1. బోయింగ్ 737-8 మాక్స్ విమాన ప్రమాదం ఏ దేశంలో జరిగింది?
ఎ) కెన్యా బి) ఉగాండా
సి) వెనిజులా డి) ఇథియోపియా
2. ఇటీవల ఏ రాష్ట్రంలో పురావస్తు శాస్త్రవేత్తలు చేపట్టిన తవ్వకాలలో హరప్పా సంస్కృతి నాటివని భావిస్తున్న శ్మశాన వాటిక బయటపడ్డాయి?
ఎ) హర్యానా బి) రాజస్థాన్
సి) గుజరాత్ డి) పంజాబ్
3. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రనాటిక్స్ (ఏఐఏఏ) 2019 సంవత్సరానికిగాను అందించే మిస్సైల్ సిస్టమ్స్ అవార్డును ఎవరు అందుకున్నారు?
ఎ) కె.శివన్ బి) సోమ్నాథ్
సి) సతీష్రెడ్డి డి) అజిత్ కుమార్ మహంతి
4. సముద్ర జీవుల పరిరక్షణ కోసం కృషికి గాను అందించే ప్రతిష్టాత్మక 'ఫ్యూచర్ ఆఫ్ నేచర్' అంతర్జాతీయ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
ఎ) దివ్య కర్నాడ్ బి) ఫెర్నాండ్ అబ్రా
సి) ఎన్ సెంగిమన డి) పైవారందరూ
5. కింద ఇచ్చిన జతలలో సరికానిది ఏది?
ఎ) చమేలీదేవి జైన్ అవార్డ్ (2018) - ప్రియాంక దూచే
బి) నారీ శక్తి పురస్కారం (2018) - రాధాదేవి
సి) జాతీయ స్టెమ్ ఎడ్యుకేషన్ అవార్డు (2019) - కావ్య కొప్పారపు
డి) పరమ్ విశిష్ట్సేవా మెడల పురస్కారం (2019) - అనిల్కుమార్
6. ప్రతిష్టాత్మకమైన గాంధీ శాంతి బహుమతులను అందించిన సంవత్సరాల ఆధారంగా జతచేయండి?
1.వివేకానంద కేంద్రం ఎ. 2016
2. అక్షయపాత్ర ఫౌండేషన్ డ
సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ బి. 2015
3. ఏకల్ అభియాన్ ట్రస్టు సి. 2013
4. మెహియే ససాకవా డి. 2017
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
బి) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
డి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
7. బయోపెస్టిసైడ్ అంతర్జాతీయ సదస్సు (బయోకాన్- 2019) జీవన సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
ఎ) స్వర్ణలత బి) ఉషారాణి
సి) కొప్పారపు కావ్య డి) మునుస్వామి శాంతి
8. తెలంగాణకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1.తృణధాన్యాల సగటు దిగుబడి విషయంలో తెలంగాణ పంజాబ్, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో నిలిచింది.
2. నూనె గింజల ఉత్పత్తిలో 2014 - 15 నందు 6.30 లక్షల టన్నుల నుంచి 2016 - 17 కి 7.23 టన్నులకు చేరింది
3. చెరుకు సాగు విస్తీర్ణం 38 వేల హెక్టార్ల నుంచి 29 వేల హెక్టార్లకు తగ్గింది. దిగుబడి కూడా 33.43 లక్షల టన్నుల నుంచి 20.61 లక్షల టన్నులకు చేరింది
4. మాంసం ఉత్పత్తి ఏటా పెరుగుతోంది. 2015 - 16లో 5.42 లక్షల టన్నులుండగా 2017-18 నాటికి 6.45 లక్షల టన్నులకు చేరింది.
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 4 డి) పైవన్నీ
9. దేశంలో ఎదుగుదల లోపంతో బాధపడుతున్న ఐదేండ్లలోపు చిన్నారుల కోసం కేంద్రం ప్రవేశ పెట్టాలని యోచిస్తున్న పథకం ఏది?
ఎ) చిన్నారి రక్ష బి) ఇల్లు, చిన్నారి, రక్షణ
సి) ఇంటి వద్దే చిన్నారుల సంరక్షణ
డి) చిన్నారుల అభయ సంరక్ష
10. నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఏఈ) ఆధ్వర్యంలో జాతీయ అంతర్జాతీయ విత్తన వాణిజ్యాన్ని పెంచేందుకు భారత విత్తన సదస్సును మార్చి 11, 12 తేదీల్లో ఎక్కడ నిర్వహించారు?
ఎ) బెంగుళూరు బి) చెన్నై
సి) ఢిల్లీ డి) హైదరాబాద్
11. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మృతి చెందడం తో, ఆయన స్థానంలో ఎవరు ఎన్నికయ్యారు?
