1. 'నందికొండ ప్రాజెక్టు'ను జవహర్లాల్ నెహ్రూ ఏ రోజున శంకుస్థాపన చేశారు?
ఎ) 1955 డిసెంబర్ 10 బి) 1955 డిసెంబర్ 4
సి) 1956 డిసెంబర్ 10 డి) 1956 ఆగస్టు 4
2. 'మహాయానం' అంటే?
ఎ) చిన్న బండి బి) పెద్దబండి
సి) నాగదేవతారాధన డి) నాగముచిలింద
3. నాగార్జున కొండ ఏ శైలికి ప్రసిద్ధి?
ఎ) పూర్వ శైలం బి) ఉత్తర శైలం
సి) అపర శైలం డి) సిద్ధారక
4. బుద్ధుడిని విగ్రహాలుగా చెక్కి ఎవరు పూజిస్తారు?
ఎ) హీనాయానులు బి) భద్రయానులు
సి) మహాయానులు డి) రాజగిరుకులు
5. బౌద్ధుల ప్రార్థనా మందిరాన్ని ఏమంటారు?
ఎ) ఆరామాలు బి) విహారాలు
సి) సంఘారామాలు డి) చైత్యం
6. శాతవాహనుల కాలంలో మాలాకారులు అనగా?
ఎ) పూలవర్తకులు బి) మేదరివారు
సి) మెరుగుపెట్టే వారు డి) రత్న పనివారు
7. దేనిని శాతవాహనుల 'టంకశాల నగరమ'ని భావిస్తున్నారు?
ఎ) కోటిలింగాల బి) కొండాపూర్
సి) ధూళికట్ట డి) పెద్దబంకూరు
8. యజ్ఞశ్రీ శాతకర్ణి పాలనా కాలానికి చెందిన ఓడ బొమ్మతో ఉన్న నాణేలు ఎక్కడ లభించాయి?
ఎ) నాగార్జున కొండ బి) ఫణిగిరి
సి) పాశెగాం డి) తిరుమలగిరి
9. ఎక్కడి తవ్వకాల్లో మొదటిసారి ఎద్దు (bశీరఅaఎaసఱషఱబర) అస్థి పంజరం అవశేషాలు దొరికాయి?
ఎ) యాపలదేవి పాడు బి) రేవళ్ళ
సి) సానబండ డి) కదంబాపూర్
10. పూలోమావి వేయించిన వెండి నాణేలు ఎక్కడ లభించాయి?
ఎ) ధూళికట్ట బి) పెద్దబంకూరు
సి) కోటిలింగాల డి) కొండాపూర్
11. కింది వారిలో ఎవరు వలిగొండలో కనుక్కొన్న బృహత్ శిలాయుగపు సమాధులు, తెలంగాణ పూర్వ యుగపు అధ్యయనానికి మొదటిసారిగా తెరతీశాయి?
ఎ) రాబర్ట్ బ్రూస్ ఫూట్ బి) జి.బుల్హెర్
సి) ఇ.సెనార్ట్ డి) వి.వి.కృష్ణశాస్త్రి
12. 'జియోగ్రాఫికారు హెపిజెయిస్' గ్రంథాన్ని రచించిన వారు?
ఎ) టాలెమి బి) ప్లీని
సి) మెగస్తనీస్ డి) వి.వి.మిరాసి
13. చుట్టూ తోటలూ, ప్రార్థనకు, సమావేశానికి, వ్యాయా మానికి సదుపాయాలున్న విహారాలను ఏమంటారు?
ఎ) సంఘారామాలు బి) ఆరామాలు
సి) హర్మికారామాలు డి) కణికరామాలు
14. 'యాంటిక్వేరియన్ రిమైన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్' అను పుస్తకాన్ని పురావస్తుశాఖ ఏ సంవత్సరంలో ప్రచురిం చింది?
ఎ) 1949 బి) 1953
సి) 1955 డి) 1956
15. ఏ యుగంలో మానవులు ఆహార సేకరణ స్థాయి నుంచి ఆహార ఉత్పత్తి స్థాయికి ఎదిగారు?
