అంతర్జాతీయం
కజకిస్థాన్ అధ్యక్షుడి ఆకస్మిక రాజీనామా
కజకిస్థాన్ అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్బయేవ్(78) 2019 మార్చి 19న తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘకాలంపాటు పదవిలో ఉన్న ఆయన ఆకస్మికంగా రాజీనామా చేయడంతో దేశం ఆశ్చర్య పోయింది. 2020లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకొంది. జీవన ప్రమాణాలు పడిపోతుండడంతో ప్రజల్లో అసంతప్తి నెలకొనడాన్ని గమనించి ఆయన ఇటీవలే మొత్తం మంత్రివర్గాన్ని తొలగించారు. పదవికి రాజీనామా చేసినప్పటికీ రాజ్యాంగం ప్రకారం ఆయన 'జాతినేత'గా కొనసాగుతారు. దానిప్రకారం విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు ఉంటుంది. అధ్యక్ష ఎన్నికలు జరిగే వరకు సెనేట్ ఎర్మన్ కస్యం జొమ్రాట్ టొకాయెవ్ (65) అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారు. తమ దేశ మాజీ అధ్యక్షుడు నుర్సుల్తాన్ నజర్బయెవ్ గౌరవార్థం రాజధాని 'ఆస్థానా'ను నుర్సుల్తాన్గా మార్చేందుకు పార్లమెంటు 2019 మార్చి 20న ఆమోదం తెలిపింది.
న్యూజిలాండ్లో సెమీఆటోమెటిక్ రైఫిళ్ల అమ్మకాలపై నిషేధం
న్యూజిలాండ్ ప్రధామంత్రి జసిండా అర్డెర్న్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. 2019 మార్చి 15న క్రైస్ట్చర్చ్ మసీదులో కాల్పుల మారణహౌమం ఉదంతాన్ని సీరియస్గా తీసుకున్న ప్రధాని జసిండా అసాల్ట్ రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల అమ్మకాలపై నిషేధం విధిస్తూ 2019 మార్చి 21న ఆదేశాలు జారీ చేశారు. సెమీ ఆటోమెటిక్ రివాల్వర్లతోపాటు బ్రెంటన్ వాడిన అన్ని రకాల ఆయుధాలపైనా నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశించింది.
మొజాంబిక్, జింబాంబ్వే, మలావి దేశాల్లో ఇదారు తుపాను
ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్, జింబాంబ్వే, మలావిలను ఇదారు తుపాను అతలాకుతలం చేసింది. భారీవర్షాలకు తోడు ఎగువప్రాంతాల నుంచి వరదలు ఒక్కసారిగా పోటెత్తడంతో ఈ మూడుదేశాల్లో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ప్రజలు గల్లంతయ్యారు. మూడుదేశాల్లో దాదాపు 15 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
భారత్-ప్రపంచం
భారత్లో 6 అణు కర్మాగారాలు: అమెరికా
భారత్తో ద్వైపాక్షిక భద్రత, పౌర అణురంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం 6 అణు విద్యుత్ కర్మాగా రాలను నిర్మించడానికి అమెరికా అంగీకారం తెలిపింది. అణు సరఫరాదారుల బదం (ఎన్ఎస్జీ)లో భారత్ సభ్యత్వం కోసం మద్దతు ఇస్తున్నట్లు వివరించింది. భారత్-అమెరికా వ్యూహాత్మక భద్రతా వ్యవస్థ 9వ విడత చర్చల అనంతరం రెండు దేశాలు ఈ సంయుక్త ప్రకటన వెలువడింది.
సుష్మాస్వరాజ్ మాల్దీవుల పర్యటన
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2019 మార్చి 18, 19 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాల్దీవుల విదేశీ వ్యవహారాల మంత్రి అబ్దుల్లా షాహిద్ తో కలిసి కీలక దైపాక్షిక అంశాలను సమీక్షించారు. 2018లో మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సొలి భారత పర్యటన సందర్భంగా ఉభయదేశాలు అంగీకరించిన అంశాల అమలు తీరుపై చర్చించారు. తర్వాత జరిగిన మాల్దీవుల మంత్రుల సంయుక్త సమావేశంలో పాల్గొన్నారు.
