అంతర్జాతీయం
సూడాన్లో ఎమర్జెన్సీ
ఆందోళనలతో అట్టుడుకుతున్న సూడాన్లో అధ్యక్షుడు ఒమర్ అల్-బాషిర్ అత్యయిక పరిస్థితిని విధించారు. ఏడాది పాటు ఇది అమలులో ఉంటుందని ప్రకటిం చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ రద్దు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో 2018 డిసెంబరు నుంచి సూడాన్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి హాహాకారాలు చేస్తున్నారు. దీంతో అధికార, విపక్షాలతో సంప్రదింపులు నిర్వహించడం ద్వారా ప్రస్తుతానికి శాంతియుత పరిస్థితులను నెలకొల్పి, కొత్త ప్రభుత్వ హయాంలో ఆర్థిక ప్రగతికి గట్టి చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు భావించారు. ఈ క్రమంలో 2019 ఫిబ్రవరి 22న అధికార నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రాష్ట్రాల గవర్నర్లు తదితరులతో కూడిన సమన్వయ కమిటీతో ఆయన పలు దఫాలుగా చర్చలు జరిపారు. అనంతరం ఎమర్జెన్సీ విధింపు నిర్ణయాన్ని వెలువరించారు.
నైజీరియా అధ్యక్షుడిగా బుహారి
నైజీరియా అధ్యక్షుడిగా ముహమ్మదు బుహారి(76) రెండోసారి ఎన్నికయ్యాడు. 2019 ఫిబ్రవరి 23న జరిగిన ఎన్నికల్లో బుహారి విజయం సాధించినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ఫిబ్రవరి 27న ప్రకటించింది. గతంలో సైనిక పాలకుడి గా వ్యవహరించిన బుహారి 2015లో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి అధ్యక్షుడు అయ్యాడు.
ట్రంప్, కిమ్ మధ్య ముగిసిన చర్చలు
అణ్వాయుధాల తగ్గింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ల మధ్య వియత్నాం రాజధాని హనోయిలో 2019 ఫిబ్రవరి 27న మొదలైన చర్చలు ఫిబ్రవరి 28న అర్ధంతరంగా ముగిసాయి. ఎలాంటి ఒప్పందం కుదరలేదని వైట్హౌస్ ప్రకటించింది. 2018 జూన్లో సింగపూర్లో జరిగిన సదస్సుకు కొనసాగింపుగా ఇది జరిగింది.
ఛాబహార్ ద్వారా భారత్కు అఫ్గాన్ ఎగుమతులు
ఇరాన్లో నూతనంగా నిర్మించిన ఛాబహార్ నౌకాశ్రయం ద్వారా అఫ్గానిస్థాన్ నుంచి భారత్కు ఎగుమతులు ప్రారంభమయ్యాయి. అఫ్గాన్లోని జరాంజ్ నగరం నుంచి 23 లారీల్లో 57 టన్నుల ఎండు ఫలాలు, వస్త్రాలు, తివాచీలు, ఖనిజా లను లోడు చేసి పంపించారు. ఇవి ముంబయి రేవుకు చేరనున్నాయి. పాకిస్థాన్ సంబంధం లేకుండా వాణిజ్యం చేసు కోవడానికి భారత్-అఫ్గాన్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి.
భారత ప్రతినిధిగా తొలిసారిగా ఓఐసీ సమావేశాల్లో ప్రసంగించిన సుష్మ స్వరాజ్
ముస్లిం ప్రధాన దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశం 2019 మార్చి 1, 2 తేదీల్లో దుబారులో నిర్వహించారు. ప్రపంచం లోని 57 ముస్లిం దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సమావేశంలో తొలిసారిగా భారత్ ప్రతినిధి ప్రసంగించారు. భారత్ను ఆహ్వానించ కూడదంటూ పాకిస్థాన్ అభ్యంతరం తెలిపినా ఆతిథ్యం ఇచ్చిన యునైటెడ్ అరబ్ఎమిరేట్స్ (యూఏఈ) పట్టించు కోలేదు. ఇది ఆ సంస్థ స్వర్ణోత్సవ సమావేశం. 2019 మార్చి 1న జరిగిన ఈ సమావేశానికి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ గౌరవ అతిథిగా హాజరయ్యారు.
