Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవి చాలా సందర్భాల్లో బహుముఖాలుగా దర్శన మిస్తాడు అయితే మంచి కవిత్వపు లక్షణం ఏమిటంటే ఆ కవిత్వపు అన్ని ముఖాలు కూడా చాలా వరకు సమాజాన్ని ప్రతిబింబిస్తూ, మనిషిని ఉన్నతీ కరించే వైపే ఉంటాయి. విభిన్న చైతన్యాలు తాత్వికచింతనల ప్రవాహాలు..వీటి నుండి వస్తున్న కవులు, ఆ కవులు దశ్యమానం చేస్తున్న వస్తువులు..తెలుగు కవిత్వాన్ని మరింత పరిపుష్టం చేస్తున్నాయి.. ఈ మధ్య కాలంలో వస్తున్న కవిత్వ పుస్తకాలలో పఠనీయమైన కవితా సంపుటాలు కొన్ని కవిత్వ దాహాన్ని తీర్చగలిగే ఊట చెలిమెలుగా ఉంటున్నాయి. అలా వచ్చిన సంపుటాల్లో రూప్ కుమార్ డబ్బీకార్ గారి 'ఐనా ప్రయాణం' వివిధ భావాలను ఒకే మూస లోకి వొంపి చిక్కబరచిన కవితా భాండం.
''పోయెట్రీ ఆఫ్ ద హయ్యర్ కైండ్ మె ఎగ్జిట్ వితౌట్ మేటర్'' అన్న 'కాల్ రిడ్జ్' మాటలను ఈ మధ్య కాలంలో చాలా మంది కవులు రుజువు చేసి చూపుతున్నారు. ఉత్తమ కవిత్వం ఛందస్సు లేకుండానే ఉండవచ్చునన్న కాల్ లిడ్జ్ లో మంచి కవిత్వాన్ని భాషా నియమాల మధ్య బంధించ కూడదనే భావన ఆనాడే ఏర్పడి ఉండవచ్చు గానీ.. ఈనాటి కవి ఇతరత్రా విషయాలను కూడా దాటేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ బద్దలు కొడుతూ ఏ క్షణానికి ఆ క్షణం కొత్తగా పురుడు పోసుకుంటున్నాడు.
కవి తను జీవించిన సమకాలీన కాల మార్పులోకి పరకాయ ప్రవేశం చేస్తూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ కాలాన్ని కొత్త హంగులతో చిత్రిస్తున్నాడు. తన చుట్టూ బలవంతంగా అల్లబడ్డ అబద్దాలను, కాల్పనిక, ఊహాతీత బలహీన లోకాలను, అహేతుక అజ్ఞానాలను చేధించుకొని మనిషి కోసం వెతికే పనిలో ఉంటాడు. మనిషిని ప్రేమించీ,మనిషిని పలవరించే సత్యవాదికి మాత్రమే కవిననే చెప్పుకునే అర్హత ఉన్నది.
మల్లె మొగ్గల పరిమళం విచ్చుకొని గోడ పగుళ్ళలో ఎదిగివచ్చిన మొక్కలపై ఒలికించే గాలిని కలగనే కవి, విషవాయువుల తాకిడి లేని విస్తారమైన పచ్చిక బయళ్ఫను కలగనే కవి అన్నీ కోల్పోయిన మనిషి తన పు ఇనుప పంజరాన చిలుకల అశబ్ద విన్యాసాలను ఈసడించుకుంటున్నాడు. శుద్ధమైన ఏ దుఃఖాలు లేని ధవళ వర్ణ లోకాల మధ్య నిలుచొని తన ఆత్మను దోసిళ్లతో ఈ లోకం ఎదపై గుమ్మరించాలని అనుకుంటున్నాడు.
చూరుకు వేలాడే వాన చినుకులను నాలుకతో ఒడిసిపట్టే క్షణాల కోసం సాయంకాలపు మంచులో తడిసిన శిశిర దేహంపైన ఏ వసంతాలనో మొలకెత్తించాలని ఏ అపురూప దశ్యాలు కోసమో కవి తన మనో లోకాల వాకిళ్ళు తెరిచి పరికించి చూస్తున్నాడు. కవి కలగనే ఈ దశ్యాలను విస్మరించడానికి వీలులేదు.
ఎవడైతే సర్వ చరాచర జగత్తును, వస్తుజాలాన్ని తన ఆత్మలో చూసుకుంటాడో, అలాగే తనని తాను సర్వ చరాచర జగద్వస్తుజాలంలో చూస్తాడో వాడికే సమదష్టి ఉంటుందనేది పూర్వికులెపుడో నిర్వచించారు. కానీ లోకం ఏ స్వార్ధ చింతనల, అజ్ఞానాల మాటునో ఈ సమదష్టినీ మానవ చింతనని దాచిపెట్టింది.
ఈ సమదష్టి కోణాలను విస్మరించడం వల్లనే అసంబద్ద అసమాన సమాజం రూపు దిదద్దుకొన్నది.
