అంతర్జాతీయం
'చైనా థర్మల్'ను ఉపసంహరించుకున్న పాకిస్తాన్
చైనా సహకారంతో నిర్మించదలపెట్టిన 1,320 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం పనులను పాకిస్థాన్ ఉపసంహరిం చుకుంది. ఈ విషయాన్ని చైనా ప్రభుత్వానికి తెలియజే సింది. దేశంలో తగినంతగా విద్యుత్తు ఉత్పాదన జరుగుతు న్నందున అదనంగా థర్మల్ కేంద్రాలు అవసరం లేదని పేర్కొంది. ఈ ప్లాంటు నిర్మించాలని పంజాబ్ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనకు, చైనా ప్రభుత్వం 60 బిలియన్ డాలర్లు (రూ.4.24 లక్షల కోట్లు) రుణం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది.
విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం కోటాకు రాష్ట్రపతి ఆమోదం
జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లు చట్టరూపం సంతరించుకుంది. దీనిపై 2019 జనవరి 12న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో చట్టంగా మారింది. 124వ రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంటు ఆమోదం పొందిన ఈ అంశం రాష్ట్రపతి ఆమోద ముద్రతో 103వ రాజ్యాంగ సవరణ చట్టంగా రూపాంతరం సంతరించుకొంది. రిజర్వేషన్ల కల్పన కోసం రాజ్యాంగంలోని 15, 16 అధికరణాలను సవరించాల్సి వచ్చింది.
జాతీయం
ముమ్మారు తలాక్ను నిషేధిస్తూ మళ్లీ ఆర్డినెన్స్
ముమ్మారు తలాక్ను నిషేధిస్తూ మరోసారి అత్యవసర ఆదేశం (ఆర్డినెన్స్) జారీ అయింది. దీనిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2019 జనవరి 12న సంతకం చేశారు. దీనిపై రూపొందించిన బిల్లు ఇంకా పార్లమెంటు ఆమోదం పొందక పోవడంతో గత సెప్టెంబరులో అత్యవసర ఆదేశం జారీ చేశారు. దాని కాలపరిమితి 2019 జనవరి 22న ముగి యనుండడంతో మళ్లీ జారీ చేయాల్సి వచ్చింది. ఈ బిల్లు ప్రస్తుతం రాజ్యసభ పరిశీలనలో ఉంది. భారత వైద్య మండలి సవరణ బిల్లు-2018, కంపెనీల సవరణ బిల్లు-2019లపై కూడా రాష్ట్రపతి అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.
CBI నుంచి రాకేశ్ అస్థానాకు ఉద్వాసన
సీబీఐ ప్రత్యేక సంచాలకుడు రాకేశ్ అస్థానాకు ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఆయనతో పాటు మరో ముగ్గురు సీనియర్ అధికారులకు 2019 జనవరి 17కు ఉద్వాసన పలికింది. అస్థానాతో పాటు సంయుక్త సంచాలకుడు అరుణ్కుమార్ శర్మ, డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ మనీష్కుమార్ సిన్హా, ఎస్పీ జయంత్ జె నాయక్నవరేల పదవీ కాలాన్ని ఇంతటితో ముగిస్తున్నట్లు సిబ్బంది శాఖ ఆదేశాలు జారీ చేసింది. అస్థానాను పౌర విమానయాన భద్రతా సంస్థ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, విమానాల భద్రతను ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది.
80 FDC ఔషధాలపై నిషేధం
కేంద్ర ఆరోగ్య శాఖ మరో 80 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ( FDC) ఔషధాల్ని నిషేధించింది. ఇందులో నొప్పి నివారిణులు, యాంటి బయోటిక్లతో పాటు బీపీ, బ్యాక్టీరియా, ఫంగస్లతో వ్యాపించే వ్యాధుల చికిత్సకు వాడే మందులున్నాయి. ఈ ఔషధాలపై నిషేధం 2019 జనవరి 11 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో నిషేధానికి గురైన మొత్తం ఎఫ్డీసీ ఔషధాల సంఖ్య 405కు పెరిగింది. 2018 సెప్టెంబర్లో 325 ఔషధాలను నిషేధిత జాబితాలో చేర్చారు.
