అంతర్జాతీయం
యూరప్యేతర దేశాలకు బ్రిటన్ వీసాలు రెట్టింపు
బ్రెగ్జిట్ అనంతర వ్యూహంలో భాగంగా బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో టెక్నాలజీ, కళలు, సజనాత్మక పరిశ్రమల్లో పనిచేసే యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలకు చెందని నిపుణులకు ప్రస్తుతం జారీచేస్తున్న వీసాలను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. అసాధారణ ప్రతిభ(ఎక్సెప్షనల్ టాలెంట్) ఉండే విదేశీయులకు టైర్-1 రూట్ ద్వారా ప్రస్తుతం 1,000 వీసాలు ఇస్తుండగా, దీన్ని 2 వేలకు పెంచుతామంది.
వరద ముప్పును గుర్తించే పరికరం అభివద్ధి
భూతాపోన్నతి కారణంగా మంచు ఫలకాలు కరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఏయే నగరాలు వరదల బారిన పడతాయో తెలిపే పరికరాన్ని అభివద్ధి చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. భూభ్రమణం తో పాటు గురుత్వాకర్షణ ప్రభావాల ఆధారంగా నీటి పంపిణీ ఎలా జరుగుతుందో ఈ పరికరం అంచనా వేస్తుందని వెల్లడించింది. వాయవ్య గ్రీన్ల్యాండ్లోని మంచు ఫలకాలు కరగటం వల్ల లండన్ సముద్ర మట్టం పెరుగుతుందని శాస్త్రవేత్త ఎరిక్ ఇవాన్ చెప్పారు.
ఇరాక్ - ఇరాన్ సరిహద్దులో భారీ భూకంపం
రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ఇరాక్-ఇరాన్ సరి హద్దుల్లో భారీ విధ్వంసం సష్టించింది. భూకంప తీవ్రతకు భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టవడంతో రెండు దేశాల్లో మొత్తం 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 7 వేల మంది గాయపడ్డారు. ఇరాక్ లోని హలబ్జ పట్టణానికి 31 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి 23.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అమెరికా భూ పరిశీలన సంస్థ తెలిపింది. ఇరాన్, ఇరాక్ స్థానిక కాలమానం ప్రకారం నవంబర్ 12న రాత్రి 9.48 గంటల (భారత కాలమానం నవంబర్ 12న రాత్రి 11.48 గంటలు) సమయంలో భూప్రకంపనలు మొదలయ్యాయి.
దక్షిణ చైనా సముద్రంపై చైనా, వియత్నాం రాజీ
దక్షిణ చైనా సముద్రం వివాదం విషయంలో చైనా, వియత్నాం రాజీకొచ్చాయి. ఆ విషయంలో వెనక్కి తగ్గేందుకు ఇరు దేశాలు నవంబర్ 13న అంగీకరించాయి. దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నౌకా రవాణా వాణిజ్యం జరిగే ఈ దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా, వియత్నాంతో పాటు బ్రూనై, తైవాన్, ఫిలిప్పీన్స్ మధ్య ఎంతో కాలంగా వివాదం నలుగుతోంది. ఈ సముద్రంలో చైనా ఓ అడుగు ముందుకేసి మిలిటరీ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా ఏకంగా కత్రిమ ద్వీపాలను నిర్మించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ హనోరు పర్యటన సందర్బంగా ఈ సముద్రం విషయంలో శాంతి నెలకొల్పేందుకు క షి చేస్తామని రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో అంగీకరించాయి.
మనీలాలో ఆసియాన్, తూర్పు ఆసియా సదస్సు
ఉగ్రవాదం, తీవ్రవాదంతో పాటు సీమాంతర ఉగ్రవాదం మనం ఎదు ర్కొంటున్న ప్రధాన సవాళ్లని, అన్ని దేశాలు వాటిని సమష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్న మైందని భారత్ పిలుపునిచ్చింది అలాగే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధా నం ఎంతో అవసరమని ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన 31వ 'ఆసియాన్-భారత్' సదస్సులో నవంబర్ 14న మోదీ పేర్కొన్నారు. ఆసియాన్ సభ్య దేశాలు.. ఆసియాన్లో థారులాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనైలు సభ్య దేశాలుగా ఉన్నాయి.