ప్రాంతీయం
ప్రత్యేక వింగ్గా ఉద్యాన విభాగం
తెలంగాణ ఉద్యానశాఖకు చెందిన ఉద్యాన విభాగాన్ని ప్రత్యేక విభాగంగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా పలు శాఖల్లోని ఉద్యో గులు, అధికారులను జిల్లా, జోనల్, మల్టీజోనల్, స్టేట్గా విభజించాల్సి ఉంది. ఈ శాఖను ప్రత్యేక కార్యాల యంగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశిస్తూ 2019 ఫిబ్రవరి 23న వ్యవసాయశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
విద్య నాణ్యతలో తెలంగాణకు 11వ స్థానం
నాణ్యమైన విద్యను అందించడంలో దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. 7 కేంద్రపాలిత ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 36లో 15వ స్థానం దక్కింది. 7 కొల మానాల ఆధారంగా 100 పాయింట్లకు రాష్ట్రాల వారీగా స్కోర్లను నీతిఆయోగ్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన '17 సుస్థిర అభివద్ధి లక్ష్యాల' పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక దీన్ని స్పష్టం చేస్తోంది. కేరళ 87 పాయింట్లతో ప్రథమ, 82తో హిమాచల్ ప్రదేశ్ ద్వితీయ స్థానాల్లో నిలిచాయి.
తెలంగాణకు13 స్కోచ్ అవార్డులు
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మెరుగైన పనితీరు కనబర్చిన సంస్థలకు స్కోచ్ సంస్థ అవార్డులను అందజేసింది. ఢిల్లీలో 2019 ఫిబ్రవరి 25న నిర్వహించిన కార్యక్రమంలో అవార్డులను ఆయా సంస్థల ప్రతినిధులకు స్కోచ్ నిర్వాహ కులు అందించారు. 'భరోసా, షీ టీమ్స్, రహదారి భద్రత-ట్రాఫిక్ నిర్వహణ, సీసీటీవీ నిఘా ప్రాజెక్ట్, డయల్ 100' కు సంబంధించి హైదరాబాద్ నగర పోలీసు శాఖకు 5 అవార్డులు దక్కాయి. మహిళా స్వయం సంఘాల సహాయంతో బహిరంగ మల విసర్జన రహిత పట్టణం(మిర్యాలగూడ పురపాలక సంఘం), ఈ కాప్స్ ఆప్లికేషన్-నేర విచారణ, దర్యాప్తు (తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీస్ అండ్ స్టాండర్డైజింగ్), ఘన వ్యర్థాల నిర్వహణ (సిద్దిపేట పురపాలక సంఘం), అభివద్ధి పనులు (సిరిసిల్ల పురపాలక సంఘం), సమర్థ పారిశుద్ధ్య నిర్వహణ (సూర్యాపేట పురపాలక సంఘం), కమ్యూనిటీ పోలీస్ సపోర్టింగ్ సెంటర్ అప్లికేషన్ (తెలంగాణ పోలీస్), బస్ ఆన్ కాంట్రాక్ట్ (టీఎస్ ఆర్టీసీ), ఉత్తమ నాణ్యమైన సేవలు (ఆరెంజ్ ట్రావెల్స్) అవార్డులు దక్కించుకున్నాయి. ఆయా శాఖల, సంస్థల ప్రతినిధులు అవార్డులను స్వీకరించారు.
ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం
తెలంగాణ రాష్ట్ర శాసనసభ.. ద్రవ్యవినిమయ (ఓట్ ఆన్ అకౌంట్) బిల్లుకు 2019 ఫిబ్రవరి 25న ఆమోదం తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల కాలానికి రూ.91 వేల 36 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది.
జలసంరక్షణలో తెలంగాణకు 3 జాతీయ అవార్డులు
తెలంగాణకు 3 జాతీయ జల అవార్డులు లభించాయి. భూగర్భ జలం పెంపు విభాగంలో కామారెడ్డి జిల్లాకు ద్వితీయ బహుమతి లభించింది. ఢిల్లీలో 2019 ఫిబ్రవరి 25న జాతీయ జల పురస్కారాల(2018)ను అందజేశారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఫ్ువాల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్రెడ్డి వీటిని స్వీకరించారు. జలసంరక్షణలో ఉత్తమ సంస్థ విభాగంలో మొదటి బహుమతిని కాకతీయ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం సాధించింది. ఉత్తమ ఆధ్యాత్మిక, పర్యాటక సంస్థల విభాగంలో హైదరాబాద్కు చెందిన ధ్రువాన్ష్ సంస్థ నిర్వాహకులు రెండో బహుమతి లభించింది.
రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పద్మారావుగౌడ్
తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఉప సభాపతి ఎన్నికలో భాగంగా 2019 ఫిబ్రవరి 23న నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావుగౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఫిబ్రవరి 25న అసెంబ్లీలో ప్రకటన చేశారు.
జగిత్యాల కలెక్టర్కు జాతీయ గుర్తింపు
తెలంగాణలోని జగిత్యాల కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్కు జాతీయ గుర్తింపు లభించింది. ఉత్తమ పాలన అందించినందుకు ఇండి యన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేసిన ఆర్.ఎం.లోధా జ్యూరీ కమిటీ ఛైర్మన్.ఈ కమిటీ దేశంలోని 686 మంది జిల్లా కలెక్టర్ల పనితీరును అధ్యయనం చేసి డాక్టర్ శరత్ను ఎంపిక చేశారు. గత రెండున్నరేళ్లలో చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ విజయవంతమెనౖ జిల్లాగా జగిత్యాల రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది.
విద్యుదుత్పత్తిలో సింగరేణి రికార్డు
సింగరేణి విద్యుత్ కేంద్రం 2019 ఫిబ్రవరి లో 100 శాతం విద్యు దుత్పత్తి (పీఎల్ ఎఫ్)తో రికార్డు సష్టించింది. ఇలా ఒక నెలలో వంద శాతం విద్యు దుత్పత్తి చేయడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రెండో సారి. 2018 సెప్టెంబరులోనూ ఇలాగే ఉత్పత్తి చేశాయి. ఈ కేంద్రంలో ఒక్కోటీ 600 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల రెండు ప్లాంట్లు ఉన్నాయి.
4 పురపాలికలకు స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలు
జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు తెలంగాణలో 4 పుర పాలక సంఘాలు ఎంపికయ్యాయి. అవి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, ఫీర్జాది గూడ. మార్చి 6న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి నుంచి పురస్కారాలను అందుకుంటారు. 2019 జనవరి 31న స్వచ్ఛ సర్వేక్షణ్పై జరిగిన సర్వే ఆధారంగా వీటిని ఎంపిక చేశారు.
జాతీయం
అభినందన్ను భారత్కు అప్పగించిన పాక్
బందీగా చిక్కిన వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్థాన్ 2019 మార్చి 1న భారత్కు అప్పగించింది. పాకిస్థాన్ సరిహద్దు దళం రేంజర్లు, ఇస్లామాబాద్లోని భారత్ హైకమిషన్కు చెందిన వైమానిక అధికారి తోడురాగా పాక్ వైపునుండే వాఘా తనిఖీ కేంద్రం వద్ద అభినందన్ భారత్లోకి ప్రవేశించారు. పైలట్ యుద్ధ ఖైదీ అని అతన్ని విడుదల చేసిన అనంతరం పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. భారత్తో నెలకొన్న ఉద్రిక్తతల్ని చల్లార్చేం దుకు పైలట్ను విడుదల చేయాలని పాక్ ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి తీవ్రంగా పనిచేసింది. 2019 ఫిబ్రవరి 27న మన దేశానికి చెందిన మిగ్-21 లోహ విహంగాన్ని పాక్ బలగాలు నేలకూల్చాయి. దాని పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పారాచూట్ సాయంతో కిందికి దిగేశారు. పాక్ అధీనంలోని భూభాగంలో దిగిన ఆయనను ఆ దేశ సైనికులు నిర్బంధంలోకి తీసుకున్నారు. పుల్వామాలో భారత జవాన్లను బలిగొన్న జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద ముఠాకు భారత్ బదులిచ్చింది. 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్ఫోర్స్ 12 మిరాజ్-2000 యుద్ధవిమానాల్లో పాకిస్థాన్లోని బాలాకోట్ వద్ద ఉన్న భారీ ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నేలమట్టం చేసింది. ఇందులో దాదాపు 350 మంది ఉగ్రవాదులు, వారి శిక్షకులు హతమయ్యారు.