కళ్ళు ఉంటే చూసి.. అని శ్రీశ్రీ అందుకే అన్నాడు. మనిషిలోని అంతర్ లోకాల సౌందర్యాత్మక పచ్చని మైదానాలు, ఎగుడుదిగుడు రహదారులు, గిడసబారిపోతున్న పాదాలు, ఆకలి పోరాటాలు, అస్తిత్వాల ఆరాటాలు, పోరాట జీవన దర్శనలు, రకరకాల సంఘటనలు, మనుషులు, కాలాల్లోకి వెళ్ళి వస్తూ రూప్ కుమార్ గారు అద్భుతమైన అనుభవాలను అనుభూతులను మన ముందు విప్పి.. ముప్పిరిగొన్న సహజానుభవాల అనుభూతులను పంచుతాడు. తను పారాడిన మట్టిలోంచి అందమైన రూపాకతిని పూయిచిన కుమ్మరి సారె లోని కళాత్మకతా సత్యాలను పట్టుకోవడమే కవికి ఉండవలసిన సహజ నిశిత దష్టి.
కళ కేవలం కళా సష్టికి మూలమేననే భావనను కూడా సమాజపు అంతర్ దష్టి గల కవులు సమర్ధించలేదు. సాహిత్యం, కళలు స్వయం సంపూర్ణ విషయమేననే ఈస్తటీషియన్స్ వాదాన్ని ప్రజాజీవితానుభవాలున్న కవులు అంతగా పట్టించుకోరు. ఖాళీ గిన్నెలోకి దుఃఖాలను వొంపడం, నిదురపోతున్న మనసును లాంతరు చేసి చెట్టు కొమ్మకు వేలాడేయగల తేజోదీప్తమైన పనిని మనిషికోసం పరితపించే, వెలుగుకోసం తాపత్రయ పడే, జీవితంలోని అనేక ప్రపంచాలను అవిష్కరించగల ఆశావహ కవి మాత్రమే చేయగలడు. అదే పని చేశారు రూప్ కుమార్ డబ్బీకర్ గారు.
తను గట్టు మీద కూర్చొని మనసును మాత్రం చెరువులో ఈదులాడే చేప పిల్లను చేయగల కవి ఎన్ని దశ్యాలనైనా వెతికిపట్డి తన ఎదను జండాను చేసి మానవ ప్రపంచపు శిఖరంపైన ఎగరేయగలడు.
రూప్ కుమార్ గారు దేన్నీ ఊరకే పోనీయరు. సమాజంలోని అనేకానేక కలగలపు అంతర్ బహిర్ రూపాలు, మారుతున్న కాలంతో పాటుగా రూపాంతరం చెందుతున్న ఆలోచనా తీరులు, యవ్వనపు స్నేహాలు, పరిపక్వత లేని కలహాలు, సందడి చేయని సమూహాలు, బీభత్సపు ఒంటరి తనాలు,పంటపొలాలు, బీడు భూములు,దుఃఖపు ఆనవాళ్ల వెతుకులాటలో తెలియని వయసు కొలతలు, మూసిన పిడికిల్లల్లోంచి విప్పారే వెలుగు రేఖలు...దేనిని జారవిడువడు. ఆయా సమయాల, ఆయా సంఘటనల ఆత్మల్లోకి వెళ్ళి కలియతిరగందే కవికి మనసొప్పదు. తిరిగి తిరిగి అతడే ఒక సాక్షి భూతమైన, సజీవ వేదికయ్యి పేర్చుచుకొని తెచ్చుకున్న రంగుల పూలన్నీ మనకు దశ్యం చేస్తాడు. శిశిరపు అంచుల మాటున వివర్ణమవుతూ, తెగిపడుతున్న ఆకుల గల గలలో రాలిపడె వేపపూత నాజూకు తనాన్ని, కలలు చిగురులు తొడిగే శబ్ద తరంగాలను వినగలగడం కవికి మాత్రమే సాధ్యం. జీవితం చుట్టూ అల్లుకున్న అనేక విషయాలను కూడా కవి మాత్రమే చర్చకు పెట్టగలడు.
గోచీ మాటున దాగిన అభిమానాలు, రైతు నాగళ్ళు తొడిగిన కర్రులు, కలలను ఒడిసి పట్టుకున్న సొట్టబోయిన రాతెండి గిన్నెలాంటి కడుపులు, గుడిసె చిల్లుల్లోంచి జారిపడే నీరెండలు, సగమైనా తీరని ఆకలి బాధలు తెలియాలంటే కవికి జీవితముండాలి.. జీవితం ఇచ్చిన అనంతమైన అనుభవం ఉండాలి. లేకపోతే కవితలు ఏ సహజతలేని, ఏ సువాసనలు లేని ప్లాస్టిక్ పూల గుత్తులుగా గోడకు వేలాడుతునో, మత మత కళేబరాల ముందు శవ గీతాలు పాడుకుంటూనో మిగిలి పోతాడు. అమోఘమైన జీవితానుభవాలను పొందిన రూప్ కుమార్ గారి కవిత్వం జీవితానికి దగ్గరగా కనిపించడంలో సందేహం లేదు కానీ.. మనకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే.. అతని కవిత్వం చదివినపుడు ఈ జీవితమంతా మనది కదా! అనే సందేహం కలగడం.
సందర్భాన్ని చెప్పినా, సంఘటనను చెప్పినా.. భావన, ఆలోచనా, పదగుంభనం కవిత్వానికి ఉండవలసిన తప్పని సరి సొగసులు. అప్పుడే అది కవిత్వమై మనలను తనవెంట తీసుకెళ్ళ గలదు. ఆ సామాగ్రి అంతా రూప్ కుమార్ గారి కవిత్వంలో సహజంగానే ఇమిడిపోయి ఉన్నది.
- డా. చెమన్, 9440385563