పదోతరగతి తెలుగు మోడల్ పేపర్-1
మొత్తం మార్కులు - 40
I స్వీయ రచన (30 మార్కులు)
ఆ) కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో సరైన జవాబులు రాయండి. 4×3=12
1) మిత్రుడు పుస్తకం వలె మంచి దారి చూపుతాడని ఎట్లా చెప్పగలరు?
2) పత్రికల్లో సంపాదకీయాలకు, సాధారణ వార్తాంశాలకు మధ్యనున్న భేదాలేవి?
3) శ్రీనాధుని గురించి రాయండి?
4) తెలంగాణ పలుకుబడులంటే ఏమిటి? కొన్ని ఉదాహరణలు రాయండి?
ఇ) కింది వానిలో ప్రతి భాగం నుంచి ఒక ప్రశ్నను తప్పనిసరిగా పది వాక్యాలలో సమాధానాలు రాయండి 3×6=18
5) కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి వివరించండి?
(లేదా)
జీవన భాష్యం - పాఠంలోగజల్ ప్రక్రియ గూర్చి తెలుసుకు న్నారు కదా! మీకు తెలిసిన మూడు సాహిత్య ప్రక్రియల పేర్లు తెలిపి వాటి గురించి రాయండి?
6) సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబి స్తాయి -దీనిని సమర్థిస్తూ రాయండి?
(లేదా)
కేశవస్వామి కథల ద్వారా గూడూరి సీతారాం రాసిన వ్యాసం ఆధారంగా కేశవస్వామి రచనల గురించి రాయండి
7) వాలి, సుగ్రీవుల వృత్తాంతాన్ని వివరించండి?
(లేదా)
హనుమంతుని సీతాన్వేషణ వృత్తాంతాన్ని గూర్చి తెలపండి?
పార్టు - బి 10 మార్కులు
వ్యాకరణాంశాలు
అ) సొంత వాక్యాలను రాయండి? 2x1=2
1) దైన్యస్థితి
2) తలదాచుకోవడం
ఆ) కింద గీతగీసిన పదాలకు అర్థాలను రాయండి. 4x1/2=2
3) దొంగలు ద్వా:కవాటంబు పగుల గొట్టారు... ( )
ఎ) వాకిటి తలుపు బి) భయపడడం
సి) గోడ డి) తాళం
4) రాము హస్తవాసి మంచిది. ( )
ఎ) ఇల్లు బి) సంభాషణ
సి) ఉపన్యాసం డి) చేతిచలవ
5) కల్లోలం అన్న పదానికి అర్థం. ( )
ఎ) అలజడి బి) సంభాషణ
సి) ఉపన్యాసం డి) కీర్తన
6) రాజు ధ్యాస ఆటపై ఉంది. ( )
ఎ) పట్టుదల బి) క్రీడించు
సి) శ్రద్ధ డి) ఆనందం
ఇ) కింది పర్యాయపదాలను గుర్తించండి. 4x1/2=2
7) మబ్బు అనే పదానికి అర్థాన్నిచ్చే పదాలు. ( )
ఎ) ఆకాశం, నింగి బి) ఆగ్రహం, కినుకు
సి) మేఘం, మాయ డి) జీమూతం, మేఘం
8) పారాశర్యుడు అనే పదానికి పర్యాయపదాలు. ( )
ఎ) వ్యాసుడు, స్వర్ణం
బి) బాదరాయణుడు, వ్యాసుడు
సి) ముని, రుషి డి) రుషి, దేవుడు
9) విషాదం అన్న పదం వీటితో సమానమైనది. ( )
ఎ) తరువు, మాను బి) బాద, ఖేదం
సి) లత, తీగ డి) చెట్టు, గట్టు
10) కృపాణం పర్యాయ పదాలు. ( )
ఎ) గొడ్డలి, కర్ర బి) కత్తి, ఆసి
సి) ఏనుడు, గజము డి) చోటు, ప్రదేశం
ఈ) ఈ కింద గీత గీసిన పదాలకు నానార్థాలను గుర్తించండి 3x1/2=1 1/2
11) రాజు అన్న పదానికి నానార్థాలు
ఎ) పుట్టుక, సృష్టి బి) ప్రభువు, చంద్రుడు
సి) ఒజ్జ, పుస్తకం డి) రేడు, భూపాలుడు
12) ఈ వర్షం ఎంతో మంచిది
ఎ) పంట, వాన బి) వాన, సంవత్సరం
సి) కవిత, ఒజ్జ డి) వరుణుడు, వాన
13) చిత్రం అన్న పదానికి నానార్థాలు
