1. ఇసుక శిలలతో, రాళ్ళతో చిన్న సైజు పరికరాలను మానవుడు ఏ యుగంలో ఉపయోగించాడు?
ఎ) ప్రాచీన శిలాయుగం బి) మధ్య శిలాయుగం
సి) నవీన శిలాయుగం డి) ఏదీకాదు
2. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ జాతి ప్రజలు నివసించారు?
ఎ) మెడిటేరియన్ బి) మంగోలాయిడ్
సి) నీగ్రిటో డి) ఆస్ట్రలాయిడ్
3. సింధూ నాగరికత ప్రజల కాలం నాటి వస్త్రాల మూట ఎక్కడ దొరికెను?
ఎ) ఉమ్మా బి) టెల్
సి) అసూర్ డి) ఉర్
4. 'ఇంగ్లీష్ బాండ్' అని పేరు పొందిన తాపీ పని విధానాన్ని కనుగొన్న వారు ఎవరు?
ఎ) గ్రీక్లు బి) ఇంగ్లీష్ వారు
సి) పర్షియన్లు డి) హరప్పనులు
5. ఈ కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) ఆయుర్వేదం - వైద్యానికి సంబంధించింది
బి) ధనుర్వేదం - సాహిత్యానికి సంబంధించింది
సి) గాంధర్వవేదం - సంగీతానికి సంబంధించింది
డి) శిల్ప వేదం - కళలకు సంబంధించింది
6. దేవుళ్ళు, దేవతలు వారి వాహనాలకు సంబంధించి సరైనది ఏది?
ఎ) విష్ణువు - గరుడపక్షి బి) స్కంధుడు - నెమలి
సి) యముడు - మహిషం డి) పైవన్నీ సరైనవే
7. ఇతిహాస యుగంలో 1000 గ్రామాలకు గల అధికారిని ఏమనేవారు?
ఎ) సావంత బి) అధిపతి
సి) గ్రామ్యవాదిన్ డి) మద్యమసి
8. రుగ్వేదంలో రిషి స్థానం పొందిన స్త్రీ ఎవరు?
ఎ) అపాల బి) విశ్వనార
సి) ఘోష డి) పైవారందరూ
9. నాగార్జునుని ఉత్తమకృతి అయిన 'మూలమాధ్యమిక కారిక' వ్యాఖ్యానం ఉత్తమంగా చేసి ఈ వాదాన్ని విస్తరింపజేసిన వారు ఎవరు?
ఎ) ఆనందుడు బి) చంద్రకీర్తి
సి) సుదార్యుడు డి)అంగుళిమాలుడు
10. బౌద్ధమతం ఉత్తర భారతదేశంలో ఎప్పుడు అంత రించిపోయింది?
ఎ) క్రీ.శ. 14వ శతాబ్దం బి) క్రీ.శ. 10వ శతాబ్దం
సి) క్రీ.శ. 11వ శతాబ్దం డి) క్రీ.శ. 16వ శతాబ్దం
11. ఈ కింది వారిలో 'రెండవ పరశురాముడు'గా ఎవరిని కీర్తించేవారు?
ఎ) ధన నందుడు బి) మహపద్మ నందుడు
సి) కాలాశోకుడు డి) శిశునాగుడు
12. నందులను ఓడించడానికి చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడి సహాయాన్ని ఎలా తీసుకున్నాడో వివరించే గ్రంథం ఏది?
ఎ) పరిశిష్ట పర్వన్ బి) అర్థశాస్త్రం
సి) ముద్రారాక్షసం డి) దివ్యవదన్
13. ఎవరి ప్రకారం మౌర్యుల కాలంలో భారతదేశంలో నేరాలు చాలా తక్కువ అని అభిప్రాయపడడం జరిగింది?
ఎ) వి.ఎ.స్మిత్ బి) మెగస్తనీస్
సి) కౌటిల్యుడు డి) స్ట్రాచో
14. బిందుసారుడు రెండు సముద్రాల నడుమ ఉన్న భూభాగాన్ని జయించారని తెలిపిన చరిత్రకారుడు ఎవరు?