ఎ) ఇనుపయుగం బి) మధ్యరాతి యుగం
సి) కొత్త రాతియుగం
డి) ఎగువ పాతరాతి యుగం
16. హైదరాబాద్ ప్రాంతంలో దొరికిన క్రీ.శ. 11వ శతాబ్దం నాటి ఒక శాసన ఏ శకం గురించి తెలుపుతుంది?
ఎ) మౌర్య వంశం బి) నంద వంశం
సి) శాలివాహన వంశం డి) సంగం శకం
17. తెలంగాణలో ఎక్కడి సమాధులలో ఇనుప గొలుసు, ఇత్తడి గంట లభించాయి?
ఎ) వలసగట్టు బి) సేరుపల్లి
సి) హస్మత్పేట డి) కొమరపల్లి
18. ఎవరి వెండి విద్ధాంక నాణేలు కోటిలింగాల, కొండా పూర్, సుల్తానాపూర్, పెద్ద బంకూరు తవ్వకాలలో లభించాయి?
ఎ) మౌర్యులు బి) శుంగులు
సి) కణ్వులు డి) నందులు
19. మౌర్యుల తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు?
ఎ) పల్లవులు బి) శాతవాహనులు
సి) ఇక్ష్వాకులు డి) నందులు
20. 'శాతవాహనుడి' తొలి నాణెంపై కింది వాటిలో ఏ చిహ్నం ఉన్నది?
ఎ) స్వస్తిక్ బి) ధనస్సు
సి) ఉజ్జయిని డి) బాణము
21. శాతవాహన వంశకర్త ఎవరు?
ఎ) కణ్హ బి) శాతకర్ణి
సి) శాతవాహనుడు డి) గౌతమిపుత్ర శాతకర్ణి
22. కింది వాటిలో ఎక్కడ శాతవాహన, ఇక్ష్వాకుల, విష్ణు కుండిన కాలాలకు చెందిన బౌద్ధారామం, మహాచైతన్యం బయటపడ్డాయి?
ఎ) నేలకొండపల్లి బి) బాదనకుర్తి
సి) ఫణిగిరి డి) పెద్దబంకూరు
23. 'హీనాయానం' అనగా?
ఎ) పెద్దబండి బి) నాగముచిలింద
సి) నాగదేవతారాధన డి) చిన్నబండి
24. నిగమాలంటే?
ఎ) గ్రామాలు బి) పట్టణాలు
సి) సభలు డి) గ్రామణి
25. శాతవాహనుల కాలంలో పంటలో రాజు భాగాన్ని ఏమని పిలిచేవారు?
ఎ) దేయమేయం బి) శ్రేణులు
సి) రాజంకంభేట డి)భూమిశిస్తు
26. కుల పెద్దలను శాతవాహనుల కాలంలో ఏమని పిలిచేవారు?
ఎ) అమాత్యులు బి) నిగమం
సి) గహపతులు డి) కరుకర
27. విదేశాలతో వ్యాపారం చేసే వర్తకులను శాత వాహనుల కాలంలో ఏమని పిలిచేవారు?
ఎ) సార్ధవాహులు బి) సేలవధకులు
సి) సెల్లాలు డి) హేరణిక
28. రాజాజ్ఞలను, రాజ్య వ్యవహారాను పత్రాలలో రాసి భద్రపరిచే వారిని ఏమని పిలిచేవారు?
ఎ) అక్షపటకులు బి) బాంఢాగారికుడు
సి) మహామాత్రులు డి) మహాతరక
29. ద్రవ్యరూపమైన ఆదాయాన్ని భద్రపరిచే వాడిని శాతవాహనుల కాలంలో ఏమనేవారు?
ఎ) హేరణికుడు బి) నిబంధకారుడు
సి) భాండాగారికుడు డి) ప్రతీహర
30. ఇక్ష్వాకుల రాజ చిహ్నం?