CBSE 10వ తరగతి గణితంలో రెండు రకాల పరీక్షలు
2020 నుంచి సీబీఎస్ఈ 10వ తరగతి గణిత పరీక్షను రెండు రకాలుగా నిర్వహించనున్నట్లు కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) ప్రకటించింది. ప్రస్తుతమున్న కఠినత్వంతో ప్రామాణిక (స్టాండర్డ్) పరీక్షను, సులువుగా ఉండేలా ప్రాథమిక (బేసిక్) పరీక్షను నిర్వ హించనున్నారు. ఉన్నత విద్యలో గణిత సంబంధ కోర్సులు అభ్యసిం చాల నుకునే విద్యార్థులు ప్రామా ణిక పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సిందే. ఇతర కోర్సులు చేయాలనుకునే వారు ప్రాథమిక స్థాయి పరీక్ష ఉత్తీర్ణులయితే సరిపోతుంది. పాఠ్య ప్రణాళిక, బోధనల్లో ఎలాంటి మార్పులూ ఉండవు. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు CBSE వెల్లడించింది.
చైనా సరిహద్దుల్లో 44 వ్యూహాత్మక రహదారులు
చైనా సరిహద్దుల వెంబడి 44 వ్యూహాత్మక రహ దారుల నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికితోడు పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన పంజాబ్, రాజస్థాన్లో 2100 కి.మీ. మేర రోడ్లు వేయనుంది. కేంద్ర ప్రజా పనుల శాఖ(CPWD) వార్షిక నివేది కలో ఈ వివరాలు పొందుపరిచారు. వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి రూ.21,040 కోట్లు అవసరమవుతాయని అంచనా.
గురు గోవింద్సింగ్ స్మారక రూ.350 వెండి నాణెం
గురు గోవింద్సింగ్ 350వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి 2019 జనవరి 13న న్యూఢిల్లీలో ఆయన స్మారకార్థం రూ.350 వెండి నాణేన్ని విడుదల చేశారు. సిక్కుల ఆరాధ్యదైవం కొలువైన ప్రాంతం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా 1947 దేశ విభజనలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లడం పెద్ద తప్పిదమన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ హాజరయ్యారు.
సిక్కింలో 'ఒక కుటుంబం-ఒక ఉద్యోగం పథకం'
సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం-ఒక ఉద్యోగం పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి పవన్ ఛామ్లింగ్ 2019 జనవరి 13న రాజధాని గ్యాంగ్టక్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో కుటుంబానికి ఒకరు చొప్పున 12 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. 2018 శీతాకాల సమావేశాల్లో సిక్కిం ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రకటించారు.
వాట్సాప్లో విచారణతో విడాకులు మంజూరు చేసిన నాగ్పూర్ కుటుంబ న్యాయస్థానం
వాట్సాప్ వీడియో కాల్ సాయంతో అమెరికాలో ఉన్న భార్య, భారత్లో ఉన్న భర్త విడాకులు పొందారు. ఈ అరుదైన సంఘటనకు మహారాష్ట్రలోని నాగ్పూర్ కుటుంబ న్యాయస్థానం వేదికైంది. 2013 ఆగస్టు 11న నాగ్పూర్కు చెందిన వ్యక్తి (37), హైదరాబాద్ (సికింద్రాబాద్)కు చెందిన యువతి (35) పెద్దలు కుదిర్చిన వివాహబంధంతో ఒక్కట య్యారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరగడంతో భర్త నాగ్పూర్ కుటుంబ న్యాయస్థానంలో విడాకులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనలకు అనుగుణంగా ఈ కేసును కౌన్సిల్కు అప్పగించారు. కేసు విచారణకు స్వయంగా తను హాజరు కాలేనని భార్య వెల్లడించడంతో న్యాయస్థానం సామాజిక మాధ్యమం వాట్సాప్ను సరికొత్త విధానానికి అనుసరించింది. యువతి విజ్ఞప్తి మేరకు కౌన్సిల్ ఆమెను వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ప్రశ్నించి, ఆ కాల్ను రికార్డు చేశారు. తర్వాత భర్తను ప్రశ్నించగా ఇద్దరూ విడాకులకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడైంది.
