తెలుగు మోడల్ పేపర్ 1
వ్యక్తీకరణ సృజనాత్మకత (స్వీయరచన) 4ఞ3ొ12
అ) ఈ క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
1. తెలంగాణలో సంధ్యాభానువు మొదటిసారి ఉదయిం చాడని కవి దాశరథి అనడంలో ఉద్దేశం ఏమై ఉంటుందో తెలపండి?
2. వ్యసనాల వలన మనిషి జీవితంలో కలిగే నష్టాలను రాయండి?
3. శ్రీధర్మపురిలో వెలసిన నరసింహస్వామిని కీర్తిస్తూ రాసిన (నరసింహ శతకం) కవి రచనా శైలిని గురించి రాయండి?
4. 'సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబి స్తాయి' ఎందుకు?
ఆ) ఈ కింది వాటిలో ప్రతిభాగం నుండి తప్పనిసరిగా ఒక ప్రశ్నకు పదివ్యాక్యాల్లో జవాబు రాయండి?
3ఞ6ొ18
5. ఆకలి మనిషి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. ఈ అంశాన్ని గూర్చి మీ సొంతమాటల్లో రాయండి? లేదా
నేటి కాలంలోఓ నగర జీవనం సంక్లిష్టంగా మారిందని కవి అనడంలో ఆంతర్యం ఏమై ఉంటుందో పాఠం ఆధారంగా విశ్లేషించండి?
6. గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా తెలంగాణ కథల గురించి రాయండి? లేదా
కొత్తబాట పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి?
7. రామాయణం చదవడం వల్ల వ్యక్తికిగానీ. సమాజానికి గానీ కలిగే ప్రయోజనాలకు తెలపండి? లేదా
రామాయణం(ఉపవాచకం) ఆధారంగా గురుశిష్యుల అనుబంధాన్ని గూర్చి విశ్లేషించండి?
పార్ట్ -బి
భాషాంశాలు (పదజాలం)
అ) కింది పదాలకు సొంతవాక్యాలు రాయండి.2ఞ1ొ2
1) క్షేత్రం 2) జడిపించు
ఆ) కిందివాక్యాలలో గీతగీసిన పదాలకు సరైన అర్థం గుర్తించండి? 4ఞ1/2ొ2
3) శ్రీరాముడికి వచ్చిన కడగండ్లు ఎవరికీ రాకూడదు (బి)
ఎ) సంతోషాలు బి) కష్టాలు
సి) రాళ్లు డి) సంపదలు
4. నాకు నిరయం దాపురించినా సరే ఇచ్చిన మాట తప్పను? (సి)
ఎ) నరకం బి) బ్రతుకు
సి) ప్రాణం డి) స్వర్గం
5. మా ఊరి చెరువు విశాలంగా ఉన్నది? (డి)
ఎ) భావి బి) జలధి
సి) నది డి) తటాకం
6) భోజనంపై నెయ్యి అభిఘరించారు. (డి)
ఎ) కలిసినారు బి) కడిగినారు
సి) తిన్నారు డి) చల్లినారు
ఇ) గీతగీసిన పదానికి పర్యాయపదాలు రాయండి?
4ఞ1/2ొ2
7. మా ఇంటి లక్ష్మి మాకు ముఖ్యం (బి)
ఎ) శ్రీ, వస్త్రం, సాలెపురుగు
డి) శ్రీ, ఇందిర, కమల
బి) స్త్రీ, శ్రీ, వనిత
డి) అంబరం, సంపద, వాన
8. ముసలితనంలో పిల్లలు అండగా ఉంటారు. (డి)
ఎ) కుండ, గ్రుడ్డు బి) ఎక్కువ, సంతోషం
సి) ఆసరా, ఆనందం డి) ఆసరా, తోడు
9. మనదేశ సైన్యం ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. (ఎ)
ఎ) బలం, సేన బి) గొప్ప, అధికం
సి) రక్షణ, శిక్షణ డి) ఒప్పు, నిజం
10. నిజాం రాజుల గుండెల్లో తెలంగాణ వీరులు కల్లోలం రేపినారు. (సి)
ఎ) అలుక బి) కోపం
సి) పెద్ద అలజడి డి) బాధ
ఈ) గీతగీసిన వాటికి నానార్థాలు గుర్తించండి.
