(శనివారం తరువాయి)
3) ప్రజాస్వామ్యంలోని వివిధ రకాలను వర్ణించండి?
ప్రజాస్వామ్యాన్ని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించడ మైంది. అవి:
1. ప్రత్యక్ష లేదా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం.
2. పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
ప్రత్యక్ష లేదా స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం: ఇది ప్రాచీన గ్రీకు రోమన్ నగర రాజ్యాలలో అమలులో ఉండేది. ఈ పద్ధతిలో ప్రజలు ప్రభుత్వ పాలన వ్యవహరాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. శాసన సంబంధమైన అధికారాన్ని వారు చెలాయిస్తారు. ప్రజలే చట్ట సభలలో పాల్గొని చట్టాలను రూపొందిస్తారు. రాజ్య వ్యవహరాలలో ప్రజలు ప్రత్యక్షంగా భాగస్వామ్యం వహిస్తారు.
పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం: దీనిలో ప్రభుత్వ పాలన ప్రజలచేత ఎన్నికైన ప్రతినిధుల ద్వారా కొనసాగు తుంది. ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా పరోక్షంగా రాజ్యాభిóష్టాన్ని రూపొందించి వ్యక్తీకరి స్తారు. నిర్ణీత సమయానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ అధికార విధుల నిర్వహణలో ప్రజలకు బాధ్యత వహిస్తారు. పరోక్ష లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం తిరిగి రెండు రకాలుగా వర్గీకరించడమైంది.
అవి:- 1. అధ్యక్ష ప్రజాస్వామ్యం
2. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
4) ప్రజాభిప్రాయ నివేదనలోని ప్రయోజనాలు, లోపాలు తెల్పండి?
ప్రజాభిప్రాయ నివేదన ప్రయోజనాలు:
ప్రజాభిప్రాయ నివేదన ప్రజలలో అవిధేయత లేదా తిరుగుబాటుకు అవకాశం ఇవ్వదు.
ప్రజలు వర్గాలుగా ఏర్పడి చట్టాలను అమోదించే ప్రమా దాన్ని తొలగిస్తుంది.
శాసన సభ మరింత బాధ్యతతో వ్యవహరించేటట్లు చూస్తుంది.
ప్రజాసార్వభౌమత్వ భావనకు హామీ ఇస్తుంది.
స్వార్థ బుద్ధి గల వ్యక్తులు, సంస్థల జోక్యాన్ని నివారిస్తుంది.
ప్రజాభిప్రాయ నివేదన లోపాలు:
ప్రజాభిప్రాయ నివేదన శాసనసభ హోదాను చాలా వరకు బలహీన పరుస్తుంది.
ఆధునిక శాసన నిర్మాణం అనేది సాంకేతిక నైపుణ్యాలతో కూడుకున్నది.
ప్రజల అమాయకత్వాన్ని, స్వార్థాన్ని ఆసరగా చేసుకునే శాసన సభ్యులు, పైరవీకారులకు ఈ పద్ధతి విశేషమైన అవకాశాలను కల్పిస్తుంది.
ఈ పద్ధతిలో జనరంజకం కాని చట్టాల నిర్మాణానికి కారకు లైన వారిని గుర్తించడం కష్టం.
ప్రజలు సాంప్రదాయ ధోరణి గల వారైతే ప్రగతిశీలక చట్టా లను రూపొందించడంలో ఈ పద్ధతి ఎన్నో ఇబ్బందులను సష్టిస్తుంది.
5) పునరాయనం ప్రయోజనాలు, లోపాలు వివరించండి?
పునరాయనం ప్రయోజనాలు:
పునరాయనం ప్రజల సార్వభౌమాధికారాన్ని అనుభవించే టట్లు చేస్తుంది. ఈ పద్ధతిలో ప్రజలు తమ ప్రతినిధులను తొలగించే అధికారాన్ని కలిగి ఉంటారు.