ఎ) గాలి,వెలుగు బి) ఆశ్చర్యం, బొమ్మ
సి) చోటు, భూమి డి) అచ్చెరువు, అద్భుతం
ఉ) గీత గీసిన పదాలకు వికృతులు గుర్తించండి 3×1/2=1 1/2
14) సముద్రం చాలా దూరంలో ఉన్నది
ఎ) జాతర బి) సంద్రం
సి) సాగరం డి) నది
15) ఈ పంక్తి ఎంతో బాగుంది
ఎ) కథ బి) బంతి సి) ఊరు డి) నగరం
16) భిక్షము ఇచ్చుట పవిత్ర కార్యము
ఎ) దేవుడు బి) బిచ్చము
సి) భిక్ష డి) దానం
ఊ) కింది వ్యుత్పత్త్యర్థాలు గుర్తించండి. 2×1/2=1
17) పద్మాక్షి
ఎ) పద్మాల పాదాలు కలిగినది
బి) అందమైన కన్నులు కలది
సి) పద్మం వంటి కన్నులు కలది
డి) తామరలు కలిగినది
18) భాష
ఎ) మాట్లాడే విధానం
బి) మాట యొక్క గొప్పదనం
సి) భాషించునది డి) భాష గొప్పదనం
పదోతరగతి తెలుగు మోడల్ పేపర్-2
1. అవగాహన- ప్రతిస్పందన (20 మార్కులు)
కింది పేరా చదివి, ప్రశ్నలకు జవాబులు రాయండి 5x1=5
వాలి వధకు ఒక ఏ మాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముణ్ణి తొందరపెట్టాడు. అందరూ కిష్కిందకు వెళ్ళారు. సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ, వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మహా బలశాలి అయిన వాలి క్షణాలలో అక్కడ వాలాడు. ఇద్దరి యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. వాలిసుగ్రీవులు ఒకే పోలికతోఉన్నారు. అందుకే రాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు. వాలి విజృంభణకు తట్టుకోలేక పోయాడు సుగ్రీవుడు. శ్రీరాముడి కొరకు చూశాడు. కనిపించలేదు. గుండె గుభేలుమంది. ప్రాణభయంతో ఋష్యమూకానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు. అక్కడకు వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో 'బతికావు పో' అని మరలిపోయాడు.
ప్రశ్నలు
1. వాలి సుగ్రీవులు ఎవరు?
2) ఇద్దరిలో బలవంతులు ఎవరు?
3) శ్రీరాముని శరణు వేడినదెవరు?
4) యుద్ధములో ఎవరు ఓడిపోయారు?
5) సుగ్రీవుడు భయపడి ఎక్కడకు వెళ్ళాడు?
2) కింది గద్యమును చదివి, ఐదు ప్రశ్నలను తయారు చేయండి? 5x1=5
పూర్వం నుంచి మనకు తులసి, రావి, వేప చెట్లను పూజించే సంప్రదాయం ఉంది. అనాది నుంచి మనం తులసిని దేవతగా పూజిస్తూ వస్తున్నాము. తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతు న్నారు. పూర్వకాలంలో తట్టు, ఆటలమ్మ వంటి వ్యాధులు వస్తే రోగి దగ్గర వేపాకులు ఉంచేవారు. స్నానం చేయించేపుడు వేపాకులు ముద్దగా నూరి నూనె, పసుపు కలిపి ఒంటికి రాసేవారు. ఎందుకనగా తట్టు,ఆటలమ్మ వస్తే దేహంపై పొక్కులు వస్తాయి. కొద్గిగా పచ్చిగా వుండి దురద పెడుతుంది. అలా దురద రాకుండా ఉండడానికి ఈ వేపాకు పసుపు దోహద పడ తాయి. ఈ రకంగా వైద్య శాస్త్రానికి సంబంధించిన వేప, సంస్కృతీపరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.
