నీతి ఆయోగ్ భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నూతన సంస్థ. ఆగస్టు 13 2014న సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఒక తీర్మానం ద్వారా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి అయోగ్ను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ తీర్మానానికి అనుగుణంగా మోది ప్రభుత్వం 'నీతిఅయోగ్'ను ఏర్పాటు చేస్తున్నట్లు జనవరి 1న ప్రకటించింది. ముఖ్యాంశాలు:
- నీతి అయోగ్ ఒక సలహాపూర్వక సంస్థ .
- నీతి అయోగ్ను మేథోనిలయంగా జ్ఞాన ఆవిష్కరణల స్థావరంగా అభివర్ణించవచ్చు. నీతి అయోగ్కు అనేక అర్థాలున్నా 'పాలసీ కమిషన్' అనే అర్థాన్ని తీసుకు న్నారు. ఒక విధంగా కో ఆపరేటివ్ ఫెడరలిజం దీని ప్రధాన లక్ష్యం.
నిర్మాణం
- నీతి ఆయోగ్కు ప్రధాన మంత్రి ఎక్స్ ఆఫీషియో అధ్యక్షుడిగా ఉంటాడు.
- ఒక ఉపాధ్యక్షుడిని ప్రధానమంత్రి నియమిస్తాడు. ఇతను కేంద్రమంత్రి హోదాను కలిగి ఉంటాడు.
- దీనికొక పాలక మండలిని ఏర్పాటు చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్నెంట్ గవర్నర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు.
- నలుగురు కేంద్ర మంత్రులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రధానమంత్రి నామినేట్ చేస్తాడు.
- పూర్తికాల సభ్యులుగా ఇద్దరిని నియమిస్తాడు. వీరు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి వచ్చినవారై ఉండాలి.
- అవసరం మేరకు పార్ట్టైమ్ సభ్యులుగా ఇద్దరిని తీసు కుంటారు. వీరికి నైపుణ్యం, పరిశోధనానుభవం ఉండాలి.
- ప్రత్యేక ఆహ్వానితులుగా సంబంధిత కృషిచేసిన వారిని ప్రధానమంత్రి నామినేట్ చేస్తాడు.
- నీతి ఆయోగ్కు ఒక సెక్రటేరియేట్ ఉంటుంది.
డివిజన్లు:
నీతి ఆయోగ్లో నాలుగు డివిజన్లు ఉంటాయి. అవి...
- అంతరాష్ట్ర మండలి (ఇంటర్ స్టేట్ కౌన్సిల్)
- ప్రణాళికా మూల్యాంకనం (ప్లాన్ ఎవాల్యూయేషన్)
- ఆఫీస్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా
- డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్
పై నాలుగు విభాగాలు నీతి ఆయోగ్లో ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలకు సంబంధించిన నిపుణులు ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తిస్తారు.
ప్రస్తుత సభ్యులు
అధ్యక్షుడు -ప్రధానమంత్రి (నరేంద్ర మోడి)
ఉపాధ్యక్షుడు - రాజీవ్కుమార్ (ఆర్థికవేత్త)
గవర్నింగ్ కౌన్సిల్ - అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్నెంట్ గవర్నలు (పాలక మండలి)
ఎక్స్ అఫీషియో సభ్యులు:
- ఆర్థిక మంత్రి (అరుణ్జజైట్లీ)
- హోం మంత్రి (రాజ్నాథ్సింగ్)
- రైల్వేమంత్రి (సురేష్ ప్రభు)
- వ్యవసాయ మంత్రి (రాధామోహన్సింగ్)
సభ్యులు:
పూర్తికాల సభ్యులు: ఇటీవల వీరిని పీఎంవో నియమించింది.
1. వి.కె. సారస్వత్ 2. బిబిక్ దేబ్రారు
3. రమేష్ చంద్ 4. వి.కె. పాల్
పాక్షిక కాల సభ్యులు : వివిధ రంగాలకు చెందిన నిపుణు లను ప్రధానమంత్రి సమావేశాలకు ఆహ్వానిస్తారు.
ప్రత్యేక ఆహ్వానితులు : 1. నితిన్ గడ్కరి
2. స్మృతి ఇరాని, 3. థావర్ చంద్ గెహ్లాట్
ముఖ్య కార్యనిర్వహణాధికారి - సింధు శ్రీ ఖుల్లర్
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి హోదా కలిగి ఉంటారు.
