Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యక్షగానం మౌలికంగా స్వభావం చేత గాన ప్రధానమైనదైనప్పటికీ, రూపక ప్రక్రియకు అనుగుణమైన స్వరూపాన్ని క్రమంగా సంతరించుకున్నది. దేశీ రూపక రచనా ప్రక్రియగా పరిణతి గాంచింది. 15వ శతాబ్దినాటికి యక్షగానం ఒక సాహిత్య ప్రక్రియగా స్థిరపడింది. తెలుగు యక్షగాన పరిణామ చరిత్రలో చివరకు యక్షగానం వీధి నాటకాలతో అభేదాన్ని పొందింది. యక్షగానాలను వాటి ఇతివత్తాన్ని బట్టి పౌరాణికాలు, చారిత్రికాలు, జానపదాలు, సాంఘికాలు, కల్పితాలుగా విభజించుకోవచ్చు. ప్రసిద్దమైన పాత్రలకు కల్పితమైన ఇతివత్తాల్ని చేర్చి వ్రాసిన వాట్ని కల్పితాలుగా చెప్పుకోవచ్చు. మహాభారతంలోని పాండవుల పాత్రలకు భట్టి విక్రమాదిత్యున్ని కథను జోడించి రచించినటువంటి కథే ''రంభ రంపాల చరిత్ర''. రంపాలకుడనువాడు మహాభారతంలో ఎక్కడా కనిపించడు. అయినప్పటికీ ఒక కొత్త పాత్రను సష్టించి ఆ పాత్ర కొరకు ఊహాత్మకమైన కథను కూడా జోడించి రచనా ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం జరి గింది. ఈ విధంగా కల్పిత కథలతో కూడి నటువంటి యక్షగానాలు తెలుగు దేశంలో ప్రదర్శింపబడి ఎంతగానో ప్రజాదరణ పొందాయి.
ఈ పరిశోధనా సిద్ధాంత గ్రంథం లోని మొదటి అధ్యాయంలో యక్షగానపరిణామాన్ని కల్పిత కథలను, వాటి లక్షణాలను పేర్కొన్నారు. రెండవ అధ్యాయం లో కల్పిత కథల్లో కథాంశాల స్వరూపం ఏవిధంగా వుందో వివరిం చారు. కల్పిత కథాత్మకమైన యక్షగానాలన్నింటిని పరిశీ లించి వాటిలోని ఇతివత్తాల్ని బట్టి, రసాల్ని బట్టి పలు విధాలుగా వర్గీకరించి విశదీకరించారు. నాల్గవ అధ్యాయం లో రంభరంపాల చరిత్ర యక్షగాన కర్త చెర్విరాల భాగయ్య గారి జీవిత చరిత్రను స్పశిస్తూ, రంభారంపాల చరిత్రకూ భట్టి విక్రమాదిత్యుని కథలోని అతిరూపవతి అతిరూపుల కథకు గల సంబంధాన్ని వివరించడం జరిగింది. చెర్విరాల భాగయ్య రంభ రంపాల చరిత్ర యక్షగానంలో పాత్రలను చిత్రీకరించిన విధానాన్ని గురించి తెలిపారు. అయిదవ అధ్యాయంలో రచయిత యొక్క రచనా విధానాన్ని, భాషా విశేషాలను వివరించారు.
(రంభరంపాల చరిత్ర-పరిశీలన - డా.తండు కష్ణ కౌండిన్య, పేజీలు: 144, వెల: రూ. 100, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు)
- కె.పి.అశోక్ కుమార్, 9700000948