అంతర్జాతీయం
అమెరికాను వణికిస్తున్న కొత్త వ్యాధి 'జొంబీ డీర్'
అమెరికాను ఒక కొత్త వ్యాధి వణికిస్తోంది. వన్య మగాలైన జింకలు, దుప్పిల్లో ఇటీవల విస్త తంగా వ్యాప్తిస్తూ, వాటి ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తున్న 'జొంబీ డీర్' వ్యాధిపై షాకింగ్ విషయాన్ని వైద్య నిపుణులు బయటపెట్టారు. జొంబీ డీర్(క్రానిక్ వాస్టింగ్ డిసీజ్, సీడబ్యుడీ) అని పిలిచే భయంకరమైన వ్యాధి (డెడ్లీ డిసీజ్) ఆనవాళ్లు ఇప్పటివరకూ జింక, దుప్పి జాతుల్లో మాత్రమే కనిపించాయి. కానీ ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందన్నది నిపుణుల హెచ్చరిక.
బ్రిటన్ లేబర్ పార్టీలో చీలిక
బ్రిటన్లో ప్రతిపక్షమైన లేబర్ పార్టీలో 2019 ఫిబ్రవరి 18న చీలిక ఏర్పడింది. యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగే ప్రక్రియ బ్రెగ్జిట్ను వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎంపీలు పార్టీకి రాజీనామా చేశారు. తాము పార్లమెంటులో స్వతంత్రులుగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు.1981లో నలుగురు లేబర్ పార్టీలో ప్రధాన నేతలు పార్టీ నుంచి బయటకొచ్చి సోషల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టారు. ఆ తర్వాత లేబర్ పార్టీలో వచ్చిన అతి పెద్ద చీలిక ఇదే.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై 16 రాష్ట్రాల దావా
మెక్సికోతో సరిహద్దుల్లో గోడ నిర్మాణానికి నిధులు రాబట్టుకోవడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ అత్యయిక స్థితి విధించడాన్ని 16 రాష్ట్రాలు కోర్టులో సవాలు చేశాయి. ట్రంప్ చర్య ద్వారా దేశాన్ని రాజ్యాంగ సంక్షోభం వైపు తీసుకెళ్లారంటూ విమర్శించాయి. ట్రంప్ చర్యను తప్పుపడుతూ 16 రాష్ట్రాలు శాన్ఫ్రాన్సిస్కోలోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫిబ్రవరి 18న దావా వేశాయి.
భారత్-ప్రపంచం
పాక్ వస్తువులపై 200% పన్ను పెంపు
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై మరిన్ని కఠిన చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2017-18లో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్లు. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వాటిలో ముఖ్యంగా తాజా పండ్లు, సిమెంట్, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి ఖనిజాలు తదితరాలున్నాయి. పాక్ నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో ప్రధానమైన తాజా పండ్లపై ప్రస్తుతం 50% వరకు, సిమెంట్పై 7.5% కస్టమ్స్ డ్యూటీ ఉంది.
కుల్భూషణ్ మరణశిక్ష రద్దుపై ఐసీజేకు భారత్ వినతి
కుల్భూషణ్ జాదవ్కు పాకిస్థాన్ మిలటరీ కోర్టు విధించిన మరణ శిక్షను రద్దు చేయాల్సిందిగా అంతర్జాతీయ న్యాయస్థానానికి భారత్ విన్నవించింది. కేసు విచార ణలో పాక్ కనీస ప్రమాణాలు పాటించలేదని ఆరోపించింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని కోరింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో భారత్ తరఫున మాజీ సొలిసిటర్ జనరల్, ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే 2019 ఫిబ్రవరి 18న వాదనలు వినిపించారు. విదేశీయులను బంధిస్తే, వెంటనే వారి మాతదేశానికి సమాచారం అందించాలని వియన్నా ఒప్పందం స్పష్టం చేస్తోందని గుర్తుచేశారు.
