1. చాకలి ఐలమ్మ ఆవిష్కరించిన పత్రిక
1) ఆలోచన 2) జీవనాడి
3) చర్చ 4) పిలుపు
2. 1989లో ఎన్టీఆర్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వారు?
1) మాండవ వెంకటేశ్వరరావు 2) చిత్తరంజన్
3) రాములు 4) రామచంద్రన్
3. నక్సలైట్ల అణిచివేతకు అధనంగా సాయుధ బలగాలను పంపాలని ఎన్టీ రామారావు కోరగా సానుకూలంగా స్పందించిన ఏకైక రాష్ట్రం?
1) పంజాబ్ 2) కర్నాటక
3) తమిళనాడు 4) ఒడిస్సా
4. టి.ఎల్.ఎన్. రెడ్డి కమిషన్ను నియమించిన ప్రభుత్వం?
1) ఎన్టీఆర్ ప్రభుత్వం
2) చెన్నారెడ్డి ప్రభుత్వం
3) వెంగళరావు ప్రభుత్వం
4) చంద్రబాబు ప్రభుత్వం
5. నక్సలైట్లు వారి అనుబంధ సంస్థలు సభలు, సమా వేశాలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇతర రాజకీయ పార్టీల వలె బహిరంగంగా నిర్వహించుకోవచ్చు. అని ప్రకటిం చిన ముఖ్యమంత్రి ఎవరు?
1) చంద్రబాబు నాయుడు 2) వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
3) ఎన్.టి.ఆర్ 4) మర్రిచెన్నారెడ్డి
6. 'నక్సల్బరీ' అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉన్నది?
1) అసోం 2) పశ్చిమబెంగాల్
3) ఒడిస్సా 4) బీహార్
7. భారత కమ్యూనిస్టుపార్టీ (మార్కిస్టు- లెనినిస్టు) ఏ సంవత్సరంలో ఏర్పడింది?
1) 1967 2) 1968 3) 1969 4) 1966
8. కచ్చడం అనగా?
1) భూస్వామి పాలేరు 2) భూస్వామి ఎడ్లబండి
3) వెట్టిచాకిరి
4) దొరవారికి కానుకలు చెల్లించడం
9. ''ఇంద్రివెల్లి దురంతం దేశాన్ని తట్టిలేపింది. మీమధ్య ఉన్నందుకు గర్విస్తున్నాను'' అని ఇంద్రవెల్లి సంఘ టన గురించి మాట్లాడినవారు?
1) గద్దర్ 2) ఎం.ఎన్.రారు
3) ఎ.కె.రారు 4) వరవరరావు
10. రైతుకూలి సంఘం రెండవ మహాసభ పూర్వపు ఏ జిల్లాలో జరిగింది?
1) నిజామాబాద్ 2) వరంగల్
3) కరీంనగర్ 4) ఆదిలాబాద్
11. రెండు తెలుగు రాష్ట్రాలను ఏర్పరిచినంత మాత్రాన భూకంపం రాబోదని చెప్పినవారు?
1) మొరార్జీ దేశారు 2) అటరీబీహారీ వాజ్పాయి
3) మహదేవ్ సింగ్ 4) జార్ట్ ఫెర్నాండేజ్
12. 'ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రా నిర్మాణమే విజ్ఞత' అని 1973లో రాష్ట్రాల పునర్విభజన సంఘంలోని ఏ సభ్యుడు అభిప్రాయపడినాడు?
1) ఫజల్ ఆలీ 2) హృదయనాథ్ కుంజ్రూ
3) కె.ఎం ఫణిక్కర్ 4) ధార్
13. ఆంధ్ర తెలంగాణలను శాంతియుతంగా ప్రత్యేక రాష్ట్రా లుగా ఏర్పాటు చేయడం ఒక్కటే బహుశా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడడా నికి మార్గమని 1973లో అభిప్రాయపడిన మాజీ ముఖ్యమంత్రి?
1) కాసుబ్రహ్మనందరెడ్డి 2) పి.వి. నరసింహారావు
3) నీలం సంజీవరెడ్డి
4) దామోదరం సంజీవయ్య
14. రోడ్ టు రెవల్యూషన్ పేరుతో ఒక సైద్ధాంతిక డాక్యు మెంటును విడుదల చేసినవారు?
1) రాడికల్ యూత్ లీగ్
2) రాడికల్ స్టూడెంట్ యూనియన్
3) ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్
4) స్టూడెంట్స్ ఫెడరేషన్
15. నక్సలైట్లను చంపితే నగదు బహుమతులు ఇస్తానని ప్రజలకు పిలుపునిచ్చిన వారు?
1) మర్రి చెన్నారెడ్డి 2) ఎన్.టి.ఆర్.
3) చంద్రబాబు నాయుడు 4) కాసుబ్రహ్మనందరెడ్డి
16. కింది వారిలో ఎవరు కన్వీనర్గా పౌరస్పందన వేదిక ఏర్పాటైంది?