లద్దాఖ్లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ కర్మాగారం
పర్వతాలు, సరస్సులు, ప్రకతి సోయగాలతో కనువిందు చేసే లద్దాఖ్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్ కర్మాగారం ఏర్పాటు కానుంది. 25 వేల ఎకరాల్లో 5000 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు. ఒకే ప్రాంతంలో ఇంత భారీ విస్తీర్ణంలో ఇప్పటివరకూ ఏ సౌర విద్యుత్ కర్మాగారామూ ఏర్పాటు కాలేదు. జమ్మూకశ్మీర్లోని కార్గిల్లో 12.5 వేల ఎకరాల విస్తీర్ణంలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో మరొకదాన్ని నిర్మించనున్నారు. ఈ రెండు కర్మాగారాల ద్వారా ఏటా 12,750 టన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించుకునే అవకాశం ఉంది.
గ్లోబల్ థింకర్స్-2019లో ముకేశ్ అంబానీకి చోటు
గ్లోబల్ థింకర్స్-2019 జాబితాలో ముకేశ్ అంబానీ చోటు దక్కించుకు న్నారు. ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ఫారిన్ పాలసీ మొత్తం 100 మందితో ఈ జాబితా రూపొం దించింది. ప్రస్తుతానికి కొంత మంది పేర్లనే వెల్లడించింది. పూర్తి జాబితాను 2019 జనవరి 22న విడుదల చేస్తుంది. అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతి క్రిస్టీన్ లగార్డే కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
EIU డెమోక్రసీ ఇండెక్స్ 2018లో భారత్కు 42వ స్థానం
11వ EIU డెమోక్రసీ ఇండెక్స్ 2018లో నార్వే ప్రథమ స్థానంలో నిలిచింది. 167 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో ఐస్లాండ్కు 2వ స్థానం, స్వీడన్కు 3వ స్థానం, భారత్ 42వ స్థానంలో నిలిచింది. ఈ ఇండెక్స్ను 2006 నుంచి ప్రారంభించారు.
THE టాప్ 200లో 49 భారతీయ వర్సిటీలు
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) 2019 సం||నికి విశ్వ విద్యాలయాలకు ర్యాంకింగ్లు ప్రకటించింది. 43 దేశాలకు చెందిన 450 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్లు ప్రకటిం చగా భారత్కు చెందిన 49 వర్సిటీలు టాప్ 200లో స్థానం సంపాదించాయి. ర్యాంకింగ్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగుళూరు) 14వ స్థానం, ఐఐటీ (బొంబాయి) 27వ స్థానం, ఐఐటీ (రూర్కీ) 35వ స్థానం, ఐఐటీ (ఇండోర్) 61వ స్థానం, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 64వ స్థానంలో నిలిచాయి. సావిత్రిబాయి ఫూలే పూణె యూనివర్సిటీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, అమతా యూనివర్సిటీ ఈ సారి టాప్ 150లో స్థానం సంపాదించాయి.
నవీన భారత్ 75 పేరుతో నీతి ఆయోగ్ వ్యూహపత్రం
నవీన భారత్ నిర్మాణానికి నాణ్యమైన విద్య అవసరమని, అందుకు ఉపాధ్యాయ విద్యను అత్యంత శ్రేష్ఠమైందిగా తీర్చిదిద్దేందుకు సమూల ప్రక్షాళన తప్పనిసరని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఉపాధ్యాయ విద్యలోకి ప్రవేశానికి కనీస ప్రమాణాలు ఉండాలని, దానికి కఠినంగా ఉండే ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహించాలని అభిప్రాయ పడింది. భారత్కు స్వాతంత్య్రం వచ్చి 2022నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతుందని, అప్పటికి నూతన భారత్ సష్టికి పాఠశాల, కళాశాల, ఉపాధ్యాయ విద్యలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయాలో పేర్కొంటూ నవీన భారత్ 75కు అవలంబిం చాల్సిన వ్యూహపత్రాన్ని రూపొందిం చింది. లక్ష్యం, ప్రస్తుత పరిస్థితి, ముందుకెళ్లేందుకు అనుసరించాల్సిన మార్గాలను అందులో పొందుపరిచింది.