ఎ) కౌటిల్యుడు బి) మెగస్తనీస్
సి) తారానాద్ డి) పిలడెల్పస్
15. విదర్భను ఆక్రమించిన శుంగ పాలకుడు ఎవరు?
ఎ) పుష్య మిత్రుడు బి) డేరియన్
సి) అగ్నిమిత్రుడు డి) దేవభూతి
16. ఈ కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి?
ఎ) పుగ బి) సార్థ
సి) జేత డి) నిగమ
17. 'రత్నావళి - రాజ పరికథ' గ్రంథ కర్త ఎవరు?
ఎ) హలుడు బి) ఆచార్య నాగార్జునుడు
సి) విశాఖ దత్తుడు డి) పులోమావి
18. వైష్ణవ చిహ్నాలు ఏ శాతవాహన రాజు వేయించిన శాసనాలపై గలవు?
ఎ) గౌతమిపుత్ర శాతకర్ణి బి) మూడవ పులోమావి
సి) యజ్ఞశ్రీ శాతకర్ణి డి) మొదటి శాతకర్ణి
19. మధ్యప్రదేశ్లోని ఛత్తీస్గఢ్ జిల్లాలో దొరికిన నాణేములపై ఏ శాతవాహన రాజు పేరు కలదు?
ఎ) కుంతల శాతకర్ణి బి) శివశ్రీ అపేలక
సి) భాగభద్రుడు డి) విజయశ్రీ శాతకర్ణి
20. సాంప్రదాయ చరిత్రకారులు 'డార్క్ ఏజ్' అని ఆధునిక చరిత్రకారులు 'మెర్సాన్టైల్ ఏజ్' అని ఏ సంవత్సరముల మధ్య భారతీయ చరిత్రను అన్నారు?
ఎ) క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ.300 వరకు
బి) క్రీ.పూ. 600 నుంచి క్రీ.శ.300 వరకు
సి) క్రీ.పూ. 300 నుంచి క్రీ.శ.800 వరకు
డి) క్రీ.పూ. 1200 నుంచి క్రీ.శ.200 వరకు
21. గ్రీకుల 'స్ట్రాటిగోరు, మెరిడార్చ్'లు ఏ విభాగంతో సంబంధం కలిగి ఉన్నాయి?
ఎ) మతం బి) పరిపాలన
సి) సంస్కృతి డి) నాణేలు
22. బాక్ట్రియా ప్రస్తుత పేరు ఏమిటి?
ఎ) ప్రష్యా బి) మాసిడోనియా
సి) బాల్క్ డి) గ్రీక్
23. శకుల కాలంలో చిన్న పట్టణాన్ని ఏమని పిలిచేవారు?
ఎ) నిగం బి) గావ్
సి) గ్రామ్ డి) తాలుక
24. శకుల చరిత్రను పునర్నిర్మించుటకు ఎంతో తోడ్పడిన నాసిక్ శాసనాన్ని వేయించిన ఉషవ దత్తుడు ఏ శక రాజుకు అల్లుడు అవుతాడు?
ఎ) అజెస్ బి) భూమకుడు
సి) నహపాణుడు డి) రుద్రదమనుడు
25. పార్థియనులు కాబూల్ను ఆక్రమించారని తెలిపిన చైనా రచయిత ఎవరు?
ఎ) ఇత్సింగ్ బి) ఫాన్ఈ
సి) హ్యుయాన్త్సాంగ్ డి) ఫాహియాన్
26. కనిష్కుడు, పురుషపురం నందు 13 అంతస్తులు గల 400 అడుగుల ఎత్తు గల కొయ్యతో ఒక గోపురం నిర్మించి అందు నిలువెత్తు బుద్ధ విగ్రహం ప్రతిష్టించినట్టు తెలిపినది ఎవరు?
ఎ) ఆల్-బెరూనీ బి) చాంగ్కీ
సి) హ్యుయాన్త్సాంగ్ డి) కల్హణుడు
27. మౌర్యానంతర యుగంలో అంత ప్రాముఖ్యత లేని పరిశ్రమ ఏది?
