అంతర్జాతీయం
బ్రెగ్జిట్ గడువు అక్టోబర్ 31 వరకు పెంపు
యూరోపియన్ యూని యన్(ఈయూ) నుంచి బ్రిటన్ విడిపోయేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ గడువు మరోసారి పెరిగింది. బ్రెగ్జిట్ గడువు 2019 ఏప్రిల్ 12తో ముగియనున్న నేపథ్యంలో మరో 6 నెలలు అంటే 2019 అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు ఈయూ తెలిపింది. ఈ గడువులోగా బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంటు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని థెరెసా మేకు సూచించింది. బెల్జియంలోని బ్రస్సెల్స్లో 2019 ఏప్రిల్ 11న సమావేశమైన 28 ఈయూ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనల మేరకు 2019 మే 23న జరిగే ఈయూ ఎన్నికల్లో బ్రిటన్ పాల్గొనాల్సి ఉంటుందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్క్లౌడే జంకర్ తెలిపారు.
మాల్దీవుల్లో నషీద్ పార్టీ విజయం
మాల్దీవుల జాతీయ పార్లమెంటు (పీపుల్స్ మజ్లీస్)కు జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ నేతత్వంలోని మాల్దీవియన్ డెమోక్రటిక్ పారీ ్ట(ఎండీపీ) ఘన విజయం సాధించింది. 87 స్థానాలకు గాను మూడింట రెండొంతుల సీట్లను కైవసం చేసుకున్నారు. మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ నేతత్వంలోని ప్రోగ్రెసివ్ పార్టీ ఘోర పరాజయం పాలైంది.
శ్రీలంకలో నూతన రైల్వేలైన్ ప్రారంభం
శ్రీలంకలో హంబన్తోట రాష్ట్రంలోని మటారా-బెలియత్త మధ్య నిర్మించిన నూతన రైల్వే మార్గాన్ని 2019 ఏప్రిల్ 9న శ్రీలంక ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో 1948లో శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రారంభించిన తొలి రైల్వేలైన్గా ఇది నిలిచింది. 26.75 కి.మీ పొడువున్న ఈ రైల్వేలైన్ను చైనా సహకారంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ఎగ్జిమ్ బ్యాంకు ఆర్థిక సహకారం అందించగా నేషనల్ మెషినరీ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రాజెక్టును నిర్మించింది.
సూడాన్లో సైనిక తిరుగుబాటు
ఆఫ్రికా దేశం సూడాన్లో సైనిక తిరుగుబాటు జరిగింది. దేశాన్ని దాదాపు 3 దశాబ్దాల పాటు పాలించిన అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్(75)ను పదవీచ్యుతుడిని చేసి, గహ నిర్బంధంలో ఉంచినట్లు 2019 ఏప్రిల్ 11న సైన్యం ప్రకటించింది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ రాజధాని ఖార్టూమ్ వీధుల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సైన్యంలో బ్రిగేడియర్గా ఉన్న బషీర్ 1989లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దింపి, అధికారాన్ని కైవసం చేసుకున్నారు.
జాతీయం
360 మంది భారత్ ఖైదీల విడుదలకు పాక్ నిర్ణయం
తమ వద్ద ఖైదీలుగా ఉన్న 360 మంది భారతీయులను విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ 2019 ఏప్రిల్ 5న ప్రకటించింది. ఈ ఖైదీల్లో 355 మంది మత్స్యకారులు కాగా అయిదుగురు ఇతరులున్నారు.