ప్రాంతీయం
అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ఖాన్
మజ్లిస్ సీనియర్ ఎమ్మెల్యే ముం తాజ్ అహ్మద్ఖాన్ ప్రొటెం స్పీకర్గా నియమితులయ్యారు. 2019 జనవరి 16న రాజ్భవన్ దర్బార్ హాలులో ఆయనతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిం చారు. అంతకుముందు రాజ్యాంగంలోని ఆర్టికల్ -178 ప్రకారం ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ఖాన్ను నియమిస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి వేదాంతం నరసింహా చార్యులు ప్రకటించారు. ముంతాజ్ అహ్మద్ఖాన్ ఉర్దూలో ప్రమాణం చేశారు. 34 ఏళ్ల తర్వాత మజ్లిస్కు ఎమ్మెల్యేకు ప్రొటెం స్పీకర్గా అవకాశం లభించినట్లయింది. 34 ఏళ్ల క్రితం ఆ పార్టీ అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేయగా, ఆ తర్వాత ముంతాజ్ అహ్మద్ఖాన్కే ఈ అవకాశం దక్కింది.
ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు
తెలంగాణ శాసనమండలిలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం సభ్యుడు భూపతిరెడ్డి, శాసనసభ్యుల కోటా సభ్యుడు యాదవరెడ్డి, గవర్నర్ కోటాలో నియమితులైన రాములు నాయక్లు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినందుకు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారి సభ్యత్వాలను రద్దు చేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు 2019 జనవరి 16న ఉత్తర్వులు (బులెటిన్) ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని 19(2) అధికరణలోని 10వ షెడ్యూలు రెండో పేరా (1) (ఎ) కింద, శాసనమండలి ఆరో నిబంధన కింద అనర్హులుగా ప్రకటించినట్లు తెలిపారు.
హైదరాబాద్లో అగ్రి విజన్-2019 సదస్సు
సీఐఐ, జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం, కోర్నెల్ యూనివర్సిటీ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వ హించిన అగ్రి విజన్-2019 సదస్సు ను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు 2019 జనవరి 17న ప్రారంభించారు.
జస్టిస్ రాధాకష్ణన్ కోల్కతాకు బదిలీ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకష్ణన్ కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేరళ హైకోర్టు న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్ దామా శేషాద్రినాయుడు బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఝార్ఖండ్ హైకోర్టులో సేవలందిస్తున్న జస్టిస్ ప్రథమ్ పట్నాయక్ను ఆయన అభ్యర్థన మేరకు ఒడిశా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయించింది.
వసతి గహాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్
సాంకేతిక సమస్యల వల్ల వేలి ముద్రల వ్యవస్థ విఫలం కావడంతో రాష్ట్రంలోని సంక్షేమ వసతి గహాల్లో ఆధార్ ఆధారిత బయో మెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తొలుత ప్రయోగాత్మకంగా బీసీ సంక్షేమ వసతిగహాల్లో ప్రారంభిం చింది. విద్యార్థుల హాజరును పరిశీలిస్తూ ఆ మేరకు నిధులు విడుదల చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మిగతా సంక్షేమ వసతి గహాల్లోనూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) సహాయం తీసుకుంటోంది.
కాకతీయ బ్రాండ్తో మామిడి ఎగుమతికి నిర్ణయం
రాష్ట్రంలో పండుతున్న మామిడికాయలను 'కాకతీయ' బ్రాండ్ పేరుతో విదేశాలకు ఎగుమతి చేయాలని తెలంగాణ ఉద్యానశాఖ నిర్ణయించింది. కార్బైడ్ వాడకుండా శాస్త్రీయం గా ఇథిలిన్ వాయువుతోనే మామిడికాయలను మాగబెట్టి ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బ్రిటన్, కొరియా, జపాన్, అరబ్ దేశాలకు ఎగుమతి చేయాలనేది యోచన. కాయలను మాగబెట్టి విదేశాలకు పంపేందుకు అనువుగా ఉండేలా రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్యాకహేౌస్ సిద్ధమవుతోంది.
తెలంగాణ గ్రామపంచాయతి ఎన్నికల్లో ఓటరు స్లిప్పుల డౌన్లోడ్కు 'టెపోల్' యాప్
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు యాప్ ద్వారా ఓటరు స్లిప్పు లను డౌన్లోడ్ చేసుకో వడానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం టెపోల్ (Te-Poll) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లోని ప్లే స్టోర్లోకి వెళ్లి టెపోల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జిల్లా, ఎపిక్ నంబర్ను ఎంటర్ చేసి ఓటరు స్లిప్పును పొందవచ్చు.