భారత్-అర్జెంటీనా మధ్య 10 ఒప్పందాలు
అర్జెంటీనా అధ్యక్షుడు మౌరిసియో మక్రి 2019 ఫిబ్రవరి 18న భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడితో సమావేశమయ్యారు. రక్షణ, అణు ఇంధనం, పర్యాటకం, సమాచార సాంకేతికత, వ్యవసాయం తదితర రంగాలకు సంబంధించి రెండు దేశాల మధ్య 10 ఒప్పందాలు కుదిరాయి.
సౌదీ యువరాజు భారత పర్యటన
సౌదీ అరేబియా సింహా సనాన్ని అధిష్ఠించనున్న యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) 2019 ఫిబ్రవరి 20న భారత్లో పర్యటించారు. ఈ సంద ర్భంగా ప్రధాని నరేంద్ర మోడితో సమావేశమయ్యారు. పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్లో పర్యటించి, ఇక్కడికి వచ్చిన ఎంబీఎస్ పలు అంశాలపై ప్రధానితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు 5 ఒప్పందాలపై సంతకాలు చేశారు.
పుల్వామా దాడిని ఖండించిన ఐరాస భద్రతా మండలి
పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయడానికి మన దేశం చేస్తున్న ప్రయత్నాలు ఫలితమిస్తున్నాయి. సీఆర్పీఎఫ్ సిబ్బందిపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2019 ఫిబ్రవరి 21న తీవ్రంగా ఖండించింది. ఈ అపరాధ చర్యకు పాల్పడిన నేరస్థులు, నిర్వాహకులు, మద్దతు తెలిపినవారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ప్రకటన విడుదల చేసింది.
దక్షిణ కొరియాలో నరేంద్రమోడీ పర్యటన
భారత ప్రధాని నరేంద్రమోడి 2019 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటించారు. దక్షిణకొరియాతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగింది. దక్షిణకొరియా దేశాధ్యక్షుడు మూన్జేఇన్, ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్కిమూన్తో కలసి యోన్సీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని మోడి ఆవిష్కరించారు.
పీఎంఎస్వైఎం ప్రక్రియ ప్రారంభం
అసంఘటిత రంగ కార్మికులు నెలవారీ పింఛను పొందడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ (పీఎంఎస్వైఎం) కింద పేర్లు నమోదు చేసుకొనే ప్రక్రియ ప్రారంభమయింది. 18-40 ఏళ్లలోపు వయసు కలిగి, నెలవారీ ఆదాయం రూ.15 వేలులోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. 18 ఏళ్ల వయసు ఉన్న వారు నెలకు రూ.55, 29 ఏళ్ల వయసు ఉన్నవారు రూ.100, 40 ఏళ్ల వయసు ఉన్నవారు రూ.200 చెల్లిస్తే, ప్రభుత్వం కూడా తన వాటా కింద అంతే మొత్తాన్ని చెల్లిస్తుంది. 60వ సంవత్సరం వచ్చే వరకు ఈ మొత్తాన్ని చెల్లిస్తుండాలి. ఆ తరువాత వారికి ప్రతి నెలా రూ.3,000 పింఛను వస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న కామన్ సర్వీసు సెంటర్ (సీఎస్సీ)ల్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఇంట్లోనే పనులు చేసుకునేవారు, వీధి వ్యాపారులు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఇటుకబట్టీల్లో పనిచేసేవారు, చెప్పులు కుట్టేవారు, చెత్త ఏరుకొనేవారు, రిక్షా కార్మికులు, వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు.. తదితరులు ఈ పథకంలో చేరవచ్చు.
