అంతర్జాతీయం
ఫ్రాన్స్ స్కూళ్లలో స్మార్ట్ఫోన్పై నిషేధం
ఫ్రాన్స్లో 15 ఏళ్లలోపు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ అవరణలో సెల్ఫోన్లు ఉపయోగించకూడదని చట్టం తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం సెల్ఫోన్లు, ట్యాబ్లెట్స్, స్మార్ట్వాచ్లు వంటివి వేటిని కూడా వాడరాదు. స్కూల్లో క్లాస్ సమయంలో ఫోన్లు వాడకూడదనే చట్టం ఫ్రాన్స్లో 2010 నుంచే అమల్లోనే ఉంది. ఇప్పుడు బ్రేక్స్, మీల్టైమ్స్లో కూడా సెల్ఫోన్లను వాడరాదని చట్టం చేశారు. 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులకు కూడా పాఠశాలలు ఈ నిబంధనను అమలు చేసుకోవచ్చు. అయితే అది కచ్చితం మాత్రం కాదు. స్కూల్ యాజమాన్యం ఇష్టం. దివ్యాంగుల విషయంలో ఈ నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పించారు.
దక్షిణ కొరియా వాయు కాలుష్యంపై పోరుకు 8 అత్యవసర బిల్లులు
దేశంలో ఓ పెను సామాజిక విపత్తుగా పరిణమించిన వాయు కాలుష్యాన్ని సమర్ధంగా ఎదుర్కొనేందుకు ప్రతిపాదించిన ఎనిమిది అత్యవసర బిల్లులకు దక్షిణ కొరియా పార్లమెంటు 2019 మార్చి 13న ఆమోదముద్ర వేసింది. పాఠశాలలు, డే కేర్ సెంటర్లలో గాలిని శుద్ధిచేసే పరికరాలను తప్పనిసరిగా అమర్చాలన్నది ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో ఒకటి. దక్షిణ కొరియాలో ధూళికణాల విపరీతంగా పెరిగిపోయి మార్చి 5న జనం కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. వెలుపలికి రావద్దని, ప్రజారవాణా వ్యవస్థనే వినియోగించమని, మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
భారత్-ప్రపంచం
ఉపరాష్ట్రపతి పర్యటనలు
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2019 మార్చి 9న, 12న కోస్టారికా, అర్జెంటీనాలలో పర్యటించారు. కోస్టారికా అధ్యక్షుడు కార్లోస్ అల్వరాడో క్వీసాడాతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచుకోవడంలో భాగంగా కొత్త రంగాల్లో సహకారం, సీమాంతర ఉగ్రవాదం, తదితర అంశాల్లో ఇరువురి మధ్య ఫలవంతమైన చర్చలు జరిపారు. బయోటెక్నాలజీ రంగంలో సహకారం అందించుకు నేందుకు, దౌత్య, అధికార పాస్పోర్టుల జారీకి అవసరమైన కొన్ని పత్రాలకు మినహాయింపు ఇచ్చే అంశాలపై అవగాహన ఒప్పందాలు జరిగాయి.
అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు గాబ్రియెలా మిషెట్టితో సమావేశమై ప్రాంతీయ బహుపాక్షిక సమస్యలపై చర్చించారు. భారత్-అర్జెంటీనా మధ్య సహకారాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. జూన్లో అర్జెంటీనాలో నిర్వహించనున్న గ్లోబల్ డిజెబిలిటీ కాన్ఫరెన్స్కు హాజరు కావాలని ఆయనను గాబ్రియెలా ఆహ్వానించారు.
