అంతర్జాతీయం
సూడాన్లో సైనిక పాలన
సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ను ఆ దేశ సైన్యం 2019 ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. ఆయన్ను పదవీచ్యు తుణ్ని చేస్తు న్నట్లు రక్షణ శాఖ మంత్రి అవధ్ మహ్మద్ ఇబ్నె ఔఫ్ ప్రకటించారు. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన సూడాన్లో 3 నెలల పాటు ఎమర్జెన్సీ, రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు. అత్యయిక స్థితి ముగిసే వరకు దేశ సరిహద్దులు, విమానాశ్రయాలు మూసివేస్తున్నట్లు చెప్పారు. రెండేళ్ల అనంతరం ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 2005 నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగాన్ని రద్దు చేశారు.
యూఎన్ఓ ఆంక్షల అమలుకు పాక్ మార్గదర్శకాలు
పాక్ భూభాగంలో ఉగ్రవాద సంస్థలకు, వాటి కార్యకలా పాలకు పగ్గాలు వేయాలని, అదుపునకు చర్యలు చేపట్టాలని ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఐక్య రాజ్యసమితి 1267 ఆంక్షల (యూఎన్ ఎస్సీ)కు సంబంధించిన మార్గదర్శకాల అమలుకు పాకిస్తాన్ 2019 ఏప్రిల్ 12న శ్రీకారం చుట్టింది. నిషేధిత ఉగ్ర సంస్థలు, వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని యూఎన్ఓ ఈ ఆంక్షలు విధించింది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామాబాద్పై ఒత్తిడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే యూఎన్ఎస్సీ ఆంక్షల సంఘం, ఆర్థిక కార్యాచరణ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)ల లక్ష్యాలకు అనుగుణంగా మార్గదర్శకాల రూపకల్పన జరిగింది.
స్ట్ట్రాటజిక్ రిలేషన్షిప్ బిల్లు ప్రవేశపెట్టిన అమెరికా
అమెరికా దేశ ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో యూఎస్-ఇండియా స్ట్రెటజిక్ రిలేషన్షిప్ బిల్లును అమెరికా చట్టసభ సభ్యుల బందం పునఃప్రవేశపెట్టింది. హెచ్ఆర్-2123 పేరిట రూపొందించిన ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యుడు జోవిల్సన్ సభలో ప్రవేశపెట్టారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగ స్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందితే వ్యూహాత్మక ఆయుధాల విక్రయంలో భారత్కు ప్రాధాన్యం లభిస్తుంది. అలాగే అమెరికా నేతత్వంలోని నాటో సభ్య దేశాలైన ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ ్లతో సమాన హోదా లభిస్తుంది.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్
ప్రపంచ వ్యాప్తంగా 2019 ఏప్రిల్ 12న ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ను నిర్వహించారు. రష్యాకు చెందిన యూరి గగారిన్ 1961 ఏప్రిల్ 12న చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దీన్ని రష్యాలో కాస్మోనాటిక్స్ డేగా కూడా నిర్వహిస్తారు.
కెనడా ఉగ్రవాద నివేదికలో సిక్కు తీవ్రవాద ప్రస్తావన తొలగింపు
ఉగ్రవాదంపై రూపొందించిన నివేదికలో సిక్కు తీవ్రవాదం ప్రస్తావనను కెనడా ప్రభుత్వం తొలగించింది. దేశానికి పొంచి ఉన్న ఐదు ప్రధాన ఉగ్రవాద ముప్పుల్లో సిక్కు తీవ్రవాదం కూడా ఉందని తొలుత పేర్కొని, ఆ తర్వాత మనస్సు మార్చు కుంది. ఉగ్ర వాదంపై రూపొందిన ఈ నివేదికను తొలుత 2018 డిసెంబర్లో విడుదల చేశారు. దీనిపై సిక్కు వర్గం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్త మైంది. సిక్కు ఉగ్రవాదాన్ని ఈ జాబితాలో చేర్చడం ఇదే మొదట ిసారి. అందులో వాడిన పదజాలాన్ని మార్చాల్సిందిగా తాను కోరతానని కెనడా ప్రజా భద్రతా శాఖ మంత్రి రాల్ఫ్ గూడాలే చెప్పారు. మతాలను ఉగ్రవాదంతో ముడిపెట్టరాదన్నారు. ఆ మేరకు తాజాగా మార్పు జరిగింది. 'భారత్లోని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు హింసాత్మక విధానాలను సమర్థిస్తున్న అతి వాదులు'గా ఆ ప్రస్తావనను మార్చినట్లు నివేదిక పేర్కొంది. జాతీయం
జమ్మూకశ్మీర్-పాక్ ఆక్రమిత కశ్మీర్ నియంత్రణ రేఖ వాణిజ్యం రద్దు
జమూకశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్ మధ్య నడుస్తున్న నియంత్రణరేఖ వాణిజ్యాన్ని 2019 ఏప్రిల్ 19 నుంచి రద్దుచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వాణిజ్య మార్గాన్ని కొన్ని అవాంఛనీయ శక్తులు అక్రమ ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీ రవాణాకు వాడుకుంటున్నట్లు నివేదికలు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. నియంత్రణ రేఖకు ఇరువైపులా ఉన్న స్థానిక ప్రజల ఉత్పత్తుల మార్పిడికి అనువైన వాతావరణ కల్పిం చడానికి ప్రభుత్వం ఇక్కడ వాణిజ్యానికి అనుమతిచ్చింది. డబ్బుతో సంబం ధం లేకుండా పూర్తి వస్తు మార్పిడి పద్ధతిలో వాణిజ్యం జరుగుతున్నందున ఎలాంటి సుంకాలు విధించడంలేదు.