ఎఫ్ఎం రేడియో ద్వారా ఓటరు చైతన్యం
ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించు కునే దిశగా కమ్యూనిటీ ఎఫ్ఎం రేడియో ద్వారా ఓటరు చైతన్య కార్య క్రమాలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రయోగాత్మక ప్రచారం కోసం తొలివిడతలో దేశవ్యాప్తంగా సుమారు 72 రేడియో స్టేషన్లను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా కొన్ని విశ్వ విద్యా లయాలను ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి రేడియో కార్యక్రమాల రూపకల్పన బాధ్యతను హెచ్సీయూకు అప్పగించింది. దేశవ్యాప్తంగా సుమారు 11 భాషల్లో కళాశాలలు, ఎన్జీవోల సహకారంతో ఓటరు చైతన్య కార్యక్రమాలను హెచ్సీయూ రూపొందిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో '112' సేవలు
అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాల్సిన ఒకేఒక్క నంబరు '112' సేవలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యాయి. పోలీసు, అగ్నిమాపక, ఆరోగ్య, మహిళా హెల్ప్లైన్లు వంటివాటికి ఇప్పటి వరకు వేర్వేరు నంబర్లు ఉండేవి. వీటన్నింటినీ సమీకతం చేస్తూ రూపొందించిన అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థను(ఈఆర్ఎస్ఎస్) కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. దేశంలో నగర భద్రత (సేఫ్ సిటీ) ప్రాజెక్టుల అమలుకు హైదరాబాద్ సహా 8 ప్రాంతాలను గుర్తించినట్లు హోం మంత్రి వెల్లడించారు.
సాయుధ బలగాలకు విమాన సౌకర్యం
పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీ-శ్రీనగర్, జమ్మూ-శ్రీనగర్ల మధ్య రాకపోకలు సాగించే కేంద్ర సాయుధ పారామిలిటరీ దళ సిబ్బందికి విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని కేంద్ర హౌంశాఖ నిర్ణయించింది. శ్రీనగర్ ప్రాంతం నుంచి జమ్మూ, ఢిల్లీకి రోడ్డుమార్గంలో ప్రయాణించడం అంత సురక్షితం కాదన్న ఉద్దేశంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
అస్సాం రైఫిల్స్కు ప్రత్యేక అధికారాలు
ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినంత వరకు అస్సాం రైఫిల్స్ (ఏఆర్) సిబ్బందికి ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ కేంద్ర హౌంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వారెంటు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయడానికి, ఏ ప్రదేశాన్నయినా సోదా చేయడానికి అధికారం లభిస్తుంది. అసోం, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరాంలు సరిహద్దులుగా ఉన్న జిల్లాలకు ఈ ఉత్తర్వు వర్తిస్తుంది. భారతీయ శిక్షా స్మతిలోని పలు సెక్షన్ల ప్రకారం ఈ అధికారాన్ని కట్టబెట్టింది. అక్రమ చొరబాటుదార్లను అరికట్టడంలో అస్సాం రైఫిల్స్ విశేషంగా కషి చేస్తోంది. భారత్-మయన్మార్ సరిహద్దులో గస్తీ బాధ్యతలు కూడా ఈ దళానిదే.
ఎన్సీటీఈ దక్షిణ ప్రాంత కమిటీ నియామకం
జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) దక్షిణ ప్రాంత కమిటీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 21న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కమిటీ చైర్మన్గా కేరళలోని రాష్ట్రీయ సంస్కత సంస్థాన్లోని విద్యావిభాగాధిపతి డాక్టర్ కె.కె.షినే నియమితులయ్యారు. కమిటీ సభ్యులుగా మరో అయిదుగురిని నియమించారు. అందులో ముగ్గురు తెలంగాణకు చెందిన వారున్నారు. ఓయూ విద్యావిభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న డాక్టర్ పారిపెల్లి శంకర్, ఉర్దూ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య ఘంటా రమేష్, పాఠశాల విద్యాశాఖలో ఉప సంచాలకుడిగా పనిచేసిన చంద్ర ప్రకాశ్రెడ్డి(హైదరాబాద్) సభ్యులుగా నియమితులయ్యారు. దక్షిణ ప్రాంత పరిధిలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలలో బీఈడీ కళాశాలలకు ఈ కమిటీయే అనుమతులిస్తుంది.
మద్యపానంపై మంత్రిత్వ శాఖ సర్వే
జాతీయ స్థాయిలో 14.6 శాతం(16 కోట్ల మంది) మద్యం సేవించేవారు ఉన్నారని ఓ సర్వే ప్రకటించింది. ఛత్తీస్గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా మద్యం వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాయని సర్వే తేల్చింది. మద్యం తర్వాత బంగు, గంజాయి మత్తు పదార్థాలు రెండో స్థానంలో ఉన్నాయి. 10 నుంచి 75 ఏళ్ల మధ్య వయసున్న వారిని సర్వేకోసం ప్రామాణికంగా తీసుకున్నారు. మద్యపానం సేవించే వారిలో ప్రతి 38 మందిలో ఒకరు చికిత్స పొందుతున్నారు. 15 ఏళ్ల విరామం తర్వాత ఎయిమ్స్ ఆధ్వర్యంలోని ఎన్డీడీటీసీ సహకారంతో సామాజిక న్యాయం-సాధికారత శాఖ ఈ సర్వే చేసింది.