ఎ) ప్రమోద్ సావంత్ బి) లక్ష్మీకాంత్ పర్సేకర్
సి) దివాకర్ కామత్ డి) ప్రతాప్సింగ్ రాణే
12. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ప్రపంచ సంతోషం నివేదిక (వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్) - 2019 భారత్ ఏ స్థానంలో నిలిచింది?
ఎ) 140 బి) 133 సి) 137 డి) 130
13. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న పాకిస్థాన్ సెనేట్కు అధ్యక్షత వహించిన తొలి హిందూ దళిత మహిళ ఎవరు?
ఎ) నిర్మలా దేశారు బి) కృష్ణకుమారి కోహ్లి
సి) సుమన్ కుమారి డి) అనితా కుమారి
14. కింద ఇచ్చిన వాటిలో సరికానిది ఏది?
1. ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నూతన చైర్మన్ - ఎం.ఆర్.కుమార్
2. హిందూస్థాన్ జింక్ కంపెనీ చైర్మన్ - కిరణ్ అగర్వాల్
3. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) చైర్మన్ - హస్ముఖ్ అదియా
4. భారత క్రికెట్ నియంత్రణ మండలి అంబుడ్స్మన్ - రవ్నీత్ గిల్
ఎ) 1 మాత్రమే బి) 1, 2 మాత్రమే
సి) 2, 4 మాత్రమే డి) 4 మాత్రమే
15. రక్షణ మంత్రిత్వ శాఖ సారధ్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) నూతన చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
ఎ) కిరణ్ అగర్వాల్ బి) సిద్దార్థ్ మిశ్రా
సి) సునీల్ చౌదరి డి) డి.కె.జైన్
16. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే బౌరాపూర్ భ్రమరాంబ జాతరకు ఫిబ్రవరి 27న రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. అయితే ఈ జాతరను నిర్వహించే తెలంగాణలోని గిరిజన తెగ ఏది?
ఎ) లంబాడాలు బి) కొలామ్లు
సి) మైస్త్రం వంశీయులు డి) చెంచులు
17. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'ఆయుష్మాన్ భారత్' అమలులో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది?
ఎ) తెలంగాణ బి) ఆంధ్రప్రదేశ్
సి) మహారాష్ట్ర డి) హర్యానా
18. మహిళా ప్రయాణికుల భద్రత కోసం 'అభయ ఆటో' లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఏ నగరంలో అందుబాటులోకి తీసుకు వచ్చింది?
ఎ) తిరుపతి బి) విశాఖపట్నం
సి) రాజమండ్రి డి) విజయవాడ
19. 2020లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిధ్యం ఇవ్వనుంది?
ఎ) భారత్ బి) జపాన్
సి) దక్షిణ కొరియా డి) స్పెయిన్
20. ఆసియా హాకీ సమాఖ్య - 2018 సంవత్సరం ఉత్తమ ఆటగాడి అవార్డు ఎవరు గెలుచుకున్నారు?
ఎ) హర్మన్ప్రీత్ సింగ్ బి) మన్ప్రీత్సింగ్
సి) పి.ఆర్.శ్రీజేష్ డి) మన్దీప్సింగ్
21. సయ్యద్ ముస్తాక్ అలీ టి-20 ట్రోఫీని ఏ రాష్ట్రం కైవసం చేసుకుంది?
ఎ) కర్నాటక బి) మహారాష్ట్ర
సి) గుజరాత్ డి) తమిళనాడు
22. కింది వాటిలో సరికానిది ఏది?
ఎ) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన గైడెడ్ రాకెట్ వ్యవస్థ పినాకను మార్చి 11న రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ) విజయవంతంగా పరీక్షించింది.
బి) దీనిని రాజస్థాన్లోని పోఖ్రాన్లో పరీక్షించారు
సి) దీనిని హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసింది
డి) పినాక గైడెడ్ రాకెట్ 150 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు
23. 'గోవా షిప్యార్డ్' తయారు చేసిన తీర ప్రాంత గస్తీ నౌక 'సాచెత్'ను ప్రారంభించినది?
ఎ) రామ్నాథ్ కోవింద్ బి) నిర్మలా సీతారామన్
సి) నరేంద్ర మోడీ డి) వెంకయ్యనాయుడు
24. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?
1. కృత్రిమ సూర్యుణ్ణి ఆవిష్కరించనున్న చైనా, 'హెచ్.ఎల్ - 2 ఎం టొకామాక్' పేరుతో ఈపరికరాన్ని తయారు చేశారు.
2. సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో 'కేంద్ర సంలీనం' అనే ప్రక్రియ ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది.
3. హెచ్.ఎల్-2 ఎం. టొకామాక్ లోనూ ఇదే విధానంలో శక్తి జనించనుంది
ఎ) 2 మాత్రమే బి) 3 మాత్రమే
సి) 1, 2 మాత్రమే డి) పైవన్నీ
25. కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిల్ ట్రాన్స్పోర్టు ప్రాజెక్టుకు హాని కలిగించేందుకు కుట్ర పన్నుతున్న వేర్పాటువాద ముఠాలను భారత్ ఏ దేశ సైన్యం సహాయంతో అణచివేసింది?