వార్తల్లో వ్యక్తులు
ముగ్గురు ఇండో-అమెరికన్లకు కీలక పదవులు
ముగ్గురు భారత సంతతి అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. అత్యంత ప్రాధాన్యమైన మూడు విభాగాలకు 2019 జనవరి 16న వీరిని అధ్యక్షుడు ట్రంప్ ఎంపిక చేశారు. తాజా నియామకాలతో ట్రంప్ ఇప్పటివరకూ 36 మందికిపైగా భారతీయ అమెరికన్లకు ముఖ్యమైన పదవులు ఇచ్చినట్టయింది. అణు విద్యుత్ విభాగ సహాయ కార్యదర్శిగా రీటా బరన్వాల్, ప్రైవసీ-సివిల్ లిబర్టీస్ ఓవర్సైట్ బోర్డు సభ్యుడిగా ఆదిత్య బంజారు, కోశాగార సహాయ కార్యదర్శిగా బిమల్ పటేల్లను అధ్యక్షుడు ఎంపిక చేశారు.
'అగస్త్యర్కూడమ్'ను అధిరోహిస్తున్న తొలి మహిళ
ఎంతో కాలం నుంచి మహిళలకు ప్రవేశానుమతి లేని కేరళలోని 'అగస్త్యర్ కూడమ్' (అత్యంత ఎత్తైన రెండో పర్వత శిఖరం)ను కె.ధన్యా సనాల్ (38) అనే వనిత తొలిసారిగా అధిరోహించింది. ధన్యా సనాల్ 2012 బ్యాచ్కు చెందిన 'ఇన్ఫర్మేషన్ సర్వీసు అధికారి'. ప్రస్తుతం ఆమె తిరువనంత పురంలో రక్షణ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పర్వతశిఖరాన్ని మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కకూ డదని ఎన్నో తరాల నుంచి గిరిజన సంప్రదాయం ఉంది.
NBE బోర్డు సభ్యుడిగా రమేష్బాబు
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షే మశా ఖకు చెందిన ప్రతిష్ఠాత్మక నేష నల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) బోర్డు సభ్యుడిగా, దక్షిణ భారత ప్రతినిధిగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పోతినేని రమేష్ బాబు నియమితులయ్యారు. రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్గా రమేష్బాబు ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కార్డియాలజీ విభాగంలో రమేష్ బాబును సభ్యుడిగా నియమిస్తూ ఎన్బీఈ డైరెక్టర్ డా.రష్మీకాంత్ దవే 2019 జనవరి 14న ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో నీట్ సహా అన్ని వైద్య విద్య సంబంధిత పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల రూపకల్పన, ప్రాక్టికల్స్, సబ్జెక్ట్ నిపుణులు, పరీక్షల పర్యవేక్షకులు, ప్యానెల్ ఇన్స్పెక్టర్ల నియామకం వంటి అంశాలను ఎన్బీఈ నిర్దేశిస్తుంది.
యెస్ బ్యాంక్ తాత్కాలిక చైర్మన్గా బ్రహ్మదత్
నాన్ ఎగ్జిక్యూటివ్ తాత్కాలిక చైర్మన్గా బ్రహ్మదత్ను నియమించినట్లు యెస్ బ్యాంక్ 2019 జనవరి 12న ప్రకటించింది. 'బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 నిబంధనల కింద యెస్ బ్యాంక్ బోర్డు పార్ట్ టైం చైర్మన్గా దత్ నియామకానికి ఆర్బీఐ ఆమోదముద్ర వేసినట్లు 2019 జనవరి 11 తేదీతో ఉన్న లేఖలో వెల్లడించింది. 2020 జులై 4 వరకు ఆయన బాధ్యతల్లో ఉంటారని బ్యాంక్ పేర్కొంది.
NSE చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా చేశారు. తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందని 2019 జనవరి 11న ఎక్స్ఛేంజీ వెల్లడించింది. మాజీ బ్యూరో క్రాట్ అయిన చావ్లాను ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసులో విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ప్రభుత్వం అనుమతిచ్చిన గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. 2018 నవంబరులో యెస్ బ్యాంక్ చైర్మన్ పదవి నుంచి వైదొలగారు.
సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్వర్మ పదవీ విరమణ
సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్వర్మ తాను ఇక ప్రభుత్వ సర్వీసులో కొనసాగబోనని తేల్చిచెప్పారు. తనను తప్పించిన తీరును ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియను విమర్శిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. అత్యున్నత స్థాయి కమిటీ తీరును అందులో ఆక్షేపించారు. ప్రభుత్వం బదిలీ చేసిన విధంగా అగ్నిమాపక సేవలు, పౌర రక్షణ, హోం గార్డుల విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలను స్వీకరిం చేందుకు ఆయన నిరాకరించారు. సీబీఐ డైరెక్టర్గా ఆయన పదవీకాలం 2019 జనవరి 31తో ముగియాల్సి ఉంది.
కామన్వెల్త్ పదవికి జస్టిస్ ఏకే సిక్రి నిరాకరణ
లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ (సీశాట్) అధ్యక్షుడు/ సభ్యుడిగా సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ ఏకే సిక్రి పేరును కేంద్రం ప్రతిపాదిం చగా, ఆ పదవి చేపట్టేందుకు ఆయన తిరస్కరించారు. ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను తొలగించిన హైపవర్డ్ కమిటీలో జస్టిస్ సిక్రి కూడా సభ్యుడే. ఈ పదవిని వద్దనుకుంటున్నానని, తన పేరును ఇకపై పరిగణించొద్దని కోరుతూ ఆయన కేంద్రానికి లేఖ పంపారు.
భారత ఫుట్బాల్ జట్టు కోచ్ కాన్స్టంటైన్ రాజీనామా
ఆసియా కప్ ఫుట్బాల్లో భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడం తో జట్టు కోచ్ స్టీఫెన్ కాన్స్టం టైన్ తన పదవికి రాజీనామా చేశాడు.
ఫుట్బాల్ దిగ్గజం జుల్ఫికరుద్దీన్ కన్నుమూత
భారత ఫుట్బాల్ దిగ్గజం మహమ్మద్ జుల్ఫికరుద్దీన్ (82) 2019 జనవరి 13న హైదరాబాద్లో మృతి చెందాడు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిథ్యం వహిం చిన జుల్ఫికరుద్దీన్ కొండాపూర్ పోలీస్ బెటాలియన్ లో డీఎస్పీగా పనిచేసి పదవీ విరమణ పొందాడు. ఫుట్బాల్ లో అద్భుత ప్రతిభ చాటిన ఆయన 16 ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పోలీస్(ఏపీపీ) జట్టుకు కెప్టెన్గా వ్యవహరిం చాడు.
ఆకాశవాణి చిన్నమ్మ నిర్మలా వసంత్ కన్నుమూత
ఆకాశవాణిలో రోజూ ప్రసారమయ్యే పాడి-పంట కార్యక్రమంలో చిన్న మ్మగా ఆబాల గోపాలాన్ని అలరించిన నిర్మలా వసంత్ (72) 2019 జనవరి 17న హైదరాబాద్లో మృతి చెందారు. 'పాడి పంట' వ్యవసాయ కార్యక్రమం అయిన ప్పటికీ వినోదం జోడించి అన్ని వర్గాల శ్రోతలను నిర్మలా వసంత్ తన వైపునకు ఆకర్షించి ఆశ్చర్యపర్చారు. పల్లెటూరి అమాయక మహిళా రైతు మనసును ఒడిసిపట్టి రైతుల సందేహాలు తన గొంతులో వినిపిస్తూ, పెద్దయ్య ద్వారా సమాధానాలు రాబడుతూ అందరినీ మెప్పించారు.
అవార్డులు
గాంధీ శాంతి బహుమతి విజేతల ప్రకటన
గాంధీ శాంతి బహుమతి విజేతలను కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 16న ప్రకటించింది. 2015-18 వరకు మొత్తం నాలుగు సంవత్సరాలకు విజేతలను ప్రకటించారు. 2018 సంవత్సరానికి యోహీ ససకావా గెలుచుకున్నారు. ఈయన ప్రపంచ ఆరోగ్య సంస్థ తరపున ప్రపంచ వ్యాప్తంగా కుష్టు నివారణకు కషి చేస్తున్నారు. 2015 సంవత్సరానికి కన్యా కుమారిలోని వివేకానంద కేంద్ర ఈ అవార్డును గెలుచు కుంది. 2016కు గాను అక్షయ పాత్ర ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్లు సంయుక్తంగా గెలుచుకున్నాయి.
జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయానికి సీఎస్ఆర్ అవార్డు
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL)కు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) అవార్డు లభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ), 2018 సీఎస్ఆర్ ఎక్సలెన్స్ అవార్డుల్లో ఉత్తమ కార్పొరేట్ సంస్థగా అవార్డు దక్కించుకు న్నట్లు జీహెచ్ఐఏఎల్ వెల్లడించింది.
కొండి మల్లారెడ్డికి అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారం
సిద్దిపేట జిల్లాకు చెందిన కవి, రచయిత కొండి మల్లారెడ్డికి అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో 2019 జనవరి 12న కరీంనగర్లో నిర్వహించిన కార్యక్రమంలోశాశ్వత పురస్కార ప్రదాత ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఎత్తైన శిఖరాలు,అగ్ని పర్వతాలు అధిరోహించిన సత్యరూప్
7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను, అగ్ని పర్వత శిఖరాగ్రాలను అత్యంత పిన్నవయసులో అధిరో హించినవాడిగా భారత పర్వతా రోహకుడుగా సత్యరూప్ సిద్ధాంత ఘనత సాధించారు. 35 ఏళ్ల 262 రోజుల వయసులో ఆయన ఈ పని పూర్తి చేశారు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన డానియెల్ బుల్ (36 ఏళ్ల 157 రోజులు) పేరు మీద ఉండేది. 2019 జనవరి 16న -40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద అంటార్కిటికాలోని మౌంట్ సిడ్లీ శిఖరాన్ని అధిరోహించి సత్యరూప్ రికార్డును తిరగరాశాడు. కోల్కతాకు చెందిన సత్యరూప్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేస్తున్నారు.
ఎత్తైన పర్వతాలు అధిరోహించిన కల్నల్ రణ్వీర్
ప్రపంచంలోని 7 ఖండాల్లో గల అత్యంత ఎత్తైన శిఖరాలు అధి రోహించిన మొట్టమొదటి భారతీయ సైనికాధికారిగా కల్నల్ రణ్వీర్ జామ్వాల్ రికార్డు సష్టించారు. 2019 జనవరి 4న భారత జాతీయ పతాకాన్ని అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్పై ఎగురవేశారు.
సైన్స్&టెక్నాలజి
చంద్రుడిపై తొలి మొక్క మొలిపించిన చైనా
చంద్రుడిపై చైనా నాటిన తొలి విత్తు మొలకెత్తింది. దీంతో చంద్రుడిపై మొక్కను మొలి పించిన తొలి దేశంగా చైనా చరిత్ర సష్టించింది. చైనా ఇటీ వల చంద్రుడి రెండో వైపునకు చాంగే-4 వ్యోమనౌకను పంపింది. దీనిలో ఓ బుల్లి కంటైనర్ ఉంది. దీనిలోనే పత్తి, బంగాళాదుంప విత్తనాలను ఉంచారు. ఇవి మొలకెత్తినట్లు చైనా పరిశోధకులు వెల్లడించారు. సంబంధిత చిత్రాలను విడుదల చేశారు. గురుత్వాకర్షణ తక్కువగా ఉండే పర్యావర ణంలో మొక్కల ఎదుగుదలను పరీక్షించడమే ఈ పరిశోధన లక్ష్యం.
ప్రపంచ ఆహార కొరతను తీర్చే నూతన వంగడాలు
అధిక దిగుబడులిచ్చే కొత్తరకం వరి వంగడాలను చైనా వ్యవసాయ శాస్త్రవేత్తలు సష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార కొరతను ఎదుర్కోవడంలో ఇవి కీలకం కానున్నట్లు భావిస్తున్నారు. పగటి సమయం, కాంతి తక్కువగా ఉన్నప్పటికీ వీటి దిగుబడులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. సౌత్ చైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన జిన్ జియాంగ్ పెంగ్ బందం ఈ జన్యుమార్పిడి వంగడాలను రూపొందించింది.
2021 డిసెంబర్లో గగన్యాన్ ప్రాజెక్టు
భారత అంతరిక్ష యాత్ర గగన్యాన్ ప్రాజెక్టును 2021 డిసెంబర్లోగా చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడిం చారు. ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలోకి పంపే ముగ్గురిలో ఒక మహిళా వ్యోమగామి కూడా ఉంటుందని వెల్లడించారు
జర్నలిజం రంగంలో ఫేస్బుక్ పెట్టుబడులు
జర్నలిజం సంబంధిత విభిన్న రంగాల్లో వచ్చే మూడేళ్లలో సుమారు రూ.2 వేల కోట్ల పెట్టు బడులు పెట్టనున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఆదరణ పొందుతున్న స్థానిక వార్తల్ని ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దష్టి సారించనున్నట్లు తెలిపింది. ప్రజలు స్థానిక వార్తల్ని మరింతగా కోరుకుంటు న్నారని, ఈ కారణంగానే తాము స్థానిక వార్తల దిశగా విస్తరణ యత్నాలను ప్రకటిస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది.