జాతీయం
ఆసియా సంపన్నుల్లో ముకేశ్ కుటుంబం నెం.1
ఫోర్బ్స్ పత్రిక విడుదల ఆసియా టాప్ - 50 సంపన్న కుటుంబాలు - 2017 జాబితాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ తొలి స్థానంలో నిలిచింది. ఈ కుటుంబం తాలూకు సంపద విలువ 19 బిలియన్ డాలర్ల పెరుగుదలతో ఏకంగా 44.8 బిలియన్ డాలర్లకు ఎగిసింది. శాంసంగ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన కొరియాకు చెందిన లీ కుటుంబం 40.8 బిలి యన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. హాంగ్కాంగ్ కు చెందిన క్వాక్ కుటుంబం 40.4 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. వీరి నికర సంపద విలువ 40.4 బిలియన్ డాలర్లు.
పప్పుధాన్యాల ఎగుమతికి కేంద్రం అనుమతి
రైతులకు మేలు చేకూర్చేలా అన్ని రకాల పప్పుధాన్యాల ఎగుమతులకు అను మతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్ 16న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆ మేరకు ఎగుమ తులపై నిషేధం ఎత్తివేతకు ఆమోదం తెలిపారు. పప్పు దినుసులపై ఎగుమతి, దిగుమతి విధానాన్ని సమీక్షించేం దుకు కేంద్ర ఆహార, పౌర సరఫరా కార్యదర్శి నేతత్వంలోని కమిటీకి అధికారం కల్పిస్తూ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుంది. పప్పు ధాన్యాల నిల్వల పరిమాణం, ఉత్పత్తికి అనుగుణంగా దిగుమతి సుంకాల్లో మార్పులు, డిమాండ్, స్థానిక, అంతర్జాతీయ ధరలు తదితర అంశాల్ని కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. 2016-17లో ప్రభుత్వం 20 లక్షల టన్నుల పప్పుధాన్యాల్ని మద్దతు ధర చెల్లించి సేకరించింది.
కశ్మీర్లోని భూకంపాలను తట్టుకునే వంతెన
అత్యంత వినాశకర భూకంపాలు, పేలుళ్లను తట్టుకునేలా కశ్మీర్లోని చినాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనను నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై ఎనిమిది తీవ్రత గత భూకంపాలను, 30 కేజీల పేలుడు పదార్థం సష్టించే విస్పోటనాన్ని సైతం ఈ వంతెన తట్టుకో గలదని చెప్పారు. ఇందు కోసం ఐఐటీ రూర్కీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ సెన్సైస్, రక్షణ పరిశోధనాభివద్ధి సంస్థ (డీఆర్డీవో)లకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో వారు అందించిన డిజైన్తో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. నదిపై 359 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ.1250కోట్లు. పారిస్లోని ప్రఖ్యాతిగాంచిన ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన 30 మీటర్లు ఎత్తులో ఉంటుంది. వం తెన మొత్తం పొడవు 1,315 మీటర్లుకాగా అందులో నదిపై పూర్తిగా ఉక్కుతో నిర్మిస్తున్న భాగం పొడవు 476 మీటర్లు.
అమితాబ్కు పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ను పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పుర స్కారంతో సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రి త్వశాఖ నవంబర్ 16న ప్రకటించింది. నవంబర్ 20 - 28 వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (×ఖీఖీ×)లో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అమితాబ్ బచ్చన్ ఐదు దశాబ్దాల సినీ కెరీర్లో 190కిపైగా చిత్రాల్లో నటించారు. 4 జాతీయ అవార్డులు, 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు.
