అంతర్జాతీయం
శ్రీలంకలో జాతీయ అత్యవసర పరిస్థితి
వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన శ్రీలంకలో 2019 ఏప్రిల్ 22 అర్ధరాత్రి నుంచి జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది. కేవలం ఉగ్రమూకలను ఏరివేసేందుకే ఈ అత్యవసర పరిస్థితిని విధించామని, ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బందిలేదని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం ప్రకటిం చింది. మూడు చర్చిలు, మూడు ఐదు నక్షత్రాల హోటళ్లపై ఏప్రిల్ 21న జరిగిన ఆత్మాహుతి దాడుల్లో అనేక మంది చనిపోయారు. పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది.
ఇరాన్పై అమెరికా ఆర్థిక దిగ్బంధనం
భారతదేశానికి ఇబ్బంది కలిగించేలా ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2019 ఏప్రిల్ 22న కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్ సహా ఏ దేశానికీ మినహాయింపు ఇవ్వబోమని ప్రకటించారు. ఇంతవరకు కొన్ని దేశాలకు 'విశేష తగ్గుదల మినహాయింపు' (సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఎక్సెప్షన్-ఎస్ఆర్ఈ) విధానం కింద అక్కడ నుంచి చమురును కొనుగోలు చేసే అవకాశం ఇచ్చారు. ఇకపై ఆ విధానం ఉండబోదని అధ్యక్ష కార్యాలయమైన వైట్హౌస్ ప్రకటించింది. ఎస్ఆర్ఈల కాలపరిమితి 2019 మే 2న ముగిసినప్పుడు దాన్ని మళ్లీ పొడిగించకూడదని అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారు. ఇరాన్ చమురు ఎగుమతులను (మే 4 నాటికి) సున్నా స్థాయికి తీసుకొని రావడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడిగా కమెడియన్ జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో హాస్య నటుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ (41) ఘనవిజయం సాధించారు. ఎన్నికల్లో జెలెన్స్కీకి 73.22 శాతం ఓట్లు రాగా, ప్రస్తుత అధ్యక్షుడు పెట్రో పొరోషెం కోకు 24.46 శాతం ఓట్లు దక్కాయి. సంప్రదాయ ఎన్నికల ప్రచారానికి భిన్నంగా కామెడీ స్కిట్లతో జెలెన్స్కీ ప్రజల్లోకి దూసుకెళ్లారు. 2019 మార్చి 31న ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. స్పష్టమైన ఫలితాలు రాకపోవడంతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జెలెన్ స్కీ, పొరోషెంకో మధ్య రెండో రౌండ్ ఎన్నికలు 2019 ఏప్రిల్ 21న నిర్వహించారు. 'సర్వంట్ ఆఫ్ ది పీపుల్' కామెడీ టీవీ సీరియల్లో జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నటించారు. ఈ సీరియల్ ముగిసిన నెలరోజుల్లో జెలెన్స్కీ నిజంగానే ఉక్రెయిన్ అధ్యక్షుడిగా విజయం సాధించాడు.
సౌదీ అరేబియాలో 37 మందికి మరణశిక్ష అమలు
ఉగ్రవాద కేసుల్లో దోషులుగా తేలిన 37 మందికి సౌదీ అరేబియాలో 2019 ఏప్రిల్ 23న సామూహికంగా మరణశిక్షను అమలు చేశారు. రియాద్, ఖాసిం, పవిత్ర మక్కా, మదీనా నగరాల్లో ఈ శిక్షను అమలు చేసినట్లు అధికార సౌదీ ప్రెస్ ఏజెన్సీ(ఎస్పీఏ) తెలిపింది. వీరంతా కూడా సౌదీ పౌరులేనని పేర్కొంది.
