Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవిత్వం రాయడం ఒక కళ. ఆ కవిత్వాన్ని అంచనా వేయడం ఒక తూనిక. ఈ తూనికను సహదయ వివేచనతో సద్విమర్శ చేయడం ఒక సహదయ భావుకతకు గీటురాయి. ఈ భావుకత ఉన్నవాడు పెన్నా శివరామకష్ణ. ప్రస్తుతం వెలువడుతున్న వచనకవిత్వాన్ని అనుశీలించి, దానిలోని ఎత్తుపల్లాలను, కవులు అనుసరిస్తున్న పోకడలను, వారు చెప్పే విధానమును (అభివ్యక్తి) ఈ వ్యాససంపుటిలో సవివరముగా చెప్పారు. ఈ వ్యాససంపుటిలో 18 వ్యాసాలున్నవి. మొదటి ఆరు వ్యాసాలు కవిత్వ లక్షణాలకు సంబంధించి - అభివ్యక్తి, శీర్షిక, ఎత్తుగడ, ముగింపు, ఉపమానాలు, మెటానమీలను చర్చించారు. మిగతా 12 వ్యాసాలు కొందరు కవుల కవిత్వంపై విశ్లేషణ.
కవి అనుభూతులు, ఊహలు, ఆలోచనలు, అభిప్రా యాలకే ప్రాధాన్యం కనుక - నవ్యత, క్లుప్తత, గుప్తత, కవిత్వ సాంద్రత మొదలైనవి వచనకవితకు అనివార్యమైనవి. వచనకవితకు నిర్దిష్ట నిర్మాణ చట్రమంటూ ఏదీలేదు. ఇది ఎంత సౌకర్యమో, అంత అసౌకర్యం కూడ (పుట 10,11) అని అంటారు. ప్రతి వచన కవితకూ శీర్షిక, ఎత్తుగడ, పూర్వాపర సమన్వయంతో కూడిన నిర్వహణ, వస్తువుకు, కవి దక్పథానికి అనుగుణమైన, సార్థకమైన ముగింపు ఉండాలి. కనుక ప్రతి కవీ తన ప్రతి కవితకూ ఒక విలక్షణమైన నిర్మాణచట్రాన్ని రూపొందించుకోవాలి. లేదా అప్రయత్నంగానేనయినా రూపొందాలి. అట్లా రూపొందింపబడిన కవితలే పునః పునః పఠనాసక్తిని కలిగిస్తూ, పాఠకుల మదిలో చిరకాలం నిలిచపోతాయంటారు.(పుట-11).
శివరామకష్ణ గారు ఈ వ్యాసాలలో కవిత్వ సజన కారులకు అనేక అంశాలను మార్గదర్శకంగా చెప్పారు. అయితే వచన కవిత్వం రాసే వారికి నియమనిబంధనలు ఏవీ ఉండవు. కవి తనూహించిన అంశమును, తనదైన పదాలలో, భావనతో వెలువరిస్తారు. ఇలానే ఉండాలనే నిక్కచ్చిత ఏమీ ఉండదు. కాని తన భావనను పాఠకుల దగ్గరకు ఎలా తీసుక వెళ్లాలి, అందుకు ఎలా చెప్పితే (అభివ్యక్తి) బాగుంటుందోనని ఆలోచిస్తాడు. అందుకు కొందరు ఆది, అంత్య ప్రాసలను కూడ ఎంచుకుంటారు. ఆది అంత్య ప్రాసలకు ప్రాధాన్యము ఇవ్వడం వలన కవిత్వం పలుచబడుతుంది. అంతేకాకుండా అనవసర పదాలు కూడా వచ్చి చేరుతాయి.