1) కె.జి. కన్నబిరాన్ 2) ప్రొ.జి. హరగోపాల్
3) ఎస్.ఆర్. శంకరన్ 4) బొజ్జతారకం
17. ఎన్ని విప్లవపార్టీలు కలిసి సి.పి.ఐ(ఎం.ఎల్) జనశక్తి పార్టీగా ఏర్పడినవి?
1) 5 2) 7 3)9 4)4
18. 'ఆలోచన' కిందివాటిలో ఏ సంస్థ అధికార పత్రిక
1) యు.సి.సి.ఆర్.ఐ(యం.సి)
2) డి.ఎస్.వో 3) ఒ.పి.డి.ఆర్
4) ఆర్.ఎస్.యు
19. గ్రామీణ పేదల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
ఎ) 1982 బి) 1985 సి) 1987 డి) 1989
20. 'నా జీవితం - జ్ఞాపకాలు' పుస్తకాన్ని ఏర్పాటైనది?
1) సంగెం లక్ష్మీబాయి 2) దేవులపల్లి శ్రీరంగమ్మ
3) ఈశ్వరీబాయి 4) ఆరుట్ల కమలాదేవి
21. 'తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం' పుస్తకాన్ని రాసినవారు?
1) భీంరెడ్డి నరసింహారెడ్డి 2) బొజ్జతారకం
3) తరిమెల నాగిరెడ్డి
4) దేవులపల్లి వెంకటేశ్వరరావు
22. 1973లో తెలంగాణకు చెందిన ఎవరిని ఇందిరాగాంధీ కార్మిక శాఖ ఉపమంత్రిగా నియమించింది?
1) మల్లికార్జున్ 2) వి.తులసీరాం
3) జి. వెంకటస్వామి 4) కె.రామకృష్ణా రెడ్డి
23.హైదరాబాద్ నగరంలో ముల్కీ నిబంధనలు వర్తింపచేయ కుండా ఉంటే సమాఖ్య రాష్ట్రమే ఉత్తమమని భావిస్తున్నా నని చెప్పినవారు?
1) నీలం సంజీవరెడ్డి 2) పి.వి. నరసింహరావు
3) కాసు బ్రహ్మనందరెడ్డి 4) జలగం వెంగళరావు
24. 'ఆరుసూత్రాల పథకం వలన తెలంగాణ ప్రయోజనాలు పూర్తిగా బలి అయినవి' అని అన్నవారు?
1) మర్రి చెన్నారెడ్డి 2) జి.ఎస్. మేల్కోటే
3) బి.సత్యనారాయణరెడ్డి 4) వి.తులసిరాం
25. 'నా అనుభవంలో ఈ అసెంబ్లీ కేవలం ఒక బాతాఖానీ షాపు మాత్రమేననీ, ప్రజల ప్రయోజనాలకు సంబంధించి ఒక రకమైన పరిహాసమేనని తేలినప్పుడు జనాన్ని వాళ్ళ మానన వాళ్ళని వదిలేసి, అసెంబ్లీలోపల ఏమిజరుగు తుందో చూడటానికి వేచి ఉండమని అడగగలమా' అంటూ శాశ్వతంగా అసెంబ్లీని వదిలేసినవారు?
1) చండ్రాపుల్లారెడ్డి
2) దేవులపల్లి వెంకటేశ్వరరావు
3) తరిమెల నాగిరెడ్డి
4) భీంరెడ్డి రరసింహారెడ్డి
26. నక్సల్బరీ, శ్రీకాకుళ ఉద్యమాలను ఏ దేశ అధికార పత్రిక 'స్ప్రింగ్ థండర్'గా ప్రకటించింది?
1) రష్యా 2) క్యుబా 3) చిలీ 4) చైనా
27. భార్గవ కమిషన్ను ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది?
1) వెంగళరావు ప్రభుత్వం
2) ఎన్.టి.ఆర్. ప్రభుత్వం
3) చెన్నారెడ్డి ప్రభుత్వం
4) చంద్రబాబు ప్రభుత్వం
28. ఏ సంవత్సరంలో తార్కుండే కమిటీ ఏర్పాటైనది?
1) 1973 2) 1977 3) 1978 4) 1984
29. ఏ సంస్థ 'జనవాహిని కదిలింది' పేరుతో ప్రజల్లో రాజకీయ సామాజిక స్పృహను కలిగించింది?
1) జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య
2) నవోదయ సాహితీ సాంస్కృతిక సంస్థ
3) పౌరస్పందన వేదిక 4) ప్రజాబంధు సంస్థ
30. ఏ సంవత్సరంలో 'ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్' ఏర్పడింది?
1) 1983 2) 1978 3) 1973 4) 1975
31. ఏ సంవత్సరంలో జార్జిరెడ్డి మరణించారు?