గినియా ప్రధాని భారత పర్యటన
గినియా ప్రధానమంత్రి ఇబ్రహీమ కసోరీ 2019 మార్చి 19న భారత్లో సతీసమేతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడితో సమావేశమయ్యారు. జాతీయం
తొలి ఓటర్లు పశ్చిమబెంగాల్లోనే అధికం
తొలిసారి ఓటు హక్కు వినియోగించుకొనే 18 ఏళ్ల యువ ఓటర్లు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 2019 సమ్మరీ రివిజన్ ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 1.50 కోట్ల మంది 18-19 ఏళ్లలోపు గల వారు ఓటర్లుగా చేరారు. ఇందులో 13.28% మంది పశ్చిమ బెంగాల్లోనే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పెరుగుదలలో తెలంగాణ 10వ, ఆంధ్రప్రదేశ్ 12వ స్థానాల్లో నిలిచాయి.
జంతువులతో ప్రచారంపై ఈసీ నిషేధం
రాజకీయ పార్టీలు, వాటి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో జంతువులు, పక్షులు, సరీసపాలను వినియోగించకూడదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మహారాష్ట్ర, అసోం, మిజోరం, తమిళనాడు, గుజరాత్, సిక్కిం, కేరళ, హిమాచల్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఇది అమలు కానుంది.
వాయు, ధ్వని కాలుష్యపైNGT ఆదేశాలు
వాయు, శబ్ద కాలుష్యంపై జాతీయ హరిత ట్రైబ్యునల్( NGT తీవ్రంగా స్పందించింది. నిర్దేశిత ప్రమాణాల మేరకు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చేపట్టదలచిన కార్యాచరణ ప్రణాళికలను ఏప్రిల్ 30వ తేదీనాటికల్లా తమకు సమర్పించాల్సిందిగా 6 రాష్ట్రాలను ఆదేశించింది. అలా సమర్పించ లేకపోతే కోటిరూపాయల చొప్పున పర్యావరణ పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. జస్టిస్ ఆదర్శ్కుమార్ గొయెల్ సారథ్యంలోని NGT ధర్మాసనం ఈ మేరకు అసోం, ఝార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు పంపింది.
కేంద్ర ఉద్యోగులకు ప్రోత్సాహకం పెంపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నత విద్యను అభ్యసిస్తే ఇచ్చే ఏకకాల ప్రోత్సాహకాన్ని 5 రెట్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఉద్యోగంలో చేరిన అనంతరం ఉన్నత డిగ్రీలు సంపాదిస్తే ఇంతవరకు రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రోత్సాహకం ఇస్తుండగా, దాన్ని రూ.10 వేల నుంచి రూ.30వేల వరకు పెంచింది. మూడేళ్ల వ్యవధి ఉన్న డిగ్రీ/డిప్లొమా చేస్తే రూ.10 వేలు, మూడేళ్లకన్నా ఎక్కువ వ్యవధి ఉన్న డిగ్రీ/ డిప్లొమాలు చేస్తే రూ.15 వేలు లభిస్తుంది. ఒక ఏడాదిలోపు వ్యవధి ఉన్న పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా చేసిన వారు రూ.20వేల ప్రోత్సాహకానికి అర్హులవుతారు. ఏడాదికన్నా ఎక్కువ వ్యవధిఉన్న పీజీ కోర్సులు చేస్తే రూ.25 వేలు లభిస్తుంది. పీహెచ్డీవంటి డిగ్రీలు చేస్తే రూ.30వేలు ఇస్తారు. చేసే ఉద్యోగంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న డిగ్రీలను చేస్తేనే ఇందుకు అర్హులవుతారు. ప్రభుత్వ సౌజన్యంతో, ప్రత్యేక సెలవు తీసుకొని చేసే డిగ్రీలకు ఇది వర్తించదు.
గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్
గోవా ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే ప్రమోద్ సావంత్(46) 2019 మార్చి 19 అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో సావంత్తో గవర్నర్ మదులాసిన్హా ప్రమాణస్వీకారం చేయించారు. మరో 11 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో బీజేపీ మిత్రపక్షాలైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్పీ) నేతలు, స్వతంత్ర సభ్యులూ ఉన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముందు సావంత్ శాసనసభ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు.