2ఞ1/2ొ1
11. నాప్రాణం పణంగా పెట్టైనా నిన్ను కాపాడుకుంటాను.
(బి)
ఎ) పందెం, వెల, ధనం
బి) అడ్డు, ఆయుధం, ఆధారం
సి) కీర్తి, సంపద, స్థానం
డి) తోడు, అద్భుతం, ఆవిరి
12. తెలంగాణ రాష్ట్రంలో సంబరాలు జరిగాయి. (సి)
ఎ) నేల, నింగి బి) మేను, శరీరం
సి) జాతర సేన
డి) తోడు అద్భుతం, ఆవిరి
ఉ) కింద గీతగీసిన పదానికి ప్రకృతికి వికృతి, వికృతికి ప్రకృతి పదాన్ని గుర్తించండి? 4ఞ1/2ొ2
13. ఆమె శిఖలో మల్లెపూలు పెట్టుకున్నది. (బి)
ఎ) తల బి) సిగ
సి) సంచి డి) సెగ
14. నేను చాలా దూరం ప్రయాణించాను. ప్రయాణం..(బి)
ఎ) పవనం బి) పయనం
సి) ప్రమాణం డి) ప్రయాణం
15. అజాగ్రత్తగా వాహనాన్ని నడిపితే మృత్యువు మనవెంటే ఉంటుంది? (ఎ)
ఎ) మరణం బి) వడ్డి
సి) అసలు డి) కొసరు
16. పిల్లలకు కైతలంటే చాలా ఇష్టం. (బి)
ఎ) కథ బి) కవిత
సి) పుస్తకం డి) కలం
ఊ) ఈ కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలను గుర్తించండి?
2ఞ1/2ొ1
17. విశ్వంభరుడు వ్యుత్పత్త్యర్థం (సి)
ఎ) లోకాన్ని పాలించేవాడు
బి) స్వర్గాన్ని జయించేవాడు
సి) విశ్వాన్ని భరించేవాడు
డి) అన్నింటినీ లక్కొనేవాడు
18. 'వేదవ్యాసుడు' వ్యుత్పత్త్యర్థం (బి)
ఎ) వేదాలను రాసినవాడు
బి) వేదాలను విభజించినవాడు
సి) వేదాలను అతిక్రమించినవాడు
డి) వేదాలను ఆక్రమించినవాడు
తెలుగు మోడల్ పేపర్ 2
1. అవగాహన - ప్రతిస్పందన 5ఞ1ొ5
అ) శ్రీరామచంద్రాదులు వానరసైన్యంలో సువేల పర్వతా నికి చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఎత్తైన ఆ పర్వత శిఖరం నుంచి లంకానగర శోభను చూశారు. లంకలో మేడ పై భాగంలో ఠీవిగా కూర్చున్నాడు రావణుడు. శ్రీరాముడు రావణున్ని చూశాడు. వానర ప్రముఖులూ చూశారు. సుగ్రీవుడు ఒక్క ఉదుటున లేచి కోపంతో ఊగిపోతున్నాడు. క్షణాలలో సువేల పర్వతం నుంచి రావణ భవనంపైన వాలాడు. తాను శ్రీరాముని మిత్రుడనని, తన దగ్గర తప్పించుకోవడం లంకేశుని తరం కాదని హెచ్చరించాడు. రావణుడిపైకి దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. ''సుగ్రీవా! ఇంతవరకు నీవు నాకంటబడలేదు. లేకుంటే ఎప్పుడో హీనగ్రీవుడవు(తల తెగినవాడవు) అయ్యేవాడివి'' అంటూ గర్జించాడు. ఇద్దరి మధ్య బాహాబాహీ యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణున్ని ముప్పు తిప్పలు పెట్టి క్షణాల్లో రివ్వున ఎగిరి సువేల పర్వతం మీద వాలాడు. శ్రీరాముడు సుగ్రీవున్ని సున్నితంగా మందలించాడు. తొందరపడి ఇలాంటి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చాడు.
