అంతర్జాతీయం
ఈయూలో నుంచి బయటకు వచ్చే బిల్లుకు బ్రిటన్ ఎంపీల మద్దతు ఐరోపా యూనియన్లో యూకే సభ్యత్వానికి ముగింపు పలికే బిల్లుకు బ్రిటన్ ఎంపీలు 2017 సెప్టెంబర్ 12న అను కూలంగా ఓటేశారు. ఈయూ ఉపసంహరణ బిల్లుకు అను కూలంగా 326 మంది ఎంపీలు ఓటేయగా, ప్రతికూలంగా 290 మంది వేశారు. యూకేను ఐరోపా ఆర్థిక సమాజంలోకి తీసుకెళ్లిన 1972 యూరోపియన్ కమ్యూనిటీస్ చట్టాన్ని తొలగించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న ఈ బిల్లు విజయం సాధించింది.
గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్-2017
22వ గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్-2017లో లండన్కు అగ్రస్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 108 ప్రధాన ఆర్థిక కేంద్రాలతో రూపొందించిన ఈ జాబితా లో ముంబై 60వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్ సంవత్సరంలో రెండుసార్లు విడుదల వుతుంది.
బెలారస్ అధ్యక్షుడి భారత పర్యటన
బెలారస్ అధ్యక్షుడు ఏజీ లుకాశెంకో 2017 సెప్టెంబర్ 12న భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడితో ఆయన సమా వేశమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా రక్షణ రంగంలో తయారీ, సంయుక్తాభివద్ధితో పాటు వివిధ అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని భారత్, బెలారస్ నిర్ణయిం చాయి. ఇరు దేశాల మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి.
సింగపూర్ అధ్యక్షురాలిగా హాలిమా యాకోబ్
సింగపూర్ అధ్యక్ష పదవిని మొట్ట మొదటి సారిగా ఓ మహిళ అలంకరించనున్నారు. ముస్లిం మలరు అల్పసంఖ్యాక వర్గానికి చెందిన హాలిమా యాకోబ్(63) దేశ అత్యున్నత పదవికి ఎంపికయ్యారు. పార్లమెంటు మాజీ స్పీకర్ అయిన హాలిమా అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన వారు. గత రెండు దశాబ్దాలుగా పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.
ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి కఠిన ఆంక్షలు
ప్రపంచాన్ని ధిక్కరించి అణు, క్షిపణి పరీక్షలకు దిగుతున్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యంత కఠిన ఆంక్షలను విధించింది. ఈ మేరకు అమెరికా రూపొందించిన తీర్మానానికి మండలిలోని సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. వీటి కింద ఆ దేశ చమురు దిగుమతులపై కట్టడి ఉంటుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విధించిన ఆంక్షలు హేయమని ఉత్తర కొరియా పేర్కొంది.
జాతీయం
అయోధ్య పరిశీలకులుగా ఇద్దరు అదనపు జిల్లా జడ్జిలు
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం నిర్వహణ, పరిశుభ్రతలను పర్యవేక్షించడానికి ఇద్దరు అదనపు జిల్లా న్యాయమూర్తుల్ని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 10 రోజుల్లోగా ఈ పని పూర్తి కావాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్మిశ్ర నేతత్వంలోని ధర్మాసనం 2017 సెప్టెంబర్ 11న అలహాబాద్ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
జాతీయ రహదారుల వెంట ఆక్రమణల్ని తొలగించాలి : చీనA×
జాతీయ రహదారుల వెంబడి దాబాలు, హోర్డింగుల వంటి అక్రమ నిర్మాణాల్ని వెంటనే తొలగించాలని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(చీనA×) స్పష్టం చేసింది. ఇలాంటి నిర్మాణాలు భద్రతకు ముప్పుగా వాటిల్లుతాయని పేర్కొంది.
చక్మా, హజోంగ్లకు భారత పౌరసత్వం
1960ల్లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి అరుణాచల్ప్రదేశ్కు వలస వచ్చిన చక్మా, హజోంగ్ శరణా ర్థులకు భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే అరుణాచల్ప్రదేశ్లోని స్థానికుల హక్కులకు, ప్రయోజనాలకు భంగం కలగకుండా చక్మా, హజోంగ్లకు పౌరసత్వం ఇవ్వాలని తీర్మానించారు. బౌద్ధులైన చక్మాలు, హిందువులైన హజోంగ్లు మతహింస సహా వివిధ కారణాలతో 1964లో భారత్కు వలస వచ్చారు.