ఫ్రీడమ్ ఆన్ ది నెట్-2017
ఫ్రీడమ్ ఆన్ ది నెట్-2017 సర్వే ఇంటర్నెట్ స్వేచ్ఛత విషయంలో మాత్రం భారత్ 41వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఫ్రీడం హౌస్ అనే సంస్థ.. ఫ్రీడమే ఆన్ ది నెట్ - 2017 నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలో 87 శాతం ఇంటర్నెట్ సేవలను వినియోగించే 65 దేశాల్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. 2016 జూన్ నుంచి 2017 మే మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో పాటు పలు తాజా అంశాలను చేర్చి ఈ నివేదికను రూపొందించింది.మొత్తం సర్వే చేసిన 65 దేశాలకుగాను 30 దేశాల్లోని ప్రభుత్వాలు సోషల్ మీడియాపై బలవంతపు ఆధిపత్యాన్ని సాధించాయి. చైనాలోని టిబెట్, ఇథియోపియా లోని ఒరోమో, భారత్లో కశ్మీర్లలో ఈ సేవలపై తరచూ ఆంక్షలు పెడుతున్నారు. ఇంటర్నెట్ స్వేచ్ఛపై 14 దేశాలు నియంత్రణలు విధించాయి.
ఏపీకి మరో 28 ఐఏఎస్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐఏఎస్ పోస్టుల సంఖ్య పెరిగింది. కేడర్ రివ్యూలో భాగంగా కొత్తగా 28 ఐఏఎస్ పోస్టులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ నవంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి 211 ఐఏఎస్ పోస్టులు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 239కి పెరి గింది. అంటే కొత్తగా 28 పోస్టులు పెరిగినట్లు. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెండు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులు ఉండగా కేడర్ రివ్యూలో భాగంగా మూడు అదనపు ప్రధాన కార్యదర్శులు పోస్టులు వచ్చాయి.
పశ్చిమ బెంగాల్కు రసగుల్లా జీఐ గుర్తింపు
రసగుల్లా స్వీట్ మా ప్రాంతానిదేనంటూ భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయితే, ఈ రసగుల్లా పశ్చిమ బెంగాల్కే చెందుతుందని ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందిన అనుబంధ సంస్థ జీఐ గుర్తింపునిచ్చింది. దీంతో పశ్చిమ బెంగాల్ తమతో పోటీ పడ్డ ఒడిశా మీద విజయం సాధించినట్లయింది.
పెరిగిన భారతీయుల ఆయుష్షు
1990వ దశకం నుంచి ఇప్పటి వరకు భారతీయుల సగటు ఆయుష్షు సంభావ్యత 10 ఏండ్లు పెరిగింది. ప్రతిష్టాత్మక లాన్సెట్ జర్నల్ చేసిన తాజా అధ్యయనంలో ఈ జీవనరేఖలు బయటపడ్డాయి. పురుషుల సగటు జీవిత కాలం 66.9 సంవత్సరాలకు పెరగ్గా, మహిళల జీవన సంభావ్యత 70.3 సంవత్సరాలకు పెరిగిందని జర్నల్ ప్రచురించింది. మహిళల ఆయుష్షు సంభావ్యత కేరళలో అధికంగా 78.7 ఏళ్లు ఉండగా, ఉత్తర ప్రదేశ్లో అత్యల్పంగా 66.8 ఏళ్లు ఉన్నట్లు అధ్యయనం తేల్చింది. సగటు జీవిత కాలం పెరగటానికి భారత దేశంలో పెరుగుతున్న అత్యాధునిక వైద్యసదుపాయాలతో పాటు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేనని లాన్సెట్ స్పష్టం చేసింది. కాని దేశవ్యాప్తంగా మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయని సర్వే తెలిపింది. అభివద్ధి చెందిన కేరళ, గోవా వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్, అసోం వంటి రాష్ట్రాలు అన్ని రకాల వైద్య సేవల్లో 4 రెట్లు వెనుకబడి ఉన్నాయని పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు తగ్గాయని నివేదిక వెల్లడించింది.
37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఏర్పాటు చేసిన 37వ ఇండియా ఇంటర్నే షనల్ ట్రేడ్ ఫెయిర్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నవంబర్ 14న ప్రారంభించారు. 14 రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్ను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (×ుూఉ) నిర్వహిస్తోంది. వియత్నాం భాగస్వామ్య దేశంగా.. జార్ణండ్ భాగస్వామ్య రాష్ట్రంగా వ్యవహరిస్తున్నాయి. 22 దేశాలకు చెందిన 7 వేల మంది ప్రతినిధులు తమ ఉత్పత్తులను ఈ ఫెయిర్లో ప్రదర్శనకు ఉంచారు.