బంగ్లాలో అభివద్ధి పథకాలకు శ్రీకారం
బంగ్లాదేశ్లో వివిధ అభివద్ధి పథకాలను ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోడి సంయుక్తంగా 2019 మార్చి 11న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇందులో భాగంగా 36 సామాజిక ఆరోగ్య కేంద్రాలకు, 11 నీటి శుద్ధీకరణ ప్లాంట్లకు ఈ-ఫలకాలతో ప్రారంభోత్సవం చేశారు. బస్సులు, ట్రక్కుల సరఫరా, ఆ దేశానికి మన జాతీయ విజ్ఞాన వ్యవస్థ విస్తరణ వంటివి కూడా ఉన్నాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
జాతీయం
క్యాన్సర్ ఔషధాల ధరలు 87శాతం వరకూ తగ్గింపు
390 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాల గరిష్ఠ చిల్లర ధరలను కేంద్ర ప్రభుత్వం 87శాతం మేర తగ్గించింది. తద్వారా ఏటా రూ.800 కోట్ల మేర రోగులకు ఆదా అవుతుందని జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ (ఎన్పీపీఏ) తెలిపింది. 2019 మార్చి 8 నుంచి కొత్త ధరలు అందుబాటులోకి వస్తాయని, ఔషధ తయారీదారులు, ఆసుపత్రులు వీటిని తప్పకుండా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది క్యాన్సర్తో బాధపడుతుండగా... 426 బ్రాండ్ల ఔషధాలు అందుబాటు లో ఉన్నాయి. ఇందులో 91శాతం (390) బ్రాండ్ల ధరలు 25శాతం నుంచి 87శాతం వరకూ తగ్గాయి.
ప్రచార చిత్రాల్లో సైనికుల ఫొటోలు వాడొద్దు: ఈసీ
ఎన్నికల ప్రచార చిత్రాల్లో సైనికుల ఫొటోలు వాడొద్దని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఆదేశించింది. ఫొటోలు వాడకూడదని 2013లోనే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉండాలని పేర్కొంది. సైనిక సిబ్బంది ఫొటోలను ప్రకటనల్లో వాడకుండా అభ్యర్థులు, నాయకులను రాజకీయ పార్టీలు నియంత్రించాలని స్పష్టం చేసింది.
ఈవీఎంలు, బ్యాలెట్ కాగితాల్లో అభ్యర్థుల ఫొటోలు
ఎన్నికల్లో అభ్యర్థుల ఫొటోలను ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ కాగితాల్లో ముద్రించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకే పేరు ఉన్నప్పుడు ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని, అందుకే ఈ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం 2019 మార్చి 10న ప్రకటించింది. అభ్యర్థులు తమ పాస్పోర్ట్ సైజు ఫొటోను ఎన్నికల అధికారికి సమర్పిం చాలని సూచించింది. మన దేశంలో 2009 నుంచి ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను ప్రవేశపెట్టిన సంగతిని ఈసీ ఈ సందర్భంగా గుర్తు చేసింది.
17వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం 2019 మార్చి 10న ప్రకటించింది. 17వ లోక్సభకు 2019 ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 23న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటిం చింది. ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్రల తో కలసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా ఈ విషయాలు వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను మాత్రం సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించడంలేదని స్పష్టం చేశారు.
యూఏఎన్ ఆధారంగానే పీఎఫ్
ఉద్యోగం మారిన ప్రతిసారీ భవిష్య నిధికి జమ చేసే సొమ్ము వివరాలపై కొత్తగా దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేకుండా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్వయంచాలిత (ఆటోమేటిక్) పద్ధతిని అమలు చేయాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. ప్రస్తుతం ఉద్యోగులకు సార్వత్రిక ఖాతా సంఖ్య (యూనివర్సల్ అకౌంట్ నెంబర్ -యూఏఎన్) ఉన్నప్పటికీ ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈపీఎఫ్ క్లెయింల విషయమై దరఖాస్తు సమర్పించాల్సి వస్తోంది. ఎన్ని ఉద్యోగాలు, ప్రదేశాలు మారినా జీవితాంతం పీఎఫ్ ఖాతా మాత్రం మారదు.
యూనివర్సిటీల్లో 'సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్'
యూనివర్సిటీలు, కళాశాలల్లో 'సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్' ఏర్పాటుకు సంబంధించి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ దిశగా ప్రతిపాదనలను సైతం ఆహ్వానించింది.
'బోయింగ్ 737 మాక్స్'లపై భారత్ నిషేధం
బోయింగ్ 737 మాక్స్లను పక్కన పెట్టిన జాబితాలో 2019 మార్చి 12న భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కూడా చేరాయి. ఈ విమానాలను తక్షణమే విమానాశ్రయాలకు పరిమితం చేయాలని డీజీసీఏ నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతే అతిముఖ్యం. భద్రతాపరంగా అన్నీ పరిశీలించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ వెల్లడించింది. మనదేశంలో స్పైస్జెట్, జెట్ ఎయిర్వేస్ ఈ రకం విమానాలను కలిగి ఉన్నాయి.