యూజీసీ రెగ్యులేషన్-2019
దేశంలో ఏ విద్యాసంస్థ అయినా డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందాలంటే 20 ఏళ్ల చరిత్ర తప్పనిసరి. దీంతో పాటు మరిన్ని నిబంధనలతో 'డీమ్డ్' హోదా మంజూరుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. విద్యా ప్రమాణాల పెంపు దిశగా.. 2016 నాటి విధివిధానాలను పక్కనపెట్టి వాటి స్థానంలో 'యూజీసీ (ఇన్స్టిట్యూషన్స్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీస్) రెగ్యులేషన్-2019' పేరుతో వీటిని రూపొందించింది. ఇకమీదట ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ సంస్థకైనా డీమ్డ్ హోదా ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైజ్) నివేదిక
ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్లో ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైజ్) విధ్వంసాలు, బాంబు పేలుళ్ల సంఖ్య పెరిగిందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఒక్క 2018లోనే ఇలాంటి ఘటనలు 57 శాతం పెరిగినట్లు పేర్కొంది. మావోయిస్టు ప్రాబల్య ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి తరహా దాడులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. ఢిల్లీలో జరిగిన సదస్సులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ)కి చెందిన నేషనల్ బాంబ్ డేటా సెంటర్(ఎన్బీడీసీ) ఈ నివేదికను విడుదల చేసింది.
ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ రేట్ల పెంపు
దేశీయ కాలావధి డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతున్నట్లు ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఈ పెంపుదల వెంటనే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. రూ.కోటి లోపు, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లలోపు, అయిదేళ్లు-అంతకుమించిన వ్యవధి కాలావధి డిపాజిట్లపై 0.50-0.90 శాతం మేర అధిక వడ్డీరేటు చెల్లించ నున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
వీర జవాన్ల రుణాలను మాఫీ చేసిన ఎస్బీఐ
పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన జవాన్లు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. 2018 ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో దాదాపు 44 మంది జవాన్లు మృతి చెందారు. దాదాపు 23 సైనికులు తమ వద్ద తీసుకున్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు అంతేకాకుండా.. రూ.30లక్షల ఇన్సూరెన్స్ డబ్బును ప్రతీ సైనిక కుటుంబానికి అందజేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
మరుగుజ్జులకు ఆర్టీసీలో రాయితీలు
మరుగుజ్జులకు తెలంగాణ ఆర్టీసీ రాయితీలు ప్రకటించింది. హైదరాబాద్, వరంగల్ నగరాల్లోని సిటీ బస్సుల్లో (ఆర్డినరీ) వారు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇతర ప్రాంతాల్లో 50% రాయితీ ఇస్తారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులకు మాత్రమే ఈరాయితీని పరిమితం చేశారు.
పురపాలక ఆస్తుల మ్యాపింగ్ ప్రాజెక్టు ప్రధాని అవార్డుకు ఎంపిక
పట్టణ స్థానిక సంస్థల్లో తెలంగాణ పురపాలక శాఖ అమలు చేస్తున్న ప్రత్యేక ప్రాజెక్టు ప్రధాని అవార్డుకు తొలిదశలో ఎంపికైంది. ఆ సంస్థల్లో ఆస్తులను జియో ట్యాగింగ్ ద్వారా మ్యాపింగ్ చేశారు. దీనివల్ల ఆస్తిపన్ను ఎగవేతకు అడ్డుకట్టతో పాటు పట్టణాలు, నగరాల్లోని ఆస్తుల పూర్తి వివరాలు పురపాలక శాఖకు అందుబాటులోకి వచ్చాయి. పురపాలక శాఖ ఈ ప్రాజెక్టును అవార్డుకు ప్రతిపాదించింది.
