లోక్పాల్(Lokpal)
ఆధునిక ప్రపంచ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలకు అనేక రకాల సేవలను అందిస్తున్నాయి. సేవలను అందించే విషయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినపుడు ప్రభుత్వ సంస్థలపై విచారణ జరిపి చర్య తీసుకోవాలి. ఇందుకోసం అనేక దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేశారు.
పాలనలో పౌరుల ఇబ్బందులను తొలగించడానికి ప్రజా స్వామ్య దేశాలు ఏర్పాటు చేసిన వ్యవస్థయే ''స్కాండి నేవియా అంబుడ్స్మన్'' అంతర్జాతీయ నిష్ణాతుడైన డోనాల్డ్.సి.రావత్ అంబుడ్స్మన్ వ్యవస్థ పాలన విధానా లపై సాధారణ పౌరుడు చేసే ఫిర్యాదుగా అభివర్ణిం చాడు. అంబుడ్స్మన్ వ్యవస్థను ప్రపంచంలో మొట్ట మొదటిసారిగా 1809 సంవత్సరంలో స్వీడన్లో నెలకోల్పారు. అంబుడ్ అనేది స్వీడిష్ భాషా పదం.
అంబుడ్స్మన్ అనగా ఒకరి తరుపున మాట్లాడే వ్యక్తి లేదా సంస్థ
డోనాల్డ్ సి. రావత్ ప్రకారం అంబుడ్స్మన్ అంటే పాలనా మరియు న్యాయపరమైన చర్యలకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి శాసన శాఖ(చట్టసభ) నియమించిన అధికారి.
స్వీడన్ నుంచి అంబుడ్స్మన్ వ్యవస్థ ఇతర స్కాండినివియా దేశాలైన ఫిన్లాండ్ (1919), డెన్మార్క్ (1955), నార్వే (1962)లకు విస్తరించింది.
ఈ వ్యవస్థను మొట్టమొదట ఏర్పాటు చేసుకున్న కామన్ వెల్త్ దేశం న్యూజిలాండ్.
న్యూజిలాండ్లో అంబుడ్స్మన్ వ్యవస్థను 'పార్లమెంటరీ కమిషనర్ ఫర్ ఇన్వెస్టిగేషన్, యునైటెడ్ కింగ్డమ్లో పార్లమెంటరీ కమిషనర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్'గా ఏర్పాటు చేస్తే భారతదేశంలో లోక్పాల్గా ఏర్పాటు చేశారు.
ప్రపంచంలో సుమారు 40 దేశాలు అంబుడ్స్మన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
''అంబుడ్స్మన్ అనేది 'పాలనాధికార గణం నుంచి నిరంకు శత్వం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే రక్షణ ప్రాకారం'' -డోనాల్డ్ సి.రావత్
లోక్పాల్ అనే పదాన్ని మొట్టమొదటి సారిగా 1963లో ఎల్.ఎం.సింఘ్వి రూపొందించారు.
భారతదేశంలో నిఘా సంస్థలు / దర్యాప్తు సంస్థలు / లోక్పాల్
పౌరుల ఫిర్యాదుల పరిష్కారానికి లోక్పాల్ అనే ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని పాలనా సంస్క రణల కమిషన్ సిఫార్సు చేసింది. నిజానికి దాని కంటే ముందు నుంచే ప్రయత్నాలు జరిగాయి.
భారతదేశంలో మొదటిసారిగా 1959లో ఆ నాటి కేంద్ర ఆర్థిక మంత్రి సి.డి.దేశ్ముఖ్ లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన చేశారు.
బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నపుడు అత్యున్నత స్థాయిలో ఉన్నవారిపై అవినీతి ఆరోపణలను విచారిం చడానికి లోక్పాల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు సూచించారు.