దీనిని దష్టిలో నుంచుకుని పెన్నా శివరామకష్ణ ఇలా అన్నారు '-వస్తువు చర్వితచర్వణమైనప్పుడు ఆలంకారికత మరింత ప్రాధాన్యమవుతుంది. అభివ్యక్తిలో పెద్దగా ప్రత్యేకత లేకపోయినా వస్తు నవ్యత చదువరిని ఆకర్షిస్తుంది. అనుప్రాస, అంత్యప్రాసలను పొదుపుగా ఉపయోగించుకుంటే కవితకు నాదసౌందర్యం, వాక్యలయ చేకూరుతుంది. అంత్యప్రాసలు మితిమీరితే, భావం మీద కంటే కవికి శబ్దం మీదనే దష్టి ఎక్కువ అనే అభిప్రాయం కలిగి, కవి మీద చులకనభావం ఏర్పడుతుంది(పుట 14)'. అంతేకాదు కవిత్వంలో ఆలోచనాత్మకతకూ, అనుభూతి వ్యక్తీకరణకూ ప్రాధాన్యమిచ్చిన రచయితలు కూడా వ్యంగ్యం వలన, ధ్వని వలన వ్యక్తావ్యాంశం చదువరుల హదయాలలో చెరగని ముద్ర వేస్తుందని భావించారు. కవితాత్మక అభివ్యక్తిని ఎంచుకుంటారు (పుట15). వచన కవితా ఖండికకు క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం కవిత్వానికి అవసరమని అంటారు.
కవిత్వ ఎత్తుగడ గురించి '- శీర్షికను చూడగానే కలిగిన పఠనాసక్తిని ఇనుమడించేలా, ఉత్కంఠ కలిగించేలా, ఆశ్చర్యచకితుడిని చేసేలా ఎత్తుగడ (ప్రారంభం) ఉండాలి. శీర్షికను ఎంచుకోవడంలోను, ఎత్తుగడలోను ఒక విభిన్నత, వినూత్నతను కనబరచాలి' అంటారు (పుట24). ఇందుకు కొన్ని ఉదాహరణలను చూపెట్టారు.
''కవితకు ముగింపు దీపస్తంభం'' వంటిదని నాలుగవ వ్యాసంలో చెపుతూ- 'శీర్షిక, ఆరంభం, నిర్వహణలలో కవి చూపిన కొత్తదనం, నైపుణ్యం లాంటి వాటన్నిటినీ స్థిర పరిచే పునాది ముగింపు. కవి భావజాలం, దష్టికోణం, పరిష్కారమార్గాల పట్ల కవి అవగాహన, భాషాజ్ఞానం, కవిత్వ శిల్ప స్పహ మొదలైనవి అన్నీ ముగింపులో ప్రతిఫలిస్తాయి. కవితలోని కవికంఠ స్వరం (ముద్ర) ముగింపులోనూ వినిపించాలి. ముగింపు ఎంత ధ్వన్యాత్మకంగా ఉంటే, కవిత అంత బిగువుగా, శక్తిమంతంగా రూపొందుతుంది. కావ్యానుభూతి సమగ్రమయ్యేది సార్థకమైన ముగింపుతోనే ప్రతి కవిత (ఉత్తమ)లో తనదైన నిర్మాణ శిల్పం ఉంటుంది. వస్తువు, వ్యక్తీకరణ ధోరణి, కవిశైలి లాంటి అంశాలను అనుసరించి 'సార్థకమైన ముగింపు' అనేది ఎప్పుడూ సాపేక్షమేనని అంటారు. (పుట 39). ఉపమ, మెటానమీల గురించి కూడా ఇందులో చెప్పారు.
శివరామకష్ణ ఈ పుస్తకాన్ని వెలువరించేముందు కొంత సర్వే చేసారు. కవులకు మూడు ప్రశ్నలను పంపి వారినుండి సమాధానాలను రాబట్టి వారి అభిప్రాయాలను కూడా ఇందులో పొందుపరచారు. శీర్షికలను చర్చించేటప్పుడు అందుకు సంబంధించిన కవితాపంక్తులను ఉదాహరించి మనకు విషయాన్ని సాదృశ్యం చేసారనడం కంటే విడమరచి చెప్పారనడం బాగుంటుంది. ఇది ఒక విధంగా కవులకు కరదీపిక అని చెప్పవచ్చును. వచన కవితా సజనశీలురు అందరూ ఒకసారి తప్పకుండా చదవవలసిన గ్రంథమిది.
(వచనకవిత-అలంకారికత- (వ్యాససంపుటి)
డా. పెన్నా శివరామకష్ణ, వెల: రూ.100/-, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు)
- డా.టి.శ్రీరంగస్వామి, 99498 57955