ఢిల్లీలో యుద్ధ స్మారకం ప్రారంభం
దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిం చిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్రమోడి 2019 ఫిబ్రవరి 25నన ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే ఈ స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రా నంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై లిఖించారు.
హైదరాబాద్, గౌహతి ఎన్ఐఏ నూతన కార్యాలయాలు
హైదరాబాద్, అసోం రాజ ధాని గౌహతిలో నిర్మించిన జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్ఐఏ) కార్యాల యాలు, నివాస గహాల సము దాయాన్ని కేంద్ర హౌంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2019 మార్చి 1న హైదరాబాద్ నుంచి ఏక కాలంలో ప్రారంభించారు.
గృహాల కొనుగోలుపై జీఎస్టీ తగ్గింపు
ఇళ్ల కొనుగోలుదారుల పన్ను భారాన్ని తగ్గిస్తూ వస్తు-సేవల పన్ను(జీఎస్టీ) మండలి నిర్ణయం తీసుకొంది. 2019 ఫిబ్రవరి 24న జరిగిన మండలి 33వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. నిర్మాణంలో ఉన్న (అండర్ కన్స్ట్రక్షన్) ఇళ్లపై జీఎస్టీ శాతాన్ని 12 శాతం నుంచి 5 శాతానికి, అందు బాటు ధరల్లో ఉన్న ఇళ్లపై పన్నును 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గించారు. కొత్త విధానంలో బిల్డర్లుకు ఇన్పుట్ ట్యాక్స్ కెడ్రిట్ (ఐటీసీ) చెల్లించడం రద్దవుతుంది. ఈ నిర్ణయాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
'ఎకో' స్మార్ట్ స్టేషన్లుగా సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ
దక్షిణ మధ్య రైల్వేలోని కాచిగూడ, సికింద్రాబాద్, విజయ వాడలను ఎకో స్మార్ట్ స్టేషన్లుగా అభివద్ధి చేయనున్నారు. ఈ మేరకు ఆ మూడింటినీ గుర్తించినట్లు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సలోనిసింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు..దేశవ్యాప్తంగా 37 రైల్వేస్టేషన్లను పర్యావరణ రీత్యా ఉన్నతంగా మార్చేందుకు నిర్ణయించారు.
పీఎం-కిసాన్ ప్రారంభం
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పుర్లో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ మైదానంలో ప్రధానమంత్రి నరేంద్రమోడి 2019 ఫిబ్రవరి 24న కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్)ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సంభాషించారు. రెండు హెక్టార్లలోపు భూమి ఉన్న దేశంలోని 12 కోట్ల మంది సన్నకారు, చిన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం ఏటా రూ.6,000ను 3 వాయిదాల్లో జమ చేయనుంది.
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ 2019 ఫిబ్రవరి 27న వెల్లడిం చారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్ల తో కొత్త జోన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. వాల్తేరు డివిజన్ను విభజించి కొత్త జోన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని విజయవాడ డివిజన్లో విలీనం చేస్తున్నట్లు స్పష్టం చేశారు
న్యూఢిల్లీలో 'కౌటిల్య ఫెలోషిప్'
ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, విధాన నిర్ణేతలకు 'కౌటిల్య ఫెలోషిప్' పేరిట న్యూఢిల్లీలో 2019 ఫిబ్రవరి 27న శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు.
ధరల నియంత్రణ పరిధిలోకి 42 క్యాన్సర్ ఔషధాలు
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే 42 నాన్ షెడ్యూల్డ్ ఔషధా లను కేంద్ర ప్రభుత్వం తాజాగా ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చింది. వాటి గరిష్ఠ చిల్లర ధర(ఎంఆర్పీ)పై వాణిజ్య లాభాన్ని 30 శాతానికి పరిమితం చేసింది. ఔషధాల(ధరల నియంత్రణ) ఉత్తర్వు-2013లోని 19వ పేరా కింద 'జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ(ఎన్పీపీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. సవరించిన ధరలు 2019 మార్చి 8 నుంచి అమల్లోకి వస్తాయి.