1) 1970 2) 1972 3) 1975 4) 1977
32. పాకాల చెరువును కట్టించినవారు?
1) జగదాలు ముమ్మాడి 2) మొదటి అనపోత
3) నాగాంబిక 4) మైలాంబ
33. 'రసార్ణవ సుధాకరం' గ్రంథకర్త?
1) మొదటి సింగభూపాలుడు
2) రెండవ సింగభూపాలుడు
3) మొదటి అనపోత 4) రెండొవ అనపోత
34. 'పొట్టకోసం' అనే నవలను రచించిన వారు?
1) జ్వాలాముఖి 2) ఎదిరె చెన్నకేశవులు
3) మచ్చవీరయ్య 4) నీలా జంగయ్య
35. 'సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి'తో సంబంధం ఉన్నవారు?
1) మల్లిఖార్జున్ 2) జి.ఎస్. మెల్కోటే
3) ఈశ్వరీబాయి 4) సంగెం లక్ష్మీబాయి
36. కింది వారిలో క్రికెట్తో సంబంధం ఉన్న హైదరాబాదీ?
ఎ) గులాం అహ్మద్ 2) అజిత్
3) రాజన్బాబు 4) సైపుద్దీన్ఖాన్
37. 'దక్కన్ సర్దార్' గా పేర్కొన్నవారు?
1) జమలాపురం
2) కొండా లక్ష్మణ్ బాపూజీ
3) భూపతి కృష్ణమూర్తి
4) కాళోజీ నారాయణరావు
38. 'షాద్' అనే కలంపేరు కలిగిన వారు?
1) కాళోజీ రామేశ్వరరావు
2) కాల్వ బాలయ్య
3) కనపర్తి రామచంద్రుడు
4) కాంచనపల్లి చిన వెంకరామారావు
39. కాపు రాజయ్య ఏ జిల్లాకు చెందినవారు?
1) యాదాద్రి భువనగిరి 2) జగిత్యాల
3) సిద్ధిపేట 4) మెదక్
40. 1949 డిసెంబర్లో 'జనతా' పేరుతో ఉర్దూలో వారపత్రిక ప్రారంభించిన వారు ఎవరు?
1) మందుముల రామచంద్రారావు
2) మందుముల నరసింహరావు
3) కాటం లక్ష్మీనారాయణ
4) భాయి రాంమూర్తి నాయుడు
41. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి పని చేసిన జస్టిస్ నాంపల్లి కుమారయ్య ఏ జిల్లాకు చెందినవారు?
1) ములుగు 2) నారాయణ్పేట్
3) జగిత్యాల 4) జనగామ
42. 'భక్త కనకదాస' సినిమాకు మొట్టమొదటసారిగా సంగీత దర్శకత్వం చేపట్టినవారు?
1) శంకర్సింగ్ 2) నెల్లూరి కేశవస్వామి
3) అనుముల కృష్ణమూర్తి 4) అనంతోజు బ్రహ్మయ్య
43. 'టూర్' అనే భావగీతాన్ని రచించినవారు?
1) మఖ్దూం మొహియుద్దీన్
2) బండారు అచ్చమాంబ
3) పులిజాల గోపాలరావు
4) గణపతి రామాచంద్రరావు
44. చార్మినార్ కథల సంపుటిని రాసినవారు?
1) చిట్యాల 2) పాలకుర్తి
3) కృష్ణారావు 4) కడవెండి
45. పాలకుర్తి ఐలమ్మ జన్మస్థలం?
1) చిట్యాల 2) పాలకుర్తి
3) కృష్ణాపురం 4) కడవెండి
46. సామల సదాశివకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ను తెచ్చిపట్టినది.
1) యాది 2) సంగీత శిఖరాలు
3) స్వరలయ 4) మలయమారుతాలు
47. 'అభినవ కాళిదాసు' బిరుదు కలవారు ఎవరు?
1) వానమామలై వరదాచార్యులు
2) వట్టికోట ఆళ్వారుస్వామి
3) దాశరథి
4) వేముగంటి నరసింహాచార్యులు
సమాధానాలు
1.2 2.2 3.3 4.2 5.4
6.2 7.3 8.2 9.3 10.3
11.2 12.2 13.1 14.2 15.3
16.3 17.2 18.2 19.2 20.2
21.4 22.3 23.1 24.2 25.3
26.4 27.1 28.2 29.2 30.4
31.2 32.1 33.2 34.2 35.3
36.1 37.1 38.1 39.3 40.3
41.3 42.2 43.1 44.2 45.3
46.3 47.4
- పృథ్వికుమార్ చౌహాన్
డైరెక్టర్, పృథ్వి ఐఏఎస్ స్టడీసర్కిల్
దిల్సుఖ్నగర్,హైదరాబాద్
ఫోన్: 9177602890
Authorization