ఎ) తోలు వస్తువులు బి) వస్త్రాలు
సి) కమ్మరి డి) కుమ్మరి
28. అనేక యుద్ధాలు చేసి పేరుపొందిన పాండ్య రాజు ఎవరు?
ఎ) సెంగుట్టవాన్ బి) నెడుంజేలియన్
సి) కరికాల చోళుడు డి) ముడికుడిమి పెరువల
29. భారత్, రోమ్ల మధ్య జరిగిన సముద్ర వ్యాపారం ఏ రోమన్ చక్రవర్తి కాలంలో అనూహ్యంగా అభివృద్ధి చెందింది?
ఎ) నీరో బి) క్లాడియన్
సి) ట్రాజన్ డి) ఆగస్టన్
30. ఏ మార్గం ద్వారా భారతదేశం ఈజిప్టుతో వ్యాపార సంబంధాలు జరిపింది?
ఎ) ఎర్ర సముద్ర మార్గం
బి) మధ్యధరా సముద్రం
సి) పర్షియన్ అఖాత మార్గం
డి) హిందూ సముద్ర మార్గం
31. గుప్తుల కాలంలో 'తాడయుక్తక' అధికారి ఏ పని చేసేవాడు?
ఎ) కరెన్సీ అధికారి
బి) పత్రాలు రూపొందించు అధికారి
సి) న్యాయ శాఖా మంత్రి డి) కోశాధికారి
32. భగవంతుని అవతారవాద సిద్ధాంతం ఏ కాలంలో ప్రారంభమైంది?
ఎ) మౌర్యులు బి) శకులు
సి) గుప్తులు డి) పల్లవులు
33. మనదేశంలో మొట్టమొదటిగా ఆధారరహితంగా నిర్మించిన గుప్తుల కాలానికి సంబంధించిన దేవాలయం ఎచట కలదు?
ఎ) బైరాత్ బి) సింహపురి
సి) గుడిమల్లం డి) సారానాథ్
34. మహా భారతంలో ఏ భాగం శూద్రులను రాజ్య వినాశకులుగా పేర్కొంది?
ఎ) యుద్ధ పర్వం బి) అరణ్య పర్వం
సి) అనుశాసన పర్వం డి) విరాట పర్వం
35. క్రీ.శ. 502లో లభ్యమైన మైత్రికులకు చెందిన తొలి భూదాన శాసనం ఎవరిది?
ఎ) నాలుగవ దృవసేనుడు బి) ద్రోణసింహుడు
సి) భట్టారకుడు డి)ఏడవ శిలాదిత్యుడు
36. నలంద విశ్వవిద్యాలయం గురించి హ్యుయాన్ త్సాంగ్ ఏమి చెప్పారు?
ఎ) 1500 మంది అధ్యాపకులు ఉండేవారు
బి) 10వేల మంది విద్యార్థులు ఉండేవారు
సి) దూరదేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చేవారు
డి) పైవన్నీ సరైనవే
37. భారత దిగ్విజయ యాత్ర జరిపి భారతదేశాన్ని ఏకీకృతం చేయమని హర్షవర్థనుడికి సలహా ఇచ్చిన అతని సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు?
ఎ) సింహనాద బి) భాణుడు
సి) సంవాదిక డి) రవికీర్తి
38. అజంతా చిత్రాలలో ఏ చాళుక్య రాజు ఆస్థానాన్ని పర్షియరాజు రెండవ ఖుస్రూ క్రీ.శ. 625లో పంపిన రాయబార బృందం దర్శించుతున్న దృశ్యం చిత్రించబడింది?
ఎ) మొదటి పులకేశి బి) మొదటి విజయాదిత్యుడు
సి) రెండవ పులకేశి డి) రెండవ కీర్తివర్మ
39. సాహిత్యం, కళ, సైనిక రంగాలలో విజయాల వల్ల గొప్పవాడుగా పేరొందిన పల్లవ రాజు ఎవరు?
ఎ) సింహ విష్ణు
బి) మొదటి మహేంద్ర వర్మ
సి) మొదటి నరసింహ వర్మ డి) నంది వర్మ
40. కృష్యర దేవాలయాన్ని రామేశ్వరంలో నిర్మించిన రాజు ఎవరు?