శాసన సభ్యులు కార్యనిర్వాహణ అధికారులు తమ విధుల నిర్వహణలో అప్రమత్తతతో వ్యవహరించేటట్లు చూస్తుంది. అలాగే వారి మితిమీరిన ప్రవర్తనను అరికడుతుంది.
ఉన్నత స్థానాలలో నిర్ణయికరణ అమలు ప్రక్రియలో అయోగ్యులైన అధికార దాహం గల నిజాయితీ లేని వ్యక్తు లను అనుమతించకుండా రాజకీయ అవినీతిని అరికడుతుంది.
పునరాయనం లోపాలు:
ప్రజలు వివేకంతో వ్యవహరించని యెడల పునరాయనం అన్యాయానికి అవకాశం ఇస్తుంది.
ప్రభుత్వపాలన క్షేత్రంలోనికి నిజాయితీ పరులైన వ్యక్తులు ప్రవేశించకుండా నిరుత్సాహపరుస్తుంది.
ప్రజాప్రయోజనాలను పెంపొందించడంలో అధికారులు స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీలు కల్పించదు.
10. లౌకికవాదం
1) లౌకికవాదమంటే ఏమిటో నిర్వచించి, లౌకికవాద భావనలను వివరించండి?
లౌకిక వాదం అంటే దేశంలో అన్ని మతాల ప్రజల పట్ల సమానమైన గౌరవాన్ని కల్పించడమే లౌకిక వాదం అంటారు. భారతదేశంలో లౌకికవాదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. Secular అనే ఆంగ్ల పదానికి లాటిన్ భాషలో ''ఇహలోకం'' [This World] ఈ పదం మతానికి వ్యతిరేక మనే అర్థాన్ని సూచిస్తుంది. ఆధునిక కాలంలో లౌకికవాదం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1851లో బ్రిటీష్ రచయిత జార్జి జాకబ్ హోల్యోక్ [George Jacob Holyoke] ఉపయోగించాడు.
మానవతావాదం, హేతువాదభావన: లౌకిక వాదం అనేక వ్యక్తిగత, సాంస్కతిక, రాజకీయ, సామాజిక అంతరార్థాలను కలిగి వుంటుంది.
రాజకీయ, సామాజిక దక్కోణం: లౌకిక వాదానికి నిర్థిష్ట మైన రాజకీయ, సామాజిక దక్కోణాలున్నాయి. సహజసిద్ధ మైన భౌతిక దక్పథాలతోను రాజకీయ, ఆర్థిక స్వావలంబన లతో కూడిన వ్యవస్థాపనకు ప్రతీకగా వుంటుంది.
స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం: స్వేచ్ఛకు, సమానత్వానికి, ప్రజాస్వామ్యానికి లౌకికవాదం ఎంతో ప్రయోజనకరమైంది. మరియు ఉదారవాద ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా వుంటుంది. లౌకికవాదం అధికార మత నాయకత్వాన్ని, మత సంస్థల ఉనికి, కొనసాగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
మతం పట్ల వ్యతిరేకత: లౌకికవాదం మతరాజ్యాలను మతాధికారుల ప్రాబల్యాన్ని ఖండిస్తుంది. ఒక రాజ్యంలోని ప్రజలు శాంతి భద్రతలకు భంగం కలగని రీతిలో ప్రజలు తమకు ఇష్టమైన మత విశ్వాసాలను, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు మొదలగు వాటిని అనుసరించవచ్చును.
2) లౌకిక రాజ్యాన్ని నిర్వచించి, లౌకిక రాజ్యం లక్షణాలు విశదీకరించండి?
''వ్యక్తులను స్వీయ, సమిష్టి మత స్వాతంత్య్రానికి హామీ ఇస్తూ వ్యక్తులకు వారి మతంతో సంబంధం లేకుండా పౌరులుగా గుర్తించే రాజ్యాన్ని లౌకిక రాజ్యం అని డి.ఇ.స్మిత్ నిర్వచిం చాడు.