ఈ-సిగరెట్లను అనుమతించవద్దు
ఈ-సిగరెట్లు, ఫ్లేవర్ కలిగిన హుక్కా వంటి ఎలక్ట్రానిక్ నికోటిన్ ఉపకరణాల తయారీ, విక్రయం, దిగుమతి, ప్రకటనలను అనుమతించరాదని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల చట్టం 1940 కింద వీటికి ఆమోదం తెలపలేదని వివరించింది. ఆన్లైన్లో కూడా వీటికి అనుమతి ఇవ్వవద్దని వెల్లడించింది.
పానిపట్ పింక్థాన్-2019 ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2019 మార్చి 8న భారత వనితలు సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. హర్యానాలోని పానిపట్ నగరంలో ఒకేసారి 50 వేల మంది పరుగెత్తి చరిత్ర సష్టించారు. ఇంతవరకు జపాన్ పేరిట ఉన్న రికార్డును తిరగ రాశారు.
లింక్డ్ఇన్ ప్రభావశీల వ్యక్తుల్లో అన్నే దివ్య
ప్రపంచ తొలి యువ మహిళా పైలట్, తెలుగు అమ్మాయి అన్నే దివ్య లింక్డ్ఇన్ ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించింది. ఈ జాబితాలోని ప్రధానిమోడి, బిల్గేట్స్, ప్రియాంక చోప్రా, ఓఫ్రా విన్ఫ్రే, సచిన్ టెండూల్కర్, కిరణ్ మజుందార్ షా వంటి 500 మందికి పైగా మహామహుల సరసన దివ్య నిలిచింది.
ఆయుధాలు దిగుమతిలో భారత్కు 2వ స్థానం
ప్రపంచంలో అత్యధిక ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంగా సౌదీ అరేబియా నిలిచింది. స్టాకహేోమ్ ఇంటర్నే షనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్స్-2018 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ 2వ స్థానంలో నిలిచింది.
జపాన్ కంటే భారత్లోనే వయోభారం
జపాన్, స్విట్జర్లాండ్లలో నివసిస్తున్న వారితో పోలిస్తే భారతీయుల్లోనే ఎక్కువమంది వయసుతో పాటు వచ్చే అనారోగ్యాల బారిన పడుతున్నట్లు ఒక అధ్యయనం వెల్లడించింది.
ఒడిశాలో లోక్సభ టికెట్ల కేటాయింపులో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు
లోక్సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్(బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ 2019 మార్చి 10న ప్రకటించారు. దీంతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది.
41 శాతం సీట్లు మహిళలకు కేటాయించిన టీఎంసీ
2019 లోక్సభ ఎన్నికలోల్ల తమ పార్టీ తరపున 41 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తున్నట్లు తణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.
36 బ్యాంకులపై రూ.71 కోట్ల జరిమానా: ఆర్బీఐ
స్విఫ్ట్ కార్యకలాపాలను నిర్ణీత గడువులోపు అమలు చేయలేకపోవడం, బలోపేతం చేయడంలో విఫలం కావడంతో 36 ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులపై రూ.71 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక సంస్థలు లావాదేవీలు నిర్వహించు కునేందుకు వీలుగా రూపొందించిన అంతర్జాతీయ మేసేజింగ్ సాఫ్ట్వేర్ స్విఫ్ట్. 2018లో వెలుగులోకి వచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రూ.14,000 కోట్ల కుంభకోణంతో ఆర్బీఐ అప్రమత్తమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ యూనియన్ బ్యాంకు, హెచ్ఎస్బీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యెస్ బ్యాంక్ తదితర బ్యాంకులున్నాయి. జరిమానా రూ.1 కోటి నుంచి రూ.4 కోట్ల మధ్య విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.