యాసిడ్ దాడి దోషులపై దయ అనవసరం సుప్రీం
ఆమ్ల దాడి అత్యంత అనాగరిక, అమానవీయ నేరమని.... అందుకే, ఇలాంటి ఘాతుకాలకు పాల్పడిన వారి విషయంలో జాలి, దయా చూపాల్సిన అవసరమే లేదని సుప్రీంకోర్టు ఉద్ఘాటించింది. 19 సంవత్సరాల యువతిపై 2004లో యాసిడ్ దాడికి పాల్పడి దోషులుగా నిరూపితులై అయిదేళ్ల కారాగార శిక్షను అనుభవించిన ఇద్దరు వ్యక్తులను రూ.1.50 లక్షల చొప్పున బాధితురాలికి పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. యాసిడ్ దాడికి గురైన ఆమెకు బాధితులకు పరిహారం పథకం కింద ఇచ్చే పరిహారాన్ని చెల్లించాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గోద్రా రైలు దహనం కేసులో ఒకరికి జీవిత ఖైదు
గుజరాత్లోని గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం కేసులో ఒకరికి జీవిత ఖైదు విధిస్తూ 2019 మార్చి 20న ప్రత్యేక సిట్ న్యాయస్థానం తీర్పు చెప్పింది. వివిధ ఆధారాలను పరిశీలించిన మీదట యూకుబ్ పటాలియాకు ఈ శిక్ష విధిస్తూ జడ్జి హెచ్.సి.వోరా తీర్పు ఇచ్చారు. దుర్ఘటన జరిగిన 16 ఏళ్ల తరువాత 2018 జనవరిలో పటాలియాను పోలీసులు అరెస్టు చేశారు. సబర్మతి సెంట్రల్ జైలులోనే కోర్టు వ్యవహారాలను నిర్వహించారు. సబర్మతి ఎక్స్ప్రెస్ను దహనం చేసి 59 మంది కరసేవలకు మతికి కారకులయిన వారిలో అతడు ఉన్నాడని నిరూపితమయింది.
సంఝౌతా కేసు నుంచి అసీమానందకు విముక్తి
సంఝౌతా రైలు పేలుడు కేసు నుంచి స్వామి అసీమానందతోపాటు మరో ముగ్గురికి ప్రత్యేక కోర్టు 2019 మార్చి 20న విముక్తి కల్పించింది. ఈ కేసులో నలుగురు నిందితులైన నబకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసీమానంద, లోకేష్శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌధరిలకు కోర్టు నుంచి విముక్తి లభించినట్లు ఎన్ఐఏ న్యాయవాది రాజన్ మల్హోత్రా తెలిపారు.తీర్పు వెలువరించడానికి ముందు ఎన్ఏఐ ప్రత్యేక జడ్జి జగదీప్సింగ్ పాక్కు చెందిన ప్రత్యక్ష సాక్షులను విచారించాలంటూ ఆ దేశానికి చెందిన మహిళ దాఖలు చేసిన దరఖాస్తును కొట్టివేశారు.
పీఏసీఆర్ ఇన్స్టిట్యూట్కు అఖిల భారత 3వ ర్యాంకు
పీఏసీ రామసామి రాజా ప్రైవేట్ ఇండిస్టియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అరుదైన గౌరవం దక్కించుకుంది. మొత్తం 33 ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో 73.7 శాతం స్కోరుతో ఈ సంస్థ అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకును దక్కించుకుందని నైపుణ్యాభివద్ధి శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ప్రకటించింది. జాతీయ స్థాయి ఐటీఐ ఎవాల్యుయేషన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని అత్యంత వెనకబడి జిల్లాల్లో ఒకటైన అరియలూరులో ఈ ఐటీఐని రామ్కో సిమెంట్స్ 2010లో ఏర్పాటు చేసింది.
ఆనందదాయక దేశాల్లో భారత్కు 140వ స్థానం
2019 ఆనందదాయక దేశాల జాబితాలో భారతదేశం 140వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. 2018లో భారత్ 133వ స్థానంలో నిలిచింది. 2019 మార్చి 20న విడుదలైన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. మార్చి 20వ తేదీని ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 'ప్రపంచ ఆనంద దినోత్సవం'గా ప్రకటించింది. ఆదాయం, స్వేచ్ఛ, విశ్వాసం, ఆరోగ్యకర జీవన విధానం-ఆయుష్షు, సామాజిక మద్దతు, వితరణ తదితర అంశాలను ఆనందం మదింపునకు ప్రాతిపదికగా తీసుకుంటున్నారు.
అధిక ఉష్ణోగ్రతతో గుండెపోటు ప్రమాదం
ఉష్ణోగ్రతకు, గుండెపోటుకు సంబంధం ఉందని జర్మనీలోని హెల్మ్హౌల్ట్జ్ జెంట్రమ్ మున్చెన్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వాతావరణం ఎంత వేడిగా ఉంటే, అంతగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. గుండెజబ్బులతో పాటు మధుమేహం, రక్తంలో అధికంగా కొవ్వుకణాలు(లిపిడ్స్) ఉండేవారికి ఈ ముప్పు మరీ ఎక్కువని నిర్ధారణ అయింది.