3) కింది పద్యానికి ప్రతిపదార్థాన్ని రాసి, భావం రాయండి? - 5 మార్కులు
తెలగాణా| భవదీయ పుత్రకులలో తీండ్రిచ్చు వైప్లవ్యసం
చలనమ్మూరక పోవలేదు| వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభావిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్ తెల్గుజోదుల్ బళా|
4) ప్రతి గేయాన్నిచదివి, దాని కింద ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి
- 5 మార్కులు
నా జ్ఞాపకాల్లో గూడు కట్టుకొన్న మమతలములల్లె
మలిన మెరుగని మట్టి మనుషుల ఎదమల్లె నా పల్లె
చుట్టూ భాందవ్యాల పాతాళ గరిగె నా పల్లె
అనుబంధాల పెరుగు గురిగి నా పల్లె
తానువంతా తంగెడు పూలు పేర్చుకున్న బతుకమ్మ
కాపురాజయ్య గీతల్లో బోనాలెత్తిన పల్లెపడతి బొమ్మ
అసోరు దూలాల పీరీల పండుగ
అలారు బలారుల దసరా పండుగ
ఆటల అల్లిబిల్లి జూలా నా పల్లె
నా పల్లెలో మా ఇళ్ళు
ఊరంతటికి ఆనందాల్ని పంచే లోగిళ్ళు
ప్రశ్నలు
1. కవితలోని ప్రాసపదాలను గుర్తించి రాయండి
2) కవితలోని కవి ఏయే పండుగలను ప్రస్తావించాడు?
3) మనుషుల మధ్య బాంధవ్యాలను కవి వేటితో ప్రస్తావించాడు?
4) ఈ కవితకు శీర్షికను సూచించండి?
5) ఆ శీర్షికను ఎందుకు పెట్టారో వివరించండి?
II. సృజనాత్మక - వ్యక్తీకరణ 2x3=6
అ) కింది వానిలో రెండు ప్రశ్నలకు జవాబులు రాయండి?
1. స్త్రీ విద్య ప్రాముఖ్యత తెలిపేటట్టు ఒక కరపత్రం రాయండి
2. 'తెలంగాణ తల్లి' తన గొప్పదనాన్ని వివరిస్తున్నట్టుగా ఏకపాత్రాభినయం లేదా ఆత్మకథ రాయండి
3. భాగ్యరెడ్డి వర్మ మాదిరిగా సమాజం కోసం పాటు పడిన వాళ్ళలో ఎవరి గురించైనా 'అభినందన' వ్యాసం రాయండి.
III. కింది పద్యమును పూరించి, దాని భావం రాయండి. - 4మార్కులు
నిరయంబైన-----ధీవర్య వేయేటికిన్
పార్టు - బి 10 మార్కులు
I. భాష్యాంశాలు - వ్యాకరణాంశాలు (10 మార్కులు)
1) బుద్ధిమంతురాలు విడదీస్తే ( )
ఎ) బుద్ధిమంత+ఆలు బి) బుద్ధిమంతు+రాలు
సి) బుద్ధి+మంతురాలు డి) బుద్ధిమంతురా+లు
2) ప్రాణాలు గోల్పోవు సంధి పేరును గుర్తించండి?( )
ఎ) త్రిక సంధి బి) గసడదవాదేశ సంధి
సి) గుణ సంధి డి) ఇకార సంధి
3) వృద్ధి సంధికి ఉదాహరణ. ( )
ఎ) తిలోదకం బి) కళోపాసన
సి) వసుదైక డి) ప్రాతౌచిత్యం
4) త్రికములు అంటే? ( )
ఎ) ఇ, టి, తి బి) ఆ, ఈ, ఏ
సి) య, వ, ర డి) ఏ, ఓ, ఆర్
5) న్యాయాన్యాయములు - సమాసం పేరు. ( )
ఎ) ద్వంద్వ బి) రూపక సి) ద్విగు డి) షష్టి
6) జ్ఞానజ్యోతి - విగ్రహ వాక్యం గుర్తించండి. ( )
ఎ) జ్ఞానము యొక్క జ్యోతి బి) జ్ఞానము కొరకు జ్యోతి
సి) జ్ఞానము చేత జ్యోతి డి) జ్ఞానము అనెడి జ్యోతి
7) షష్ఠి తత్పురుష సమాసానికి ఉదాహరణ. ( )
ఎ) రాణినగలు బి) గుణహీనుడు
సి) మూడు రోజులు డి) దొంగభయము
8) సంఖ్యావాచకము మొదటి పదంగా గల సమాసం ఏది?