ఇండోనేషియాలో రామాయణ స్టాంపు
ఇండోనేషియా ప్రభుత్వం రామాయణ ఇతివత్తంతో ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. రామాయణంలో సీతను రావణుడి బారి నుంచి రక్షిం చేందుకు జటాయువు చేసిన పోరా టాన్ని ఇతివత్తంగా చేసుకుని ఈ స్టాంపును రూపొందించారు. భారత్-ఇండోనేషియా మధ్య 70 ఏళ్ల దౌత్య సంబంధాలను పురస్కరించుకొని ఈ స్టాంపును విడుదల చేసింది. ప్రముఖ ఇండోనేషియా శిల్పకారుడు పద్మశ్రీ బాపక్ న్యోమన్ నుఅర్తా ఈ స్టాంపును రూపొందించారు.
మలేరియా వ్యాక్సిన్ వాడకాన్ని ప్రారంభించిన తొలి దేశం మలావీ
ప్రపంచంలోనే మొట్టమొదటిగా మలేరియా వ్యాక్సిన్ (టీకా) వాడకాన్ని మలావీ ప్రభుత్వం ప్రారంభించింది. ఆఫ్రికాలోని మలావీ ప్రభుత్వం చేపట్టిన ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్వో) స్వాగతించింది. మలేరియా నుంచి చిన్నారులను కాపాడుకు నేందుకు 30 ఏళ్లకు పైగా శ్రమించిన ఫలితమే 'ఆర్టీఎస్, ఎస్'గా నామకరణం చేసిన ఈ టీకా అని పేర్కొంది. ఘనా, కెన్యాల్లో త్వరలోనే ఈ వ్యాక్సిన్ చిన్నారులకు అందుబాటులో ఉంటుందని డబ్ల్యుహెచ్వో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 4,35,000 మంది పిల్లలు మలేరియా బారిన పడుతున్నట్లు అంచనా. ఏటా ఆఫ్రికా దేశాల్లో 2,50,000 మందికి పైగా చిన్నారులు మలేరియాతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే మలావీ ప్రభుత్వం ఈ టీకా వాడకానికి శ్రీకారం చుట్టింది.
భారత్లో తట్టు టీకాలకు 29 లక్షల మంది దూరం
భారత్లో ఏడేళ్లలో దాదాపు 29 లక్షల మంది పిల్లలకు తట్టు టీకాల (మజిల్స్ వ్యాక్సిన్) తొలి డోసు వేయించలేదని యూనిసెఫ్ 2019 ఏప్రిల్ 25న వెల్లడించింది. దాదాపు 80 శాతం రోగనిరోధక శక్తిని కాపాడే ఈ డోసును అలసత్వం తదితర కారణాలతో పిల్లలకు సరిగా వేయించడం లేదని పేర్కొంది. 2010-2017 మధ్య గణాంకాలను యూనిసెఫ్ వెల్లడించింది. తట్టు నుంచి పిల్లలను కాపాడాలంటే 2 డోసులు వేయించాలి. 2017లో ప్రపంచ వ్యాప్తంగా 85శాతం మందికి తొలి డోసు వేయించారు. రెండో డోసు 67 శాతం మాత్రమే వేయించారు. 2017లో 1.10 లక్షల మంది తట్టుతో చనిపోయినట్లు అంచనా.
ప్రపంచ సంక్షోభంగా తట్టు వ్యాధి
ప్రాణాంతక వ్యాధి అయిన తట్టు (మిజిల్స్)ను ఐక్యరాజ్య సమితి 2019 ఏప్రిల్ 19న ప్రపంచ సంక్షో భంగా ప్రకటించింది. పేద, అభివద్ధి చెందుతున్న దేశాలతో పాటు.. అమెరికాలోనూ ఈ వ్యాధి దాఖలాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధితో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని యునెటైడ్ నేషన్స్ చిల్డన్స్ర్ ఫండ్ (యునిసెఫ్), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడిం చాయి. తట్టు కారణంగా ఏటా లక్ష మంది చిన్నారులు చనిపోతు న్నారని తెలిపాయి. కాంగో, ఇథియోఫియా, జార్జియా, కజకిస్థాన్, కిర్గిస్థాన్, మడగాస్కర్, మయన్మార్, ఫిలిప్పీన్స్, సూడాన్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది.