1964లో సంతానం అధ్యక్షతన పాలనా సంస్కరణల సంఘం కేంద్ర స్థాయిలో లోక్పాల్ను, రాష్ట్రస్థాయిలో లోకాయుక్తను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
లోక్పాల్ లక్షణాలు
1. లోక్పాల్ నియామకాలు రాజకీయాలకు అతీతంగా జరగాలి.
2. వీరి హోదా దేశంలోని అత్యున్నత న్యాయాధికారులతో పోల్చ తగినదిగా ఉండాలి.
3. న్యాయవ్యవస్థ జోక్యాన్ని అవకాశం లేని విధంగా దర్యాప్తు సాగాలి.
4. అవి స్వతంత్రను ప్రదర్శించాలి.
5. వీటి దర్యాప్తు, విచారణ వ్యక్తిగతంగా, లాంఛన రహితంగా జరగాలి.
పార్లమెంట్లో లోక్పాల్ బిల్లు-కాలక్రమం
1968 నుంచి 2011 వరకు లోక్పాల్ బిల్లును పార్లమెంటు లో 10 సార్లు ప్రవేశపెట్టారు.
1. మొదటి సారిగా 1968లో లోక్పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కాని 1970లో లోక్సభ రద్దు కావడంతో ఆ బిల్లు వెలుగు చూడలేదు. (ఇందిరా గాంధీ ప్రధానమంత్రి)
2. 1971లో మళ్ళీ ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం
3. 1977లో జూలైలో మొరార్జీ దేశారు నేతృత్వంలోని జనతా ప్రభుత్వం
4. 1985 ఆగస్టులో రాజీవ్గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం
5. 1989 డిసెంబర్లో వి.పి.సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం
6. 1996 సెప్టెంబర్లో దేవగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం
7. 1998 ఆగస్టులో ఏబి వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం
8. 2001 ఆగస్టులో ఏబి వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం
9. 2011 ఆగస్టులో డా|| మన్మోహన్సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం
10. 2011 డిసెంబర్లో మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం
అయితే పైన పేర్కొన్న ఏబిల్లు కూడా ఏదో ఒక కారణం చేత పార్లమెంటు ఆమోదానికి నోచుకోలేదు.
మొదటి నాలుగు బిల్లులు లోక్సభ రద్దు కావడం చేత మురిగి పోయాయి. ఐదవ పర్యాయం ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 6, 7 బిల్లులను కూడా లోక్సభ రద్దు కావడం చేత మురిగిపోయాయి. 8 వ బిల్లు కూడా పాస్ కాలేక లోక్సభ రద్దు అయింది. 9వ బిల్లు 2011లో ప్రభుత్వం ఉప సంహరించుకుంది. చివరకు 2011లో 10వ పర్యాయం ప్రవేశపెట్టిన బిల్లు చట్ట రూపం దాల్చింది.
భారత రాజ్యాంగంలో లోక్పాల్ ప్రస్థావన
లోక్పాల్కు సంబంధించి 116వ రాజ్యాంగ సవరణ బిల్లును 2011 డిసెంబర్ 27నలోక్సభ ఆమోదించింది. 29 డిసెంబర్ 2011న రాజ్యసభలో చర్చ జరిగి ఆమోదిం చాల్సి ఉండగా ఆగిపోయింది.
లోక్పాల్ బిల్లు 2011కు పార్లమెంటు 2013లో ఆమో దించి,2014 జనవరి 1న రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలిపారు. (అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ) 2014 జనవరి 16 నుంచి లోక్పాల్ బిల్లు అమలులోకి వచ్చింది.
16 జనవరి 2014 నుంచి లోక్పాల్ బిల్లు అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం 19 మార్చి 2019 నాడు లోక్పాల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఎట్టకేలకు లోక్పాల్
ఉన్నత స్థాయి అధికార వ్యవస్థల్లో అవినీతిని అంతమొందిం చేందుకుఉద్దేశించిన లోక్పాల్ సుదీర్ఘ కాలం తరువాత సాకారమైంది.