12 హిమాలయ రాష్ట్రాలపై వాతావరణ చిత్రపటాలు
వాతావరణ మార్పులకు ప్రభావితమవుతున్న 12 భారతీయ హిమాలయ ప్రాంత(ఐహెచ్ఆర్) రాష్ట్రాల చిత్రపటాలను ఐఐటీ-గౌహతి, ఐఐటీ-మండి, ఐఐఎస్సీ-బెంగళూరు రూపొందించాయి. ఐహెచ్ఆర్ ప్రాంతంలోని 12 రాష్ట్రాలు ఇందుకు మొదటిసారిగా ఉమ్మడి విధానాన్ని అనుసరించి ఈ చిత్రపటాలను తయారు చేశాయి. రాష్ట్ర, జిల్లాస్థాయిలో మిగతావాటితో పోల్చి చూసుకోవడానికి ఇవి ఉపయోగపడ నున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఐహెచ్ఆర్లో ఉష్ణోగ్రత, వర్షపాతం బాగా పెరిగాయని పరిశోధకులు చెబుతున్నారు. భారతీయ హిమాలయ ప్రాంతాల్లో అసోం, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, పశ్చిమబెంగాల్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీరు ఉన్నాయి.
ప్రాంతీయం
నాస్కామ్ నివేదికలో టీ-చిట్స్కు చోటు
తెలంగాణ రిజిస్ట్రేషన్, ఐటీ శాఖలు అభివద్ధి చేసిన 'టీ-చిట్స్ అప్లికేషన్'కు నాస్కామ్ వార్షిక నివేదిక-2019లో చోటు లభించింది. చిట్ఫండ్ నమోదు, నిర్వహణకు ఉద్దేశించిన ఈ అప్లికేషన్ను చిట్మాంక్స్ అనే సంస్ధ రూపొందించింది.
కవ్వాల్ అభయారణ్యంలో మద్యం, ధూమపానం నిషేధం
వన్యప్రాణుల, అటవీ రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవ్వాల్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో మద్య పానం, ధూమపానం నిషేధించింది. ఉల్లంఘిం చిన వారికి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం 3 సంవత్సరాల జైలుశిక్ష తప్పదని అధికారులు హెచ్చ రిస్త్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం పెద్దయ్య దేవుని ఆలయం పరిసర ప్రాంతాలకు మద్యాన్ని తీసుకెళ్లకుండా 2019 మార్చి 14న పోలీసులు, అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఆలయం దట్టమైన అడవిలో ఉంది.
టీఎస్ఆర్టీసీకి 4 పురస్కారాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)కి 4 అవార్డులు లభించాయి. ఏటా జాతీయ స్థాయిలో అసోసియే షన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) అందించే పురస్కారాలివి. వీటిల్లో భాగంగా 2017-18 సంవత్స రానికి వాహన ఉత్పాదకత, ఇంధన పొదుపు విభాగాల్లో ఆర్టీసీకి ఈ గుర్తింపు వచ్చింది. వాహన ఉత్పాదకతకు సంబంధించి హైదరాబాద్ నగరంలో వాహనం ఒకరోజు తిరిగిన కిలోమీటర్ల(228.98 నుంచి 238.90)కు మొదటి స్థానం లభించింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో 396.91 నుంచి 404.43 కిలోమీటర్లతో రెండోస్థానం వచ్చింది. ఇంధన పొదుపు పరంగా గ్రామీణ ప్రాంతంలో, హైదరాబాద్ నగరంలోనూ ప్రథమ స్థానాలు వచ్చాయి.
సీఐఐ-తెలంగాణ చైర్మన్గా డి.రాజు
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణా విభాగం ఛైర్మన్గా డి.రాజు, వైస్-ఛైర్మన్గా సైయెంట్ లిమిటెడ్ ఎండీ అండ్ సీఈఓ కష్ణ బొడనపు ఎన్నికయ్యారు. ఈ పదవుల్లో ఇరువురూ ఏడాది కాలం పాటు ఉంటారు. కిర్బీ బిల్డింగ్ సిస్టమ్స్ సీఈఓ, ఎండీగా వ్యవహరిస్తున్న డి.రాజుకు ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.