మాలి ప్రధాని మైగా రాజీనామా
మాలి దేశ ప్రధానమంత్రి సౌమేలౌ బౌబేయే మైగా కేబినెట్ సహచరులందరితో కలిసి రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలనూ ఆమోదించినట్టు దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా కార్యాలయం 2019 ఏప్రిల్ 19న ప్రకటించింది. దేశంలో భూముల వివాదంలో డోగోన్, ఫులానీ తెగల మధ్య ఏళ్ల తరబడి ఉద్రిక్తతలు కొనసా గుతున్నాయి. 2019, మార్చి 23న ఒగాస్సగో గ్రామంలో ఫులానీ తెగకు చెందిన 160 మంది ఊచకోతకు గురయ్యారు. ఆ తెగకు చెందిన ప్రజలతోపాటు ప్రతిపక్ష పార్టీలు, పౌరహక్కుల సంఘాల నేతలు అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తు న్నారు. దేశంలో ఉద్రిక్తతలను తగ్గించడంలో విఫలమయ్యా రంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఏప్రిల్ 17న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
అబుదాబిలో తొలి హిందూ ఆలయం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదా బిలో నిర్మించనున్న తొలి హిందూ దేవాలయానికి 2019 ఏప్రిల్ 20న శంకుస్థాపన చేశారు. ఆలయాన్ని నిర్మిస్తున్న బోచసన్ వాసి శ్రీ అక్షర్-పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ(బీఏపీఎస్) అధిపతి మహాంత్ స్వామి మహారాజ్ గర్భగుడి నిర్మాణం కోసం పునాదిరాయి వేశారు. అబుదాబి-దుబారు హైవేకు సమీపంలో 14 ఎకరాల్లో ఏడు అంతస్తులుగా ఈ ఆలయాన్ని నిర్మించను న్నారు. ఇందులో ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం, వ్యాయామశాల ఏర్పాటు చేయనున్నారు.
ప్రపంచంలోనే ఎత్తయిన ఇండోర్ వాటర్ ఫాల్
సింగపూర్లోని చాంగీ విమానా శ్రయంలో 14 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన జెవెల్ సెంటర్లు 2019 ఏప్రిల్ 11న ప్రారం భించారు. గాజు పలకలు, ఉక్కుతో చేపట్టిన ఈ నిర్మాణం డోనట్ ఆకారం లో చూపరు లను ఆకట్టుకుంటోంది. ఇందులోని వాటర్ ఫాల్ సిస్టమ్ విమానాశ్రయంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఇండోర్ వాటర్ ఫాల్గా రికార్డుల్లో కెక్కింది.
ఆడవాళ్ల ఆయుర్దాయమే ఎక్కువ : డబ్ల్యూహెచ్ఓ
మగవారు సగటున 69.8 ఏళ్లు జీవిస్తే, ఆడవారు సగటున 14.2 ఏళ్లు జీవిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధ్యయనంలో తేలింది. పురుషుల్లో ధూమపానం, మద్యం సేవించడం, ప్రమాదకరమైన పనులు చేయడం, హింసకు పాల్పడటంతో పాటు మానసిక ఒత్తిడి అనేవి తక్కువ ఆయుర్దా యానికి కారణమని వెల్లడైంది. జీవిత కాలాన్ని తగ్గించే ముఖ్యమైన 40 జబ్బుల్లో 33 పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆయుర్దాయం గత పదహారేళ్లలో సగటున 5.5 ఏళ్లు పెరిగిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
జాతీయం
చైనా పాల ఉత్పత్తులపై నిషేధం పొడిగింపు
చైనా నుంచి పాలు, పాల ఉత్పత్తుల (చాక్లెట్లతో సహా) దిగుమతిపై నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చైనా పాలు, పాల ఉత్పత్తుల్లో విషపూరిత రసాయనాలను గుర్తించేందుకు నౌకాశ్రయాల వద్ద ఉన్న అన్ని పరిశోధనశాలలను ఆధునికీకరించేంత వరకు ఈ నిషేధాన్ని పొడిగించాలని ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కేంద్రానికి సూచించింది. నిజానికి భారత్ చైనా నుంచి పాలను దిగుమతి చేసుకోకున్నా ముందు జాగ్రత్తగా ఈ చర్య చేపట్టారు.