భారత సైన్యం చేతికి ధనుష్ శతఘ్నులు
దేశీయంగా తయారుచేసిన ధనుష్ శతఘ్నులు భారత సైన్యం చేతికి అందాయి. 2019 ఏప్రిల్ 8న జబల్ పూర్లోని గన్ క్యారేజీ ఫ్యాక్టరీలో జరిగిన కార్య క్రమంలో ఆయుధ కర్మాగార బోర్డు (ఓఎఫ్బీ) 6 శతఘ్నులను అందజేసింది. 155 ఎంఎంఐ 45 క్యాలిబర్ కలిగిన దీర్ఘశ్రేణి శతఘ్నులను దేశీయంగా రూపొందించడం ఇదే మొదటిసారని ఓఎఫ్బీ చైర్మన్ సౌరభ్ కుమార్ పేర్కొన్నారు. ఇవి 38 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. ఆటోమేటెడ్ టెక్నాలజీ వల్ల మూడు నుంచి ఆరు శతఘ్నులు ఏకకాలంలో ఒకే లక్ష్యంపై కాల్పులు జరిపే వీలుంది. ఒక్కో తుపాకీకి గంటకు 42 రౌండ్లు పేల్చే సామర్థ్యం ఉంటుంది. దీని బరువు 13 టన్నుల లోపు ఉండడం వల్ల పర్వతమయ, మారుమూల ప్రాంతాలకు దీన్ని తరలించడం సులువుగా ఉంటుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది పనిచేస్తుంది. గురి చూసేందుకు ఈ శతఘ్నిలో ఇనర్షియల్ నేవిగేషన్ ఆధారిత వ్యవస్థ ఉంది. రాత్రి, పగలు తేడా లేకుండా గుళ్ల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. 114 ధనుష్ శతఘ్నుల కోసం భారత సైన్యం ఇటీవల ఓఎఫ్బీకి ఆర్డరిచ్చింది.
వరకట్న వేధింపులపై సుప్రీం కీలక తీర్పు
వరకట్న వేధింపులు, గహ హింస ఎదుర్కొనే మహిళ భర్తకు దూరంగా ఎక్కడ నివసిస్తుంటే ఆ ప్రదేశం నుంచి తన జీవిత భాగ స్వామితో పాటు మెట్టినింటి కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయవచ్చని ఫిర్యాదుల పరిధిని విస్తరిస్తూ సుప్రీంకోర్టు 2019 ఏప్రిల్ 9న తీర్పు వెలువరించింది. వివాహిత తనకు ఎదురయ్యే వేధింపులపై ఫిర్యాదు చేసే క్రమంలో ప్రాంత పరిధిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోరు నేతత్వంలోని సుప్రీం బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై వేధింపుల ఫిర్యాదులకు సంబంధించి పెళ్లికి ముందు, తర్వాత మహిళ నివసించిన ప్రాంతంతో పాటు ఆశ్రయం పొందిన ప్రాంతంలోనూ వివాహ సంబంధిత కేసులను నమోదు చేయవచ్చని బెంచ్ స్పష్టం చేసింది. యూపీకి చెందిన రూపాలి దేవి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్ధానం ఈ తీర్పు వెలువరించింది.
నదీ కాలుష్యం నియంత్రణకు కేంద్ర
పర్యవేక్షణ కమిటీ
కాలుష్యంతో కునారిల్లుతున్న 350కిపైగా నదులను పునరుజ్జీవిం పజేయడానికి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) కీలక నిర్ణయం తీసుకుంది. నదుల కాలుష్యం కారణంగా తాగునీటికి, వాతావరణానికి తీవ్రమైన హాని కలుగుతున్న నేపథ్యంలో వాటిని కాలుష్య రహితం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు అనుగుణంగా జాతీయస్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేసి, దాన్ని అమలు చేయడానికి కేంద్ర పర్యవేక్షణ కమిటీ (సీఎంసీ)ని ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ ప్రతినిధి, కేంద్ర జలవనరులు, పట్టణాభివద్ధి, పర్యావరణ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు, క్లీన్ గంగ జాతీయ కార్యక్రమం డైరెక్టర్ జనరల్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఎన్జీటీ ఛైర్పర్సన్ జస్టిస్ ఆదర్శకుమార్ గోయల్తో కూడిన ధర్మాసనం తెలిపింది. రాష్ట్రాల్లో ఇప్పటికే పనిచేస్తున్న నదీ పునరుజ్జీవన కమిటీ (ఆర్ఆర్సీ)లతో కలసి కార్యాచరణ ప్రణాళిక అమలులో 'సీఎంసీ' పాలు పంచుకుంటుంది. రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శులు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తారు. ''ఆర్ఆర్సీల పనితీరును ప్రధాన కార్యదర్శులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. జూన్ 30లోగా విధివిధానాలను ఖరారు చేయాలని చెప్పింది.
