1. 'దివ్యాలు' అనే న్యాయ విధులను కనిపెట్టిన విష్ణు కుండినుల రాజు?
ఎ) మాధవవర్మ బి) గోవిందవర్మ
సి) ఇంద్రవర్మ డి) ఇంద్ర భట్టారక వర్మ
2. 'శ్రీపర్వత' అనే పదాన్ని నాణేలపై చెక్కించినవారు?
ఎ) శాతవాహనులు బి) ఇక్ష్వాకులు
సి) విష్ణుకుండినులు డి) వాకాటకులు
3. విష్ణుకుండినుల రాజముద్ర ఒకటి ఇటీవల ఎక్కడ లభించింది?
ఎ) కీసరగుట్ట బి) ఇంద్రపురి
సి) చైతన్యపురి డి) అమరావతి
4. ఎవరి కాలంలో ప్రాకృత భాష తెరమరుగై సంస్కృత భాష రాజభాష అయినది?
ఎ) ఇక్ష్వాకులు బి) వాకాటకులు
సి) విష్ణుకుండినులు డి) రాష్ట్ర కూటులు
5. 'ఘటికావాప్త పుణ్యసంచయ' అనే బిరుదు గలవారు?
ఎ) ఇంధ్రభట్టారకవర్మ బి) రెండో మాధవవర్మ
సి) మొదటి గోవిందవర్మ డి)విక్రమేంద్రవర్మ
6. వాకాటకులు ఎవరి బంధువులు?
ఎ) మౌర్యులు బి) గుప్తులు
సి) శుంగలు డి) నందవంశీయులు
7. ఎవరి రాజ్యంలో 'గవ్వలు' కూడా ద్రవ్యంగా చెలామణి అయ్యాయని షాహియాన్ రాశారు?
ఎ) శాతవాహనులు బి) విష్ణుకుండినులు
సి) ఇక్ష్వాకులు డి) వాకాటకులు
8. కింది వారిలో ఎవరు శ్రీపర్వతం మీద బంగారంతో చేసిన నిలువెత్తు బుద్ధ విగ్రహాలు ఉన్నాయని తన గ్రంథంలో రాశారు?
ఎ) షాహియాన్ బి) హ్యుయన్త్సాంగ్
సి) ఇత్సింగ్ డి) ప్లీని
9. ఎక్కడ నశం డబ్బి (పోత ఇనుముతోమామిడి పిందె ఆకారంలో చేసినది) తెలంగాణ ప్రాంతంలో దొరికింది?
ఎ) కీసరగుట్ట బి) మునులగుట్ట
సి) యాదగిరి గుట్ట డి) తిరుమలగిరి గుట్ట
10. కింది వారిలో ఎవరు మిశ్రమ సంస్కృతి స్థానంలో హైందవ సంస్కృతిని ప్రవేశపెట్టారు?
ఎ) ఇక్ష్వాకులు బి) శాతవాహనులు
సి) రాష్ట్రకూటులు డి) విష్ణుకుండినులు
11. ఏ విష్ణుకుండినుల రాజు 16 రాజసూయ యాగాలు, 11 అశ్వమేధ యాగాలు, వాజపేయ, పురుషమేధ మొదలైన 1000 యాగాలు చేశాడని శాసనాలు పేర్కొన్నాయి?
ఎ) రెండవ మాధవవర్మ బి) విక్రమేంద్ర భట్టారకవర్మ
సి) మొదటి గోవిందవర్మ డి) మొదటి ఇంద్రవర్మ
12. ఎక్కడ రెండంతస్థుల గుహల్లో ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు, తొలి చాళుక్యుల కాలంనాటి ఇటుక గోడలు, శాసనాలు ఉన్నాయి?
ఎ) ఏలేశ్వరం బి) సలేశ్వరం
సి) ఉమామహేశ్వరం డి) కీసరగుట్ట
13. యుద్ధభేరి, దంతముఖస్వామి విగ్రహ ప్రతిష్టలు ఎవరి పాలనాకాలంలో జరిగాయి?
