Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రత్యేక సంచిక కోసం రచనల ఆహ్వానం
మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు జీవితంపై ప్రత్యేక సంచిక కోసం రచనలకు తెలంగాణ సామాజిక రచయితల సంఘం ఆహ్వానం పలుకుతోంది. వ్యాసాలు రెండు పేజీలు, కవితలు 16 లైనలకు మించకుండా తీajవరష్ట్రaఎతీaఙబశ్రీa ఏస్త్రఎaఱశ్రీ.షశీఎ కి ఈ నెల 20 లోపుగా పంపాలి. వివరాలకు 9848445134 లో సంప్రదించవచ్చు.
బోనాలపై కవితలకు ఆహ్వానం
పి.వి.నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా, ఆషాఢ మాసం సందర్భంగా బోనాలు, అమ్మ వారిపై కవితలకు హైదరాబాద్ పాతనగర కవుల వేదిక ఆహ్వానం పలుకుతోంది. కవితలను 20 లైన్లు మించకుండా తెలుగులో టైప్ చేసి 9703542598, 9182178653, సెల్ నెంబర్ వాట్స్ యాప్కు ఫోటోతో పాటు ఆగస్టు 10 లోపు పంపాలని వేదిక కన్వీనర్ కె.హరనాథ్ ప్రకటనలో పేర్కొన్నారు.
దసరా కథల పోటీ
పాలపిట్ట-జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ దసరా కథల పోటీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు రూ.10,000, రూ.5000, రూ.3000, ఒక్కొక్క కథకు వెయ్యి రూపాయల చొప్పున పది కథలకు ప్రత్యేక బహుమతులు అందజేస్తారు. తెలుగు కథకులు ఎక్కడి వారయినా ఈ పోటీలో పాల్గొనవచ్చు. కథలు పంపడానికి చివరి తేదీ 15 ఆగస్టు 2020. పంపేవారు ఎడిటర్, పాలపిట్ట, 16-11-20/6/1/1, 403, విజయ సాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్పేట, హైదరాబాద్-500 036, చిరునామాకు పంపవచ్చు. లేదా జుఎaఱశ్రీ: జూaశ్రీaజూఱ్్aఎaస్త్రఏస్త్రఎaఱశ్రీ.షశీఎ, జూaశ్రీaజూఱ్్abశీశీసరఏస్త్రఎaఱశ్రీ. షశీఎ లకు పంపవచ్చు. వివరాలకు 9848787284 నంబరులో సంప్రదించవచ్చు.