జన్ధన్ ఖాతాల్లో రూ.97,665.66 కోట్లు
జన్ధన్ ఖాతాల్లో 2019 ఏప్రిల్ 8 నాటికి రూ.97,665.66 కోట్లు ఉన్నట్లు ప్రభుత్వం గణాంకాల ద్వారా వెల్లడైంది. అదే సమయంలో జన్ధన్ ఖాతాల సంఖ్య 35.39 కోట్లకు చేరింది. మొత్తం 27.89 కోట్ల మందికి రూపే కార్డులను జారీ చేశారు. 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) కార్యక్రమాన్ని ప్రారంభించారు. 50 శాతం బ్యాంకు ఖాతాలు మహిళలవే. మొత్తం ఖాతాల్లో 59 శాతం ఖాతాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
మూగజీవాల రక్షణ బాధ్యత వ్యవసాయ శాఖదే
గోవులు, జంతువుల రక్షణకు తెచ్చిన చట్టాలను అమలు చేసే బాధ్యతను వ్యవసాయ శాఖకు అప్పగిస్తూ 2019 ఏప్రిల్ 6న కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ బిజినెస్ రూల్ 349కి సవరణ చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ పర్యవేక్షించేది.
బిల్కిస్ బానోకు 50 లక్షల పరిహారం
2002లో గుజరాత్లో గోద్రా అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు రూ.50 లక్షల పరిహారం, ఉద్యోగం, వసతి కల్పించాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విషయంలో నిర్లక్ష్యం చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ అధికారులకు పెన్షన్ ప్రయోజనాలు నిలిపి వేయాలని.. బాంబే హైకోర్టు దోషిగా తేల్చిన ఐపీఎస్ అధికారికి రెండు ర్యాంకులు తగ్గించాలని (డిమోట్) వెల్లడించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోరు, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 23న ఈ మేరకు తీర్పు వెలువరించింది.
సీజేఐ వివాదం విచారణకు కమిటీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోరుపై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు నియమిం చింది. ఈ కమిటీకి అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతత్వం వహించనుండగా, జస్టిస్ ఎన్వీ రమణ, మహిళా జడ్జి జస్టిస్ ఇందిరా బెనర్జీ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఈ విచారణ అంతర్గతంగా చేపడతామని జస్టిస్ బాబ్డే తెలిపారు. ఇందులో వాది, ప్రతివాది తరపున న్యాయవాదులు ఉండరని, విచారణ ప్రక్రియ ముగింపునకు నిర్ణీత గడువు లేదని వివరించారు. కమిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ వైదొలగాలని నిర్ణయించారు.
40 రోజుల్లో మైత్రీ వంతెన
జమ్మూ కశ్మీర్లోని మైత్రీ మంతెనను 40 రోజుల్లోనే భారత సైన్యం నిర్మించింది. ఈ తీగల వంతెన లెహ్లౌ సింధూ నదిపై 260 అడుగుల పొడవున ఉంది. దీని నిర్మాణానికి సైన్యం 500 టన్నుల కాంక్రీటు, ఇనుమును ఉపయో గించింది. లెV్ా, లద్దాఖ్లలోని మారుమూల గ్రామాల అనుసం ధానానికి ఉపయోగ పడుతుంది.
ఎనిమిదేళ్లలో నిరుద్యోగం రెండింతలు
దేశంలో 2011 నుంచి 2018 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో నిరుద్యోగం రెండింతలు పెరిగినట్లు బెంగళూరులోని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు ది స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా (ఎస్డబ్ల్యూఐ)-2019 పేరిట 2019 ఏప్రిల్ 17న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను దేశంలోని ఉద్యోగాల స్థితిగతులను లెక్కించే కన్సూమర్ పిరమిడ్స్ సర్వే ఆఫ్ ది సెంటర్ ఫర్ మోనిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ-సీపీడీఎక్స్) సంస్థ నుంచి 2016-18 మధ్య గల సమాచారాన్ని సేకరించి రూపొందించారు.