మనీలాండరింగ్ వివాదంలో 'చందమామ'
చిన్నపిల్లల కథల పుస్తకం చందమామ మ్యాగజైన్ కొత్త యాజమాన్యం మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొం టోంది. ముంబయికి చెందిన జియోడెసిక్ లిమిటెడ్ 2007లో చందమామ మ్యాగజైన్ను కొనుగోలు చేసింది. ఈ కంపెనీలోని ముగ్గురు డైరెక్టర్లు స్విట్జర్లాండ్కు నిధులను తరలించినట్లు, ఇతర ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు. వీరిలో ప్రశాంత్ శారద్ ములెకర్, పంకజ్ కుమార్ ఓంకార్ శ్రీవాస్తవ, కిరణ్ కులకర్ణి ఉన్నారు. దీనిపై ఈడీ, ఎకనమిక్ అఫెన్స్ వింగ్, ముంబయి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
జుడిషియల్ అకాడమీ పేరు మార్పు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జుడిషియల్ అకాడమీ పేరును మార్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 75ను అనుసరించి 'తెలంగాణ రాష్ట్ర జుడిషియల్ అకాడమీ'గా పేరు మారుస్తూ 2019 మార్చి 12న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.
స్టీఫెన్ హాకింగ్ పేరిట బ్రిటన్ స్మారక నాణేలు
భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పేరిట బ్రిటన్ స్మారక నాణేలను విడుదల చేసింది. కష్ణబిలాలపై హాకింగ్ పరిశోధనకుగాను వీటికి 'బ్లాకహేోల్ కాయిన్స్'గా నామకరణం చేసింది. వెండి, బంగారంతో తయారుచేసిన ఈ 50 పెన్స్ (అర పౌండ్) నాణేల ధరను 55, 795 పౌండ్లుగా నిర్ణయించారు.
ప్రాంతీయం
ఓటింగ్ శాతాన్ని పెంచే 'సంకల్ప'
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'మీ ఓటు ద్వారా మీ ప్రేమను చూపించండి' అంటూ సంకల్ప పత్రాలను పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేస్తోంది. వాటిని వారు ఇళ్లకు తీసుకెళ్లి, తల్లిదండ్రుల సంతకాలతో మళ్లీ బడుల్లో సమర్పించాలి. ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరడంతో, 'కచ్చితంగా' అని హామీ ఇస్తూ పెద్దలు సంతకాలు చేసి అందించేలా ఆ పత్రాలను ముద్రించారు. వాటిని 6-10 తరగతి విద్యార్థులకు అందించారు.
TSMSIDC చైౖర్మన్ పదవీకాలం పొడిగింపు
తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక వసతుల అభివద్ధి సంస్థ (TSMSIDC) చైౖర్మన్ పరియడా క్రిష్ణమూర్తి పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది కాలం పొడిగించింది.
కరీంనగర్లో తొలి మహిళా పెట్రోలింగ్ వాహనాలు
రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా కమెండో బందాన్ని ఏర్పాటు చేసిన కరీంనగర్ పోలీసు కమిషనరేట్ మరోసారి తన ఘనతను చాటుకుంది. తొలి సారిగా మహిళా కమెండోలతో పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్డ్స్, క్యూఆర్టీ విభాగాలను ఏర్పాటు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా 2019 మార్చి 8న కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి అనుపమ చక్రవర్తి, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, సీపీ వీబీ కమలాసన్రెడ్డి జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు.
తెలంగాణలో 4 కొత్త మండలాలు
కొత్తగా 4 మండలాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లాలో మొస్రా, చండూరు, సిద్దిపేట జిల్లాలో నారాయణరావుపేట, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడుచింతలపల్లి గ్రామాలను మండలాలుగా ప్రకటించింది. ఈ మేరకు తుది నోటిఫికేషన్ విడుదల చేస్తూ 2019 మార్చి 8న రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
5 పీహెచ్సీలకు జాతీయ గుర్తింపు
రాష్ట్రంలోని 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ విభాగంలో 5 పీహెచ్సీలు ఎంపికైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది. ఎంపికైన ఐదింటిలో సిద్దిపేట జిల్లా కూకునూర్పల్లి పీహెచ్సీ 91.2 శాతం మార్కులతో అగ్రభాగాన నిలిచింది. కరీంనగర్ జిల్లా చల్లూరు పీహెచ్సీ 87.6 శాతం మార్కులతో 2వ స్థానంలో, గంగాధర, కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ, శేఖరం బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పీహెచ్సీ అభివద్ధి కోసం వరుసగా మూడేళ్ల పాటు ఏటా రూ.3 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది.