అమీర్పేట్- హైటెక్ సిటీ మెట్రో ప్రారంభం
అమీర్పేట్, హైటెక్ సిటీ మార్గంలో 2019 మార్చి 19 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. గవర్నర్ నరసింహన్ అమీర్పేట్ స్టేషన్లో జెండాఊపి ఈ సేవలను ప్రారంభించారు. దీంతో ఇకపై నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాల్సిన ప్రయాణికులు ఒకే రైల్లో ప్రయాణించొచ్చు. ఎల్బీనగర్, మియాపూర్ నుంచి వెళ్లాల్సిన వాళ్లు మాత్రం అమీర్పేట్లో రైలు మారాల్సి ఉంటుంది.
టీఎస్జేఏ క్రీడా అవార్డుల ప్రదానం
తెలంగాణ క్రీడా పాత్రికేయుల సంఘం వార్షిక అవార్డుల్లో 2019 మేటి ప్లేయర్గా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఎంపికైంది. 2019 మార్చి 19న జరిగిన కార్యక్రమంలో సైనా తరఫున ఆమె తండ్రి హర్వీర్సింగ్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ సీనియర్ క్రీడాకారిణిగా పి.వి.సింధు, ఉత్తమ కోచ్గా పుల్లెల గోపీచంద్ ఎంపిక కాగా.. ఉత్తమ జట్టుగా భారత బ్యాడ్మింటన్ బందం అవార్డు అందుకుంది. గోపికి ఈ అవార్డును మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ అందజేశారు.
సరకు రవాణాలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు
దక్షిణ మధ్య రైల్వే సరకు రవాణాలో నూతన రికార్డును సష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందుగానే సరికొత్త మైలు రాయికి చేరింది. మార్చి 18 నాటికే రూ.10,745 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం రూ.2,414 కోట్లు అధికంగా గడించింది. అన్నిరకాలు కలిపి 117.16 మిలియన్ టన్నుల సరకుల్ని రవాణా చేసింది.
వార్తల్లో వ్యక్తులు
లోక్పాల్గా జస్టిస్ పినాకి చంద్రఘోష్
భారత తొలి లోక్పాల్గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నియమితుల య్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవనం 2019 మార్చి 19న అధికారిక ప్రకటనను విడుదల చేసింది. పారా మిలటరీ దళమైన సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) మాజీ అధిపతి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్కుమార్ జైన్తోపాటు మహేంద్రసింగ్, ఇందర్జీత్ ప్రసాద్ గౌతమ్లు నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా నియమితులయ్యారు. జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ప్రదీప్కుమార్ మహంతి, జస్టిస్ అభిలాషాకుమారి, జస్టిస్ అజరుకుమార్ త్రిపాఠిలు జ్యుడిషియల్ సభ్యులుగా ఎంపికయ్యారు.
శక్తిమంతమైన జడ్జి పదవికి నియోమీరావు ఎంపిక
భారత-అమెరికన్ న్యాయవాది నియోమీరావు శక్తిమంతమైన ఫెడరల్ జడ్జిగా ఎంపిక య్యారు. ఈ మేరకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. నియోమీరావు డీసీ సర్క్యూట్ అపీళ్ల కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. దేశంలో శక్తిమంతమైన ధర్మాసనాల్లో ఇది ఒకటి. అమెరికా సుప్రీంకోర్టు తర్వాతి స్థానంలో ఇది ఉంది. నియోమీ నియామకాన్ని సెనేట్ 53-46 ఓట్లతో ఆమోదించింది.
ఎల్ఐసీ ఎండీగా సుశీల్ కుమార్
ఎల్ఐసీ దక్షిణ మధ్య జోనల్ మేనేజర్గా పనిచేసిన టి.సి. సుశీల్కుమార్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితుల య్యారు. తెలంగాణలో రైతు బీమా, ఆంధ్రప్రదేశ్లో చంద్రన్న బీమా తదితర పథకాల అమల్లో కీలక భూమిక పోషించారు. కర్ణాటకలోనూ పలు ప్రభుత్వ పథకాల అమలుకు ఒప్పందాలు కుదిరాయి. ఈయనతోపాటు పశ్చిమ ప్రాంత జోనల్ మేనేజర్గా పనిచేసిన విపిన్ ఆనంద్ను కూడా ప్రభుత్వం ఎండీగా నియమించింది.
