పదోతరగతి తెలుగు మోడల్ పేపర్-2
Time - 2.45hrs MARKS-20
1. అవగాహన - ప్రతిస్పందన
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి? 5x1=5
తెలుగు సాహిత్యంలోఏని పంచకావ్యాల్లో మనుచరిత్రను మొట్టమొదట లెక్కబెడతారు. ఆంధ్రప్రబంధ కవులలో ప్రధమపూజ అల్లసాని పెద్దనగారికే చేస్తారు. ఆదికవులు, కవిబ్రహ్మలు, ప్రబంధ పరమేశ్వరులు, కవి సార్వభౌములు మొదలైన ఆజానుభాహులు ఎంతరున్నా, మన సాహితీ రంగంలో ఒక జానెడు ఎత్తుగా కనిపించే జాణ ఆంధ్రకవితా పితామహ బిరుదాంకితులు అల్లసాని పెద్దనగారే. దీనికి కారణం కృష్ణదేవరాయలవారు అందరికన్నా పెద్దనగారికి పెద్దపీట వేయడమే కాదు, ఆయన సహజంగా ఉన్నతుడు. దానికి కారణం ఆయనలో పూర్వకవు లలోని శుభలక్షణాలన్ని కేంద్రీకృతం అయ్యాయి.
ప్రశ్నలు
1. తెలుగు పంచకావ్యాలలో మొదట లెక్కపెట్టిన కావ్యం ఏది?
2. ఆంధ్రప్రభంధ కవులలో ఎవరిని శ్రేష్ఠునిగా గౌరవిస్తారు?
3. ఆంధ్ర కవితా పితామహుడు బిరుదు పొందిన కవి ఎవరు?
4. పెద్దన కవి సహజంగా ఉన్నతుడు కావడానికి కారణం ఏంటి?
5. పెద్దన గారిని ఆదరించిన కవిరాజు ఎవరు?
2) కింది గద్యమును చదివి, ఐదు ప్రశ్నలను తయారు చేయండి. 5x1=5
నిరుద్యోగ సమస్య నిజమునకు నిరక్షరాస్యుల వల్ల ఏర్పడినది కాదు. విద్యావంతుల విషయముననే ఇది తీరని సమస్యగా పరిణమించింది. ఈ విద్యావంతులు కుర్చీలలో కూర్చుండి గుమస్తా పని చేయుటకే కుతూహల పడుచున్నారు. చదివిన చదువు కూడా అందుకే ఉపకరించుచున్నది. కావున మన విద్యా విధానము కొంత మారవలయును. విద్యావంతుల వృత్తి విద్యలను అభ్యసించుట మేలు. ప్రభుత్వము వారి ప్రోత్సాహముతో వారు కుటీర పరిశ్రమలను నెలకొల్పుటయే ఈ సమస్యకు తగిన పరిష్కారం. వృత్తి విద్యలను అభ్యసిం చిన వారికి ప్రభుత్వము వారి తోడ్పాటు తప్పక లభించి తీరును.
3) కింది పద్యానికి ప్రతిపదార్థాన్ని రాసి, భావం రాయండి? - 5 మార్కులుల
భండనభీముఁ డార్తజన బాంధవుఁ డుజ్వల బాణతూణ కో
దండ కళాప్రచండ భూజతాండవ కీర్తికి రామమూర్తికిన్
రెండవసాటి దైవమిక లేఁడనుచున్ గడగట్టి భేరికా
దండము నెక్కి చాటెదను దాశరధీ! కరుణా పయోనిధీ!!
4) కింది పద్యాన్ని చదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి
-5మార్కులు
కుసుమ గుచ్ఛంబునకుఁబోలె బొసగు శౌర్య
మానవంతున కివి రెండు మహితగతులు
సకలజన మస్తక ప్రదేశములైన
వనమునందైన జీర్ణభావంబుఁ గనుట
ప్రశ్నలు
1. శౌర్యమానవంతుడు ఎవరితో పోల్చబడ్డాడు?
2. కుసుమ గుచ్ఛం ఎక్కడ అలంకరింపబడుతుంది?
3. ఈ పద్యానికి శీర్షికను సూచించండి?
4. ఈ పద్యంలోని అలంకారం రాయండి?
5. శౌర్యమానవంతునికి మహిత గతులు ఎన్ని?
I సృజనాత్మకత - వ్యక్తీకరణ -2x3=6మా
అ) కింది వానిలో రెండు ప్రశ్నలకు జవాబులు రాయండి?
1. కోపం తగ్గించుకోవడం మంచిది! అనే అంశాన్ని బోధిస్తూ మిత్రునికి లేఖ రాయండి?
2. ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న ఏదైనా ఒక ప్రధాన సామాజికాంశం/సంఘటనల ఆధారంగా సంపాద కీయ వ్యాసం రాయండి?