- ప్రాంతీయ మండలికి ప్రధాన మంత్రి గానీ లేదా అతను నియమించిన వ్యక్తిగాని అధ్యక్షత వహిస్తాడు.
నీతి ఆయోగ్కు ప్రచార సంస్థలు
- ప్రభుత్వ విధాన మార్గదర్శి నీతి ఆయోగ్ తన విస్తృతి పెంచుకోవడానికి మార్కెటింగ్ ఏజెన్సీ, డిజిటల్ కంపెనీలను నియమించుకోనుంది. ఏటా పెద్ద చిన్నా కలిపి 48 కార్యక్రమాలు నిర్వహిస్తామని నీతి ఆయోగ్ ప్రకటించింది. వీటికి మార్కెటింగ్ ఏజెన్సీ ... మార్కెటింగ్, కమ్యూనికేషన్ ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాల్సి ఉంటుంది. సృజనాత్మక ప్రచార బాధ్యతలూ చేపట్టాల్సి ఉంటుంది. డిజిటల్ సంస్థ వారానికి రెండు బ్లాగు పోస్టుల్లో సమాచారం పొందు పరిచే బాధ్యత నిర్వర్తించాలని తెలిపింది. ఈ సమా చారాన్ని అంతా డిజిటల్గా అభివృద్ధి చేయాలి. సామా జిక మాద్యమాల్లో సమాచార నియంత్రణ, రేడియోలో 30 సెకన్ల గీతాల రూపకల్పన కూడా చేయాల్సి ఉంటుంది.
- నీతి ఆయోగ్ సామాజిక విభాగానికి ప్రధాన సలహా దారుగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రతన్ వాటల్ నియమితులయ్యారు. ఇతను మూడేళ్ళపాటు పదవిలో కొనసాగుతారు.
నీతి ఆయోగ్ లక్ష్యాలు
జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలు, రంగాల అభివృద్ధి వ్యూహాలను రాష్ట్రాలతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.
- ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించి ఏ అంశాన్నైనా తిరిగి సమీక్షిస్తుంది.
- గ్రామీణ స్థాయిలో విలువను చేకూర్చే ప్రణాళికల్ని రూపొందించి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది.
- ఆర్థికాంశాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న విషయాలపై సూచనలిస్తుంది.
- అందరికీ సమాన అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తుంది.
నీతి ఆయోగ్ విధులు:
ఆర్థిక విధానపరమైన అంశాలకు సంబంధించి వ్యూహాత్మక సాంకేతిక సలహాలతో కూడిన జాతీయ కార్యక్రమాలను సిఫారసు చేయడం.
- గ్రామ స్థాయిలో ప్రణాళికల రూపకల్పనకు అవసరమైన యంత్రాగాన్ని అభివృద్ధి చేయడం.
- రాష్ట్రాల క్రియాశీలక భాగస్వామ్యంతో జాతీయాభి వృద్ధికి అవసరమైన ప్రాధాన్యతలు, రంగాలు, వ్యూహాలను రూపొందించడం.
- ఆర్థిక విధానాలు, వ్యూహాల రూపకల్పనలో జాతీయ భద్రత, ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం.
- సమాజంలో ఆర్థిక ప్రగతి ఫలాలను పొందలేని వర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది.
- దేశానికి, అవసరమైన వ్యూహాత్మక, దీర్ఘకాలిక విధానాలు, కార్యక్రమాలను రూపొందించడం. వాటి అమలును, పురోగతిని, వాటి ప్రయోజనాలను పర్యవేక్షిస్తుంది.
- జాతయ, అంతర్జాతీయ వ్యాపార నిపుణులు ప్రాక్టీషనర్లు తదితరుల సహకారంతో వ్యాపారాభి వృద్ధికి అవసరమైన విజ్ఞాన వంతమైన వినూత్న మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
- అభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేసి క్రమంలో ప్రభుత్వ శాఖలు, విభాగాల మధ్య తలెత్తే సమస్యల పరిష్కారానికి నీతి ఆయోగ్ ఒక వేదికలాగ పనిచేస్తుంది.