కోల్కతలో హోమియోపతి వైరాలజి ల్యాబ్
భారతదేశంలో మొట్టమొదటి అధునాతన హోమియోపతి వైరాలజి ల్యాబ్ను పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతలో ప్రారంభిం చారు.
ఈ-వెహికల్ పాలసీని ఆమోదించిన కర్ణాటక
దేశంలో ఈ-వెహికల్ పాలసీని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల ప్రోత్సాహం కొరకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీని ఆమోదిం చింది.
బుల్లెట్ రైలు మార్గానికి శంకుస్థాపన
అహ్మదాబాద్-ముంబయి రైల్వే స్టేషన్ల మధ్య రూ.1.10 లక్షల కోట్ల వ్యయంతో దేశంలోనే తొలి బుల్లెట్ రైలును తీసుకు వచ్చేం దుకు ఉద్దేశించిన పథకానికి ప్రధాని నరేంద్రమోడి, జపాన్ ప్రధాని షింజో అబే 2017 సెప్టెంబర్ 14న అహ్మదాబాద్ లో శంకుస్థాపన చేశారు. బుల్లెట్ రైలు పథకం కోసం జపాన్ దాదాపు రూ.88,000 కోట్ల రుణాన్ని కేవలం ఒక్క పైసా వడ్డీకి ఇస్తోంది. బుల్లెట్ రైలు పథకం కోసం 4 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు వడోదరాలో ఏర్పాటు కానున్న శిక్షణ సంస్థకు కూడా ఈ సందర్భంగా శంకుస్థాపన చేశారు.
షేప్-1 పోలీసులకే రాష్ట్రపతి పతకాలు
శాంతి భద్రతలు కాపాడే వారు శారీరక సౌష్టవాన్ని కలిగి ఉండాలని, అప్పుడే వారు రాష్ట్రపతి పతకాలు వంటి పుర స్కారాలకు అర్హులవుతారని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసుల సంఘాలకు సర్క్యులర్ పంపించింది. సచ్ఛీలత లేని పోలీసులకు కూడా ఎలాంటి పతకాలూ ఇవ్వబోరు. శరీర ఆకతి ఆధారంగా పోలీసులను షేప్-1, షేప్-2లుగా వర్గీకరించింది.
దీూజూకు మహారత్న హోదా
భారత్ పెట్రోలియం కార్పొరేషన్(దీూజూ)కు కేంద్రం మహారత్న హోదాను ప్రకటించింది. దీంతో ఆర్థిక విషయాల్లో కంపెనీకి మరింత స్వేచ్ఛ దక్కుతుంది. నవరత్న కంపెనీ అయి ఉండి, గడచిన మూడేళ్లలో రూ.25,000 కోట్లకు పైగా సగటు వార్షిక టర్నోవరును నమోదు చేసిన వాటికి మహారత్న హోదా ఇస్తారు.
రైళ్లలో గుర్తింపు కోసం ఎం-ఆధార్
రిజర్వుడు క్లాస్లో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే ఓ వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకూ ప్రయా ణికులు వ్యక్తిగత గుర్తింపు కోసం ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉండగా, ఇకనుంచి డిజిటల్ రూపంలో ఉన్న ఆధార్ను ఫోన్లో చూపించినా సరిపోతుందని రైల్వే మంత్రిత్వశాఖ 2017 సెప్టెంబర్ 13న తెలిపింది. ఎం-ఆధార్ యాప్ ద్వారా ఆధార్ కార్డును డిజిటల్ రూపంలో గుర్తింపుగా చూపించవచ్చు. ఈ యాప్ను భారత విశిష్ట ప్రాధికార సంస్థ రూపొందించింది.
ప్రాంతీయం
ఆర్టీఏ ప్రధాన కార్యదర్శిగా రాజా సదారాం
తెలంగాణ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా అసెంబ్లీ మాజీ కార్యదర్శి రాజా సదారాం, కమిషనర్గా జర్నలిస్ట్ బుద్ధా మురళి నియమితులయ్యారు. 2017 సెప్టెంబర్ 15న సీఎం కేసీఆర్ అధ్యక్షతన డిప్యూటీ సీఎం మహ మూద్ అలీ, ప్రతిపక్ష నేత జానా రెడ్డితో కూడిన త్రిసభ్య కమిటీ వీరిని ఎంపిక చేసింది.