అవయవదానంపై జీవన్దాన్, జాగతి
సంస్థల మధ్య ఒప్పందం
తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ జన్మదినం పురస్క రించుకుని 2019 ఫిబ్రవరి 17న నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొని అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జీవన్దాన్ సంస్థ, జాగతి సంస్థ మధ్య అవయవదానంపై జరిగిన ఒప్పంద పత్రాలపై కవిత హైదరాబాద్ నిమ్స్లో సంతకాలు చేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ 2019 ఫిబ్రవరి 20న జరిగింది. రాజ్భవన్లో 10 మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తమంత్రులకు శాఖలను కేటాయించారు. ఆర్థిక, ఐటీ, పరిశ్రమలు, పురపాలన, నీటి పారుదల శాఖ వంటి అత్యంత కీలక శాఖలను తన వద్దే ఉంచుకోవాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి మిగతా శాఖలను సహచరులకు కేటాయించారు.
తెలంగాణలో సఫ్రాన్ వైమానిక పరిశ్రమ
ఫ్రాన్స్కు చెందిన ప్రసిద్ధ విమానాల విడిభాగాల తయారీ సంస్థ సఫ్రాన్ హైదరాబాద్లో రూ.290 కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శంషాబాద్లోని జీఎంఆర్ ప్రత్యేక ఆర్థిక మండలి సమీపంలో స్థాపించనున్న ఈ పరిశ్రమలో విమాన లీఫ్ టర్బోఫ్యాన్ ఇంజిన్ల విడిభాగాలు తయారుచేస్తారు. ఈ పరిశ్రమ ద్వారా 50 మంది నిపుణులు, మరో 300 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుంది. సంస్థ సీఈవో ఫిలిప్ పెటిట్కొలిన్ 2019 ఫిబ్రవరి 19న ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమై ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథలకు అవార్డులు
కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలు దేశంలోని ప్రాజె క్టుల్లో అత్యుత్తమంగా నిలిచా యని తెలంగాణ నీటి పారుదల శాఖ పేర్కొంది. 'స్మార్ట్ వాటర్- వేస్ట్ వరల్డ్' అనే అంతర్జాతీయ పత్రిక సర్వేలో ఈ రెండు ప్రాజెక్టులు ఎంపికైనట్లు తెలిపింది. 2019 ఫిబ్రవరి 19న చెన్నైలో కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ నల్ల వెంకటేశ్వర్లు, భగీరథ ఈఈ రాజేశ్వర్రావు ఈ అవార్డులు అందుకున్నారు
5 మండలి స్థానాలకు నోటిఫికేషన్ జారీ
తెలంగాణ శాసనసభ కోటా మండలి స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 5 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2019 మార్చి 12వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాన్ని వెల్లడిస్తారు. ఫిబ్రవరి 21 నుంచి 28వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 1 వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. 5వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు.
ఆర్జీయూకేటీకి యూజీసీ గుర్తింపు
నిర్మల్ జిల్లా బాసర రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాల యానికి యూజీసీ 12(బి) గుర్తింపు లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో 3 ట్రిపుల్ ఐటీలు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు మిగిలిన బాసర ట్రిపుల్ ఐటీ స్వయం ప్రతిపత్తితో ఆర్జీయూకేటీగా మారింది.
స్వచ్ఛ సుందర్ శౌచాలరులో జగిత్యాల ప్రథమం
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ సుందర్ శౌచాలరులో జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 2018లో 90 రోజుల్లో 60 వేల మరుగుదొడ్లను నిర్మించడంతో జిల్లా కలెక్టర్ శరత్కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. అదే స్ఫూర్తితో అధికారులు మరుగుదొడ్లను ఉపయోగంలోకి తెచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ మరుగుదొడ్ల ఉపయోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అధికారుల కషి ఫలించింది. జిల్లాలో నిర్మించిన 60వేల మరుగుదొడ్లను 100శాతం ఉపయోగిస్తున్నారు.