3. 'పర్యావరణ పరిరక్షణ' గురించి ఒక వచన కవిత రాయండి? (20 వాక్యాలు)
III కింది పద్యము, దాని యొక్క భావము రాయండి? - 4మార్కులు
4. ఆ కంఠబుగ ------ తాపసుల్
I . భాషాంశాలు - వ్యాకరణాంశాలు (10 మార్కులు)
1) అత్యద్భుతం విడదీస్తే ( )
ఎ) అతి అద్భుతం బి) అత్య అద్భుతం
సి) అత్య బ్ధుతం డి) అత అద్భుతం
2) రమ్యోధ్యానము - సంధి పేరును గుర్తించండి ( )
ఎ) త్రిక సంధి బి) గసడదవాదేశ సంధి
సి) గుణ సంధి డి) ఇకార సంధి
3) రుగామ సంధికి ఉదాహరణ ( )
ఎ) తిలోదకం బి) సాహసవంతురాలు
సి) వసుదైక డి) ప్రాతౌచిత్యం
4) వృద్ధులు అంటే ( )
ఎ) ఐ, ఔ బి) ఆ, ఈ, ఏ
సి) య, వ, ర డి) ఏ, ఓ, ఆర్
5) నానార్థములు కలిగి ఉండేది - ఏ అలంకారం ( )
ఎ) ఉపమ బి) రూపక
సి) యమక డి) శ్లేష
6) గరళకంఠుడు - విగ్రహ వాక్యం గుర్తించండి ( )
ఎ) గరళము నందు కంఠము కలిగినవాడు
బి) కంఠము నందు గరళము కలిగినవాడు
సి) కంఠము నందు నలుపు కలిగినవాడు
డి) కడుపులో గరళము కలిగినవాడు
7) సప్తమి తత్పురుష సమాసానికి ఉదాహరణ ( )
ఎ) రాణి నగలు బి) గుణహీనుడు
సి) బ్రహ్మణశక్తి డి) దొంగభయము
8) అన్యపదార్థ ప్రాధాన్యం కలది ( )
ఎ) పంచమి బి) బహువ్రీహి
సి) ద్వంద్వ డి) తృతీయ
9) శార్ధూలం వృత్త పద్యానికి యతిని గుర్తించండి ( )
ఎ) 11 బి) 10 సి) 13 డి) 14
10) కోపమొకింతలేదు, బుధకోటికిఁగొంగుఁబసిండి సత్యమా --- ఏ వృత్తపద్యం గుర్తించండి ( )
ఎ) శార్దూలం బి) ఉత్పలమాల
సి) చంపకమాల డి) మత్తేభం
11) కింది వాటిలో 'మ' గణం ఏది? ( )
ఎ) UII బి) III సి) UUU డి) UIU
12) సీసపద్యానికి వచ్చే గుణాలు ( )
ఎ) 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు
బి) 2 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం
సి) 1 సూర్యగణం, 1 ఇంద్రగణం, 1 సూర్యగణం
డి) 6 ఇంద్ర గణాలు, 2 సూర్యగణాలు
13) పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్ధబేధం కలిగి ఉంటే ( )
ఎ) స్వభావోక్తి బి) అంత్యానుప్రాస
సి) ఛేకానుప్రాస డి) యమకం
14) నీవేల వచ్చెదవు - ఏ అలంకారం ( )
ఎ) రూపక బి) యమకం
సి) అంత్యానుప్రాస డి) శ్లేష
15) అంత్యానుప్రాస లక్షణం - గుర్తించండి ( )
ఎ) చివరి ప్రాస పదాలు రావడం
బి) ఒకే హల్లు అనేకసార్లు రావడం
సి) అనేక హల్లులు అనేక సార్లు రావడం
డి) మధ్యలో ప్రాస పదాలు రావడం
16) నెల్లూరి కేశవస్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించారు (కర్మణీ వాక్యంగా మార్చితే) ( )
ఎ) భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకరు కేశవస్వామి
బి) నెల్లూరి కేశవస్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకడిగా కీర్తించబడ్డారు
సి) భారతదేశంలో గొప్పవారు ఒకరు అని నెల్లూరి కేశవస్వామి కీర్తించబడ్డారు
డి) భారతదేశంలో గొప్ప కథకులని కేశవస్వామి కీర్తి పొందబడ్డారు
17) కింది వానిలో అతిశయోక్తి అలంకారం గుర్తించండి. ( )
ఎ) రవి తాటిచెట్టంత పొడవున్నాడు
బి) మా ఇల్లు చిన్నగా ఉంది
సి) శత్రువులు భయపడి,పారిపోయారు
డి) సింహం పెద్దగా అరిచింది
18) మత్తేభం వృత్త పద్యానికి వచ్చే గణాలు ఏవి? ( )
ఎ) భ,ర,న,భ,భ,ర,వ బి) స,భ,ర,న,మ,య,వ
సి) న,జ,భ,జ,జ,జ,ర డి) మ,స,జ,స,త,త,గ
19) యణ్ణులు ఏవి ( )
ఎ) ఆ,ఈ,ఏ బి) య,వ,ర
సి) ఐ,ఔ డి) క,చ,ట,త,ప
20) పట్టణము అలంకారముగా నుండటకు అందరును ఉత్సాహముతో పాటుపడిరి (వ్యవహార భాషలోనికి మార్చి రాయండి ( )
ఎ) పట్టణం అలంకారంగా ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడ్డారు
బి) పట్నం అలంకారం ఉండడానికి అందరూ ఉత్సాహంతో పాటుపడుదురు
సి) పట్టణం అలంకారముగా ఉండడానికి అందరూ ఉత్సాహము చూపిస్తారు
డి) పట్టణం అలంకారము చేయడానికిక అందరూ ఉత్సాహముతో ఉన్నారు.
- జయశ్రీ
తెలుగు ఉపాధ్యాయురాలు
మదర్స్ఇంటిగ్రల్ స్కూల్
ఓయూ రోడ్డు, హైదరాబాద్