క్షిపణిని ప్రయోగించిన స్వదేశీ పోరాట హెలికాప్టర్
దేశీయంగా రూపొందించిన తేలికపాటి పోరాట హెలి కాప్టర్ (LCH) కీలక మైలు రాయిని అధిగమించింది. గగనతలం నుంచి గగన తలంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్రాన్ని తొలిసారిగా ప్రయోగించింది. గాల్లో కదులుతున్న ఒక లక్ష్యాన్ని విజయ వంతంగా ఛేదించింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) సంస్థ ఈ హెలికాప్టర్ను రూపొందించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న సమీకత పరీక్ష వేదిక వద్ద ఈ ప్రయోగం జరిగింది.
బెంగళూరులో ఉన్నతి ప్రారంభం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన ఉన్నతి (యుని స్పేస్ నానోశాటిలైట్ అసెంబ్లీ అండ్ ట్రైనింగ్ బై ఇస్రో)ని 2019 జనవరి 17న బెంగళూరులో కేంద్ర అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ప్రారంభించారు.
ఆర్థికాంశాలు
ముద్రా మొండి బకాయిలు రూ.11,000 కోట్లు
చిన్నపాటి వ్యాపార/వాణిజ్య సంస్థలకు సహకరించేందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన్మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) పథకం కింద ఇస్తున్న రుణాల్లో మొండి బకాయిలు రూ.11,000 కోట్లకు చేరాయని పేర్కొంటూ, ఆర్థిక శాఖను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అప్రమత్తం చేసింది. ప్రస్తుత పరిస్థితే కొనసాగితే భవిష్యత్తులో నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ) అధికంగా వచ్చే విభాగంలో ముద్ర చేరడం కచ్చితమేనని పేర్కొంది.
భారత్కు ఏడీబీ నిధులు
భారత్కు ఇచ్చే నిధుల సాయాన్ని 2019లో 4.5 బిలియన్ డాలర్లు (రూ.31,500 కోట్లు) కు పెంచుతున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రకటించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం, 2019-20లో 7.6శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఏడీబీ అంచనా వేసింది.
క్రీడాంశాలు
2020 టోక్యో ఒలింపిక్స్కు ఇండియా చెఫ్ డి మిషన్గా బీరేంద్ర ప్రసాద్ బైశ్య
2020 టోక్యో ఒలింపిక్స్కు ఇండియా చెఫ్ డి మిషన్గా ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీరేంద్ర ప్రసాద్ బైశ్య ఎంపికయ్యారు. బీరేంద్ర ప్రసాద్ బైశ్య మాజీ కేంద్ర మంత్రి. గతంలో అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిం చాడు. 2020 ఒలిపింక్స్కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యం ఇవ్వనుంది. టోక్యో ఒలిపింక్స్కు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. 1964లో టోక్యో మొదటిసారి ఒలిపింక్స్కు ఆతిథ్యం ఇచ్చింది.
కోహ్లి, శాస్త్రిలకు ఎస్సీజీలో గౌరవ సభ్యత్వం
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్సీజీ)లో గౌరవ సభ్యత్వం లభించింది. ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచి 71 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత్ తెరదించడానికి కారణమైన విరాట్, శాస్త్రిలకు ఎస్సీజీ గౌరవ సభ్యత్వం ఇచ్చింది.
టెన్నీస్కు ఆండీ ముర్రే వీడ్కోలు
బ్రిటన్ టెన్నిస్ ప్లేయర్, మాజీ వరల్డ్ నంబర్వన్ ఆండీ ముర్రే టెన్నిస్కు వీడ్కోలు పలుకుతు న్నట్లు ప్రకటించారు. ముర్రే మొత్తం 45 ఏటీపీ టైటిల్స్ సాధించాడు. 2012, 2016లలో జరిగిన ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించాడు.
యన్.సంతోష్కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270