తొలి లోక్పాల్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ను నియమిస్తూ మార్చి 19 2019న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్మాణం : లోక్పాల్కు ఒక చైర్మన్, 8మంది వరకు సభ్యులు ఉంటారు. వీరిలో 50 శాతం తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు ఉండాలి.
చైర్మన్ను, సభ్యులను ఎంపిక చేయడానికి ఒక సెలక్షన్ కమిటీ, సెర్చ్ కమిటీ ఉంటుంది. ఇందులో ఏడుగురికి తగ్గకుండా సభ్యులు ఉంటారు. వీరిలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలు ఉండాలి.
లోక్పాల్ నిర్మాణం : లోక్పాల్లో ఒక చైర్మన్, 8 మంది సభ్యులు ఉంటారు. వీరిలో నలుగురు సభ్యులు జుడిషి యల్, మిగిలిన నలుగురు నాన్జుడీషియల్ సభ్యులు
నియామకం : చైర్మన్, సభ్యులను రాష్ట్రపతి తన రాజముద్ర చేత స్వయంగా సంతకం చేసిన పత్రం ద్వారా నిమమిస్తాడు. సెలక్షన్ కమిటీ సలహా మేరకు నియమిస్తాడు.
సెలక్షన్ కమిటీ : అధ్యక్షుడు - ప్రధానమంత్రి,
సభ్యులు - లోక్సభ స్పీకర్, లోక్సభ ప్రతిపక్ష నాయకులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా అతడు సిఫార్సు చేసిన న్యాయమూర్తి, ఒక నిష్ణాతుడైన సభ్యుడు.
ప్రస్తుత లోక్పాల్ సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు / సభ్యులు
అధ్యక్షులుగా - నరేంద్రమోడీ (ప్రధానమంత్రి)
సభ్యులుగా - సుమిత్ర మహాజన్ (లోక్సభ స్పీకర్), రంజన్ గొగోరు (సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి), ముకుల్ రోహత్గీ(సీనియర్ న్యాయవాది)
అయితే లోక్సభలో ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గేను కమిటీ సభ్యుడిగా కాకుండా ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలవడం జరుగుతుంది.
అర్హతలు :
1. చైర్మన్గా నియమితులైన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసి ఉండాలి.
2. జూడిషియర్ మెంబర్గా నియమితులైన వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కాని లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
3. నాన్జూడిషియల్ మెంబర్గా నియమితులైన వ్యక్తి పరిపాలన, అవినీతి నిర్మూలన మొదలగు అంశాలలో సుదీర్ఘ అనుభవం ఉండాలి.
అనర్హతలు/షరతులు
1. పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలలో సభ్యుడిగా ఉండరాదు.
2. 45 సం||లు కంటే తక్కువ వయస్సు ఉండరాదు.
3. నేరారోపణ రుజువై ఉండరాదు.
4. ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీచ్యుడై ఉండరాదు.
పదవీకాలం
- చైర్మన్, సభ్యులు 5 నుంచి 7 సం||ల కాలానికి నియమించబడతారు. ఏది ముందైతే అది వర్తిస్తుంది.
- పునర్ నియామకానికి అర్హులు కారు.
- పదవీ విరమణ చేసిన 5 సం||ల వరకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థలకు పోటీ చేయరాదు.
తొలగింపు : అక్రమ ప్రవర్తన, అవినీతి, అసమర్థత లేదా దివాలా తీయడం కారణాల వల్ల రాష్ట్రపతి చైర్మన్, సభ్యులను నేరుగా తొలగిస్తాడు.
రాజీనామా : చైర్మన్, సభ్యులు తమ పదవులకు పదవీకాలం ముగియక ముందే రాజీనామా చేయవచ్చు. వారు తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తారు.
వేతనం : చైర్మన్కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా జీతభత్యాలు ఉంటాయి. సభ్యులకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం కలదు.