బెంగళూరులో ఏరో ఇండియా-2019 ప్రదర్శన
ఏరో ఇండియా-2019 ప్రదర్శన 2019 ఫిబ్రవరి 20న బెంగళూరు లోని యలహంక వైమానిక స్థావరంలో ప్రారంభ మైంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రులు సురేశ్ ప్రభు, సదానంద గౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రదర్శనలో 2019 ఫిబ్రవరి 21న భారతీయ సైనిక దళాధిపతి బిపిన్ రావత్ భారతీయ యుద్ధ విమానంలో ప్రయాణించారు. 'ఎల్సీఏ-తేజస్'లో అరగంట పాటు ప్రయాణించారు.
అంతర్జాతీయ పరిశోధన, అభివద్ధి సదస్సు
భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫిక్కి), కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సంయుక్త భాగస్వామ్యం లో ఏటా నిర్వహిస్తున్న అంతర్జాతీయ పరిశోధన, అభివద్ధి సదస్సును 2019 ఫిబ్రవరి 21, 22 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సదస్సులో ఒక భాగస్వామిగా ఆఫ్రికా ఖండానికి చెందిన జాంబియా, ఇథియోపియా, రువాండా తదితర దేశాల విద్యాశాఖ, సాంకేతిక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈక్వెడార్లో వందేళ్లు పైబడిన తాబేలు
వందేళ్ల క్రితమే అంతరించి పోయినట్లు భావిస్తున్న తాబేలు జాతిని ఈక్వెడార్ లోని గలాపగోస్ దీవుల్లో కనుగొన్నారు. దీని వయస్సు 111 ఏళ్లకు పైనే. ఇదే జాతికి చెందిన మరికొన్ని తాబేళ్లు కూడా సమీప ప్రాంతంలో ఉండొచ్చని గలాపగోస్ నేషనల్ పార్క్ అధికారులు భావిస్తున్నారు. చివరిసారిగా ఈ జాతి తాబేలు 1906లో కనిపించింది.
టాంజానియాలో కొత్తరకం డైనోసార్ అస్థిపంజరం
డైనోసార్ల గురించి జరిగే చర్చ అంతా ఇంతా కాదు. వేల ఏళ్ల కిందట అంతరించి పోయిన ఈ జీవులపై ఇప్పటికీ పరిశోధనలు జరుగు తూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా ఆఫ్రికాలో కొత్త జాతి డైనోసార్ అస్థిపంజరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోక భాగాల్లో గుండె ఆకారంలో ఎముక ఉండడం ఈ డైనోసార్ల ప్రత్యేకత. టైటనోసారస్ జాతికి ఈ చెందిన ఈ డైనోసార్ శిలాజాన్ని టాంజానియాలోని మొటుకా నది సమీపంలో ఉన్న ఓ క్వారీలో గుర్తించినట్లు మిడ్ వెస్టర్న్ యూనివర్సిటీ
వార్తల్లో వ్యక్తులు
పరిశోధకులు ప్రకటించారు.
కిరణ్ మజుందార్ షాకు అరుదైన గౌరవం
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండి యన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) గవర్నింగ్ బోర్డు సభ్యురాలు కిరణ్ మజుందార్ షాకు అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితి విభాగం యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ (యూఎస్ ఎన్ఏఈ) సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు. యూఎస్ ఎన్ఏఈ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ షానే. బయో ఫార్మాసూటికల్స్, బయోటెక్నాలజీ ఇండిస్టీలో ఆమె చేసిన కషికి గుర్తింపుగా ఈ అవకాశం దక్కింది.
ఐఐఐటీ కర్నూలు డైరెక్టర్గా ప్రొ|| సోమయాజులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు ఐఐఐటీ నూతన డైరెక్టర్గా వరంగల్ నిట్ (ఎన్ఐటీ)కి చెందిన ప్రొఫెసర్ డీవీఎల్ఎన్ సోమయాజులును నియమిస్తూ కేంద్ర మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ 2019 ఫిబ్రవరి 20న ఉత్తర్వులు జారీచేసింది. వరంగల్ నిట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న సోమయాజులు ప్రస్తుతం ఈ-ఐసీటీ అకాడమీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ఇంజినీరింగ్, సైన్స్ ఫ్యాకల్టీల్లో నైపుణ్యాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అకాడమీని వరంగల్ నిట్ కేంద్రంగా ప్రారంభించింది.