ఇన్టాక్ సభ్యుడిగా వేదకుమార్
ఇన్టాక్(ఇండియన్ నేషనల్ ట్రస్టు ఫర్ ఆర్ట్, కల్చరల్ హెరిటేజ్) పాలకమండలి సభ్యుడిగా పర్యావరణవేత్త మణికొండ వేద కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. 2019 మార్చి 16న ఢిల్లీలో జరిగిన 2019 ఇన్టాక్ ఎన్నికల్లో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడిగా ఆయన రెండోసారి ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా చారిత్రక సంపదను కాపాడటం కోసం మూడు దశాబ్దాలుగా వేదకుమార్ కషి చేస్తున్నారు. వేదకుమార్ వత్తిరీత్యా ఇంజినీర్. ప్రవత్తి రీత్యా చారిత్రిక వారసత్వ సంపద పరిరక్షణ కార్యకర్త. 2001 నుంచి ఆయన ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. 2012 నుంచి 2014 వరకు ఇన్టాక్ ఏపీ శాఖకు కో-కన్వీనర్గా కొనసాగారు.
నైజీరియా విద్యార్థినికి 20 స్వర్ణాలు
అంతర్జాతీయ సాంస్కతిక వినిమయంలో భాగంగా మైసూరు విశ్వవిద్యాలయంలో చదువుతున్న నైజీరియా విద్యార్థిని ఎమెలైఫ్ స్టెల్లా చిమేలో 20 స్వర్ణ పతకాలు అందుకున్నారు. 2019 మార్చి 17న నిర్వహించిన విశ్వవిద్యా లయం 99వ స్నాతకోత్సవంలో భాగంగా ఎమ్మెస్సీ రసాయనశాస్త్ర విద్యార్థిని స్టెల్లా చిమేలో 20 స్వర్ణపతకాలతో పాటు 5 నగదు పురస్కారాలు అందుకున్నారు. భవిష్యత్తులో బోధన రంగంలో స్థిరపడాలని స్టెల్లా ఆశిస్తున్నారు. విశ్వవిద్యాలయ చరిత్రలో ఇన్ని పతకాలు సాధించటం ఇదే తొలిసారి. సింగపూర్కు చెందిన నన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య బి.వి.చౌదరి, మైసూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య హేమంతకుమార్ విద్యార్థులకు పట్టాలు అందించారు.
బాక్సర్ ఘనీచాంద్ మతి
జాతీయ మాజీ బాక్సింగ్ చాంపియన్, సర్వీసెస్ సీనియర్ విభాగం బాక్సింగ్ చాంపియన్ ఎస్ఏ ఘనీచాంద్(74) 2019 మార్చి 15న హైదరాబాద్లో మృతి చెందారు. రక్షణశాఖలో వివిధ హౌదాలలో పని చేసిన ఆయన వరుసగా 17 సంవత్సరాలు సర్వీసెస్కు ప్రాతినిధ్యం వహించి, 8 సార్లు జాతీయ చాంపియన్గా నిలిచాడు. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత ఆయన గోల్కొండ బాక్సింగ్ అసోసియేషన్ స్థాపించి యువకులకు బాక్సింగ్లో శిక్షణ ఇచ్చారు.
అవార్డులు
తెలంగాణ పర్యాటక థీమ్ సాంగ్కు జపాన్ అవార్డు
జపాన్లోని ఒసాకా నగరంలో 2019 మార్చి 13, 14 తేదీల్లో జరిగిన 'వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్'లో 'థీమ్సాంగ్ ఆఫ్ తెలంగాణ'కు అవార్డు లభించింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల అందాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. బెస్ట్ ఫిల్మ్ ఇన్ కల్చరల్ టూరిజం విభాగంలో ఈ అవార్డును తెలంగాణ దక్కించుకుంది. 2019 మార్చి 14న ముగింపు ఉత్సవాల్లో డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ డి.సత్యనారాయణ అవార్డును అందుకున్నారు.
పిల్లల్ని ప్రోత్సహించే పంచాయతీకి చైల్డ్-ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ అవార్డు
పిల్లల్ని ప్రోత్సహించే పంచాయతీలకు జాతీయ పురస్కారం లభించనుంది. ఇప్పటికే పంచాయతీలకు మూడు రకాల అవార్డులను అందజేస్తున్న కేంద్రం.. నాలుగో అవార్డుకు రూప కల్పన చేసింది. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించటం, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల హాజరు తీరు వంటి వాటితో సహా 8 రకాల అంశాలకు లభించే మార్కుల ప్రాతిపదికన కేంద్రం ఆయా పంచాయతీలను ఎంపిక చేస్తుంది. పంచాయతీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఇప్పటికే పంచాయతీ శక్తికరణ్ పురస్కార్, రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్, గ్రామ పంచాయతీ అభివద్ధి ప్రణాళిక.. అనే 3 రకాల పురస్కారాలను ఏటా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించే ఏప్రిల్ 24న అందజేస్తోంది. ఇపుడు 4వ రకం పురస్కారానికి రూపకల్పన చేసి ఈ విషయాన్ని తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలకు తెలిపింది. దీనికి 'చైల్డ్-ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ అవార్డు' అని నామకరణం చేసింది. ఎంపికయ్యే పంచాయతీకి రూ.5 లక్షల నగదు లభిస్తుంది.