జనాభా పెరుగుదల రెట్టింపు
భారత్లో 2010 నుంచి 2019 మధ్య జనాభా వార్షిక సగటు 1.2 శాతంగా ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి జనాభా నిధి-యూఎన్డీఎఫ్ నివేదిక పేర్కొంది. 142 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న చైనాలో ఇదేకాలంలో పెరుగుదల 0.5 శాతం మాత్రమే. అంటే మన దేశంలో జనాభా పెరుగుదల రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. భారత్ 136 కోట్ల జనాభాతో ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉంది. ప్రపంచ జనాభా పరిస్థితి 2019 పేరిట యూఎన్డీ ఎఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్లో 0-14, 10-24 ఏళ్ల వయస్కులు 27 శాతం ఉన్నారు. 15-64 వయస్కులు 67 శాతం, 65 ఏళ్లు అంతకు పైబడినవారు 6 శాతం ఉన్నారు. 1994లో ప్రతి లక్ష మందికి మాత మరణాల నిష్పత్తి 488 కాగా 2015 నాటికి 174కు తగ్గింది.
భారత్లో 6 లక్షల మంది డాక్టర్ల కొరత
భారత్ తీవ్ర స్థాయిలో వైద్యుల కొరతను ఎదుర్కొంటోంది. మన దేశానికి 6 లక్షల మంది డాక్టర్లు, 20 లక్షల మంది నర్సులు తక్కువగా ఉన్నట్లు అంచనా. భారత్లో ప్రతి 10,189 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడే ఉన్నారు. నర్సు, రోగుల నిష్పత్తి 1ః483గా ఉంది. ఈ క్రమంలో యాంటీ బయాటిక్స్ ఇవ్వడంతో తగినంత శిక్షణ ఉన్న సిబ్బంది కొరత కారణంగా రోగులకు ప్రాణం నిలిపే మందులు అందడం లేదని నిపుణులు చెబుతున్నారు. 'సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్, పాలసీ (సీడీడీఈపీ)' ఈ నివేదిక వెల్లడించింది. భారత్లో 65 శాతం వైద్య చికిత్సలకయ్యే వ్యయం భరించలేని స్థాయిలో ఉండటంతో, ఏటా 5.7 కోట్ల మంది పేదరికం బారిన పడుతున్నట్లు తేలింది.
మానసిక రుగ్మతలుంటే మరణశిక్ష వద్దు
మరణశిక్ష పడ్డ నిందితులు దానిని అమలు చేసేలోగా తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనయితే వారిని ఉరి తీయొద్దంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 1999లో మహారాష్ట్రలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి, హతమార్చిన వ్యక్తికి ఉరిశిక్ష పడగా, ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఈ మేరకు తీర్పు చెప్పింది.
విశాఖలో ఆస్ట్రేలియా-ఇండో నేవీ విన్యాసాలు
ఆస్ట్రేలియా-ఇండోనేవీ విన్యాసాలు 2019 ఏప్రిల్ 2 నుంచి 14 వరకు విశాఖ తీరంలో జరిగాయి. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఆస్ట్రేలియా-ఇండో నావికాదళాలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయి. ఏషినెన్స్-19 పేరిట నిర్వహించిన నేవీ విన్యాసాల్లో ఆస్ట్రేలియాకు చెందిన కాన్బెర్రా, న్యూకేజల్, పరమట్టా, సక్సెస్ నౌకలతో పాటు హెలికాప్టర్లు, సబ్మెరైన్, యాంటీ సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్లు పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా నేవీతోపాటు 50 మంది అమెరికా, 20 మంది న్యూజిలాండ్ నేవీ సిబ్బంది కూడా సంయుక్త విన్యాసాలలో పాల్గొన్నారు.