ఎ) నంది బి) సింహం
సి) పులి డి) స్వస్తిక్
31. 'హలసహస్ర ప్రదాత' అనే బిరుదు కలవాడు?
ఎ) శాంతమూలుడు
బి) ఎహువల శాంతమూలుడు
సి) వీరపురుషదత్తుడు
డి) రుద్రపురుషదత్తుడు
32. శాతవాహనుల కాలంలో 'కటకం' అనగా?
ఎ) మిలటరీ క్యాంప్ బి) కంటోన్మెంట్
సి) స్కందావారం డి) రాజకంఖేట
33. మత్య్స పురాణం ప్రకారం ఇక్ష్వాకులు ఎంతమంది రాజులు?
ఎ) 4 బి) 7 సి) 18 డి) 5
34. నాగార్జున కొండ నుంచి ప్రారంభమై, శ్రీశైల పర్వతం చుట్టూ ఉన్న నల్లమల కొండల వరకు గల పర్వత శ్రేణిని పురాణాలు, బౌద్ధగ్రంథాలు ఏమని వర్ణించాయి?
ఎ) ఉత్తరశైలం బి) అపరశైలం
సి) పూర్వశైలం డి) సిద్ధారక
35. ఇక్ష్వాకులు, శ్రీపర్వతీయులు ఒక్క,రేనని మొదటగా వివరించిన వారు?
ఎ) డి.సి.సర్కార్ బి) వి.వి.కృష్ణశాస్త్రి
సి) కె.పి.జయస్వాల్ డి) బి.ఎన్.శాస్త్రి
36. నాగార్జున కొండ అవశేషాలను మొదటగా గుర్తించిన వారు?
ఎ) బి.యన్.రామచంద్రన్
బి) రాయప్రోలు సుబ్రహ్మణ్యం
సి) ఎన్.హెచ్.లాంఫ్ుర్స్ట్
డి) ఎ.రంగనాథ సరస్వతి
37. ఇక్ష్వాకుల కాలంలో ఒక రకమైన భూమిశిస్తును స్థానిక పాలకులు వసూలు చేసుకుని, అనుభవించే వారిని ఏమని పిలిచేవారు?
ఎ) కర బి) భోగ సి) హిరణ్యం డి) మేయం
38. ఇక్ష్వాకులు ఏ నాణేలను అత్యధికంగా ముద్రించారు?
ఎ) బంగారు బి) వెండి
సి) సీసపు డి) ప్రతినాణేం
39. శాతవాహనుల కాలంలో 'పసకరులు' అనగా?
ఎ) రాయసగాళ్ళు బి) మేదరివారు
సి) రాతిపనివారు డి) చేతివృత్తులవారు
40. ఏ శాసనంలో 'తెలుంగణ' పదం పేర్కొన్నారు?
ఎ) విలాస శాసనం బి) కుర్గోడు శాసనం
సి) తెల్లాపూర్ శాసనం డి) వెలిచర్ల శాసనం
41. కిందివారిలో ఎవరు 'తెలింగాణ' అని పేర్కొన్నారు?
ఎ) టాలెమీ బి) ప్లీని
సి) అబుల్ఫజల్ డి) అమీర్ ఖుస్రో
42. ఏ శాసనంలో 'తెలుంగాణ' పదం ప్రయోగించారు?
ఎ) తిరుమల శాసనం బి) చిన్నకంచి శాసనం
సి) విలాస శాసనం డి) వెలిచర్ల శాసనం
43. ఏ శాసనంలో 'తెలుంగ' అనే పదం ఉన్నది?
ఎ) కుర్గోడు శాసనం బి) తెల్లాపూర్ శాసనం
సి) చిన్నకంచి శాసనం డి) వెలిచర్ల శాసనం
44. కింది వారిలో ఎవరు 'తిలింగ' అని పేర్కొన్నారు?