ఎ) రెండో మాధవ వర్మ
బి) మొదటి గోవిందవర్మ
సి) మహా రాజేంద్ర వర్మ
డి) రెండో విక్రమేంద్రవర్మ
14. బౌద్ధమతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు?
ఎ) వేములవాడ చాళుక్యులు
బి) ముదిగొండ చాళుక్యులు
సి) విష్ణుకుండినులు డి) ఇక్ష్వాకులు
15. హిరణ్యగర్భ యాగాన్ని చేసినవారు?
ఎ) రాష్ట్రకూటులు బి) వాకాటకులు
సి) ఇక్ష్వాకులు డి) విష్ణుకుండినులు
16. బౌద్ధ మతానికి చెందిన ఏ శాఖ హైదరాబాద్లోని చైతన్యపురిలో ఉండేది?
ఎ) మహాయాన బి) హీనాయాన
సి) జనవాద డి) ధేరవాద
17. కీసరగుట్టపై ఏ బౌద్ధం ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి?
ఎ) మహాయాన బౌద్ధం బి) భద్రయాన బౌద్ధం
సి) రాజగిరులు డి) హీనయాన బౌద్ధం
18. ఎవరి కాలంలో బ్రాహ్మణులు క్రమంగా బుద్ధుణ్ని, విష్ణువు తొమ్మిదవ అవతారంగా చిత్రించారు?
ఎ) ఇక్ష్వాకులు బి) వాకటాకులు
సి) విష్ణు కుండినులు
డి) వేములవాడ చాళుక్యులు
19. సంస్కృతంలో 'ప్రమాణ సముచ్ఛయం' అనే గ్రంథాన్ని రాసినవారు?
ఎ) ఈశ్వరకృష్ణుడు బి) దిఙ్నగుడు
సి) నయసేనుడు డి) కాళిదాసు
20. 'మహాబోధిసత్వ' బిరుదు కలిగినవాడు?
ఎ) విక్రమేంద్రవర్మ బి) గోవిందవర్మ
సి) రెండో మాధవవర్మ డి) మహా రాజేంద్ర వర్మ
21. విక్రమేంద్రవర్మతో సంబంధం లేనిది?
ఎ) మహాకవి బి) షడభిజ్ఞ
సి) మహాబోధిసత్వ డి) పరమసాగతస్య
22. ఏ కోటను కూడా మొదట విష్ణుకుండులే కట్టిం చినట్టు తెలిపేవారి రాజచిహ్నం శిల్పాలు ఆ కోటగోడల మీద కనిపిస్తాయి?
ఎ) భువనగిరి కోట బి) మున్ననూరు కోట
సి) ఇందూరు కోట డి) జగిత్యాల
23. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) జైనమతం విష్ణుకుండినుల కాలంలోనే కను మరుగు అయినది
బి) విష్ణుకుండినుల కాలంలో ఆరామ విహారాల్లో బ్రాహ్మణాధిక్యం చోటుచేసుకున్నది
సి) ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలుగా మారాయి
డి) అలంపురం విష్ణుకుండుల కంటే ముందువారైన ఇక్ష్వాకుల కాలం నుంచే మనుగడలో ఉండేదనే శాసన ఆధారం దొరికింది.
24. ఎవరి కాలంలో జైన ఆలయాలు శివాలయాలు అయ్యాయి?
ఎ) వాకాటకులు బి) ఇక్ష్వాకులు
సి) విష్ణుకుండినులు
డి) వేములవాడ చాళుక్యులు
25. విష్ణుకుండినులు కట్టిన రామలింగేశ్వర ఆలయాలు కింది వాటిలో ఎక్కడ లేదు?
ఎ) చెరువుగట్టు బి) పులిగిళ్ళ
సి) షాద్నగర్ డి) నందికొండ
26. చైతన్యపురి శిలాశాసనం ఏ భాషలో ఉన్నది?
ఎ) పాళీ బి) ప్రాకృతం
సి) సంస్కృతం డి) తెలుగు
27. కింది వాటిలో సరికాని జత ఏది?