జలియన్వాలాబాగ్ నరమేధానికి వందేళ్లు
జలియన్వాలాబాగ్ అమరులకు 2019 ఏప్రిల్ 13న జాతి ఘన నివాళులు అర్పించింది. 1919 ఏప్రిల్ 13న జరిగిన మారణకాండకు 2019 ఏప్రిల్ 13తో 100 సం||లు పూర్తి అయ్యాయి. 1919లో అమత్సర్ లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం బ్రిటీష్ పాలనలోని భారత చరిత్రలో అవమానకర మరకగా మిగిలిపోతుందని బ్రిటన్ ప్రధాని థెరిసా మే అన్నారు. 13న జలియన్ వాలాబాగ్ ఘటనకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంట్లో చర్చలో ఆమె ఈ మేరకు మాట్లాడారు. ఈ ఘటనపై అధికారికంగా క్షమాపణ చెప్పడానికి ఆమె నిరాకరించారు.
పెళ్లి పేరుతో లోబరుచుకోవడం లైంగిక దాడే : సుప్రీం
పెళ్లి పేరుతో మహిళను లోబరుచు కోవడం లైంగిక దాడిగా పరిగణిం చాలని, ఇది మహిళ గౌరవానికి భంగకర మేనని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చత్తీస్గఢ్కు చెందిన ఓ డాక్టర్ 2013లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించిన కేసులో చత్తీస్గఢ్ హైకోర్టు లైంగిక దాడిలో దోషిగా తేల్చింది. హైకోర్టు నిందితుడికి పదేళ్ల కఠిన శిక్షను విధించడంతో నిందితుడు కింది కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. వివాహం చేసుకునే ఉద్దేశం లేకున్నా శారీరకంగా లోబరుచుకునేందుకు పెళ్లిని సాకుగా చూపాడని, ఇది లైంగిక దాడి కిందకే వస్తుందని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
ప్రాంతీయం
మేనేజర్ ఆఫ్ ది ఇయర్గా సింగరేణి సీఎండీ
సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్ బ్రిటన్కు చెందిన అచీవ్మెంట్ ఫోరం సంస్థ ఇస్తున్న మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును 2019 ఏప్రిల్ 12న అందుకున్నారు. వత్తి నైపుణ్యంతో పాటు వినూత్న ఆలోచనలను ప్రోత్సహించే వారికి సంస్థ ఏటా ఈ పురస్కారం అందిస్తోంది. లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రాంగ ణంలో 2019 సంవత్సరానికి గాను గ్లోబల్ క్లబ్ ఆఫ్ లీడర్స్ సంస్థ అధ్యక్షులు, బిజినెస్ అలయెన్స్ వ్యవస్థాపకులు మిసెస్ క్రిస్టినాబ్రిగ్స్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఈబీఏ ఫ్రొఫెసర్ జాన్ నెట్టింగ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.
తెలంగాణలో 'మీసేవ 2.0' వెర్షన్ ప్రారంభం
తెలంగాణలో పౌర సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసేం దుకు ఐటీశాఖ 'మీసేవ 2.0' వెర్షన్ను అందు బాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి ప్రజలు 'మీసేవ' కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే దరఖాస్తు చేసుకునేందుకు ఇందులో వీలు కల్పించింది. ఇప్పటికే 'టీ-యాప్ ఫోలియో' ద్వారా పలు సేవలు అందుబాటులోకి తెచ్చిన ఐటీశాఖ తాజాగా 2.0 వెబ్వెర్షన్ ద్వారా ప్రజలు, విద్యార్థులకు తరచూ అవసరమయ్యే 37 ప్రభుత్వ-పౌర సేవలను ఇంటినుంచే పొందే వెసులుబాటు కల్పిస్తోంది. మీసేవ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పోర్టల్లో 2.0 సిటిజన్ సర్వీసెస్ను ఎంచుకుని పూర్తివివరాలతో రిజిస్టర్ చేసుకుంటే అవసరమైన పౌరసేవలు పొందేందుకు అర్హత లభిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తులో ఏమైనా సందేహాలుంటే పరిష్కారం కోసం కాల్సెంటర్ (1100 లేదా 1800 425 1110) నంబర్లలో సంప్రదించవచ్చు. 9121006471 లేదా 9121006472 నంబర్లకు వాట్సాప్ చేయవచ్చు.
వార్తల్లో వ్యక్తులు
సెస్ డైరెక్టర్గా ప్రొఫెసర్ రేవతి
సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్) నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ రేవతి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ హోదాలో ఉన్న ప్రొఫెసర్ గాలబ్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రారంభించిన ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ (ఐడీఎస్) సంచాలకుడిగా నియమితులయ్యారు. ఈ సంస్థలు రాష్ట్రాల్లో సామాజిక, ఆర్థిక సంబంధమైన మార్పులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తుంటాయి. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకూ సెస్ సేవలు అందించింది. మానవాభివద్ధి, షెడ్యూలు కులాల అభివ ద్ధి, మిషన్ భగీరథ, యూనిసెఫ్ సహకారంతో డివిజన్ ఫర్ ఛైల్డ్ స్టడీస్ లాంటి ఎన్నో నివేదికలను సెస్ రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రణాళికపై పరిశోధన (నిధుల కేటాయింపు, వినియోగం)లను కూడా చేపట్టింది.
రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్ఐఎన్ శాస్త్రవేత్త భానుప్రకాశ్రెడ్డి
పోషక జీవ రసాయన శాస్త్రంలో చేసిన పరిశోధనలకు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ-లండన్ ఫెలోగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్త డాక్టర్ జి.భానుప్రకాశ్రెడ్డి ఎంపికయ్యారు. నూతన ఫెలోగా ఎంపికైనవారి వివరాలతో ది టైమ్స్ (లండన్) పత్రిక కథనం ప్రచురిం చింది. పలు పరిశోధనలతో పాటు ఇప్పటికే ఆయన రాసిన 170 పరిశోధక పత్రాలు ప్రచురితమ య్యాయి. సూక్ష్మ పోషకాలు, వద్ధాప్యం లో వచ్చే వ్యాధులపై పరిశోధనాత్మక అధ్యయనం సాగిస్తున్నారు. ఓయూలో పీహెచ్డీ చేసిన ఆయన ప్రస్తుతం జాతీయ సైన్స్ అకాడమీ ఫెలోగా ఉన్నారు.
ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కన్నుమూత
ప్రముఖ సంపాదకుడు, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు (76) 2019 ఏప్రిల్ 12న హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయనకు భార్య త్రిపుర, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామ చంద్రాపురంలో విశ్వనాథం దంపతులకు ఆయన మొదటి సంతానంగా జన్మించారు. పూణెలో రక్షణ శాఖ సివిల్ సర్వీస్ విభాగంలో పనిచేశారు. '67లో ఆంధ్రప్రభ విజయవాడ ఎడిషన్లో సబ్ఎడిటర్గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1990 వరకు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి 91లో చీఫ్ ఎడిటర్గా పదోన్నతి పొందారు. దాదాపు 40 ఏళ్ల పాటు ఆంధ్రప్రభలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి 2007లో పదవీ విరమణ పొందారు. రాష్ట్ర విభజన అనంతరం 2015 నుంచి 2017 వరకు ఏపీ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్గా పనిచేశారు.
అవార్డులు
నరేంద్రమోడీకి రష్యా అత్యున్నత అవార్డు
భారత ప్రధాని నరేంద్రమోడీని రష్యా ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్య్రూ ది అపోస్టల్ అనే రష్యా అత్యున్నత పౌర అవార్డుతో మోడీని గౌరవించనున్నట్లు 2019 ఏప్రిల్ 12న వెల్లడించింది. మోదీకి అంతర్జాతీయ అవార్డు రావడం ఈ నెలలో ఇది రెండోసారి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కూడా తమ దేశ అత్యున్నత పౌర అవార్డు 'జయేద్ మెడల్'ను మోడికి ఇచ్చింది. ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను బలపరచడానికి మోడీ చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా ఆ దేశం ఈ అవార్డును ప్రకటించింది.
న్యూయార్క్టైమ్స్, వాల్స్ట్రీట్ జర్నల్లకు పులిట్జర్ అవార్డు
న్యూయార్క్ టైమ్స్, వాల్స్ట్రీట్ జర్నల్ పత్రికలు వేర్వేరుగా అందించిన పరిశోధనాత్మక కథనాలకుగాను పాత్రికేయ రంగంలో అందించే ప్రఖ్యాత పులిట్జర్ పురస్కారానికి ఎంపికయ్యాయి. ట్రంప్ కుటుంబం స్వార్జితమని చెప్పుకున్న సంపదకు సంబంధించిన పన్నుల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేలా వివరణాత్మక పరిశోధన కథనాలను అందించినం దుకు 'టైమ్స్' ప్రఖ్యాత పాత్రికేయ పురస్కారాన్ని గెలుచు కున్నట్లు పులిట్జర్ పురస్కార కమిటీ న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాల యంలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించింది. యెమెన్లో యుద్ధంపై కథనాలకుగాను అసోసియేటెడ్ ప్రెస్కు అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ దక్కింది. మయన్మార్లో రోహింగ్యా ముస్లింలపై జరిగిన అఘాయిత్యాలపై అందించిన కథనాలకు రాయిటర్స్ను పురస్కారంతో గౌరవించారు. వలసదారుల ప్రయాణాలపై తీసిన చిత్రాలకు కూడా రాయిటర్స్కు అవార్డు దక్కింది. ఇతర విభాగాల్లో పలు పత్రికలకు పురస్కారాలు ప్రకటించారు.