హైదరాబాద్లో బయో ఆసియా-2019 సదస్సు
ఆసియాలోనే అతిపెద్ద బయో టెక్నాలజీ మరియు లైఫ్-సైన్సెస్ ఫోరమ్ బయో ఆసియా 2019 సదస్సును 2019 ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు హైదరాబాద్లో నిర్వహిం చారు. తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ సదస్సును ప్రారంభించారు. జీవశాస్త్రాల రంగంలో వినూత్నమైన సేవలు, ఉత్పత్తులు అందిస్తున్న 5 స్టార్టప్ సంస్థలకు బయోఏషియా-2019 సదస్సు చివరి రోజున ప్రత్యేక గుర్తింపు లభించింది.
న్యూఢిల్లీలో యూత్ పార్లమెంట్ ఫెస్టివల్
న్యూఢిల్లీలో 2019 ఫిబ్రవరి 27న 'నేషనల్ యూత్ పార్ల మెంట్ ఫెస్టివల్-2019' నిర్వహిం చారు. ప్రధాని మోదీ పలువురు యువతీయువకులకు అవార్డు లను అందజేశారు. యూత్ పార్లమెంట్ సందర్భంగా నరేంద్రమోడి 'ఖేలో ఇండియా యాప్ను ఆవిష్కరించారు. భారత క్రీడా ప్రాధి కార సంస్థ(సారు) దీన్ని అభివద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా దేశంలోని క్రీడా ప్రాంగణాలు, వాటిలో అందు బాటులో ఉన్న సౌకర్యాలు, క్రీడల నిబంధనలు, ఫిట్నెస్ను పరీక్షించు కోవచ్చు.
ఏప్రిల్ 1 నుంచి రెండు టికెట్ల లింకింగ్ సదుపాయం
రెండు టికెట్ల లింకింగ్ సదుపాయం 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే 2019 ఫిబ్రవరి 23న ప్రకటించింది. ఆన్లైన్ టికెట్లతోపాటు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్లోనూ ఈ విధానం అమలుకానుంది. మొదట ఎక్కిన రైలు ప్రయాణ ఛార్జీని మినహాయించి మిగిలిన దూరం డబ్బులను రైల్వేశాఖ తిరిగి చెల్లిస్తుంది. టెలిస్కోపిక్ లాభం లేకుండా.. రద్దు ఛార్జీలను మినహాయిం చకుండా పూర్తిగా రిఫండ్ చేయనున్నారు. ఇందుకు మొదట ప్రయాణించిన రైలు దిగిన సమయం నుంచి 3 గంటల్లోగా రిఫండ్కు దరఖాస్తు చేసుకోవాలి.
జమాతే ఇస్లామీ సంస్థపై నిషేధం
జమ్ము కాశ్మీర్లో జాతి వ్యతిరేక, విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జమాతే ఇస్లామీ సంస్థను కేంద్ర ప్రభుత్వం 5 సం||ల పాటు నిషేధించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ 2019 ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ జారీ చేసింది
అవార్డులు
నరసింహారెడ్డికి సామల సదాశివ సాహితీ పురస్కారం
ప్రముఖ కవి, విమర్శకుడు, అనువాదకుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డికి ప్రతిష్ఠాత్మకమైన సామల సదాశివ స్మారక సాహితీ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలంగాణ కళావేదిక అధ్యక్షుడు అనుముల దయాకర్ వెల్లడించారు. 'మూల మలుపు, కొత్త పలక, నేనే, సమాంతర స్వప్నం..' కవితా సంపు టాలతో తెలుగు కవిత్వంలో తన శైలిని ఆవిష్కరించిన నర్సిం హారెడ్డి 'హైదరాబాద్ విషాదం' పేరుతో మీర్ లాయక్ అలీ ఆంగ్ల గ్రంథాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. తెలంగాణ రుబాయిలు నరసిం హారెడ్డి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
91వ ఆస్కార్ అవార్డులు