ఎ) పంచమి బి) ద్విగు
సి) ద్వంద్వ డి) తృతీయ
9) చంపకమాల వృత్త పద్యానికి యతిని గుర్తించండి?()
ఎ) 11 బి) 10 సి) 13 డి) 14
10) కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతి బొందరే?--- ఏ వృత్త పద్యం గుర్తించండి? ( )
ఎ) శార్దూలం బి) ఉత్పలమాల
సి) చంపకమాల డి) మత్తేభం
11) కింది వాటిలో సూర్యగణాలు ఏవి? ( )
ఎ)UII, III బి) UI, IIIసి) III, UIU డి) UI, UI
12) తేటగీతికి వచ్చే గణాలు? ( )
ఎ) 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు
బి) 2 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం
సి) 1 సూర్యగణం, 1 ఇంద్రగణం, 1 సూర్యగణం
డి) 2 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు
13) హల్లుల జంట అర్ధ భేదంతో వెంటవెంటనే వస్తే()
ఎ) వృత్తానుప్రాస బి) అంత్యానుప్రాస
సి) ఛేకానుప్రాస డి) యమకం
14) నగార మోగిందా - నయాగారా దుమికిందా - ఏ అలంకారం ( )
ఎ) రూపక బి) యమకం
సి) అంత్యానుప్రాస డి) శ్లేష
15) వృత్తానుప్రాస లక్షణం గుర్తించండి? ( )
ఎ) ఒకే హల్లు ఒకేసారి రావడం
బి) ఒకే హల్లు అనేక సార్లు రావడం
సి) అనేక హల్లులు అనేకసార్లు రావడం
డి) ఒకే హల్లు ఒకే పదంలో రావడం
16) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి ఎందరో పోతుంటారు. (సంయుక్త వాక్యంగా మార్చితే.. ( )
ఎ) నమాజు చదవడానికి ఎందరో వస్తూ, చదవి ఎందరో పోతుంటారు.
బి) నమాజు చదవడానికి ఎందరో పోతుంటారు
సి) నమాజు చదవడానికి ఎందరో వస్తూ, పోతుంటారు
డి) నమాజు చదవడానికి ఎందరో వస్తుంటారు. నమాజు చదివి పోతుంటారు
17) సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి? ( )
ఎ) శత్రువులు భయంతో పారిపోయారు
బి) శత్రువులు పారిపోయారు భయంతో
సి) శత్రువులు భయపడి, పారిపోయారు
డి) భయపడి శత్రువులు, పారిపోయారు
18) ఉత్పలమాల వృత్త పద్యానికి వచ్చే గుణాలు ఏవి? ( )
ఎ) భ,ర,న,భ,భ,ర,వ బి) స,భ,ర,న,మ,య,వ
సి) న,జ,భ,జ,జ,జ,ర డి) మ,స,జ,స,త,త,గ
19) వేణు తాను రానని రమతో అన్నాడు ( )
ఎ) పరోక్ష వాక్యం బి) ప్రత్యక్ష వాక్యం
సి) సంశ్లిష్ట వాక్యం డి) సంయుక్త వాక్యం
20) ప్రత్యక్ష కథనం (వాక్యం) గుర్తించండి ( )
ఎ) నేను రాన్రా తమ్మడు అన్నాడు
బి) ''నేను రాన్రా తమ్మడు'' అన్నాడు
సి) నేను రానని అన్నాడు
డి) తను రానని అన్నాడు
- మంజుల
తెలుగు ఉపాధ్యాయురాలు
మదర్స్ఇంటిగ్రల్ స్కూల్
ఓయూ రోడ్డు, హైదరాబాద్