కష్ణా బోర్డు చైర్మన్గా గుప్తా
కష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్గా డాక్టర్ ఆర్కే గుప్తాను కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ నియమించింది. ప్రస్తుతం ఆయన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పటివరకు కేఆర్ఎంబీకి చైర్మన్గా ఉన్న జైన్ స్థానంలో గుప్తాకు చోటు కల్పించారు.
గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో స్వరూప్ రావల్
భారత్కు చెందిన నటి, ఉపాధ్యా యురాలు స్వరూప్ రావల్ వర్కీ ఫౌండేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో టాప్ 10 ఫైనలిస్టులో స్థానం సంపాదించారు. బోధన లో వినూత్న పద్ధతులు అవలం భించడం ద్వారా భారతీయ సమాజంలోని పిల్లలలో నైపుణ్యాభివద్ధిని పెంచేందుకు చేసిన కషికి గాను ఆమె పేరు జాబితాలో చేర్చారు. స్వరూప్ ప్రస్తుతం గుజరాత్లోని లావడ్ ప్రైమరీ పాఠశాలలో పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 179 దేశాల నుంచి వచ్చిన దాదాపు 10 వేల నామినేషన్ల నుంచి ఆమె పేరు ఎంపికయింది. 2019 మార్చి లో దుబారులో గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ ఫోరమ్ (జీఈఎస్ఎఫ్) విజేతకు ఈ అవార్డును అందజేయనుంది. విజేతకు రూ.7 కోట్ల ప్రైజ్ మనీ అందజేస్తారు.
సైన్స్ టెక్నాలజి
ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తే యంత్రాన్ని కనుగొన్న అభిషేక్
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న అభిషేక్ తయారు చేసిన ధాన్యాన్ని ఎత్తే యంత్రం రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ఫెయిర్లో ప్రథమ, జాతీయ స్థాయిలో మూడో బహుమతి సాధించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్ అభిషేక్ను 2019 ఫిబ్రవరి 18న ప్రగతిభవన్కు ఆహ్వానించి ప్రోత్సాహకంగా రూ. లక్ష చెక్కును అందచేశారు.
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కారకాన్ని గుర్తించిన ఐఐటీహైచ్ శాస్త్రవేత్తలు
బాల్యపు క్యాన్సర్గా పరిగణించే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా(ఏఎల్ఎల్)ను నయం చేసేందుకు చికిత్సా విధానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వ్యాధి చికిత్సలో అత్యంత కీలకమైన ఎల్-ఆస్పర్జినేజ్ కారకాన్ని అంటార్కిటిక్ ప్రాంతంలో కనిపించే శిలీంధ్రంలో ఐఐటీ-హైదరాబాద్ పరిశోధకులు గుర్తించారు.
మానవ రహిత విమాన వ్యవస్థ
సైయెంట్ సొల్యూషన్స్ అండ్ సిస్టమ్స్ మానవ రహిత విమాన వ్యవస్థను 2019 ఫిబ్రవరి 20న ఆవిష్క రించింది. ఇజ్రాయెల్కు చెందిన బ్లూబర్డ్ ఏరో సిస్టమ్స్, హైదరాబాద్కు చెందిన సైయెంట్ సొల్యూషన్స్ అండ్ సిస్టమ్స్ల సంయుక్త సంస్థే ఇది. కాగా, ఈ కంపెనీ రూపొందించిన 'వాండర్బి వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్'(వీటీఓఎల్) మానవ రహిత విమాన వ్యవస్థను మిలటరీ, మానవ విపత్తులు, వాణిజ్య అవసరాలు, తదితరాలకు ఉపయోగించుకోవచ్చని కంపెనీ తెలిపింది.