జనాభా పెరుగుదల రెట్టింపు
భారత్లో 2010 నుంచి 2019 మధ్య జనాభా వార్షిక సగటు 1.2 శాతంగా ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి జనాభా నిధి-యూఎన్పీఎఫ్ నివేదిక పేర్కొంది. 142 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న చైనాలో ఇదేకాలంలో పెరుగుదల 0.5 శాతం మాత్రమే. అంటే మన దేశంలో జనాభా పెరుగుదల రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. భారత్ 136 కోట్ల జనాభాతో ప్రపంచంలో ద్వితీయ స్థానంలో ఉంది. 1969లో మన దేశ జనాభా 54. 15 కోట్లు. 1994 నాటికి 94.22 కోట్లకు చేరింది. ఇదే కాలంలో చైనా జనాభా 80. 36 కోట్ల నుంచి 123 కోట్లకు పెరిగింది. ప్రపంచ జనాభా పరిస్థితి 2019 పేరిట యూఎన్ పీఎఫ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం... భారత్లో 0-14, 10-24 ఏళ్ల వయస్కులు 27 శాతం ఉన్నారు. 15-64 వయస్కులు 67 శాతం, 65 ఏళ్లు అంతకు పైబడినవారు 6 శాతం ఉన్నారు. 1994లో ప్రతి లక్ష మందికి మాత మరణాల నిష్పత్తి 488 కాగా 2015 నాటికి 174కు తగ్గింది.
రెట్టింపైన ఖైదీల అసహజ మరణాలు
జైళ్లలో ఖైదీల అసహజ మరణాలు ఏడాది కాలంలో రెట్టింపు అయ్యాయి. 2015తో పోలిస్తే 2016లో ఇలాంటి మరణాల సంఖ్య 115 నుంచి 231కి చేరింది. ఈ మేరకు జాతీయ నేర రికార్డుల బ్యూరో 'ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా-2016' పేరిట 8 ఏళ్ల తర్వాత విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2016లో అసహజంగా మరణించిన వారిలో 102 మంది ఖైదీలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 14 మంది ఇతర ఖైదీల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అసహజ మరణాల్లో ఉత్తరప్రదేశ్ (56) మొదటి స్థానంలో ఉంది.
స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్స్లో భారత్ 17వ స్థానం
స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్స్లో భారత్ 17వ స్థానంలో నిలిచింది. 2018 సం||నికి గాను స్టార్టప్బ్లింక్ 100 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో అమెరికా మొదటి, యూకే 2వ, కెనడా 3వ స్థానంలో నిలిచాయి.
2018-19లో 11 శాతం పెరిగిన ఔషధ ఎగుమతులు
మన దేశం నుంచి 2018-19లో ఔషధ ఎగుమతులు 11 శాతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య శాఖ పరిధిలోని ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మాగ్జిల్) గణాంకాల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 19.15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.84 లక్షల కోట్లు) విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయి. 2017-18లో మనదేశం ఎగుమతి చేసిన ఔషధాల విలువ 17.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.21 లక్షల కోట్లు) మేర ఉన్నాయి.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారత్కు 2వ స్థానం
వేగంగా అభివద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచ దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉందని మెకిన్సే సంస్థ 2019 ఏప్రిల్ 4న నివేదిక ఇచ్చింది. 2018 గణాంకాల ప్రకారం భారత్లో 560 మిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. భారత్లో సగటున సోషల్ మీడియా వినియోగదారుడు వారంలో 17 గంటల పాటు గడుపుతున్నాడు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఇండోనేషియా మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం 17 అభివద్ధి చెందిన, చెందుతున్న దేశాలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది.
ప్రాంతీయం
తెలంగాణలో భవన నిర్మాణ అనుమతుల్లో మార్పులు
భవన నిర్మాణ అనుమతుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జారీ చేసిన బిల్డింగ్ కోడ్-2016కు అనుగుణంగా ఈ మార్పులు చేశారు. నివాసయోగ్య ధ్రువీకరణ పత్రం (ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) జారీకి ముందే బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉం టుంది. గతంలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాతే విద్యుత్, నీటి కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవలసి వచ్చేది. ప్రస్తుతం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అయిన తర్వాత మాత్రమే విద్యుత్, నీటి కనెక్షన్లు ఇస్తారు. నిబంధనల మేరకు భవనం పైభాగంలో (టెర్రస్)పై ఈత కొలను నిర్మాణానికి అనుమతి ఇస్తారు.