ఎన్రాన్-దభోల్ అవినీతి కేసు మూసివేత
రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, కార్పొరేట్ సంస్థలపై అవినీతి ఆరోపణలు వ్యక్తమైన ఎన్రాన్-దభోల్ విద్యుత్తు ప్రాజెక్టు కేసు కథ ముగిసింది. ఈ కేసును సుప్రీంకోర్టు 2019 ఏప్రిల్ 11న మూసివేసింది. 25 ఏళ్లపాటు సుదీర్ఘ ఆలస్యం జరిగిందని, ప్రమేయం ఉన్న పలువురు వ్యక్తులు అందుబాటులో లేకపోవడం, జ్యుడిషియల్ కమిషన్ విచారణను కొనసాగించడం వల్ల ప్రయోజనం కనిపించనందున మూసివేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి, జస్టిస్ దీపక్గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ-మద్రాస్
భారత్లోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఐఐటీ-మద్రాస్ అగ్ర స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర సాంకేతిక విద్యా సంస్థల పనితీరు ఆధారంగా రూపొం దించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2019 ఏప్రిల్ 8న ఢిల్లీలో విడుదల చేశారు. ఈ జాబితాలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) 2వ, ఐఐటీ-ఢిల్లీ 3వ స్థానం దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో 3,127 విద్యాసంస్థలు పాల్గొన్నాయి. విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్సీ-బెంగళూరు తొలి స్థానంలో నిలవగా, జేఎన్యూ, బీహెచ్యూ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
నిపుణుల లభ్యతలో హైదరాబాద్కు 3వ స్థానం
నైపుణ్యం గల ఉద్యోగులను ఆకర్షించటంలో దేశంలో మొదటి 3 నగరాల్లో హైదరాబాద్ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఎన్సీఆర్ (దేశ రాజధాని దిల్లీ ప్రాంతం), బెంగుళూరు ఉండగా, హైదరాబాద్ 3వ స్థానంలో నిలిచింది. అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ అయిన 'లింక్డ్ఇన్' 2018-19 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థానికి రూపొందించిన 'భారత ఉద్యోగస్థుల నివేదిక' ఈ వివరాలు వెల్లడించింది.
అత్యధిక డాలర్లు జమ అయిన దేశంగా భారత్
2018 ఏడాదిలో డాలర్ల రూపంలో అత్యధికంగా సొమ్ము జమ అయిన దేశంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు ఏప్రిల్ 9న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2018లో భారత్కు వివిధ దేశాల నుంచి 79 బిలియన్ డాలర్లు చేరాయి. ఆ తర్వాత చైనా (67 బిలియన్ డాలర్లు), మెక్సికో (36 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ 34 (బిలియన్ డాలర్లు), ఈజిప్ట్(29 బిలియన్ డాలర్లు) దేశాలు ఉన్నాయి. పాకిస్థాన్కు విదేశాల నుంచి నగదు పంపే వారి సంఖ్య మితంగా (7శాతం) ఉంది.
ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ర్యాంకింగ్స్లో ఢిల్లీ ఎయిర్పోర్టుకు 12వ స్థానం
ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నే షనల్ విడుదల చేసిన 2018 వరల్డ్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ ర్యాంకింగ్స్లో అమెరికాలోని హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా ఇంటర్నే షనల్ ఎయిర్పోర్టు ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 12వ స్థానంలో నిలిచింది
ఉత్తర, తూర్పు భారతాల్లో భూగర్భ జలాల్లో క్షీణత
భారత్లోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో 2005 నుంచి 2013 మధ్య భూగర్భ జలాలు వేగంగా క్షీణించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఫలితంగా లక్షల మంది ప్రజలు తీవ్ర కరవులు, ఆహార సంక్షోభం, తాగునీటి కొరతను ఎదుర్కొన్నట్లు గుర్తించారు. ఖరగ్పూర్ ఐఐటీ, కెనడాలోని అథబాస్కా విశ్వవిద్యాలయాలకు చెందిన బందం వినియోగించదగిన భూగర్భ జలాల నిల్వలపై అంచనాలు రూపొందించింది. ఇందుకోసం ప్రత్యక్ష పరిశీలనతో పాటు, ఉపగ్రహ ఆధారిత గణాంకాల్ని ఉపయోగించారు. దేశవ్యాప్తంగా 3,907 బావుల్ని పరిశీ లించారు. అసోం, పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్లో భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోయినట్లు వెల్లడైంది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్ వంటి చోట్ల భూగర్భ జలాల నిల్వలు పునరుజ్జీవనం పొందినట్లు తేలింది.
సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం
2019 ఏప్రిల్ 9న సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం నిర్వహించారు. 1965లో గుజరాత్లోని రాణ్ ఆఫ్ కచ్లో గల సర్దార్పోస్ట్ వద్ద పాకిస్థాన్ దళాలకు వ్యతిరేకంగా సీఆర్పీఎఫ్ చూపిన ధైర్య సాహసాలకు ప్రతీకగా ఏటా ఏప్రిల్ 9న శౌర్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక స్థూపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ పాల్గొన్నారు.
ప్రాంతీయం
2019-20లో భారత వద్ధి 7.5 శాతం : ప్రపంచ బ్యాంక్
2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వద్ధి స్వల్పంగా పెరిగి 7.5 శాతానికి చేరొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. పెట్టు బడులు బలోపేతం కావడం కొనసాగడం, ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఎగుమతులు, వినియోగం పెరగడం కలిసి రావొచ్చని అభిప్రాయపడింది. 2018-19లో వాస్తవిక జీడీపీ వద్ధి 7.2 శాతంగా నమోదు కావొచ్చని దక్షిణాసియాపై విడుదల చేసిన నివేదిక ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ప్రపంచంలో వేగవంత వద్ధి కలిగిన పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని ఐఎంఎఫ్-ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశాల ముందు విడుదల చేసిన నివేదిక వివరించింది.
సూక్ష్మ సేద్యంలో తెలంగాణకు 8వ స్థానం
సూక్ష్మసేద్యం (డ్రిప్ ఇరిగేషన్) పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 8వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి కషి సించాయి యోజన 2018-19 వార్షిక ప్రగతి నివేదికను కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 9.61 లక్షల హెక్టార్లలో సూక్ష్మసేద్యం విస్తరించ గా అందులో 2లక్షల హెక్టార్లు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి. తెలంగాణలో కేవలం 37,875 హెక్టార్ల విస్తీర్ణం మాత్రమే పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. సూక్ష్మసేద్యం ఎక్కువగా అమలు చేసిన మొదటి 10 జిల్లాల్లో 6 జిల్లాలు ఏపీ నుంచే ఉండగా, తెలంగాణ నుంచి ఒక్క జిల్లా కూడా లేదు.
సైయంట్ ఆధ్వర్యంలో డ్రోన్ల ఫ్లయింగ్ శిక్షణ
హైదరాబాద్కు చెందిన ఐటీ, ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ ఆధ్వర్యం లో డ్రోన్ల ఫ్లయింగ్ శిక్షణ కార్య క్రమం ప్రారంభ మైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎస్ఏఏ)లతో ఒప్పందం చేసుకుంది. ఇది తెలంగాణలో తొలి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సర్టిఫైడ్ ట్రయినింగ్ అని కంపెనీ తెలిపింది.
వార్తల్లో వ్యక్తులు
రంగస్థల సవ్యసాచి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి మృతి
పురుష పాత్రలతో పాటు సక్కుబాయి, మోహిని, సత్య భామ, ద్రౌపది, చంద్రమతి తదితర సమ్మోహన పరిచే స్త్రీ పాత్రలతో అలరించి.. రంగస్థల సవ్యసాచిగా పేరొందిన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి(84) 2019 ఏప్రిల్ 7న హైదరాబాద్లో మృతి చెందారు. సినీరంగంలో మాటల రచయితగా ఉన్న సాయిమాధవ్.. సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారుడు. స్త్రీ పాత్రలంటే తానే గుర్తొచ్చే స్థాయికి ఎదగడంతో తెలుగు రంగస్థల సక్కుబాయిగా ఆయనకు పేరొచ్చింది.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా మాల్పాస్ ఎన్నిక
ప్రపంచ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా అమెరికా ఆర్థిక శాఖలో అండర్ సెక్రెటరీగా ఉన్న మాల్పాస్ 2019 ఏప్రిల్ 5న ఎన్నికయ్యారు. 63 ఏళ్ల మాల్పాస్ ప్రపంచబ్యాంకు 13వ అధ్యక్షుడిగా 5 సం||ల పాటు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు అసాంజ్ అరెస్టు
వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ను బ్రిటన్ పోలీసులు 2019 ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. బెయిలు షరతు లను ఉల్లంఘించిన అభియోగం పై ఈ చర్యను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఏడేళ్లుగా అసాంజ్ ఆశ్రయం పొందుతున్న లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయానికి వచ్చిన అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అసాంజ్ (47) ఆస్ట్రేలియాలో జన్మించారు. 2006లో వికీలీక్స్ను ఏర్పాటు చేశారు. 2010లో ఆయన అమెరికాకు చెందిన రహస్య సైనిక, దౌత్య పత్రాలను వెలువరించ డంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ సంచలనం సష్టించింది. దీనిపై అమెరికా ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈలోగా అసాంజ్పై స్వీడన్లో లైంగిక వేధింపుల అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఆరోపణలపై ఆయన బ్రిటన్లో అరెస్టయ్యారు. బెయిలుపై విడుదలయ్యారు. తనను స్వీడన్కు అప్పగించకుండా నిలువరించాలంటూ బ్రిటన్లో న్యాయ పోరాటం చేశారు. కోర్టుల్లో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అమెరికా రహస్యాలను బహిర్గతం చేసిన కేసులో తనను ఆ దేశానికి అప్పగించే ప్రమాదం ఉందని, మరణ శిక్ష ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తంచేస్తూ ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం పొందారు.