ఉత్తమ నౌకలకు అవార్డులు
తూర్పు నావికాదళంలో 2018-19 ఏడాదికిగానూ ఉత్తమ ప్రతిభ చూపిన నౌకలకు అవార్డులను అందించడంతో పాటు, వివిధ విభాగాల పనితీరును తెలుసుకునేందుకు 2019 ఏప్రిల్ 17న విశాఖపట్నంలో ఫ్లీట్ అవార్డు-2019 పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఇతర అధికారులు హాజరై బహుమ తులను అందించారు. వాటిలో ఐఎన్ఎస్ ఐరావత్ (అత్యుత్తమ వేగవంతమైన నౌక), ఐఎన్ఎస్ ఖాంజర్ (ట్యాంకరు విభాగంలో), ఐఎన్ఎస్ సాత్పురా (విధ్వంసకర నౌకల విభాగంలో) అవార్డులు అందుకున్నాయి.
సిప్లా చైర్మన్ హమీద్కు బ్రిటన్ రాయల్ సొసైటీ గౌరవం
ప్రముఖ శాస్త్రవేత్త, పారిశ్రామిక వేత్త, ఔషధ రంగ దిగ్గజ సంస్థ సిప్లా చైర్మన్ యూసుఫ్ హమీద్(82)కు బ్రిటన్ రాయల్ సొసైటీ గౌరవం దక్కింది. ప్రపం చంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కూడిన రాయల్ సొసైటీ గౌరవ ఫెలోగా హమీద్ 2019 సంవత్సరానికి ఎంపికయ్యారు. ఆయనతో పాటు 51 మందికి ఈ పురస్కారం దక్కింది. భారత సంతతి శాస్త్రవేత్తల్లో ప్రొఫెసర్ గురుదయాళ్ బెస్రా, ప్రొఫెసర్ మంజుల్ భార్గవ, ప్రొఫెసర్ అనంత్ పరేఖ్, ప్రొఫెసర్ అక్షరు వెంకటేష్లు పురస్కారానికి ఎంపిక య్యారు. బ్రిటన్ రాయల్సొసైటీ ఫెలోగా ఎంపికైన భారత తొలి మహిళా శాస్త్రవేత్తగా ప్రొఫెసర్ గగన్దీప్ కాంగ్ రికార్డు సష్టించారు. చిన్నారుల్లో వైరల్ ఇన్ఫెక్షన్లపై ఆమె పరిశోధనలు నిర్వహించారు.
జాబితాలు
పత్రికా స్వేచ్ఛ సూచీ 2019లో భారత్ 140వ స్థానం
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ 2019లో భారత్ 140వ స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్ కేంద్రంగా పని చేస్తున్న 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' ఈ సూచీని 180 దేశాలతో రూపొందించారు. జర్నలిస్టులపై దాడులు చేస్తున్న వారిలో ఎక్కువ మంది బీజేపీ మద్దతుదారులేనని ఆరోపించింది. సూచీలో నార్వే మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా పాత్రికేయుల పట్ల శుత్రుత్వ వైఖరి పెరుగుతోంది. ప్రభుత్వాలు మీడియాపై పట్టును పెంచుకుంటున్నాయి. గత ఏడాది భారత్లో ఆరుగురు భారతీయ పాత్రికేయులు హత్యకు గురయ్యారు.
సైన్స్ and టెక్నాలజి
సంతానలేమి కారణాల గుర్తించిన సీసీఎంబీ
చాలామంది పురుషుల్లో సంతానలేమి సమస్యకు వై క్రోమోజోమ్ లోని కొన్ని భాగాలను కోల్పోవడమే ప్రధాన కారణమని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ లోపం భారతీయుల్లోనే ఎక్కువని అధ్యయన కర్తలు తేల్చారు. వై క్రోమోజోమ్లోని కొన్ని భాగాల తొలగింపు కారణంగా తరచూ పునరుత్పత్తిలో వైఫల్యానికి దారి తీస్తోందని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.తంగరాజ్ నేతత్వంలో సీసీఎంబీ బందం గుర్తించారు. శుక్రకణాల (స్పెర్మాటోజ నిసెస్) ఉత్పత్తికి వై క్రోమోజోమ్లోని చాలా జన్యువులు కీలకం. 8.5 శాతం కేసుల్లో కొన్ని జన్యువులు లేకపోవడంతో వంధ్యత్వానికి కారణంగా ఇదివరకే తేల్చారు. తాజా అధ్యయనంలో సంతాన లేమికి క్రోమోజోమ్లోని అజూ స్పెర్మియా (ఏజెడ్ఎఫ్) ప్రాంతంలో కొన్ని భాగాలు కనిపించకుండా పోవడమే కారణంగా గుర్తించారు.