తెలంగాణ రాష్ట్ర నూతన ఎక్సైజ్ పాలసీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలపై కొత్త విధానాన్ని ప్రకటించింది. రెండేళ్ల పాటు(2017-19) అమల్లో ఉండే ఈ విధానంపై 2017 సెప్టెంబర్ 12న ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మద్యం విధానంలో లైసెన్స్ రుసుములను పెంచారు. కొత్త ఎక్సైజ్ పాలసీ 2017 అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుంది. 2017 జూన్తోనే మద్యం దుకాణాల లైసెన్సు గడువు ముగిసిపోయింది. కానీ, హైవేలకు 500 మీటర్ల దూరంలోని మద్యం దుకాణాలు ఎత్తివేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై వివాదం కొలిక్కి రాకపోవడంతో పాత విధానాన్నే 3 నెలలు పొడిగించారు. ఆ గడువు 2017 సెప్టెంబర్ 30తో ముగిసిపోతోంది. దీంతో అక్టోబరు 1 నుంచి రాబోయే రెండేళ్లకు ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది.
1 నుంచి 12 తరగతుల వరకు తెలుగు తప్పనిసరి
ప్రపంచ తెలుగు మహాసభలపై 2017 సెప్టెంబర్ 12న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగును ఒక పాఠ్యాం శంగా బోధించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిం చింది. కోరుకున్న విద్యార్థులకు ఉర్దూభాష కూడా ఆప్షనల్గా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో నిర్వహించతల పెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలను ముందుగా అనుకున్నట్లుగా అక్టోబరులో కాకుండా 2017 డిసెంబరు 15 నుంచి 19 వరకు 5 రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
వరంగల్, మెదక్ జిల్లాలకు స్వచ్ఛ పురస్కారాలు
దేశవ్యాప్తంగా స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత పాటించడంలో ప్రతిభ చూపిన విద్యాసంస్థలు, ఆదర్శ గ్రామాలను తయారు చేసిన జిల్లా కలెక్టర్లకు కేంద్ర మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో అవార్డులు అందజే సింది. స్వచ్ఛత పాటిస్తూ ఆదర్శ గ్రామాలను తయారు చేయడా నికి కషి చేసినందుకు తెలంగాణ లోని వరంగల్ అర్బన్, మెదక్ జిల్లాల కలెక్టర్లు ఆమ్రపాలి, భారతి హోలికెరి 2017 సెప్టెంబర్ 14న పురస్కారాలు అందు కొన్నారు. వరంగల్ జిల్లాలోని శంభుపల్లి, మెదక్ జిల్లాలోని ముజ్రపేట గ్రామాలకు దక్కిన ఈ పురస్కారాలను కలెక్టర్లు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా కంది శివారులోని ఐఐటీ హైదరాబాద్ కూడా స్వచ్ఛ అవార్డును దక్కించుకుంది.
వార్తల్లో వ్యక్తులు
మిషన్ 24ను ప్రారంభించిన సచిన్ టెండుల్కర్
భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ముంబైలోని ఎం ఈస్ట్లో మిషన్ 24ను ప్రారంభించారు. ఎం ఈస్ట్ అత్యధిక మురికివాడల జనాభా గల ప్రాంతం. మిషన్ 24 ద్వారా ఎం ఈస్ట్ ప్రాంతంలోని మురికివాడల ప్రజల జీవన ప్రమాణా లను పెంచడానికి కృషి చేస్తారు.
ఐఆర్సీటీసీ ఛైర్మన్గా మహేంద్ర ప్రతాప్
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ మరియు ఎండీగా మహేంద్ర ప్రతాప్ నియమితుల య్యారు. మహేంద్ర ప్రతాప్ ప్రస్తుతం ×=జుజ డైరెక్టర్ (ఫైనాన్స్)గా పని చేస్తున్నారు. ఆయన ఈ పదవిలో 5 సం||ల పాటు ఉండనున్నారు.
అవార్డులు
ప్రకాశ్ పదుకొనెకు దీA× జీవిత సాఫల్య అవార్డు
భారత బ్యాడ్మింటన్కు విశేష సేవలందించినందుకు గాను ప్రకాశ్ పదుకొనెను జీవితకాలసాఫల్య పురస్కారంతో సత్క రించాలని భారత బ్యాడ్మింటన్ సంఘం(దీA× ) నిర్ణయిం చింది. బారు ఈ అవార్డును ఇవ్వడం ఇదే తొలిసారి. అవార్డు కింద రూ.10 లక్షలు ఇస్తారు.