1. మయన్మార్ 2. థారులాండ్ 3. బంగ్లాదేశ్
ఎ) 1, 2 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 1 మాత్రమే డి) 3 మాత్రమే
26. కింద ఇచ్చిన దినోత్సవాలలో సరికానిది ఏది?
ఎ) ప్రపంచ అటవీ దినోత్సవం - మార్చి 21
బి) ప్రపంచ వాతావరణ దినోత్సవం - మార్చి 23
సి) ప్రపంచ క్షయ దినోత్సవం - మార్చి 24
డి) ప్రపంచ వికలాంగుల దినోత్సవం - మార్చి 12
27. ప్రపంచ అటవీ దినోత్సవం గురించి కింది వాటిలో సరి అయినవి ఏవి?
1. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని మార్చి 21న జరుపుకుంటారు.
2. 2019లో ఫారెస్ట్ అండ్ ఎడ్యుకేషన్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు
3. మొదటిసారిగా అటవీ దినోత్సవాన్ని 2010లో నిర్వహించారు
4. అడవి పట్ల అవగాహన కల్పించేందుకు వరల్డ్ బ్యాంక్ మార్చి 21వ తేదీన ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచించింది.
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 2, 4 డి) పైవన్నీ
28. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
ఎ) ఫిబ్రవరి 24 బి) ఫిబ్రవరి 21
సి) మార్చి 21 డి) మార్చి 24
29. ప్రతీ సంవత్సరం నిర్వహించే ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని (మార్చి 9) మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహిం చారు?
ఎ) 2004 బి) 2006
సి) 2009 డి) 2001
30. 'ఇదారు' తుఫాన్ కారణంగా ఏ దేశాలకు భారీ నష్టం సంభవించింది?
1. మాలావి 2. సూడాన్
3. జింబాబ్వే 4. మొజాంబిక్
ఎ) 1, 3 బి) 1, 2, 4
సి) 1, 3, 4 డి) పైవన్నీ
31. జమ్మూకాశ్మీర్లోని ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రత్యేక అధికరణ ఏది?
ఎ) 32 ఆర్టికల్ బి) 33 ఆర్టికల్
సి) 35ఎ ఆర్టికల్ డి) 32(ఎ) ఆర్టికల్
32. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు రూపొందించిన కొత్త నిబంధనలలో సరికానిది ఏది?
ఎ) అభ్యర్థులు వరుసగా తమ ఐదేండ్ల ఆదాయ పన్ను రిటర్నులను సమర్పించాలి
బి) పన్ను రిటర్నులతో పాటు విదేశాల్లోని ఆస్తులు, అప్పుల వివరాలు కూడా చూపాలి
సి) అభ్యర్థులందరూ పాన్ నెంబర్ను తప్పనిసరిగా చూపించాల్సిన అవసరం లేదు
డి) అభ్యర్థి తనతో పాటు జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన వారి ఆస్తుల వివరాలు కూడా సమర్పించాలి
33. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాటిన్ అమెరికా దేశాల పర్యటనల గురించి సరైనది?
1. మార్చి 5 నుంచి 9 వరకు లాటిన్ దేశాలైన పరాగ్వే, కోస్టారికాల్లో పర్యటించారు
2. ఈ రెండు దేశాలలో ఉపరాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి
3. పరాగ్వే అధ్యక్షుడు మారియో అబ్డో బెనిటెజ్, కోస్టారికా అధ్యక్షుడుకార్లోస్ అల్టరాడో క్వీసాడా
4. కోస్టారికా పర్యటనలో వెంకయ్యనాయుడుకి యుఎన్ఓ ఆధ్వర్యంలోని పీస్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. అలా లభించిన తొలి భారతీయుడు ఆయనే.
ఎ) 1, 2 మాత్రమే బి) 2, 3, 4 సరైనవి
సి) పైవన్నీ సరైనవే డి) 1, 3 మాత్రమే
34. తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి మహిళ ఎవరు?
ఎ) సైనా నెహ్వాల్ బి) పి.వి.సింధు
సి) భావన కాంత్ డి) అవని చతుర్వేది
సమాధానాలు
1.డి 2.సి 3.సి 4.డి 5.డి
6.సి 7.బి 8.డి 9.సి 10.డి
11.ఎ 12.ఎ 13.బి 14.డి 15.బి
16.డి 17.బి 18.డి 19.ఎ 20.బి
21.ఎ 22.డి 23.బి 24.డి 25.సి
26.డి 27.ఎ 28.బి 29.బి 30.సి
31.సి 32.సి 33.సి 34.బి
- సి. ప్రకాశ్ రెడ్డి
మెదక్, ఫోన్: 9440783828
Authorization