91వ ఆస్కార్ పురస్కార వేడుక అమెరికాలోని లాస్ ఏంజెలిస్లో 2019 ఫిబ్రవరి 25న నిర్వ హించారు. ఈసారి ఆస్కార్ వేదికపై భారత ఖ్యాతి వెలుగులీనింది. గ్రామీణ భారత మహిళలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలకు దర్పణం పడుతూ భారత నిర్మాత గునీత్ మొంగ్యా నిర్మించిన 'పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్' డాక్యుమెంటరీ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకుంది. ఇరానియన్ దర్శకురాలు రేకా జెహ్ తాబ్చి తెరకెక్కించిన ఈ లఘు చిత్రాన్ని పూర్తిగా భారతదేశంలోనే నిర్మించారు. 'బొహెమియన్ రప్సోడీ' చిత్రం అత్యధికంగా 4 పురస్కారాలు సాధించి సత్తా చాటింది. తర్వాతి స్థానంలో మూడు పురస్కారాలతో 'రోమా', 'గ్రీన్బుక్', 'బ్లాక్పాంథర్' ఉన్నాయి. ఉత్తమ చిత్రం పురస్కారాన్ని 'గ్రీన్ బుక్' కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా రమీ మాలెక్, ఉత్తమ నటిగా ఒలీవియా కోల్మాన్, ఉత్తమ దర్శకుడిగా అల్ఫోన్సో కువరన్ పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ నటిగా నిలిచిన ఒలీవియా కోల్మాన్కు, ఉత్తమ నటుడు రమీ మాలెక్ పోషించిన నిజ జీవిత పాత్ర ఫ్రెడ్డీ మెర్క్యురీకి భారతీయ మూలాలున్నాయి.
ఉషారాణికి బయోకికాన్ జీవన సాఫల్య పురస్కారం
ఐఐసీటీ రిటైర్డ్ శాస్త్రవేత్త పత్తిపాటి ఉషారాణి బయోఫెస్టిసైడ్ అంతర్జాతీయ సదస్సు (బయోకికాన్-2019) జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. మార్చి 6న ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్లోని అమిటీ విశ్వవిద్యాలయంలో జరిగే బయోకికాన్ 6వ సదస్సులో ఆమె ఈ పురస్కారం అందుకోను న్నారు. పర్యావరణ పరిరక్షణ, మొక్కలు, కీటకాల సంబంధ బాంధవ్యాలపై పరిశోధనలో ఆమె దిట్ట. పంటలకు హాని చేసే పురుగులు, కీటకాల నియంత్రణకు పర్యావరణానికి హాని చేయని సుమారు 50 రకాల జీవ రసాయనాలను ఉషారాణి అభివద్ధి చేశారు. ఇప్పటివరకు 11 పేటెంట్లు పొందారు.
సామాజిక సేవకు ఇన్ఫోసిస్ ప్రోత్సాహకం
సామాజిక సమస్యలకు పరిష్కారాలు చూపే ఆవిష్కరణలకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థ రూ.1.70 కోట్ల విలువైన నగదు పురస్కారాల్ని అందజేసింది. 'ఆరోహణ్ సోషల్ ఇన్నోవేషన్' పేరిట ఈ పురస్కారాలను సంస్థ అధ్యక్షురాలు సుధామూర్తి 2019 ఫిబ్రవరి 26న విజేతలకు అందించారు. 2018-19 ఏడాదికి ప్రశాంత్ గడె , కుశ్వంత్ రారు, అంజలి ఖురానాలు ప్లాటినమ్ పురస్కారాలు అందుకున్నారు.
సైన్స్ & టెక్నాలజి
సరికొత్త ఎంఆర్ఐ సెన్సార్
అమెరికాకు చెందిన మస్సాచుసెట్స్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) శాస్త్రవేత్తలు సరికొత్త మాగటిక్ రెసొనాన్స్ ఇమేజ్ (ఎంఆర్ఐ)ను అభివద్ధి చేశారు. దీనిద్వారా మెదడులోని కాల్షియం చర్యలను మరింత సూక్ష్మంగా గుర్తించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కణాల్లోని కాల్షియం సిగలింగ్ను సైతం గుర్తించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జంతువులపై చేసిన ప్రయోగాలు ఫలించాయని తెలిపారు.