అన్ని మతాలు సమాన హోదా: లౌకిక రాజ్యం ప్రజలందరికి సమాన హోదాను కల్పిస్తుంది. ప్రజల మధ్య కులం, వర్ణం, మతం, ప్రాంతం, తెగ, భాషల వారీగా ఎటువంటి వివక్షతను చూపదు. మత కార్యకలాపాలలో రాజ్యం జోక్యం వుండదు. ''సర్వమత ధర్మసమాభావన'' లౌకిక రాజ్యానికి నిజమైన అర్థం.
ఏ మతానికి తావులేదు: లౌకిక రాజ్యం ఏ ఒక్క మతం పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపదు. మతపరమైన అంశాల ప్రాతిపది కపై చట్టాలను రూపొందించదు. రాజ్యానికి లేదా ఏ ఒక్క మతానికి ప్రత్యేక గుర్తింపు వుండదు.
రాజ్యానికి అధికారిక మతం వుండదు: లౌకిక రాజ్యం ఏ ఒక్కమతాన్ని అధికార మతంగా గుర్తించదు. ప్రజల మత వ్యవహరాలలో తటస్థ వైఖరిని అవలంభిస్తుంది. లౌకిక రాజ్యం పరిపాలనలో మత సూత్రాలను ఏ మాత్రం పట్టించు కోదు. లౌకిక రాజ్యం ఏ మతం భావాలను ప్రబోధించదు.
3) లౌకిక వాద వ్యాప్తికి దోహదపడే అంశాలను పేర్కొనండి?
1. హేతుబద్దమైన ఆలోచన వ్యాప్తి
2. మూడనమ్మకాల పట్ల ప్రజలలో వ్యతిరేక ధోరణి.
3. ప్రజాస్వామ్య విలువలు, సంస్థల విస్తరణ.
4. శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతి.
5. మతపరమైన దోషాలపట్ల ప్రజల అప్రమత్తత.
6. సామాజిక శాసనాల ప్రభావం.
7. లౌకిక ధక్పథం ఆవశ్యకత.
8. లౌకిక రాజ్యంలో సామాజిక ఆర్థిక రంగాలలో ప్రజల పురోగతి
9. లౌకిక రాజకీయ న్యాయకత్వ ప్రభావం.
10. రాజ్యంలో ఉన్న అన్ని మతాలకు సమాన అవకాశం, సమాన ఆదరణ.
4) లౌకిక వాదంలోని నాలుగు సుగుణాలను వివరించండి?
1. సమత: ప్రపంచ రాజ్యాలకు లౌకిక వాదం సమ సమాజానికి ఆదర్శవంతమైనది. దేశంలోని అన్ని మతాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తుంది. మానవులు సష్టించిన అసమానతలు గుర్తించదు.
2. మత స్వాతంత్య్రం: లౌకిక రాజ్యంలో ప్రజలకు సంపూర్ణం గా మత స్వాతంత్య్రం ఉంటుంది. రాజ్యం వ్యక్తుల మత వ్యవహరాలలో జోక్యం చేసుకోదు లౌకిక రాజ్యంలో రాజ్యాంగం, వివిధ చట్టాలు, ప్రజలకు ఇష్టమైనా మతాన్ని స్వీకరించుటకు, ప్రభోదించుటకు, మత ప్రచారం చేసుకొనుటకు సంపూర్ణమైన స్వాతంత్య్రాన్ని ప్రజలకు ఇవ్వడం జరిగింది.
3. సమన్యాయ పాలన: లౌకిక వాదం సమన్యాయపాలన అనే భావనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. చట్టనిర్మాణం, చట్టాల అమలు, చట్టాల వ్యాఖ్యానంలో ప్రజలకు ఏ మతంతో సంబంధం లేకుండా లౌకిక రాజ్యం వ్యవహరిస్తుంది.
4. జాతీయ సమైక్యత: లౌకికవాదం ప్రజలలో జాతీయ సమైక్యతను, సమగ్రతలను పెంపొందించే ఉత్తమ సాధనంగా దోహదపడుతుంది. భిన్నత్వంలో ఏకత్వ సాధనకు పాటుపడుతుంది.