మాన్ బుకర్ ప్రైజ్-2017 షార్ట్ లిస్టు
మాన్ బుకర్ ప్రైజ్-2017 రేసు నుంచి భారత్కు చెందిన ప్రముఖ రచయిత్రి అరుంధతి రారు నిష్క్రమించారు. ఆమె రాసిన 'ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్' అనే పుస్తకానికి తుది జాబితాలో చోటు దక్కలేదు. 2017 సెప్టెంబర్ 13న ఈ మేరకు 6 పుస్తకాలతో కూడిన షార్ట్ లిస్టును జ్యూరీ విడు దల చేసింది. విజేతలను అక్టోబర్ 17న ప్రకటించనున్నారు.
స్వాతిలక్రాకు హాంపలీ లీడర్ షిప్ అవార్డు
హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (నేరాలు), షీ-టీమ్స్ వ్యవస్థాపక ఇన్చార్జి స్వాతి లక్రాకు హాంపరీ లీడర్షిప్ అవార్డు దక్కింది. భారత్ తరఫున ఆమెను అమెరికన్ కాన్సులేట్ నామినేట్ చేసింది. మొత్తం పది దేశాల నుంచి ఎంట్రీలు రాగా, భారత్ నుంచి స్వాతితో పాటు మరొకరు మాత్రమే ఉన్నారు. హార్వర్డ్ వర్సిటీలో నెల పాటు జరిగే ఓరియెంటేషన్ ప్రోగామ్ తర్వాత అవార్డును ప్రదానం చేయనున్నారు.
సైన్స్ Ê టెక్నాలజి
చంద్రుడిపై నీటి విస్తతికి సంబంధించిన మ్యాప్
భారత్ తొలిసారి చంద్రుడి కక్ష్యలోకి పంపిన చంద్రయాన్-1 వ్యోమనౌక అందించిన డేటాతో చంద్రుడిపై నీటి విస్తతికి సంబంధించిన మ్యాప్ను తొలిసారిగా శాస్త్రవేత్తలు తయారు చేశారు. భవిష్యత్లో చంద్రుడి పైకి వెళ్లే వ్యోమగాములకు ఇది ఉపయోగపడుతుంది.
7 భాషలకు గూగుల్ ట్రాన్స్లేట్ యాప్
మరో 7 భారతీయ భాషల్లో ట్రాన్స్లేట్ యాప్ అందుబాటు లోకి రానుందని గూగుల్ 2017 సెప్టెంబర్ 13న ప్రకటిం చింది. దీని ద్వారా ఆంగ్లంలో ఉన్న రహదారి సూచికలను కూడా అనువదించి చదువుకోవడానికి వీలు పడుతుంది. ప్రస్తుతం హిందీ భాషకు ఈ సౌకర్యం ఉండగా, ఇకపై తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ లకు ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది.
'నావికా సాగర్ పరాక్రమ్' యాత్ర ప్రారంభం
ప్రపంచాన్ని చుట్టివచ్చేందుకు ఆరు గురు భారత మహిళా నావికులు చేపట్టనున్న 'నావికా సాగర్ పరాక్రమ్' యాత్ర 2017 సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. గోవాలోని పణజిలో మందోవీ బోట్పూల్లో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ తరిణిలో 165 రోజుల పాటు ఈ సాహస యాత్ర సాగనుంది.
పరీక్షల్లో దెబ్బతిన్న ఎం-777 శతఘ్ని
దశాబ్దాల తర్వాత తొలిసారిగా భారత సైన్యం చేతికి అందిన ఎం-777 శతఘ్ని క్షేత్ర స్థాయి పరీక్షల్లో దెబ్బతింది. అమెరికాలోని బీఏఈ సిస్టమ్స్ నుంచి ఎం-777 శతఘ్నులను కొనుగోలుకు కుదిరిన ఒప్పందంలో భాగంగా పరీక్షల కోసం కొన్నింటిని భారత సైన్యానికి అందించారు. అత్యంత తేలికగా ఉండే ఈ ఆయుధాలను సులువుగా పర్వత ప్రాంతాల్లో మోహరించవచ్చు. ఒక్కో శతఘ్ని ధర రూ.35 కోట్లుగా ఉంది. మొత్తం 145 శతఘ్నుల కొనుగోలుకు అంగీకారం కుదిరింది.
- యన్.సంతోష్కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270
Authorization