తెలంగాణ శాసనసభ, శాసనమండలి ప్రొరోగ్
తెలంగాణ శాసనసభ, మండలిని ప్రొరోగ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ 2019 మార్చి 10న ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఇవి అమల్లోకి వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత వాయిదా పడ్డాయి. నిబంధనల మేరకు ఉభయ సభలను ప్రొరోగ్ చేయాల్సి ఉన్నందున ఉత్తర్వులు జారీ చేశారు.
దూలపల్లిలో అటవీ సహజ వనరుల అధ్యయన కేంద్రం
రాష్ట్రంలో కొత్తగా అటవీ సహజ వనరుల అధ్యయన కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారి(పీసీసీఎఫ్) చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు అటవీ శాఖ 2019 మార్చి 12న ఉత్తర్వులు జారీ చేసింది. దూలపల్లిలోని అటవీ అకాడమీలో ఏర్పాటు కానున్న అధ్యయన కేంద్రానికి వైస్ చైర్మన్గా తెలంగాణ అటవీ అకాడమీ డైరెక్టర్, సభ్యులుగా పరిపాలన, ఐటీ విభాగాల అదనపు పీసీసీఎఫ్లు, అటవీ శాఖ సంయుక్త కార్యదర్శి వ్యవహరిస్తారు. గవర్నింగ్ బాడీతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించారు.
అత్యాచార బాధితులకు ఆర్థికసాయం పెంపు
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అత్యాచార బాధితులకు చెల్లించే నష్ట పరిహారాన్ని ప్రభుత్వం పెంచింది. అత్యాచారానికి గురైన మహిళకు కనిష్ఠంగా రూ.4 లక్షలు, గరిష్ఠంగా రూ.7 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. గ్యాంగ్ రేప్ బాధితులు, ప్రాణాలు కోల్పోయిన మహిళ కుటుంబానికి రూ.5-10 లక్షలు చెల్లిస్తారు. శాశ్వత అంగవైకల్యం పొందిన మహిళకు రూ.1-4 లక్షలు, కాలిన మహిళలకు రూ.2-8 లక్షలు, యాసిడ్ బాధితులకు రూ.3-8 లక్షల వరకు నష్టపరిహారం చెల్లిస్తారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదుకు సీ-విజిల్ యాప్
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు సీ-విజిల్ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. సాధారణ పౌరులు ఎవరైనా నియమావళి ఉల్లంఘనలను గుర్తిస్తే వెంటనే ఫొటో/వీడియో తీసి ఈ యాప్లో ఫిర్యాదు చేయవచ్చు. దానిపై సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీ-విజిల్ ద్వారా 18,022 ఫిర్యాదులు రాగా అందులో 8,715 సరైనవిగా గుర్తించి పరిష్కరించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం 2019 ఫిబ్రవరి 9 నుంచి మార్చి 1 వరకు యాప్ను పరీక్షించిన అధికారులు, అన్ని జిల్లాల నుంచి 493 ఫిర్యాదులను నమోదు చేసి చూశారు. అది విజయవంతం కావడంతో 2019 మార్చి 12 నుంచి యాప్ను ఆన్లైన్ చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది.
ఇబ్రహీంపట్నంలో జపాన్-ఇండియా భద్రత బలగాల విన్యాసాలు
జపాన్లోని ఒకినావాలో ఉన్న అమెరికా మిలటరీ మొదటి బెటాలియన్కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ గ్రూప్ (వైమానిక విభాగం), హైదరాబాద్లోని జాతీయ భద్రత దళం (ఎన్ఎస్జీ) సంయుక్తంగా చేపట్టిన విన్యాసాలు 2019 మార్చి 13న ప్రారంభమయ్యాయి. ఇబ్రహీంపట్నంలోని ఎన్ఎస్జీ కేంద్రంలో రెండు వారాల పాటు విన్యాసాలు జరగనున్నాయి.
వార్తల్లో వ్యక్తులు
UNDP గుడ్విల్ అంబాసిడర్గా పద్మాలక్ష్మి
భారత సంతతికి చెందిన మోడల్, టీవీ వ్యాఖ్యాత, పాకశాస్త్ర నిపుణు రాలు, రచయిత్రి పద్మాలక్ష్మి ఐక్యరాజ్య సమితి అభివద్ధి కార్యక్రమం (UNDP) గుడ్విల్ అంబాసిడర్గా నియమితుల య్యారు. UNDP 2019 మార్చి 8న ప్రకటన విడుదల చేసింది. మహిళా లోకం ఎదుర్కొంటున్న వివక్ష, అసమానతలపై యుఎన్డీపీ చేస్తున్న పోరుకు, లక్ష్య సాధనకు గుడ్విల్ అంబాసిడర్గా ఆమె మద్దతు కూడగడతారు.