అవార్డులు
కవి కె.శివారెడ్డికి సరస్వతీ సమ్మాన్ అవార్డు
2018 సరస్వతీ సమ్మాన్ సాహితీ పురస్కారం ప్రసిద్ధ కవి కె.శివారెడ్డికి లభించింది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి తెలుగు కవి శివారెడ్డి. సాహిత్యంలో విశిష్ట సేవలందించిన వారికి ప్రతిఏటా కేకే బిర్లా ఫౌండేషన్ ఇచ్చే ఈ అవార్డు శివారెడ్డి రచించిన 'పక్కకు ఒత్తిగిలితే' కవితా సంపుటికి దక్కింది. ఈ పురస్కారం కింద ప్రశంసా పత్రంతో పాటు రూ.15 లక్షల నగదు అందజేస్తారు.
విరాట్ కోహ్లి, స్మతి మంధానలకు
విజ్డెన్ క్రికెటర్ అవార్డు
భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, స్మతి మంధానలు విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కైవసం చేసుకున్నారు. 2018లో మూడు ఫార్మాట్లలో కలిపి 2735 పరుగులు చేసిన కోహ్లి పురుషుల విభాగంలో లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అతడు ఈ ఘనత సాధించడం ఇది వరుసగా మూడోసారి. 2018లో జరిగిన వన్డేల్లో 669, టీ20ల్లో 662 పరుగులు చేసిన మంధాన మహిళల విభాగంలో అవార్డును దక్కించు కుంది. ఆమెకు ఇదే తొలి విజ్డెన్ అవార్డు. 2018 డిసెంబరులో ఐసీసీ అవార్డుల్లోనూ వీళ్లిద్దరు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. ప్రముఖ క్రికెట్ మ్యాగజైన్ విజ్డెన్ 1889 నుంచి క్రికెటర్లకు అవార్డులను ప్రధానం చేస్తోంది.
ఏడుగురు భారతీయులకు 'గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్షిప్'
గేట్స్ కేంబ్రిడ్జ్ స్కాలర్షిప్-2019కు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఎంపికైన 90 మంది పోస్టుగ్రాడ్యుయేట్లలో ఏడుగురు భారతీయులున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం 2019 ఏప్రిల్ 11న ప్రకటన చేసింది. వీరు ఆయా సబ్జెక్టులలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తారు. ఈ స్కాలర్ షిప్కు ఎంపికైన అత్యంత ప్రతిభాశీలురైన ఏడుగురు భారతీయుల్లో నికిత ముమ్మిడివరపు(హిస్టరీ, ఫిలాసఫీ) ధవ్ నందమూడి (బయాలాజికల్ సైన్సెస్)లతో పాటూ అర్జున్ అశోక, రితికా సుబ్రమణియన్ (జెండర్ స్టడీస్), కనుప్రియాశర్మ (క్రిమినాలజీ), అవని వీయిరా(ఆంగ్లం), నిషాంత్ గోఖలే(లీగల్ స్టడీస్)లున్నారు.