విశ్వంలో అత్యంత పురాతన హీలియం హైడ్రైడ్ అయాన్
విశ్వంలో అత్యంత పురాతన అణువును శాస్త్రవేత్తలు మొట్ట మొదటిసారిగా కనుగొన్నారు. హీలియం హైడ్రైడ్ అయాన్ (హెచ్ఈహెచ్ం) అనే ఈ అణువు 1400 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్బ్యాంగ్లో జనించిన తేలికపాటి మూలకాల పునఃమిశ్రమానికి నాటి ప్రత్యేక ఉష్ణోగ్రతలు దోహద పడ్డాయని వివరించారు.
మహిళల రక్షణకు 'మై సర్కిల్' యాప్
స్త్రీల కోసం ఎయిర్టెల్, ఫిక్కీ మహిళా సంస్థ(ఎఫ్ఎల్ఒ) సంయు క్తంగా 'మై సర్కిల్' అనే యాప్ను అందుబాటు లోకి తెచ్చాయి. ఈ యాప్ వినియో గించే మహిళలు తాము బాధాకరమైన లేదా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటు న్నప్పుడు సహాయం కోసం తమకు తెలిసిన ఐదుగురు సన్నిహితులకు 'ఎస్ఎంఎస్' పంపించవచ్చు. ఈ సందేశంలో ఉన్న లింక్ ఆధారంగా ఎస్ఎంఎస్ పంపిన మహిళ గూగుల్ మ్యాప్ ద్వారా లొకేషన్కు వెంటనే చేరుకోవచ్చు. ఎయిర్టెల్తో పాటు ఇతర టెలికాం ఆపరేటర్ల స్మార్ట్ఫోన్ వినియో గదారులూ ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం ఉంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, ఉర్దూ, అస్సామీ, ఒరియా, గుజరాతీ భాషల్లో ఎస్ఎంఎస్ పంపవచ్చు. ఐఒఎస్ ఆధారిత స్మార్ట్ఫోన్లలో 'సిరి' ద్వారా ప్రస్తుతం వాయిస్ కమాండ్ను కూడా యాక్టివేట్ చేసే సౌలభ్యం ఉంది.
చంద్రునిపై కూలిపోయిన స్పేస్క్రాఫ్ట్
ఇజ్రాయిల్కు చెందిన స్పేస్క్రాఫ్ట్ చంద్రునిపై కూలి పోయింది. చంద్రునిపై స్పేస్క్రాఫ్ట్ను ల్యాండ్ చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయోల్ 'స్మాల్ కంట్రీ బిగ్ డ్రీమ్స్' పేరిట ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 2019 ఏప్రిల్ 11న స్పేస్క్రాఫ్ట్ చంద్రునిపై ల్యాండ్ అవ్వాల్సి ఉంది. దీంతో ఈ ప్రయోగానికి సంబంధించిన దశ్యాలను ఇజ్రాయిల్ టీవీతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రసారం చేశారు. అయితే చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రయోగం విఫలమైంది. 7 దేశాలు చంద్రునిపై స్పేస్క్రాఫ్ట్ ల్యాండ్ చేయడానికి ప్రయత్నించగా 3 మాత్రమే విజయం సాధించాయి.
గురుత్వాకర్షణ తరంగాల రహస్యాల వెలికితీతకు ఔత్సాహికులకు శాస్త్రవేత్తల ఆహ్వానం
విశ్వంలో రెండు కష్ణబిలాలు ఢ కొట్టుకుంటున్న సమయంలో వెలువడిన గురుత్వాకర్షణ తరంగాల్లో నిక్షిప్తమైన రహస్యాలను వెలికి తీయడానికి తోడ్పాటు అందించాలని ఔత్సాహికులను శాస్త్రవేత్తలు కోరారు. ప్రపంచ వ్యాప్తంగా డెస్క్టాప్ కంప్యూటర్ల సాయంతో ఈ పని చేపట్టవచ్చని పేర్కొన్నారు. అంతరిక్ష-కాలంతో కూడిన ఒక ఊహాజనిత వలలో చెలరేగే సుడులను గురుత్వాకర్షణ తరంగాలుగా పేర్కొంటారు. విశ్వంలో మారుతున్న గురుత్వాకర్షణ క్షేత్రాలకు సంబంధించిన ముఖ్య సమాచారం వాటిలో నిక్షిప్తమై ఉంటుంది. లేజర్ ఇంటర్ ఫెరోమీటర్ గ్రావిటే షనల్-వేవ్ అబ్జర్వేటరీ (లైగో) అనే సాధనం 2015లో గురుత్వాకర్షణ తరంగాలను తొలిసారిగా గుర్తించింది.