పాక్ సెనేట్ సమావేశానికి హిందూ మహిళా సెనేటర్ సారథ్యం
పాకిస్థాన్ తొలి హిందూ మహిళా సెనేటర్ కష్ణకుమారి కొహ్లి 2019 మార్చి 8న జరిగిన పార్లమెంటు సమావేశానికి సారథ్యం వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆమెకే శుక్రవారం నాటి సమావేశానికి సారథ్య బాధ్యతలు అప్పగించాలని సెనేట్ చైర్మన్ నిర్ణయించినట్లు సెనేటర్ ఫైజల్ జావేద్ అంతకుముందే ట్విటర్ ద్వారా తెలిపారు.
9 ఏళ్ళకే రచయితగా భారత బాలుడి ఘనత
భారతదేశానికి చెందిన అథార్వ్ షిండే 9 ఏళ్ళ వయసులోనే 197 పేజీల నవలను రాసి ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం తూర్పు ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఉన్న అరుష నగరంలో బ్రాయిబర్న్ ఇంటర్నేషనల్ స్కూల్లో అథార్వ్ షిండే 4వ తరగతి చదువుతున్నాడు. షిండే తండ్రి భారత ప్రభుత్వ అధికారి. డిప్యూటేషన్పై ప్రస్తుతం టాంజానియాలో విధులు నిర్వర్తిస్తున్నారు. 'ది బెహమోత్స్: ఎండ్ ఆఫ్ వార్బ్రింగర్' పేరట తాను రాసిన ఈ నవల బాలలు, యువత, పెద్దలనూ ఆకట్టుకుంటుందని షిండే తెలిపాడు. ఈ-బుక్ రూపంలోనూ ఆన్లైన్లో ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచినట్టు వివరించాడు.
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్గా జస్టిస్ ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ 2019 మార్చి 9న ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టుకు వచ్చే కేసుల్లో పేదలకు అవసరమైన న్యాయ సాయం చేసే బాధ్యతను ఈ కమిటీ చూస్తుంది. సర్వోన్నత న్యాయస్థాన జడ్జీల్లో 3వ అత్యంత సీనియర్ న్యాయమూర్తికి ఈ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించడం అనవాయితీగా వస్తోంది.
ఈడీ ప్రత్యేక సంచాలకులుగా దూబే కుమార్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక సంచాలకులుగా అనూప్కుమార్ దూబే, సుశీల్కుమార్ నియమితు లయ్యారు. భారతీయ రెవెన్యూ సర్వీస్కు చెందిన దూబే, కుమార్లు వరుసగా దిల్లీ, చెన్నైలోని ఈడీ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తారు.
ఎముక మజ్జ దానం చేసిన తొలి భారతీయ మహిళ
మూలకణ దానంపై సమాజంలో నెలకొన్న అపోహలను పటాపంచలు చేస్తూ తమిళనాడుకు చెందిన మసిలమణి తన గొప్ప మనసు చాటుకున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధ పడుతున్న పసికందు ప్రాణాలు నిలబెట్టారు. రోగితో బంధుత్వ మేదీ లేకపోయినా ఎముక మజ్జ దానం చేసిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సష్టించారు. నిపుణులను సంప్రదించిన మసిలమణి.. మూలకణాలు ఇతరులకు ఇవ్వడంలో ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని చెప్పడంతో మూలకణాన్ని ఢిల్లీలోని ఓ బాలుడికి మూలకణాలు దానం చేశారు.
రూ.52,750 కోట్ల షేర్లు ఫౌండేషన్కు కేటాయించిన అజీమ్
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ విప్రోలో తన 34 శాతం షేర్లను అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్కు విరాళంగా ప్రకటించారు. ఆయన నియంత్రణలో ఉన్న పలు సంస్థల వద్ద ఉన్న రూ.52,750 కోట్లను విరాళంగా ప్రకటించారు. దాతత్వ కార్యకలాపాలు నిర్వహించే అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్కు ప్రేమ్జీనే చైర్మన్గా ఉన్నారు. దీని కార్యకలాపాల కోసం ఉపయోగించే దాతత్వ నిధికి ప్రేమ్జీ గతంలో కూడా షేర్లు, ఆస్తుల రూపంలో కొంత మొత్తాన్ని కేటాయిస్తూ వచ్చారు.