పై పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
1. శ్రీరామచంద్రుడు తన పరివారంతో ఏ పర్వతానికి చేరుకున్నాడు?
2. లంకలో రావణుడు ఎక్కడ కూర్చున్నాడు?
3. సువేల పర్వతం నుంచి రావణ భవనంపైన వాలింది ఎవరు?
4. నాకంట బడితే నీవు హీనగ్రీవుడవు అయ్యేవాడివి అని ఎవరు ఎవరిని హెచ్చరించారు?
5. సుగ్రీవున్ని శ్రీరాముడు ఎందుకు మందలించాడు?
ఆ) ఈ క్రింది గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 5ఞ1ొ5
శ్రీకృష్ణదేవరాయలు క్రీ.శ.16వ శతాబ్దికి చెందినవాడు. సాహిత్యంపై ప్రత్యేక అభిమానం కలవాడు. భువన విజయమనే సభమండపాన్ని ఏర్పాటు చేసి సాహిత్య గోష్టులు నిర్వహించేవారు. అనేక మంది కవులను, పండితులను పోషించేవాడు. ఇతని ఆస్థానంలో ఎనిమిది మంది కవులు ఉండేవారు. వారిని ''అష్టదిగ్గజాలు'' అని పిలిచేవారు. అందులో అల్లసాని పెద్దన అగ్రగణ్యుడు. వికటకవిగా పేరుపొందిన తెనాలి రామకృష్ణుడు అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. రాయలు రాజు మాత్రమే కాదు, గొప్ప కవి, పండితుడు కూడా. ''దేశ భాషలందు తెలుగు లెస్స'' అని తెలుగు భాషను కీర్తించాడు. ఇతని కాలంలోనే ప్రబంధాలు ఎక్కువగా వచ్చాయి. కావున ఈయన కాలం తెలుగు భాషకు స్వర్ణయుగమై కీర్తించబడింది.
6.''భువన విజయం'' అనే సభా భవనాన్ని ఏర్పాటు చేసింది ఎవరు?
7. రాయలు ఆస్థానంలోని కవులను ఏమని పిలిచేవారు?
8. ''దేశ భాషలందు తెలుగు లెస్స'' అని ఎవరు అన్నారు?
9. తెలుగు భాష స్వర్ణయుగమై ఎవరి కాలంలో కీర్తించబడింది?
10. తెనాలి రామకృష్ణున్ని ఏమని పిలిచేవారు?
ఇ) ఈ క్రింది పద్యం పూర్తి చేసి భావాన్ని సొంత మాటల్లో రాయండి. 5ఞ1ొ5
కారే రాజులు? --------యిక్కాలమున్ భార్గవా!
లేదా
నీ యొడిలోన పెంచితివి ----- జిగిమెండు మాతరో!
ఈ) ఈ క్రింది పద్యం చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండం. 5ఞ1ొ5
రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
సుకవి చేతి కలము సుధలు కురియు
అతడేల గలుగు యాత్ప్రపంచంబు
నీతడేల గలుగు ఇహము పరము
12) ఎవరి చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది?
13) ఈ పద్యంలో ''అతడు'' అనగా ఎవరు?
14) ఇహము పరము ఈ రెండింటిని ఏల గలిగేవాడు ఎవరు?
15) సుధలు ఎవరి చేత కురిపించబడతాయి?
16) పై పధ్యానికి శీర్షిక నిర్ణయించండి?