కత్రిమ పరమాణువుల సష్టి
మొత్తం ఆప్టికల్ వ్యవస్థలున్న క్వాంటమ్ కంప్యూటింగ్ దిశగా శాస్త్రవేత్తలు పెద్ద ముందడుగు వేశారు. విడి ఫొటాన్లను ఉత్పత్తి చేసే కత్రిమ పరమాణువులను సష్టించారు. పలుచటి 2డీ హెక్సాగోనల్ బోరాన్ నెట్రైడ్ ఫలకంపై గ్యాలియం కేంద్రీకత అయాన్ పుంజంతో రంధ్రాలు పెట్టడం ద్వారా వీటిని వెలువరించారు. వీటి ద్వారా వచ్చే విడి ఫొటాన్లు క్వాంటమ్ సమాచారాన్ని మోసుకెళ్లే వాహకాలు (క్యూబిట్లు)గా వ్యవహరిస్తాయని పరిశోధనలో పాలు పంచుకున్న బెంజిమన్ జె అలెమన్ పేర్కొన్నారు. ఈ విడి ఫొటాన్లను సూక్ష్మమైన, అత్యంత సున్నితత్వం కలిగిన థర్మోమీటర్లుగా, క్వాంటమ్ కంప్యూటింగ్లో కీలకమైన 'కీ డిస్ట్రిబ్యూషన్' కుబీ క్వాంటమ్ సమాచార బదిలీ, నిల్వ, ప్రాసెస్కు ఉపయోగపడతాయని చెప్పారు.
తటాకాల నుంచే భూమిపై జీవం పుట్టుక
భూమిపై తొలినాటి జీవం పుట్టుకకు సముద్రాల కన్నా ప్రాచీన తటాకాలు/చెరువులే అనువైన వాతావరణాన్ని కల్పించినట్లు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్) పరిశోధకులు పేర్కొన్నారు. ఇలాంటి జల వనరుల్లో 10 సెంటీమీటర్ల లోతుల్లో అత్యధిక గాఢత స్థాయుల్లో ఉండే నైట్రోజన్ భూమిపై జీవం పుట్టుకకు కీలక మూలకంగా నిలిచినట్లు భావిస్తున్నారు.
మూలకణాలతో బ్లడ్ కాన్సర్కు చికిత్స
బ్లడ్ కాన్సర్ వ్యాధికి చికిత్సను అందించడంలో మూల కణాల్లోని ప్రోటీన్ ఆస్రిజ్ కీలక పాత్ర పోషిస్తుందని బెంగళూరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జేఎన్సీ ఏఎసఆర్) పరిశోధకులు ఎలుకలపై ప్రయోగం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. ట్యూమర్ సప్రెసర్ పీ53ని నియంత్రించడం ద్వారా, బ్లడ్ కేన్సర్ పెరగకుండా ఈ ఆస్రిజ్ ప్రోటీన్ దోహదపడినట్లు తమ అధ్యయనంలో తెలిసిందని పరిశోధకులు వెల్లడించారు.
కష్ణబిలం ఛాయాచిత్రం తీసిన శాస్త్రవేత్తలు
తొలిసారిగా కష్ణబిలం ఛాయా చిత్రాన్ని శాస్త్రవేత్తలు తీశారు. ఈ ఘనతను ఫ్రాన్స్ లోని నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్కు చెందిన పరి శోధకులు సాధించారు. మన పాలపుంతలోని ఎం87 నక్షత్ర సమూహం(గెలాక్సీ)లో భూమికి 5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ కష్ణబిలాన్ని ఈవెంట్ హారిజాన్ టెలిస్కోప్ సాయంతో ఫొటో తీశారు. మధ్యలో నల్లటి ప్రాంతం, చుట్టూ నారింజ రంగులో ఉన్న మంటలు, తెల్లటి ప్లాస్మా, వాయువులు ఉన్న క ష్ణబిలం చిత్రాన్ని 2019 ఏప్రిల్ 10న శాస్త్రవేత్తలు విడుదల చేశారు.
నిర్భరు క్షిపణి పరీక్ష విజయవంతం
దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన దీర్ఘశ్రేణి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భరును భారత్ 2019 ఏప్రిల్ 15న విజయవంతంగా పరీక్షిం చింది. ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో ఉన్న సమీకత పరీక్షా వేదిక (ఐటీఆర్) నుంచి ఈ పరీక్షను చేపట్టినట్లు రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్డీవో) తెలిపింది. శత్రువుల రాడార్లకు ఆచూకీ దొరకకుండా ఉండేందుకు ఈ అస్త్రం నేల నుంచి కేవలం 100 మీటర్ల ఎత్తులో పయనిస్తుంది. 0.7 మ్యాక్ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం ఉంది. తాజా పరీక్షలో ఇది 42 నిమిషాల్లోనే నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించింది.