వార్తల్లో ప్రదేశాలు
140 ఏళ్లకు కనిపించిన సర్పం
అంతరించిపోయిందనుకున్న ఓ సర్పజాతిని 140 ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు గుర్తించారు. 2016-18 మధ్య మేఘమలై వన్య ప్రాణుల అభయారణ్యంలో సర్వే జరిపిన సమయంలో వుడ్ స్నేక్ కనిపించిందని హెర్పెటాలజిస్టు ఆర్.చైతన్య, బయోడైవర్సిటీ కన్సర్వేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ వరాద్ గిరి వెల్లడించారు. 235 మిల్లీమీటర్ల పొడవుతో ముదురు గోధుమ రంగులో ఈ ఆడపాము ఉందని చెప్పారు. కాగా, ఈ వుడ్ స్నేక్ను చివరిసారిగా 1878లో బ్రిటిష్ సైనికాధికారి, ప్రకతి శాస్త్రవేత్త అయిన కర్నల్ రిచర్డ్ హెన్రీ బెడ్డోమ్ గుర్తించారు.
పశ్చిమ కనుమల్లో వింత మరుగుజ్జు కప్ప
ఉదర భాగం నారింజ రంగు, ముందు భాగం ముదురు గోధుమ రంగులో ఉండి.. అక్కడక్కడా నక్షత్రాన్ని తలపించే మచ్చలు ఉన్న వింత ప్రాచీన కప్పను శాస్త్రవేత్తలు గుర్తించారు. బొటనవేలంత పరిమాణంలో ఉన్న ఈ మరుగుజ్జు కప్ప కేరళలోని పశ్చిమ కనుమల్లో కనిపించింది. లక్షల సంవత్సరాల నాటి ఉభయచరాల వారసత్వానికి ఇవి ఏకైక ఆనవాలని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్పీ విజయకుమార్ వెల్లడించారు.
అవార్డులు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు 'యూనివర్సిటీ ఆఫ్ పీస్' గౌరవ డాక్టరేట్
భారతదేశ సుస్థిర అభివద్ధి, ప్రజాస్వామ్యం, చట్టాలకు అందించిన సేవలకుగాను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడిని గౌరవ డాక్టరేట్ లభించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటైన యూనివర్శిటీ ఆఫ్ పీస్ ఈ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
రాధాదేవికి నారీశక్తి పురస్కారం
కులవత్తుల్లో పురుషాధిక్యాన్ని సవాలు చేస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన తిరుపతికి చెందిన కగ్గనపల్లి రాధాదేవి జాతీయ అత్యుత్తమమైన నారీశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. యువ శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలిచిన శ్రీహరికోటలోని సతీశ్ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్) శాస్త్రవేత్త మునుస్వామి శాంతి కూడా ఈ పురస్కారాన్ని పొందారు.
వైవీయూ ప్రొఫెసర్ ఎంవీ శంకర్కు లండన్ సీకెం పురస్కారం
కడప యోగి వేమన విశ్వవిద్యాలయం మెటీరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ ప్రొఫెసర్ ఎంవీ శంకర్కు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ అందించే సీకెం(చార్టెడ్ కెమిస్ట్) పురస్కారం లభించింది. రాష్ట్రంలో సీకెం పురస్కారం అందుకొన్న తొలి ఆచార్యుడిగా, పరిశోధకుడిగా శంకర రికార్డు సష్టించారు. రసాయన విజ్ఞాన శాస్త్రంలో అంకితభావంతో పరిశోధన సాగించినందుకు, 12 నైపుణయత గుణాలను పరీక్షించి అన్నింటిలో ప్రతిభ చూపడంతో ఈ పురస్కారం వరించింది.
పద్మ అవార్డుల ప్రదానోత్సవం
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2019 మార్చి 10న పద్మ అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం 112 మంది విజేతల్లో 47 మందికి రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందించారు.