ప్రాంతీయం
ఈ-నామ్లో తెలంగాణకు అగ్రస్థానం
ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (ఈ-నామ్) ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.7,454 కోట్ల విలు వైన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని కేంద్ర వ్యవసాయశాఖ నవంబర్ 16న ప్రకటించింది. 18.71 లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్లైన్ ద్వారా వ్యాపారులకు అమ్ముకు న్నారని పేర్కొంది. ఇలా రాష్ట్రంలో 44 మార్కెట్ల ద్వారా ఈ-నామ్ను విజయ వంతంగా అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. తెలంగాణలో 85 వ్యవసాయ ఉత్పత్తులు 85 శాతం ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారానే విక్రయించారు. ఏ రాష్ట్రం లోనూ ఆన్లైన్ ద్వారా ఈ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరగలేదని కేంద్ర నివేదికలో ప్రస్తావించారు.
తెలంగాణకు ఇండియా టుడే అవార్డులు
ఆర్థిక రంగం, స్వచ్ఛతలో పురోగతికి గుర్తింపుగా రాష్ట్రానికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఇండియాటుడే ఏటా నిర్వహిస్తున్న స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్క్లేవ్-2017 సదస్సు నవంబర్ 16న ఢిల్లీలో జరిగింది. ఆర్థిక, స్వచ్ఛత రంగాల్లో పురోగతికి రాష్ట్రానికి రెండు బెస్ట్ పెర్ఫార్మింగ్ లార్జ్ స్టేట్ అవార్డులు ప్రదానం చేసింది. ఈ అవార్డులను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు కేటీఆర్, జోగు రామన్న అందుకున్నారు.
క్రీడలు
పాకిస్తాన్ బౌలర్ హఫీజ్ పై మళ్లీ నిషేధం
పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ మహమ్మద్ హఫీజ్ బౌలింగ్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి - ఐసీసీ మరోసారి నిషేధం విధించింది. గత నెలలో శ్రీలంకతో సీరీస్లో భాగంగా జరిగిన మూడో వన్డేలో హఫీజ్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడని గుర్తించిన ఐసీసీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద బౌలింగ్ యాక్షన్తో 2014 డిసెంబర్లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్.. రెండోసారి 2015 జూన్లో ఏడాది నిషేధానికి గురయ్యాడు.
బ్రెజిల్ గ్రాండ్ప్రి విజేత సెబాస్టియన్ వెటెల్
బ్రెజిల్ గ్రాండ్ప్రి రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్ల ఈ రేసును రెండో స్థానం నుంచి ప్రారంభించిన వెటెల్ గంటా 31 నిమిషాల 26.262 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. రెండో స్థానంలో వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), కిమీ రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, హామిల్టన్ నాలుగో స్థానంలో నిలిచారు. తాజా గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్షిప్ విభాగంలో వెటెల్కు (302 పాయింట్లు) రెండో స్థానం ఖాయమైంది. రెండు వారాల క్రితం మెక్సికో గ్రాండ్ప్రిలో హామిల్టన్కు (345 పాయింట్లు) ప్రపంచ టైటిల్ ఖరారైంది.
పేస్ - రాజాకు నాక్స్విల్లె ఏటీపీ చాలెంజర్ టైటిల్
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. భారత్కే చెందిన పురవ్ రాజా ద్వయం అమెరికాలో జరిగిన నాక్స్విల్లె ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్ను సాధించింది. నవంబర్ 13న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ పేస్-పురవ్ రాజా ద్వయం 7-6 (7/4), 7-6 (7/4)తో జేమ్స్ సెరాటిని (అమెరికా)-జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పేస్ జంటకు 4,650 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
17వ ప్రపంచ బిలియర్డ్స్ చాంప్గా పంకజ్ అద్వానీ
భారత క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ 17వ సారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్(150 అప్ ఫార్మాట్)గా నిలిచాడు. నవంబర్ 12న జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 6-2 ఫ్రేమ్ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి మైక్ రసెల్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. 2016లో బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్లోనూ పంకజ్ చాంపియన్గా నిలిచాడు.
Authorization