- సుస్థిర, సమాన ప్రగతికి అనుసరించాల్సిన ఉత్తమ విధానాల, సుపరిపాలనకు అవసరమైన విధానాలపై పరిశోధనలు చేయడానికి ఈ సంస్థ అత్యాధునిక వనరుల కేంద్రాన్ని నిర్వహిస్తుంది.
- ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం సామార్థ్యాలను పెంచడంపై నీతి ఆయోగ్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
నీతి ఆయోగ్ మొదటి సమావేశం:
నీతి ఆయోగ్ మొదటి సమావేశం 'టీమ్ ఇండియా' పేరుతో ప్రధాని అధ్యక్షతన 8 ఫిబ్రవరి 2015న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి పశ్చిమబెంగాల్ తప్ప అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లెఫ్ట్నెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ప్రముఖ ఆర్థిక వేత్తలు దేశంలో వ్యవసాయ రంగం నానాటికి క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
- కేంద్ర ప్రభుత్వం తయారీ రంగం అభివృద్ధికి ''మేక్ ఇన్ ఇండియా'' కార్యక్రమం చేపట్టినట్లుగానే వ్యయసాయ రంగం అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.
- ఈ సమావేశంలోనే కేంద్ర పథకాల భవిష్యత్తుపై చర్చించడానికి, నిపుణులు సంఖ్యను పెంచడానికి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నీతి ఆయోగ్ ముఖ్యమంత్రులతో 3 ఉపసంఘాలు ఏర్పాటు చేస్తుందని ప్రధాని ప్రకటించారు.
- ఆ సమావేశంలోనే '' సబ్ కా సాథ్, సబ్ కా వికాస్'' (అందరితో కలసి అందరి అభివృద్ధి) నీతి ఆయోగ్ లక్ష్యం అని పునరుద్ఘాటించారు.
నీతి ఆయోగ్ ప్రణాళికా సంఘాల మధ్య తేడాలు- పోలికలు
నీతి ఆయోగ్:
నీతిఆయోగ్ సలహా సంఘం మాత్రమే దీనికి నిధులు కేటాయించే అధికారం లేదు.
నీతి ఆయోగ్ సభ్యుల సంఖ్య చాలా తక్కువ. ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి పార్ట్టైం సభ్యులను నియమిస్తారు.
నీతి ఆయోగ్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. పాలక మండలి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఇందులో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్ట్నెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు.
- విధానాల రూపకల్పన, నిధుల కేటాయింపు విషయాల్లో రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను నీతి ఆయోగ్ తప్పనిసరిగా సంప్రదించాలి. వీటి ఆమోదంతోనే అంతిమ విధానాన్ని ప్రకటిస్తుంది.
- నీతి ఆయోగ్ కేవలం సలహాలిచ్చే మేథో నిలయం మాత్రమే. తాను రూపొందించిన విధానాలను అమలు చేసే అధికారం దీనికి లేదు.
ప్రణాళిక సంఘం :
జాతీయ, రాష్ట్రస్థాయిలో నిధులు కేటాయించే అధికారం ప్రణాళికా సంఘానికి ఉంది. ఇందులో పార్ట్టైం సభ్యులు ఉండరు.
ప్రణాళిక సంఘంలో ఒక ఎక్స్ అఫిషియో అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ఒక మెంబర్ సెక్రెటరీ, కొందరు పూర్తికాల సభ్యులుంటారు.
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయాభివృద్ధి మండలి సమావేశాలకు, వార్షిక ప్రణాళిక సమావేశాలకు మాత్రమే పరిమితమవుతాయి.
- ప్రణాళికా సంఘం జాతీయాభివృద్ధి మండలికి జవాబుదారి. జాతీయాభివృద్ధి మండలిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్ట్నెంట్ గవర్నర్లు సభ్యులు.
- ప్రణాళిక సంఘం ముందు విధానాలను రూపొందిస్తుంది. తర్వాత నిధుల కేటాయంపు కోసం రాష్ట్రాలను సంప్రదిస్తుంది.
- ప్రణాళికా సంఘం తన విధానాలను రాష్ట్రాలపై బలవంతంగా అమలు చేస్తుంది.
- దారావత్ సైదులు నాయక్
పౌరశాస్త్రం అధ్యాపకులు
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
పుల్కల్, సంగారెడ్డి జిల్లా
ఫోన్్ 9908569970
Authorization