సైన్స్టెక్నాలజి
ట్యాంకు విధ్వంసక క్షిపణి పరీక్ష విజయవంతం
భుజం మీద నుంచి ప్రయోగించే వీలున్న ట్యాంకు విధ్వంసక గైడెడ్ క్షిపణి(ఎంపీఏటీజీఎం)ని భారత్ 2019 మార్చి 14న రాజస్థాన్ ఎడారిలో విజయవంతంగా పరీక్షించింది. యుద్ధక్షేత్రంలో అత్యంత కీలకమైన ఈ అస్త్రాన్ని దేశీయంగా రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివద్ధి చేసింది.
క్యాన్సర్ చికిత్సకు నానో-బోట్లు
క్యాన్సర్ లక్షణాలను అధ్యయనం చేయడానికి కెనడా శాస్త్రవేత్తలు నానో రోబోటిక్స్ వ్యవస్థను అభివద్ధి చేశారు. ఈ వ్యాధిని గుర్తించడానికి, చికిత్సకు ఉన్న అవకాశాలను ఇది మెరుగుపరుస్తుందని వారు తెలిపారు. 'నానో-బోట్' అనే ఈ సాధనం నిజానికి ఒక జత అయస్కాంత పట్టకార్(ట్వీజర్)లా ఉంటుంది. ఇది నానో పరిమాణంలో ఉన్న పూసను అత్యంత కచ్చితత్వంతో మూడు డైమెన్షన్లలో మానవ కణంలోకి ప్రవేశ పెట్టగలదు. లేజర్ల సాయంతో నడిచే ఆప్టికల్ ట్వీజర్లకు 2018లో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కింది.
ప్రపంచంలోనే తొలిసారిగా 3 వేల కి.మీ.ల
నుంచి సర్జరీ
చైనా రాజధాని బీజింగ్లోని పీఎల్ఏ జనరల్ ఆస్పత్రిలోని పార్కిన్సన్ రోగికి దాదాపు 3,000 కిలోమీటర్ల దూరం నుంచి ఆపరేషన్ చేసి రికార్డు సృష్టించారు. డాక్టర్ ఆపరేషన్ థియేటర్కు రాకుండా నిర్వహించిన ఆ శస్త్ర చికిత్స సక్సెస్ అయ్యింది. బీజింగ్కు 3 వేల కి.మీ.ల దూరంలో ఉన్న దక్షిణ హైనన్ ద్వీపం నుంచి డాక్టర్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశాడు. ప్రపంచంలోనే తొలిసారిగా 5జీ టెక్నాలజీని వినియోగించుకుని లింగ్ జీపీ అనే డాక్టర్ రిమోట్ కంట్రోల్ ద్వారా రోగి మెదడులోకి న్యూరోస్టిమ్యులేటర్/ బ్రెయిన్ పేస్మేకర్ను ఎక్కించాడు. ఆపరేషన్ థియేటర్లో ఉన్న అన్ని పరికరాలను అక్కడి నుంచే ఆపరేట్ చేశాడు.
సోలార్ పవర్తో సముద్ర నీటి నుంచి హైడ్రోజన్ ఇంధనం
సోలార్ పవర్ను ఉపయోగించి సముద్రం నీటి నుంచి హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే పరికరాన్ని అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివద్ధి చేశారు. ఈ సరికొత్త ఆవిష్కరణతో భవిష్యత్తులో స్థిర ఇంధన వనరుల వినియోగానికి మార్గం సుగమం కానుంది. సరికొత్త సాంకేతికత సాయంతో ఉప్పు నీటి నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులను వేరు చేయడం ద్వారా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
గూగుల్కు రూ.11,600 కోట్ల భారీ జరిమానా
ఆన్లైన్ ప్రకటనల వ్యాపారంలో తన ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందనే ఆరోపణలపై గూగుల్కు ఐరోపా సమాఖ్య సుమారు రూ.11,600 కోట్ల (1.68 బిలియన్ డాలర్ల) భారీ జరిమానా విధించింది. విశ్వాసానికి విఘాతం కలిగించినందుకు గూగుల్కు ఐరోపా సమాఖ్య భారీ జరిమానా విధించడం ఇది మూడోసారి. గూగుల్కు చెందిన యాడ్సెన్స్ ప్రకటనల వ్యాపారంపై జరిమానా అంశాన్ని ఐరోపా సమాఖ్య కాంపిటీషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టగర్ బ్రస్సెల్లో 2019 మార్చి 20న ప్రకటించారు.