తల వెంట్రుకలతో విటమిన్-డి స్థాయిల అంచనా
తొలిసారిగా తల వెంట్రుకల సాయంతో శరీరం లోని విటమిన్-డి స్థాయిలను శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఒంటిపై సూది గుచ్చకుండా విటమిన్-డి లోపాన్ని నిర్ధారించేందుకు ఈ విధానం తోడ్పడే వీలుంది. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా విటమిన్-డి లోపం వేధిస్తోంది. ప్రస్తుతం రక్త నమూనాలను పరి శీలించి లోపాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ పరీక్షలను మరింత సులువుగా నిర్వహించడమే లక్ష్యంగా ఐర్లాండ్లోని ట్రినిటీ కాలేజీ నిపుణులు పరిశోధన చేపట్టారు.
క్యూఆర్ సామ్ పరీక్ష విజయవంతం
ఆర్మీకి మరింత శక్తినిచ్చే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ పరీక్షలు 2019 ఫిబ్రవరి 26న విజయవంతంగా జరిగాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్లు సంయుక్తంగా అభివద్ధి చేసిన ఈ క్షిపణికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ దాడులు చేయగలగడం మాత్రమే కాకుండా.. రాడార్ల ద్వారా జామ్ చేసే ప్రయత్నాలను ఎలక్ట్రానిక్ కౌంటర్ మెషర్ల ద్వారా తిప్పికొట్టగల శక్తి కూడా వీటికి ఉంది. ట్రక్కులో లేదా చిన్న గొట్టంలోంచి ప్రయోగించగల క్యూఆర్సామ్ 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించ గలదు.
వార్తల్లో వ్యక్తులు
కవి, రచయిత ద్వానా శాస్త్రి కన్నుమూత
కవి, రచయిత, విమర్శ కుడు, పోటీ పరీక్షల శిక్షకుడు.. ద్వానా శాస్త్రిగా సుప్రసిద్ధులైన ద్వాదశి నాగేశ్వరశాస్త్రి (71) 2019 ఫిబ్రవరి 26న సికింద్రాబాద్లో కన్ను మూశారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా లింగాల. ఏలూరులో బీఎస్సీ చదివారు. ఆంధ్ర విద్యాలయంలో ఎంఏ (తెలుగు), నాగార్జున విశ్వ విద్యాలయంలో ఎం.ఫిల్ ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పీజీ డిప్లొమో ఇన్ లింగ్విస్టిక్స్ చదివారు. 1972 నుంచి అమలాపురంలోని ఎస్కేబీ ఆర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, రీడర్గా ఉద్యోగం చేశారు. కవి, రచయిత, విమర్శకుడిగా ఖ్యాతి పొందారు. 'మన తెలుగు తెలుసుకుందాం', 'మాటలంటే మాటలా?', 'ఇదీ మన తెలుగు', 'మన తెలుగు వైభవం', 'తెలుగు జిలుగు' వంటి మొత్తం 80 పుస్తకాలు, వందల వ్యాసాలను రచించారు. పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు అవసరమైన స్టడీమెటీరియల్ను కూడా అందించారు.
అమెరికాకు సౌదీ తరఫున తొలి మహిళా రాయబారి
అమెరికాలో తమ దేశ రాయబారిగా సౌదీ అరేబియా తొలిసారి ఒక మహిళను నియమించింది. రాకుమారి రీమా బింత్ బందర్కు ఈ బాధ్యతలను అప్పగిం చింది. ఈ మేరకు సౌదీ రాజు 2019 ఫిబ్రవరి 23న ఉత్తర్వు జారీ చేశారు. ఇప్పటివరకూ ఆ పదవిలో కొనసాగిన రాకుమారుడు ఖలీద్.. సౌదీ రక్షణ శాఖలో ఉపమంత్రిగా నియమితులయ్యారు. సౌదీ యువరాజు, రక్షణ మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్కు ఖలీద్ సోదరుడు.
హెచ్సీయూ మండలి సభ్యుడిగా భట్టు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడిగా ఉస్మానియా యూనివర్సిటీ రసాయనశాస్త్రం ఆచార్యులు భట్టు సత్యనారాయణ నియమితులయ్యారు. కేంద్రీయ విశ్వవిద్యాలయ డైరెక్టర్ నుంచి 2019 ఫిబ్రవరి 26న ఆదేశపత్రం అందింది. సత్యనారాయణకు 30 సంవత్సరాల బోధనానుభవం ఉంది. ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యాపకుల సంఘం ఛైర్మన్గా సేవలు అందిస్తున్నారు. హెచ్సీయూకి మరో పాలకమండలి సభ్యుడిగా ఢిల్లీలో ఆచార్యుడిగా పనిచేస్తున్న చంద్రిమ సాహను నియమించారు.