ఎ) రెండో మాధవవర్మ - జనాశ్రయ
బి) మొదటి గోవిందవర్మ - మహాకవి
సి) ఇంద్రభట్టారక వర్మ - ఘటికావాస్త పుణ్యసంచయ
డి) విక్రమేంద్రవర్మ - పరమసోగతస్య
28. 'అమరపురీశులమ'ని ఎవరు చెప్పుకొన్నారు?
ఎ) వేములవాడ చాళుక్యులు
బి) ముదిగొండ చాళుక్యులు
సి) ఇక్ష్వాకులు డి) విష్ణుకుండినులు
29. శుక్రపురం అనగా నేటి......?
ఎ) ఇంద్రపాలనగరం బి) సంగనిగుండాల
సి) పురనిసంగమం డి) అమరపురం
30. ఏ విష్ణుకుండిన రాజు అనేక 'దేవాయతనాలు' కట్టించాడు?
ఎ) గోవిందవర్మ బి) విక్రమేంద్రవర్మ
సి) మాధవ వర్మ డి) పరమ భట్టారక వర్మ
31. వంకేశ్వరాలయం తెలంగాణలో ఎక్కడ ఉన్నది?
ఎ) ఆమ్రాబాద్ బి) కీసరగుట్ట
సి) చైత్యనపురి డి) ఇంద్రపాలనగరం
32. కింది వాటిలో రామలింగేశ్వరాలయం ఎక్కడ ఉన్నది?
ఎ) కీసరగుట్ట బి) వాడపల్లి
సి) ఘట్కేసర్ డి) మఠంపల్లి
33. పుణ్య స్నానాలచే పవిత్రమైన శిరస్సు కలవాడు అని ఏ విష్ణుకుండినరాజును వర్ణించెడివారు?
ఎ) రెండో మాధవవర్మ బి) ఇంద్రవర్మ
సి) రెండో ఇంద్ర భట్టారకవర్మ
డి) రెండో విక్రమేంద్రవర్మ
34. కీసరగుట్ట పైన ఒక్కొక్క విజయానికి గుర్తుగా ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠ చేసినవారు?
ఎ) దేవవర్మ బి) మంచన భట్టారకుడు
సి) ఇంద్రవర్మ డి) రెండో మాధవవర్మ
35. త్రియంబకనాథ దేవాలయానికి లేదా సోమగిరీశ్వరనాథ దేవునికీ దేవభోగముగా రేగోన్ర గ్రామాన్ని ఎవరు దానం చేశారు?
ఎ) రెండో మాధవ వర్మ బి) విక్రమేంద్రవర్మ
సి) రెండో గోవిందవర్మ డి) ఇంద్ర వర్మ
36. విష్ణుకుండినులు ఏ మతానుయాయులు?
ఎ) వైదిక బి) బౌద్ధ
సి) జైన డి) శైవ
37. గోవిందవర్మ పరమభట్టారికాదేవి మహా విహారానికి ఏ గ్రామాన్ని దానం చేశాడు?
ఎ) పేణ్కపఱ బి) పఱకి విషయం
సి) ఇఱుణ్డెరో డి) రావరేవ
38. 2011లో చేపట్టిన తవ్వకాలలో తెలంగాణలో ఎక్కడ ఆరు ఆరామాలు బయటపడ్డాయి, ఒక్కో ఆరామంలో 7 గదులున్నాయి?
ఎ) ఫణిగిరి బి) నేలకొండపల్లి
సి) పల్లవేశ్వరాలయం డి) ఏకేశ్వరాలయం
39. 'గోవింద రాజ విహారం' ఎక్కడ ఉన్నది?
ఎ) చైతన్యపురి బి) కారుకొండ
సి) గాజులబండ డి) ఫణిగిరి
40. 'పరమభట్టారికా మహాదేవి విహారం' ఎక్కడ ఉన్నది?