సృజనాత్మకత 2ఞ5ొ10
ఉ) ఈ క్రింది వాటిలో ఏవేని రెండు ప్రశ్నలకు జవాబులు రాయండి.
17) మీరు సందర్శించిన ఏదేని పుణ్యక్షేత్రం గురించి మీ మిత్రునికి లేఖ రాయండి?
18) మీ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మీకు తెలిసిన వ్యక్తిని అభినందిస్తూ అభినందన వ్యాసం రాయండి?
19) ''సమాజంలో మూఢనమ్మకాలను పారదోలడం'' అనే అంశాన్ని వివరిస్తూ ఒక 'కరపత్రం' తయారు చేయండి
పార్ట్ - బి
×. భాషాంశాలు (వ్యాకరణాంశాలు) 20ఞ1/2ొ10
అ) ఈ క్రింది వాటికి అడిగిన విధంగా సరైన జవాబులు గుర్తించండి.
1. దుర్ముహూర్తం విడదీయగా (సి)
ఎ) దు+ముహూర్తం బి) దుర్+ముహూర్తం
సి) దు:+ ముహూర్తం డి) దు:+సుముహూర్తం
2. ఈ క్రింది వానిలో త్రిక సంధికి ఉదాహరణ (ఎ)
ఎ)అవ్వీటి బి)రాజాజ్ఞ
సి)ఎవరైనా డి)మాయమ్మ
3. నల్లకలువలు విగ్రహ వాక్యం (సి)
ఎ)నల్లగా ఉన్న కలువలు
బి) నల్లటి కలువలు
సి) నల్లనైన కలువలు
డి) నల్లరంగు కలువలు గల పూవులు
4. ఉత్తర పదం ప్రధానంగా గలది (డి)
ఎ) కర్మదారయ సమాసం బి) ద్వంద్వ సమాసం
సి) ద్విగు సమాసం
డి) తత్పురుష సమాసం
5. ''వేదపురాణ శాస్త్ర పదవీనదవీయసియైన పెద్దము'' పద్యపాదం ఏ వృత్తానికి చెందినది (డి)
ఎ) చంపకమాల బి) శార్థూలం
సి) మత్తేభం డి) ఉత్పలమాల
6. 2, 4 పాదాలలో అయిదు సూర్య గణాలు కలిగిన పద్యము (బి)
ఎ) కందము బి) ఆటవెలది
సి) తేటగీతి డి) ద్విపద
7. ఈ క్రింది వాటిలో సమర్థించి చెప్పే అలంకారం ఏది? (సి)
ఎ) అతిశమోక్తి అలంకారం
బి) రూపకాలంకారం
సి) అర్థాంతర వ్యాసాలంకారం
డి) ఛేకానుప్రాస అలంకారం
8. ''మిమ్ము మాధవుడు రక్షించుగాక'' దీనిలోని అలంకారం (సి)
ఎ) ఉపమాలంకారం
బి) ఉత్ప్రేక్షాలంకారం
సి) శ్లేషాలంకారం
డి) రూపకాలంకారం
9. శౌర్యాది దీనిలోని గణాలు (ఎ)
ఎ) ఖఖ× బి) ఖ×ఖ సి) ×ఖఖ డి) ఖ××
10. తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని రాజేష్ అన్నాడు - దీనిని ప్రత్యక్ష కథనంలోకి మారిస్తే (సి)
ఎ) నేను తన దేశాన్ని ప్రేమిస్తున్నానన్నాడు రాజేష్
బి) నీవు నీ దేశాన్ని ప్రేమిస్తానన్నాడు రాజేష్
సి) ''నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను'' అని రాజేష్ అన్నాడు
డి) తాను నా దేశాన్ని ప్రేమిస్తున్నానన్నాడు రాజేష్
11. '' నాకివ్వాల్సింది ఏమీ లేదు'' అని శేఖర్ అన్నాడు - దీనిని పరోక్ష కథనంలోకి మారిస్తే (ఎ)
ఎ) తనకివ్వాల్సింది ఏమి లేదని శేఖర్ అన్నాడు
బి) అతనికి ఇవ్వాల్సింది ఏమి లేదన్నాడు శేఖర్
సి) అతనికివ్వాల్సింది అన్నాడు శేఖర్
డి) మాకు ఇవ్వాల్సిందే అన్నాడు శేఖర్
12. '' నేను దాదాపు 20 ఇంటర్వ్యూలు చేశాను'' దీనిని కర్మణీ వాక్యంగా మారిస్తే (బి)
ఎ) తాను దాదాపు 20 ఇంటర్వ్యూలు చేశాడు.