రఘురాం రాజన్కు యశ్వంతరావు చవాన్ నేషనల్ అవార్డు
ఆర్థిక అభివృద్ధిలో చేసిన కృషికి గాను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్కు 2018 యశ్వంతరావు చవాన్ నేషనల్ అవార్డు లభించింది. మహారాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి యశ్వంత రావు చవాన్ 106వ జయంతిని పురస్కరించుకుని 2019 మార్చి 12న ఈ అవార్డును ప్రదానం చేశారు
96 మందికి ఇస్రో పురస్కారాలు
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో విలువ ఆధారిత సేవలు అందించిన 96 మందికి ఇస్రో పురస్కారాలు ప్రదానం చేసింది. బెంగళూరులోని అంతరిక్ష భవన్లో 2019 మార్చి 13న నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.కస్తూరి రంగన్, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ శివన్ ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.
అకాల మరణాల్లో 25శాతం పర్యావరణ మార్పుల వల్లే : యూఎన్ఓ
అకాల మరణాల్లో 25 శాతం పర్యావరణ మార్పులు, కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయి. విపరీతమైన కర్బన ఉద్గారాల విడుదల, రసాయనాల కారణంగా కలుషితమవు తున్న తాగునీరు, వాయు కాలుష్యంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రభావితులవుతున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ మేరకు గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఔట్లుక్ (జీఈవో) నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది.
సైన్స్ & టెక్నాలజీ
పినాక రాకెట్ పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో అభివద్ధి చేసిన గైడెడ్ రాకెట్ వ్యవస్థ పినాకను 2019 మార్చి 11న భారత్ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఈ పరీక్ష జరిగినట్లు రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇది సైన్యంలోని శతఘ్ని విభాగం సత్తాను మరింత పెంచుతుందని వివరించింది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం సమకూరుతుందని పేర్కొంది. దీనిని హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివద్ధి చేసింది.
సౖౖెబీరియాలో మామోత్కు చెందిన గడ్డకట్టిన కణాలు
ఏనుగు కంటే ఆరింతల పెద్దది, ఒకప్పుడు భూమిపై సంచరించిన మామోత్కు చెందిన గడ్డకట్టిన కణాలు 2011లో సైబీరియా మంచు ప్రాంతంలో లభ్యమయ్యాయి. మామోత్ 28,000 సంవత్సరాల నాటిది. జపాన్లోని కిందారు విశ్వవిద్యాలయానికి చెందిన కెరు మియామోటో శాస్త్రవేత్తల బందం వాటిని సేకరించింది. మూషికాల అండకోశాల్లో భద్రపరిచి పరిశోధన సాగించింది. ఈ క్రమంలో ఆ కణాల్లో కదలికలు వచ్చాయి. జీవ సంబంధ స్పందనలు స్పష్టంగా కనిపించాయి.
లాసిక్ శస్త్రచికిత్స కచ్చితత్వానికి వినూత్న సాంకేతికత
దష్టి లోపాలను లేజర్ కిరణాలతో సరిచేసే లాసిక్ శస్త్ర చికిత్సను మరింత కచ్చితత్వంతో నిర్వహించే వినూత్న సాంకేతికతను అమెరికాలోని మేరిల్యాండ్ విశ్వ విద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గియులియానో స్కార్సెలీ అభివద్ధి చేశారు. దీని వల్ల భవిష్యత్తులో కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం ఉండదు. కాంటాక్ట్ లెన్సులు అమర్చుకోవాల్సిన పనికూడా ఉండదు.
క్రీడలు
ఆసియన్ జిమ్నాస్టిక్ యూనియన్ సాంకేతిక కమిటీ సభ్యులుగా ఐదుగరు భారతీయులు
ఆసియన్ జిమ్నాస్టిక్ యూనియన్ సాంకేతిక కమిటీ సభ్యులుగా ఐదుగరు భారతీయులు నియమించబడ్డారు. వీరు 2019 నుంచి 2022 వరకు ఈ పదవిలో ఉండనున్నారు.
1.దీపక్ కబ్రా పురుషుల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్
2.అక్షత షీటె రిథమిక్ జిమ్నాస్టిక్స్
3.సుమిత్ ఎంఆర్ అక్రోబాటిక్ జిమ్నాస్టిక్స్
4.మకరంద్ జోషి ఏరోబిక్ జిమ్నాస్టిక్స్
5.నారాయణ్ శశి జిమ్నాస్టిక్స్ ఫర్ ఆల్
- యన్.సంతోష్కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270