క్యాన్సర్ ముప్పును గుర్తించే డీఎన్ఏ ఆంకోస్క్రీన్
జన్యు విశ్లేషణతో మానవునిలో కొన్ని రకాల క్యాన్సర్లను ముందే గుర్తించే పరీక్షలను మ్యాప్మై జీనోమ్ సంస్థ డీఎన్ఏ ఆంకోస్క్రీన్ పేరుతో తొలిసారి అందుబాటులోకి తెచ్చింది. ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి డీఎన్ఏ పటంతో పాటు బయో కెమికల్ ప్రొఫైల్ను నిశితంగా పరీక్షిస్తారు. దీంతో దాదాపు 14 రకాల క్యాన్సర్లకు సంబంధించి జన్యువుల్లో మ్యుటేషన్లు (మార్పులు) గుర్తించే వీలుంది.
అల్జీమర్స్ను నయం చేసే మొక్క
కాలిఫోర్నియా గిరిజనులు ఉపయోగించే ఒకరకమైన పొద (మొక్క జాతి)కు అల్జీమర్స్ను నయం చేసే గుణం ఉన్నట్లు తాజా సర్వే పేర్కొంది. ఎర్బా శాంటా అని పిలిచే ఈ మొక్కను శ్వాస వ్యాధులు, జ్వరం, తలనొప్పి వంటి రుగ్మతల నివారణకు గిరిజనులు ఉపయోగిస్తుంటారు. దీనిని దివ్య మూలికగా భావిస్తారు. ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను రిడాక్స్ బయాలజీ అనే జర్నల్లో ప్రచురించారు.
క్రీడాంశాలు
స్ట్రాంజా స్మారక బాక్సింగ్లో జరీన్కు స్వర్ణం
స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణం గెలుచుకుంది. నిఖత్తో పాటు మీనాకుమారి, అమిత్ ఫంగాల్ కూడా పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. బల్గేరియా రాజధాని సోఫియాలో జరిగిన టోర్నీలో మహిళల 51 కేజీల విభాగం ఫైనల్లో జరీన్ 5-0తో ఫిలిపినొ మాగ్నోని ఓడించింది. మీనాకుమారి దేవి (54 కేజీలు) స్వర్ణం గెలిచింది. ఫైనల్లో మీనా 3-2తో విలెగాస్ను ఓడించింది. ఈ టోర్నీలో భారత్ 3 స్వర్ణ, ఒక రజత, 3 కాంస్యాలతో 7 పతకాలు కైవసం చేసుకుంది.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన
క్రికెటర్గా క్రిస్ గేల్
వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్గా గేల్ నిలిచాడు. 2019 ఫిబ్రవరి 20న ఇంగ్లాండ్తో తొలి వన్డేలో క్రిస్ గేల్ 12 సిక్సర్లు బాది 135 పరుగులు చేశాడు. దీంతో అతడి మొత్తం అంతర్జాతీయ సిక్సర్ల సంఖ్య 488కు చేరుకుంది. మూడు ఫార్మాట్లలో కలిపి గేల్కి ఇది 444వ మ్యాచ్. అఫ్రిది 524 మ్యాచ్ల్లో 476 సిక్సర్లతో నెలకొల్పిన రికార్డును గేల్ బద్దలు కొట్టాడు.
జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్గా సైనా
జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపి యన్గా సైనా నెహ్వాల్ నిలిచింది. 2019 ఫిబ్రవరి 16న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పి.వి. సింధును ఓడించింది. 2018లో నాగ్పుర్లో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్లో సింధునే ఓడించి టైటిల్ గెలిచిన సైనా నెహ్వాల్, మరోసారి అదే ప్రత్యర్థిని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్లో సౌరభ్వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో లక్ష్యసేన్ను ఓడించిన అతను మూడోసారి జాతీయ ఛాంపియన్ అయ్యాడు. పురుషుల డబుల్స్లో ప్రణవ్ చోప్రా-చిరాగ్శెట్టి టైటిల్ గెలిచారు. ఫైనల్లో ఈ జోడీ అర్జున్-శ్లోక్ రామచంద్రన్పై గెలిచింది. మహిళల డబుల్స్లో శిఖ-అశ్విని జోడి మేఘన-పూర్వీషాలపై గెలిచి టైటిల్ నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్లో మను అత్రి-మనీషా జోడి రోహన్-కుహు గార్గ్ను ఓడించి విజేతలుగా నిలిచారు.
Authorization