బి) నాచే దాదాపు 20 ఇంటర్వ్యూలు చేయబడ్డాయి.
సి) అతను దాదాపు 20 ఇంటర్వ్యూలు చేశాడు.
డి) నేను దాదాపు 20 ఇంటర్వ్యూలు చేయబడ్డాను.
13) ఈ క్రింది దానిలో ''బడు'' అనే పదం క్రియాపదానికి చేర్చబడుతుంది (ఎ)
ఎ) కర్మణీవాక్యం
బి) కర్తరీ వాక్యం
సి) సామాన్య వాక్యం
డి) సంశ్లేష వాక్యం
14) నేను పాఠశాలకు వెళ్లాను. నేను పాఠం చదివాను - ఈ వాక్యాలను సంశ్లిష్ట వాక్యంగా మర్చగా (సి)
ఎ) నేను పాఠశాలకు వెళ్లాను, పాఠం చదివాను.
బి) నేను పాఠం చదివాను, పాఠశాలకు వెళ్లలేదు.
సి) నేను పాఠశాలకు వెళ్లి, పాఠం చదివాను.
డి) నేను పాఠశాలకు వెళ్లినా పాఠం చదువలేదు.
15) రామదాసు కీర్తనలు రాశాడు. రామదాసు కీర్తనలు భద్రపరచాడు - ఈ వాక్యాలను సంయుక్త వాక్యంగా మార్చగా (బి)
ఎ) రామదాసు కీర్తనలు రాసి, వాటిని భద్రపరిచాడు.
బి) రామదాసు కీర్తనలు రాశాడు మరియు భద్రపరిచాడు.
సి) రామదాసు కీర్తనలు రాస్తూ, భద్రపరిచాడు.
డి) రామదాసు కీర్తనలు రాయలేదు, అయినా భద్రపరిచాడు.
16) నేను లోపలికి రావచ్చా. ఇది ఏ రకమైన వాక్యం
(ఎ)
ఎ) ప్రశ్నార్థక వాక్యం
బి) ఆశ్యర్యార్థక వాక్యం
సి) నిషేదార్థక వాక్యం
డి) అనుమత్యార్థక వాక్యం
17) సీత ఇంటికి వస్తుందో! రాదో? ఇది ఏ రకమైన వాక్యం (సి)
ఎ) కర్మణీ వాక్యం బి) కర్తరీ వాక్యం
సి) సందేహార్థక వాక్యం
డి) నిషేదార్థక వాక్యం
18. మధ్యలఘువు ఉండేది (సి)
ఎ) తగణం బి) మగణం
సి) రగణం డి) యగణం
19) భేదం లేనట్లు చెప్పే అలంకారమేది? (సి)
ఎ) ఉపమాలంకారం
బి) ఉత్ప్రేక్షాలంకారం
సి) రూపకాలంకారం
డి) శ్లేషాలంకారం
20. మత్తేభంలో వచ్చే గణాలు వరుసగా (బి)
ఎ) భరనభభరవ బి) సభరనమయవ
సి) నజభజజజర
డి)మనజసతతగ
- ఆర్. సత్యనారాయణ
తెలుగు పండిట్
జడ్పీహెచ్ స్కూల్, భూంపల్లి
సిద్దిపేట జిల్లా ఫోన్:9676201554
Authorization