నేల, నీటిలో పోరాడే డ్రోన్ పడవను రూపొందించిన చైనా
ప్రపంచంలోనే తొలిసారిగా రూపొందించిన సాయుధ ఉభయచర డ్రోన్ పడవను చైనా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని నీటితో పాటు నేల మీద జరిగే పోరాటాల్లోనూ ఉపయోగిం చవచ్చని పరిశోధకులు తెలిపారు. 'మెరైన్ లిజర్డ్' అనే ఈ డ్రోన్ పడవను వుచాంగ్ నౌకా నిర్మాణ సంస్థ రూపొందించింది. ఏకబిగిన 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీన్ని ఉపగ్రహాల ద్వారా రిమోట్ సాయంతో నియంత్రించవచ్చు. దీని పొడవు 12 మీటర్లు. నీటిలో శత్రువు కంటపడకుండా సంచరిస్తూ గంటకు 50 నాట్ల వేగాన్ని అందుకోగలదు. నేల మీద గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
గూగుల్, యాపిల్ యాప్ స్టోర్స్లో 'టిక్టాక్' తొలగింపు
గూగుల్, యాపిల్ తమ యాప్ స్టోర్ల నుంచి ''టిక్టాక్'' యాప్ను తొలగిం చాయి. ఈ చైనా సామాజిక మాధ్యమం ప్లాట్ఫారమ్ను తొలగించాల్సిందేనని, 2019 ఏప్రిల్ 3న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిం దేనని సుప్రీంకోర్టు కేంద్రానికి లేఖ రాయడంతో ఈ యాప్ను తొలగిం చాయి. అశ్లీలంతో కూడిన వీడియోలు విరివిగా చలామణి అవుతున్నాయంటూ మద్రాస్ హైకోర్టు.. ఇటీవల టిక్టాక్ యాప్ను మనదేశ ప్రజలకు అందుబాటులో లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అంతరిక్ష శిలల నుంచి రక్షణకు కొత్త విధానం
భూమికి సమీపంలోని చిన్నపాటి శిలలను చాలా ముందు గానే గుర్తించే ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ 'నాసా' శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనివల్ల ఆ ఖగోళవస్తువులు భూమిని ఢ కొట్టకుండా నిరోధించే చర్యలకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
క్రీడాంశాలు
ఎంసీసీ జీవితకాల సభ్యులుగా ఇంజమామ్, బౌచర్
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్, దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్లకు అరుదైన గౌరవం లభించింది. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) గౌరవ జీవితకాల సభ్యుల జాబితాలో వాళ్లకు చోటు దక్కింది. క్రికెట్కు చేసిన సేవలకు గాను వాళ్లను ఆ జాబితా లో చేరుస్తున్నట్లు 2019 ఏప్రిల్ 12న ఎంసీసీ వెబ్సైట్ పేర్కొంది.
లీడింగ్ క్రికెటర్గా విరాట్ కోహ్లి
భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా మూడో ఏడాది లీడింగ్ క్రికెటర్-2018గా నిలిచాడు. ఈ మేరకు 2019 ఏప్రిల్ 10న విజ్డన్ క్రికెటర్స్ అల్మనాక్ అవార్డులను ప్రకటిం చారు. ఈ అవార్డును మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు డాన్ బ్రాడ్మన్ (10 సార్లు), జాక్ హాబ్స్ (8 సార్లు) మాత్రమే గెలుచుకోగా... ఇప్పుడు ఆ జాబితాలో కోహ్లి చేరాడు. మహిళల విభాగంలో స్టార్ ప్లేయర్ స్మతి మంధాన లీడింగ్ క్రికెటర్గా ఎంపికైంది. మరోవైపు అప్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ఖాన్ వరుసగా రెండో ఏడాది లీడింగ్ టి20 క్రికెటర్ అవార్డుకు ఎంపికయ్యాడు.
రోహిత్యాదవ్ జాతీయ రికార్డు
జావెలిన్ త్రో ప్లేయర్ రోహిత్యాదవ్(ఉత్తరప్రదేశ్) అండర్-18 విభాగంలో జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య నిర్వహించిన జాతీయ జావెలిన్ త్రో ఓపెన్ ఛాంపియన్ షిప్లో 2019 ఏప్రిల్ 15న జరిగిన అర్హత రౌండ్లో ఈటెను 81.75 మీటర్ల దూరం విసిరిన అతను సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇదివరకు ఈ రికార్డు మహమ్మద్ హదీశ్ (79.29మీ) పేరు మీద ఉంది. హర్యానా అథ్లెట్లు అథ్లెట్లు పూనమ్ రాణి (49.53మీ), మోనిక (42.46మీ), శిల్ప (39.89మీ) అమ్మాయిల విభాగంలో వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.
వీధి బాలల ప్రపంచకప్ ప్రచారకర్తగా మిథాలీ
వీధి బాలల క్రికెట్ ప్రపంచకప్లో పోటీపడే భారత జట్టుకు మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ ప్రచారకర్తగా ఎంపికయ్యింది.
Authorization