ఎ) ఇంద్రపాలన నగరం బి) ఫణిగిరి
సి) నేలకొండపల్లి డి) నాగార్జునకొండ
41. విష్ణుకుండినుల దాదాపు పరిపాలనా కాలం?
ఎ) క్రీ.శ. 358 - 569 బి) క్రీ.శ. 358 - 589
సి) క్రీ.శ. 338 - 589 డి) క్రీ.శ. 318 - 569
42. కింది వాటిలో దేనిని తెలంగాణ అమరావతి అని కూడా అంటారు?
ఎ) అమరపురం బి) ఇంద్రపాలనగరం
సి) పురనిసంగమం డి) శుక్రపురం
43. విష్ణుకుండులు దేని పేరును 'అమరపురం' అన్నారు?
ఎ) మల్లెపురం బి) తుమ్మెదపురం
సి) మామిడిపురం డి) భ్రమరపురం
44. తెలంగాణ రాష్ట్రంలో లేని విష్ణుకుండినుల శాసనం?
ఎ) ఖానాపూర్ రాగి శాసనం
బి) తుమ్మెల గూడెం రాగి శాసనం
సి) సలేశ్వరం శిలా శాసనం
డి) కీసరగుట్ట శిలా శాసనం
45. కింది వాటిలో ఏది విష్ణుకుండినుల కాలానికి చెందని ఆలయం?
ఎ) నోడగేశ్వరాలయం బి) వంకేశ్వరాలయం
సి) రామలింగేశ్వరాలయం డి) పల్లవేశ్వరాలయం
46. విక్రమేంద్ర భట్టారక వర్మ ఇంద్రపాలనగర తామ్ర శాసనం ఏ సంవత్సరంలో వేయించబడింది?
ఎ) క్రీ.శ. 518 బి) క్రీ.శ. 566
సి) క్రీ.శ. 437 డి) క్రీ.శ. 389
47. మొదట హిందూ గుహాలయాలను ఆంధ్ర దేశంలో నిర్మించినవారు?
ఎ) ఇక్ష్వాకులు బి) విష్ణుకుండినులు
సి) వేములవాడ చాళుక్యులు డి) ముదిగొండ చాళుక్యులు
48. తుమ్మలగూడెం శాసనాన్ని వేయించినవారు?
ఎ) మొదటి విక్రమేంద్రవర్మ
బి) ఇంద్ర భట్టారక వర్మ
సి) మంచన భట్టారకుడు
డి) విక్రమేంద్ర భట్టారక వర్మ
49. కీసరలో ఉన్న కేసరి రామలింగేశ్వరాలయం ఎవరి కాలం నాటిది?
ఎ) ఇక్ష్వాకులు బి) పల్లవులు
సి) వేములవాడ చాళుక్యులు డి) విష్ణుకుండినులు
50. చిక్కుళ్ళ శాసనాన్ని వేయించినవారు?
ఎ) విక్రమేంద్ర భట్టారకవర్మ
బి) మొదటి విక్రమేంద్రవర్మ
సి) దేవవర్మ డి) రెండవ గోవిందవర్మ
సమాధానాలు
1.ఎ 2.సి 3.ఎ 4.సి 5.ఎ
6.బి 7.బి 8.బి 9.ఎ 10.డి
11.ఎ 12.బి 13.ఎ 14.సి 15.డి
16.బి 17.ఎ 18.సి 19.బి 20.ఎ
21.బి 22.ఎ 23.సి 24.సి 25.డి
26.బి 27.బి 28.డి 29.ఎ 30.ఎ
31.ఎ 32.ఎ 33.ఎ 34.డి 35.బి
36.ఎ 37.ఎ 38.ఎ 39.ఎ 40.ఎ
41.ఎ 42.ఎ 43.సి 44.ఎ 45.ఎ
46.బి 47.బి 48.డి 49.డి 50.ఎ
- పృథ్వికుమార్ చౌహాన్ డైరెక్టర్,
పృథ్వివస్ ఐఏఎస్ స్టడీసర్కిల్
దిల్సుఖ్నగర్,హైదరాబాద్
ఫోన్: 9177602890
Authorization