సైన్స్ and టెక్నాలజీ
అమెరికాలో 6 కోట్ల ఏళ్ల చేప శిలాజం గుర్తింపు
అమెరికాలోని కన్సస్ యూని వర్సిటీ పరిశోధ కులు 6 కోట్ల సంవత్సరాల కిందటి చేప శిలాజాన్ని కనుగొన్నారు. యూని వర్సిటీకి చెందిన పరిశో ధకుడు రాబర్ట్ డీపాల్మా, ఆయన సహచరులు కలసి చాలా జీవులకు చెందిన అరుదైన శిలాజాలను వెలికితీశారు. 6 కోట్ల ఏళ్ల కిందట భూమిని ఓ గ్రహశకలం ఢకొీన్నప్పుడు దాదాపు 75 శాతం జంతు, వక్ష జాతులు అంతరించి పోయాయి. ఈ విపత్తు వల్లే డైనోసార్లు కూడా అంతరించి పోయాయి. ఆ సమయంలో పలు జాతులకు చెందిన జంతువులు, చేపలు కూడా చనిపోయాయి. అవన్నీ శిలాజంగా మారి ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. నార్త్ డకోటా ప్రాంతంలో దీన్ని పరిశోధకులు గుర్తించారు.
అంతరిక్షంలో బ్యాక్టీరియా బెడద
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం(ఐఎస్ఎస్)లో బ్యాక్టీరియా, శిలీంధ్రం వంటి సూక్ష్మ జీవులు ఉన్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన శాస్త్రవేత్తల బందం గుర్తించింది. దీంతో అక్కడి వ్యోమగాముల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఐఎస్ఎస్లో భూమిపై ఉండే జిమ్, ఆస్పత్రుల్లో ఉండే అన్ని సూక్ష్మజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. వీటిని కనుగొనడం వల్ల వ్యోమగాముల ఆరోగ్య సంరక్షణ కోసం, అంతరిక్షంలోకి ప్రయాణం చేసేటప్పుడు, అక్కడ నివసించేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవచ్చని నాసా పేర్కొంది.
అరుణ గ్రహంపై జీవం
అంగారకుడికి చెందిన ఉల్కపై బ్యాక్టీరియా ఉందని లండన్కు చెందిన పరిశోధకులు గుర్తించారు. దీన్ని బట్టి అంగారకుడిపై ఒకప్పుడు జీవం ఉండొచ్చని భావి స్తున్నట్లు తెలిపారు. 1977-78 మధ్య అంటా ర్కిటికా ప్రాంతంలో జపాన్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ జరుపుతున్న తవ్వకాల్లో ఏఎల్హెచ్-77005 అనే ఉల్క దొరికినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. దీనిపై హంగేరియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ, ఎర్త్ సైన్సెస్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఉల్కను అధ్యయనం చేసి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉల్క లోపల సేంద్రియ పదార్థ రూపంలో బ్యాక్టీరియా ఉందని కనుగొన్నట్లు ఇల్డికో గ్యొల్లరు అనే శాస్త్రవేత్త తెలిపారు.
కష్ణబిలం ఫొటో తొలిసారి ఆవిష్కరణ
విశ్వంలో సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రాలనూ స్వాహా చేసే కష్ణబిలం (బ్లాక్ హోల్) ఫొటో మొట్ట మొదటి సారిగా మానవాళి ఎదుట ఆవిష్కత మైంది. గురుత్వాకర్షణ కవచం సాయంతో మనకు కనిపించకుండా విశ్వంలో హల్చల్ చేస్తున్న ఈ ఖగోళ వింతను భారీ టెలిస్కోపు సాయంతో శాస్త్రవేత్తలు క్లిక్మని పించారు. చీకటిమయంగా ఉన్న కేంద్రభాగం, చుట్టూ నారింజ రంగు తేజస్సును వెదజల్లు తున్న శ్వేతవర్ణపు వేడి వాయువు, ప్లాస్మాతో ఈ కష్ణబిలం చిత్రం అద్భుతంగా ఉంది. గత 30 ఏళ్లలో చిత్రకారులు వేసిన ఊహాచిత్రంలానే ఉంది. ఇది అద్భుతమైన సాంకేతిక విజయమని ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఖగోళ భౌతికశాస్త్రవేత్త పాల్మెక్ నమారా చెప్పారు. బ్రసెల్స్, షాంఘై, టోక్యో, వాషింగ్టన్, శాంటియాగో, తైపైలో ఏకకాలంలో శాస్త్రవేత్తలు విలేకర్ల సమావేశంపెట్టి ఈ చిత్రం గురించి వివరించారు.