బీడీఎల్ సీఎండీగా సిద్ధార్థ మిశ్రా
రక్షణ మంత్రిత్వ శాఖ సారథ్యంలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) నూతన ఛైర్మన్, ఎండీగా (సీఎండీ) సిద్ధార్థ మిశ్రా నియమితులయ్యారు. 2019 మార్చి 1న ఆయన బాధ్యతలు చేపట్టారు. మూడు దశాబ్దాల క్రితం భారత నౌకాదళంలో ఎలక్ట్రికల్ విభాగంలో అధికారిగా చేరిన ఆయన కమడోర్ స్థాయికి ఎదిగారు. నౌకాదళం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత హైదరాబాద్లోని ఈసీఐఎల్లో జనరల్ మేనేజర్గా పనిచేశారు. ఇప్పుడు బీడీఎల్ సీఎండీ అయ్యారు.
క్రీడలు
మన్ప్రీత్కు ఉత్తమ ఆటగాడి అవార్డు
భారత హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్సింగ్ ఆసియా హాకీ సమాఖ్య 2018 ఏడాది ఉత్తమ ఆటగాడి అవార్డు గెలుచుకున్నాడు. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో సంయుక్త విజేతగా నిలిచిన భారత హాకీ జట్టుకు మన్ప్రీత్ సారథ్యం వహించాడు. నెదర్లాండ్స్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టు రజతం గెలవడం లోనూ మన్ప్రీత్ ఆటగాడిగా కీలకపాత్ర పోషించాడు. మహిళల విభాగంలో భారత టీనేజర్ లాల్రెమ్సియామి వర్ధమాన క్రీడాకారిణి అవార్డు గెలుచుకుంది. 2018 ప్రపంచకప్లో ఆకట్టుకున్న ఈ మిజోరాం అమ్మాయి.. ఆసియా క్రీడల్లో జట్టు రజతం గెలవడంలోనూ తనవంతు పాత్ర పోషిం చింది. భారత పురుషుల హాకీ జట్టుకు ఉత్తమ ప్రదర్శన అవార్డు దక్కింది.
తేజస్లో ప్రయాణించిన తొలి మహిళ పీవీ సింధు
బెంగళూరు వైమానిక ప్రదర్శన నాలుగో రోజు ఫిబ్రవరి 23న తేలికపాటి యుద్ధ విమానం తేజస్కు కోపైలెట్గా తెలుగు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు వ్యవహరించారు. దీంతో తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళగా సింధు చరిత్ర పుటల్లోకి ఎక్కారు. అతి తక్కువ వయసు (23ఏళ్లు)లో యుద్ధ విమానాన్ని నడిపిన వ్యక్తిగా ఆమె రికార్డు సష్టించారు.
మక్రన్ కప్ బాక్సింగ్ టోర్నీ
ఇరాన్లో 2019 ఫిబ్రవరి 28న జరిగిన మక్రన్ కప్ బాక్సింగ్ టోర్నీలో జాతీయ ఛాంపియన్ దీపక్సింగ్(48 కిలోలు) స్వర్ణ పతకం సాధించాడు. తెలుగు బాక్సర్ లలిత ప్రసాద్(52 కిలోలు) రజత పతకం గెలుచుకున్నాడు
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో సౌరభ్కు స్వర్ణం
భారత షూటర్ సౌరభ్చౌదరి ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ 245 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రజతం గెలిచిన డామి మికెచ్ (సెర్బియా) కంటే సౌరభ్ 5.7 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. డామి 239.3 పాయింట్లు సాధించగా.. కాంస్యం సాధిం చిన చైనా షూటర్ వీ పాంగ్ 215.2 పాయింట్లకు పరిమిత మయ్యాడు. వీ పాంగ్ 2008 ఒలింపిక్స్ స్వర్ణ విజేత. ఇప్పటికే 10 మీ. ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగం లో ప్రపంచ రికార్డును తన పేరిటే లిఖించు కున్న సౌరభ్.. సీనియర్ స్థాయిలోనూ రికార్డు నెలకొ ల్పాడు.
- యన్.సంతోష్కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270