- వీరి జీతభత్యాలను సాధారణంగా తగ్గించడానికి వీలు ఉండదు.
జ భారత ప్రభుత్వ సంచిత నిధి నుంచి వీరి జీతభత్యాలు చెల్లించడం జరుగుతుంది.
- ప్రస్తుత చైర్మన్ వేతనం - రూ.2,80,000
- సభ్యులు వేతనం - రూ. 2,50,000
నివేదిక : లోక్పాల్ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి, రాష్ట్రపతి పార్లమెంటుకు సమర్పిస్తారు.
లోక్పాల్ విధులు
1. ప్రధానమంత్రితో సహా ఇతర ఉన్నత పదవులలో ఉన్న వ్యక్తులపై ఇచ్చిన అవినీతి ఆరోపణలను విచారిస్తుంది. అయితే జాతీయ భద్రతా, ప్రజా భద్రతా అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు దీని పరిధిలోకి రావు.
2. లోక్పాల్కు స్వతంత్రంగా ఒక విచారణ, ప్రాసిక్యూషన్ విభాగం ఉంటుంది.
3. సీబీఐతో సహా దేశంలో ఉన్న ఇతర విచారణ సంస్థలు లోక్పాల్ పరిధిలోకి వస్తాయి.
4. సీవీసీ విచారించిన అంశాలను, తీసుకున్న చర్యలను లోక్పాల్కు తెలియజేయాలి.
5. విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసుకునే అధికారం ఉంది.
6. ఆరోపణలున్న అధికారులను సస్పెండ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అధికారం ఉంది.
7. అలాగే ఆరోపణలున్న వ్యక్తుల ఆస్తులను స్వాధీన పరుచుకునే అధికారం ఉంది.
8. ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన ఒక ఉన్నతాధికార కమిటీ సిఫార్సు మేరకు సీబీఐ డైరెక్టర్ను నియమించాలి.
9. అవినీతి నిరోధక చట్టం కింద ప్రస్తుతం ఉన్న 6 నెలల కనీస శిక్షను 2సం||లకు అలాగే 7 సం||ల గరిష్ట శిక్షను 10 సం||లకు పెంచాలి.
10. ఫిర్యాదుపై 6నెలలో విచారణ ముగించాలి
11. విధి నిర్వహణలో సివిల్ న్యాయస్థానాలకు ఉండే అధికారాలుంటాయి.
12. ఫిర్యాదుదారుని ఆరోపణలు తప్పని తేలితే జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
లోక్పాల్ ఏర్పాటు
కేంద్రంలో ఉన్నత స్థాయిలో జరిగే అవినీతి అక్రమాలు విచారించడానికి చట్టబద్దత కలిగిన వ్యవస్థయే లోక్పాల్. 116వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్పాల్ను 17 డిసెంబర్ 2013 నాడు రాజ్యసభ ఆమోదించింది. 18 డిసెంబర్ నాడు లోక్సభ ఆమోదించి, జనవరి 1, 2014 నాడు పార్లమెంటు ఆమోదం పొంది 16 జనవరి 2014 రాష్ట్రపతి ఆమోదం పొంది, 19 మార్చి 2019 తొలి లోక్పాల్ ఏర్పాటైంది.
19 మార్చి 2019 ఏర్పాటు
చైర్మన్ - జస్టిస్ పినాకి చంద్రఘోష్
జ్యూడిషియల్ సభ్యులు - జస్టిస్. దిలీప్బాబా సాహెబ్ భోసలే, జస్టిస్. ప్రదీప్కుమార్ మొహంతి, జస్టిస్. అభిఘోష్ కుమారి, జస్టిస్. అజరుకుమార్ త్రిపాఠీ
జ్యూడిషియల్ సభ్యులు కానివారు - దినేష్ కుమార్ జైన్, అర్చనా రామసుందరం, మహేందర్ సింగ్, ఇంద్రజిత్ ప్రసాద్ గౌతం
Authorization