పుప్పొడి రేణువులతో ఆస్తమా గుర్తింపు
ఆస్తమాను ముందుగానే పసిగట్టడంలో పుప్పొడి రేణువులు సహాయపడుతాయని అధ్యయనంలో వెల్లడైంది. తమ పరిశోధనలో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ పరిశోధకులు.. పలువురు వ్యక్తుల వద్ద కొన్ని రకాల పుప్పొడి రేణువులను ఉంచారు. అప్పుడు ఆస్తమా, క్రానిక్ ఆబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్(సీవోపీడీ) బారిన పడే అవకాశం ఉన్న వారిలో ఎక్కువగా తుమ్ములు, ఆయాసం వంటి అలర్జీ లక్షణాలు రావడం గమనించినట్లు తెలిపారు. ఈ మేరకు ది జర్నల్ నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్లో ఒక కథనం ప్రచురితమైంది.
పర్యావరణహిత రోబోలు రూపొందించిన
భారతీయ విద్యార్థి
అబుధాబిలో నివసి స్తున్న సాయినాథ్ మణికందన్ అనే భారతీయ విద్యార్థి రెండు వేర్వేరు పర్యా వరణ హిత రోబోలకు రూప కల్పన చేశాడు. సముద్రం లోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేయడానికి ''ఎంబాక్ క్లీనర్'', వ్యవసాయంలో ఉపకరించే ''అగ్రి బాట్'' అనే రెండు వినూత్న రోబోలను తయారు చేశాడు. ప్రస్తుతం ఇతడు జెమ్స్ యునైటెడ్ ఇండియన్ స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్నాడని ఖలీజ్టైమ్స్ పేర్కొంది. ఈ రెండు రోబోలు వేడి వాతావరణం ఎక్కువగా ఉండే యూఏఈ వంటి దేశాలకు ఎంతో ఉపయోగ పడతాయని కితాబిచ్చింది. ఎంబాట్ అనే రోబో నమూనాతో సముద్రజలాలపై పేరుకుపోయిన వ్యర్థాలను ఏరివేయవచ్చు. ఇది చూడటానికి పడవలా ఉంటుంది. దీనికి అమర్చిన రెండు మోటార్లతో ఎలా కావాలంటే అలా తిప్పవచ్చు. బ్యాటరీలు బదులు సోలార్ ఫలకలూ వాడుకోవచ్చు. జలాల స్వచ్ఛతను కాపాడటానికి ఈ రోబో ఎంతో ఉపయోగపడుతుంది'' అని మణికందన్ తెలిపాడు. సోలార్ ఫలకాల సాయంతో పనిచేసే అగ్రిరోబోతో పొలంలో మట్టి తవ్వొచ్చని, విత్తనాలు నాటవచ్చని వివరించాడు.
క్రీడలు
ఈఎస్పీఎన్ ఉత్తమ క్రీడాకారిణిగా పీవీ సింధు
ఈఎస్పీఎన్ భారత్ ప్రకటించిన క్రీడా అవార్డుల్లో పీవీ సింధు 2019 ఉత్తమ మహిళా క్రీడా కారిణి (ఫిమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్) గా నిలిచింది. 2018లో ఆమె సాధించిన విజయాలకు గాను ఈ ఘనత దక్కింది. జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్చోప్రా 2019 ఉత్తమ ఆటగాడి అవార్డు (మేల్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ది ఇయర్) సొంతం చేసుకున్నాడు. సైనా నెహ్వాల్ 'కమ్బ్యాక్ ఆఫ్ ది ఇయర్' అవార్డు సొంతం చేసుకుంది. భారత షూటింగ్ జట్టు కోచ్ జస్పాల్ రానా ఉత్తమ కోచ్ అవార్డు కైవసం చేసుకున్నాడు. అభినవ్ బింద్రా, అశ్విని నాచప్ప, మనీష మల్హోత్రా లాంటి వాళ్లతో కూడిన 14 మంది సభ్యుల న్యాయనిర్ణేతల బందం ఈ అవార్డులకు ఆటగాళ్లను ఎంపిక చేసింది.