ఎ) అమీర్ ఖుస్రో బి) ప్లీని
సి) టాలెమీ డి) అబ్దుల్ఫజల్
45. 'తిరిలింగ' అనే పదం ఏ శాసనంలో ఉన్నది?
ఎ) పుర్లి శాసనం బి) చిన్నకంచి శాసనం
సి) తిరుమల శాసనం డి) వెలిచర్ల శాసనం
46. 'తిలింగ' శబ్దాన్ని ఏ పురాణం పేర్కొన్నది?
ఎ) వాయుపురాణం బి) మత్య్సపురాణం
సి) విష్ణు పురాణం డి) బ్రహ్మాండ పురాణం
47. ఎక్కడి రాక్షసగూడు సమాధి ఇప్పటివరకు జరిగిన పరిశోధనల ప్రకారం దేశంలోనే మొదటిదని తేలింది?
ఎ) ఏటూరు నాగారం
బి) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
సి) గుండాల డి) బొమ్మెర
48. ఎక్కడి రాక్షస గూళ్ళలో చేపలు పట్టే గాలాలు దొరికాయి?
ఎ) చిన్నమారురు బి) ఉప్పేరు
సి) వీరాపురం డి) హస్మత్పేట
49. ఎక్కడి రాక్షస గూళ్ళలో బంగారు ఉంగరం లభించింది?
ఎ) పోలిచెట్టి చెరువుగడ్డ బి) కదంబాపూర్
సి) నెల్లిమిల్లి డి) రాయగిరి
50. 'నాచురల్ హిస్టరీ' అనే గ్రంథాన్ని రాసినవారు?
ఎ) టాలెమీ బి) ప్లినీ
సి) అబుల్ ఫజల్ డి) అమీర్ఖుస్రో
51. ఏ శాసనం ప్రకారం ఒక ఇంటి యజమాని (గహపతి) జలశయాన్ని నిర్మించినట్టు ప్రస్తావన ఉంది?
ఎ) మ్యాకదోని శాసనం బి) జున్నార్ శాసనం
సి) నాసిక్ శాసనం డి) నానేఘాట్ శాసనం
52. శాతవాహనుల కాలంలో ముప్పైమంది సైనికుల నాయకుడిని ఏమని పిలిచేవారు?
ఎ) గుల్మిక బి) అవేసినులు
సి) ధన్నుక డి) కొనచిక
53. శాతవాహనుల కాలంలో నగరాల్లోని సైన్యాగారాలను ఏమని పిలిచేవారు?
ఎ) స్కందారం బి) కటకాలు
సి) గౌల్మికులు డి) కంటోన్మెంట్లు
ఎ) శాతవాహనుడు బి) కణ్హ
సి) మొదటి శాతకర్ణి డి) రెండో శాతకర్ణి
55. నాసిక్ శాసనాన్ని వేయించినది?
ఎ) గౌతమిబాలశ్రీ బి) నాగానిక
సి) యజ్ఞశ్రీ డి) వేదశ్రీ
సమాధానాలు
1.ఎ 2.బి 3.సి 4.సి 5.డి
6.ఎ 7.బి 8.ఎ 9.ఎ 10.ఎ
11.ఎ 12.ఎ 13.బి 14.బి 15.సి
16.బి 17.సి 18.ఎ 19.బి 20.ఎ
21.సి 22.ఎ 23.డి 24.బి 25.ఎ
26.సి 27.ఎ 28.ఎ 29.ఎ 30.బి
31.ఎ 32.బి 33.బి 34.బి 35.సి
36.డి 37.బి 38.సి 39.బి 40.సి
41.సి 42.డి 43.ఎ 44.ఎ 45.ఎ
46.ఎ 47.బి 48.ఎ 49.ఎ 50.బి
51.ఎ 52.ఎ 53.బి 54.బి 55.ఎ
- పృథ్వికుమార్ చౌహాన్
డైరెక్టర్, పృథ్వి ఐఏఎస్ స్టడీసర్కిల్
దిల్సుఖ్నగర్,హైదరాబాద్
ఫోన్: 9177602890
Authorization