క్రీడలు
టోక్యో ఒలింపిక్స్కు ఇర్ఫాన్
భారత అథ్లెట్ కె.టి.ఇర్ఫాన్ 2020 టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. జపాన్లోని నోమిలో జరిగిన ఆసియా రేస్ వాకింగ్లో 20 కి.మీ విభాగంలో 4వ స్థానంలో నిలవడం ద్వారా ఇర్ఫాన్.. టోక్యో బెర్తు సంపాదించాడు. 29 ఏళ్ల ఈ కేరళ అథ్లెట్.. ఈ రేసును గంటా 20 నిమిషాల 57 సెకన్లలో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్ అర్హతా ప్రమాణాన్ని (1 గంట 21 నిమిషాలు) అందుకున్నాడు. ఈ ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత తొలి అథ్లెట్ ఇర్ఫానే. 2012 లండన్ ఒలింపిక్స్లో ఇర్ఫాన్ జాతీయ రికార్డు(1:20:21 సె) సష్టించి 10వ స్థానంలో నిలిచాడు.
కర్ణాటకకు ముస్తాక్ అలీ ట్రోఫీ
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని కర్ణాటక కైవసం చేసుకుంది. 2019 మార్చి 14న ఇండోర్లో జరిగిన ఫైనల్లో కర్ణాటక 8 వికెట్ల తేడాతో మహారాష్ట్రను ఓడించింది.
ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్షిప్లో
భారత్కు 4వ స్థానం
ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు అద్భుత పోరాటానికి అనుకున్న ఫలితం దక్కలేదు. త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్న భారత్ 4వ స్థానంలో నిలిచింది. 2019 మార్చి 14న కజకిస్తాన్లోతోని ఆస్తానాలో రష్యాతో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్లో భారత్ ఓడిపోయింది. భారత్ 11 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. 16 పాయింట్లతో రష్యా స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, 13 పాయింట్లతో ఇంగ్లండ్ రజతాన్ని, చైనా (12 పాయింట్లు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాయి.
శ్రీశాంత్పై జీవితకాల నిషేధం ఎత్తివేత
2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణానికి సంబంధించి మాజీ క్రికెటర్ శ్రీశాంత్పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. అది మరీ కఠినమైన శిక్ష అని చెప్పిన కోర్టు.. అతడికి ఎంత శిక్ష విధించాలనే దానిపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐని ఆదేశించింది. శిక్షను సమీక్షించే ముందు బీసీసీఐ కమిటీ శ్రీశాంత్ వాదనలను వినాలని న్యాయమూర్తులు అశోక్ భూషణ్, కేఎం జోసెఫ్లతో కూడిన ధర్మాసనం చెప్పింది. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో అతడు దోషి అని తేల్చడాన్ని మాత్రం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.
ISLఛాంప్ బెంగళూరు
ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ 5వ సీజన్లో బెంగళూరు ఎఫ్సీ విజేతగా నిలిచింది. 2019 మార్చి 17న సాగిన ఫైనల్లో బెంగళూరు 1-0తో గోవా ఎఫ్సీని ఓడించింది. అదనపు సమయంలో (116వ ని) రాహుల్ కొట్టిన గోల్తో బెంగళూరు విజేతగా నిలిచింది.
2020 ఒలింపిక్స్కు బుల్లెట్ టార్చ్
2020 టోక్యో ఒలింపిక్స్ టార్చ్ను నిర్వాహకులు 2019 మార్చి 20న ఆవిష్కరించారు. వికసించే చెర్రీ పుష్పం ఆకారంలో టార్చ్ను రూపొందించారు. జపాన్లో బుల్లెట్ రైలు తరహా ఆకతిలో సంప్రదాయ సుకుర గుర్తును ప్రేరణగా తీసుకొని ఈ టార్చ్ను తయారు చేశారు. 2011 సునామి బాధితుల కోసం తాత్కాలికంగా ఇళ్లు నిర్మించిన తర్వాత మిగిలిన అల్యూమినియం వ్యర్థాలతో రూపొందించిన ఈ టార్చ్ 71 సెంటీమీటర్ల పొడవు, 1.2 కేజీల బరువు ఉంది. 2020 మార్చి 26న ఫుకుషిమాలో టార్చ్ ర్యాలీ మొదలవుతుంది.
Authorization