ఆసియా చెస్లో శ్రీశ్వాన్కు రెండు స్వర్ణాలు
ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్లో హైదరాబాద్ ప్లేయర్ శ్రీశ్వాన్కు రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం లభించాయి. శ్రీలంకలోని వాస్కదువా వేదికగా ఏప్రిల్ 10న జరిగిన ఈ టోర్నీలో అండర్-14 బాలుర వ్యక్తిగత విభాగంలో శ్రీశ్వాన్ చాంపియన్గా నిలిచాడు. మరోవైపు క్లాసికల్ టీమ్ కేటగిరీలో స్వర్ణాన్ని కైవసం చేసుకున్న శ్రీశ్వాన్... ర్యాపిడ్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. అండర్-8 బాలుర విభాగంలో మేకల మహేంద్ర తేజ రన్నరప్గా నిలిచాడు.
లిన్ డాన్కు మలేసియా ఓపెన్ టైటిల్
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీ మలేసియా ఓపెన్లో లిన్ డాన్(చైనా) విజేతగా నిలిచాడు. 2019 ఏప్రిల్ 7న కౌలాలంపూర్లో జరిగిన ఫైనల్లో డాన్ తన జూనియర్ చెన్ లాంగ్(చైనా)పై విజయం సాధించాడు. డాన్ చిరకాల ప్రత్యర్థి, క్యాన్సర్ నుంచి చికిత్స పొందుతూ ఆటకు దూరంగా ఉన్న లీ చోంగ్ వీ (మలేసియా) విజేతకు బహుమతి అందజేశారు. మహిళల సింగిల్స్ టైటిల్ను వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ (తైపీ) వరుసగా మూడో సారి గెలుచుకుంది. ఫైనల్లో తై జు అకానె యామగుచి(జపాన్)ను ఓడించింది. డబుల్స్ ఈవెంట్లన్నీ చైనా షట్లర్లే గెలుచుకున్నారు.
జాతీయ హాకీ కోచ్గా గ్రాహం రీడ్
భారత పురుషుల హాకీ జట్టు కోచ్గా ఆస్ట్రేలియాకు చెందిన గ్రాహం రీడ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. రీడ్ను కోచ్గా నియమించాలంటూ హాకీ ఇండియా చేసిన ప్రతి పాదనకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సారు) 2019 ఏప్రిల్ 8న ఆమోదం తెలిపింది. 2020 చివరి వరకూ రీడ్ భారత జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నాడు.
షాంకీర్ చెస్ టోర్నమెంట్లో విశ్వనాథన్ ఆనంద్కు 4వ స్థానం
షాంకీర్ చెస్ టోర్నమెంట్లో విశ్వనాథన్ ఆనంద్ 4వ స్థానంలో నిలిచాడు. టోర్నీలో ఆఖరిదైన తొమ్మిదో రౌండ్లో విషీ..వెస్లీన్ తొపలోవ్ (బల్గేరియా)తో డ్రా చేసు కున్నాడు. దీంతో 4.5 పాయింట్లతో ఆనంద్.. నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్ మాగస్ కార్ల్సన్ (నార్వే) టైటిల్ గెలుచుకున్నాడు. అతను 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆఖరి రౌండ్లో కార్ల్సన్.. అలెగ్జాండర్ గ్రిషుక్ (రష్యా)ను ఓడించాడు. షాంకీర్ టైటిల్ కొట్టడం అతనికిది నాలుగోసారి.
మన్ప్రీత్ కౌర్పై నాలుగేళ్ల నిషేధం
డోప్ పరీక్షల్లో పట్టుబడ్డ షాట్ పుటర్ మన్ప్రీత్ కౌర్పై జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ(నాడా) నాలు గేళ్ల నిషేధం విధించింది. 2017లో ఆమె డోప్ పరీక్షల్లో విఫలమైంది. మన్ప్రీత్పై నిషేధం 2017 జులై నుంచి అమల్లోకి వస్తుంది. 2017 ఆసియా ఛాంపియన్షిప్లో సాధించిన స్వర్ణాన్ని, జాతీయ రికార్డు (18.86మీ)ను మన్ప్రీత్ కోల్పోనుంది. మన్ప్రీత్ 2017లో నాలుగుసార్లు డోప్ పరీక్షల్లో విఫలమైంది.
భారత్కు ఐదు మ్యాచ్ల హాకీ సిరీస్
భారత్, మలేసియా మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల హాకీ సిరీస్ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఏప్రిల్ 11న జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 1-0తో మలేసియాపై గెలుపొందింది. దీంతో 4-0తో సిరీస్ను కైవసం చేసుకుంది.
Authorization