ఎ) మూడవ కృష్ణుడు బి) రెండవ ఇంద్రుడు
సి) నాలుగో గోవిందుడు డి) రెండవ కృష్ణుడు
41. రాజేంద్ర చోళుడి చేతిలో ఓడినందుకు తుంగభద్ర లో మునిగి మరణించే 'పరమయోగాన్ని' ఆచరిం చిన చాళుక్య ప్రభువు ఎవరు?
ఎ) రెండవ సోమేశ్వరుడు
బి) ఒకటవ సోమేశ్వరుడు
సి) మూడో సోమేశ్వరుడు
డి) నాలుగో గోవిందుడు
42. చోళుల అధికారులకు సంబంధించి సరైనది ఏది?
ఎ) అరసార్- పాలకులు
బి) కడైసియార్ - నిమ్న వర్గాల స్త్రీలు
సి) పులైయ్యన్లు - తాళ్ళు అల్లేవారు
డి) పైవన్నీ సరైనవే
43. లింగరాజు దేవాలయం నిర్మాణం ఏ నిర్మాణ శైలిని అనుసరించి చేశారు?
ఎ) నాగర బి) ద్రావిడ
సి) వేసార డి) అమరావతి
44. 'ప్రాచ్య ప్రదీప్' బిరుదాంకితుడైన అస్సాం పాలకుడు ఎవరు?
ఎ) విద్యానాధుడు బి) బ్రహ్మపాలుడు
సి) ఇంద్రపాలుడు డి) వల్లభ దేవుడు
45. సింధూను అరబ్బులు ఆక్రమించుకున్నపుడు సింధూ రాజధాని బ్రహ్మణాబాద్లో అరబ్బులను ఎదుర్కొంది ఎవరు?
ఎ) ఆనందపాలుడు బి) జిజియబాయి
సి) దాహిర్ డి) జైసింగ్
46. సరిహద్దు ప్రాంత రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన సుల్తాన్ ఎవరు?
ఎ) మహ్మద్ఘోరీ బి) బాల్బన్
సి) ఇల్టుట్మిష్ డి) అల్లావుద్దీన్ ఖిల్జీ
47. జిజ్మహ్మద్షాహీ అనే పేరుతో గొప్ప ఖగోళశాస్త్ర పట్టికలు తయారు చేయించింది ఎవరు?
ఎ) జైసింగ్ బి) సాదత్ఖాన్
సి) బుర్హన్వుల్ ముల్క్ డి) పూరన్ చంద్
48. కార్తేజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఐరోపా రాజ్యం ఏది?
ఎ) డచ్ బి) పోర్చుగల్
సి) ఇంగ్లీష్ డి) స్పెయిన్
49. ప్రారంభంలో పూర్తిగా వ్యాపారంపై మాత్రమే తమ దృష్టిని కేంద్రీకరించిన ఫ్రెంచ్వారు ఏ గవర్నర్ కాలంలో భారతదేశంలో ఫ్రెంచ్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్నారు?
ఎ) డూప్లే బి) లిన్నెయర్
సి) అల్బుకర్క్ డి) ఫ్రాన్సిస్ మార్టిన్
50. ఆర్య సమాజ్ స్థాపకుడు దయానంద సరస్వతి ఎక్కడ మరణించెను?
ఎ) జలంధర్ బి) అజ్మీర్
సి) రాధానగర్ డి) ముంబాయి
సమాధానాలు
1.బి 2.సి 3.ఎ 4.డి 5.బి
6.డి 7.బి 8.డి 9.బి 10.ఎ
11.బి 12.సి 13.బి 14.సి 15.ఎ
16.సి 17.బి 18.ఎ 19.బి 20.ఎ
21.సి 22.సి 23.ఎ 24.సి 25.బి
26.ఎ 27.ఎ 28.డి 29.బి 30.ఎ
31.డి 32.సి 33.ఎ 34.సి 35.బి
36.డి 37.ఎ 38.సి 39.సి 40.ఎ
41.బి 42.డి 43.సి 44.సి 45.డి
46.బి 47.ఎ 48.బి 49.ఎ 50.బి
షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580