5) లౌకిక వాదం దక్కోణాలను క్లుప్తంగా విశ్లేషించండి?
1. సామాజిక దక్కోణం: లౌకిక వాద భావన సామాజిక జీవనంలో మూఢత్వాలను విస్మరించడం కుల, మత, వర్గాల పరంగా ప్రజలు వ్యవహరించడాన్ని లౌకికవాదం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. సామాజిక వ్యవస్థలో ప్రజల మధ్య అస్పశ్యత, వెట్టిచాకిరి వంటి దురాచారాలను పాటించరాదని కోరుతుంది.
2. ఆర్థిక దక్కోణం: లౌకిక వాదంలో ప్రజలు తమ ఇష్టాను సారంగా తమకు నచ్చిన వత్తులను ఎన్నుకొని వాటిని ఆచరించడానికి, అనుసరించడానికి ప్రచారం చేసుకో వడానికి ప్రజలకు కావాల్సిన స్వేచ్ఛను లౌకికవాదం కల్పిస్తుంది.
3. రాజకీయ దక్కోణం: లౌకికవాదానికి కొన్ని రాజకీయ దక్కోణాలు ఉంటాయి. లౌకికవాదం రాజకీయ వ్యవహారా లలో ప్రజలందరికీ పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుమతిస్తుంది.
6) భారతదేశంలో లౌకిక వాద నేపధ్యాన్ని పేర్కొనండి?
బ్రిటీష్ ప్రభుత్వ పాలన భారతదేశంలో అనేక విద్యా సంస్కరణలను ప్రారంభించింది. శాస్త్రవిజ్ఞానికి ప్రాముఖ్యత నిచ్చింది. అదే సమయంలో భారతదేశంలోని రెండు ప్రధాన మతాలైన హిందువులు, మహమ్మదీయుల మధ్య మతపర మైన విషబీజాలను నాటింది. అందులో భాగంగా చట్టసభ లలో మహమ్మదీయులకు ప్రత్యేక స్థానాలను కేటాయించింది. దాంతో భారత రాజకీయాలలో మతపర మైన ఘర్షణలు ఎడతెగని లక్షణంగా పరిణమించాయి. జనాభా పరిమాణం ఆధారంగా బ్రిటీష్ పాలకులు హిందు వులు, మహమ్మదీయుల మధ్య ప్రాధాన్యత నివ్వడంతో మత అంశాల ప్రాతిపదికపై భారతీయుల మధ్య అవేశాలను పురికొల్పారు. దాంతో భారతదేశంలో నివసించే విషయంలో మైనారిటీలలో అభద్రతా భావం నెలకొంది. కాలక్రమేణా మతఘర్షణలు, మతవిద్వేషాలు అనేవి భారతదేశంలో దైనందిన చర్యలుగా పరిణమించాయి. ఈ రకమైన పరిస్థితి అంతిమంగా మహమ్మదాలీ జిన్నా వంటి నాయకులు 'ద్విజాతిసిద్ధాంతం'(Two Nations Theory) ప్రతిపాదించేందుకు దారి తీసింది. 1947 ఆగస్టులో భారత యూనియన్ ఇండియా, పాకిస్తాన్లుగా విడిపోవడానికి రాజకీయ పరిస్థితుల తీవ్రతయే కారణంగా పేర్కొనవచ్చు. స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశబ్దాలు గడిచినప్పటికీ భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో మత ఘర్షణలు సంభవించడం లౌకిక వాదానికి సవాలుగా పరిణమిం చిందని చెప్పవచ్చు. లౌకికవాదం అనేది మతానికి మతానికి మధ్య అభిమనాన్ని, వివక్షతను చూపడం కాదు. అన్ని మతాల ప్రజల పట్ల సమానమైన గౌరవాన్ని ప్రదర్శించడమే లౌకికవాదం.
- దారావత్ సైదులు నాయక్
సివిక్స్ లెక్చరర్,గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
ఫోన్: 9908569970