విజయవంతమైన 'కాళేశ్వరం' మొదటి పంపు
కాళేశ్వరం ఎత్తిపోతల పథ కంలోనే మొట్టమొదటి ఎత్తి పోతలను 2019 ఏప్రిల్ 24న ప్రయోగా త్మకంగా ప్రారంభించగా విజయవం తమైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని 6వ ప్యాకేజీ పంప్హౌస్ ఇందుకు వేదికైంది. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ కంప్యూటరు మీట నొక్కి మొదటి పంపును ప్రారంభించారు. సర్జ్పూల్ నుంచి పరుగులు పెట్టిన గోదావరి జలాలు మేడారం జలాశయంలోకి చేరాయి.
మిషన్ భగీరథకు హడ్కో పురస్కారం
మిషన్ భగీరథకు హడ్కో (గహ నిర్మాణ, నగరాభివద్ధి సంస్థ) పురస్కారం లభించింది. మౌలిక వసతుల కల్పనలో వినూత్న విధానాలను కల్పించినందుకు ఈ పురస్కారం లభించింది. భగీరథకు హడ్కో నుంచి రుణం వస్తుంది. ఇప్పటికే భగీరథకు రెండుసార్లు ఈ సంస్థ పురస్కారాలను అందజేసింది.
వార్తల్లో వ్యక్తులు
జపాన్ అసెంబ్లీకి భారత సంతతి వ్యక్తి
జపాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పురాణిక్ యోగేంద్ర అలియాస్ యోగి (41) విజయం సాధించారు. ఆ దేశ రాజధాని టోక్యో పరిధిలోని ఎదోగవా వార్డు అసెంబ్లీ స్థానానికి 2019 ఏప్రిల్ 21న జరిగిన ఎన్నికల్లో యోగి గెలిచారు. యోగేంద్ర 1997లో తొలిసారిగా ఇంజినీరింగ్ విద్యార్థిగా జపాన్లోకి అడుగు పెట్టారు. రెండేళ్లు అక్కడ ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి, భారత్కు తిరిగొచ్చేశారు. 2001లో ఓ ప్రైవేటు కంపెనీ ఇంజినీర్ హోదాలో ఆ దేశానికి వెళ్లారు. నాటి నుంచి ఎదోగవా వార్డు పరిధిలోనే ఆయన నివసిస్తున్నారు.
స్కాట్లాండ్ మాజీ కెప్టెన్ డి లాంజ్ కన్నుమూత
స్కాట్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కాన్ డి లాంజ్(38) మెదడు సంబంధిత వ్యాధి కారణంగా 2019 ఏప్రిల్ 19న మృతి చెందారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన లాంజ్ స్కాట్లాండ్ కెప్టెన్గా ఆ దేశానికి తొలి అంతర్జాతీయ విజయం అందించాడు. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన లాంజ్ తన జట్టును గెలిపించాడు. దక్షిణాఫ్రికాలో దేశవాళీ క్రికెట్ను కూడాఆడాడు.
అవార్డులు
ఏఎన్యూ పరిశోధకుడికి అంతర్జాతీయ గౌరవం
గుహల్లో జీవవైవిధ్యంపై పరిశోధనలు చేస్తున్న ఆచార్య నాగార్జున యూని వర్సిటీ (ఏఎన్యూ) జంతుశాస్త్ర పరిశోధకుడు డాక్టర్ షాబుద్దీన్ షేక్కు అంతర్జాతీయ గౌరవం లభించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా ప్రకతిని, అందులోని వనరుల పరిరక్షణకు పనిచేస్తున్న 'ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్' (ఐయూసీఎన్), 'కేవ్ ఇన్వెర్టిబ్రేట్ స్పెషలిస్ట్ గ్రూప్'కు సేవలందించేందుకు షాబుద్దీన్ నియమితు లయ్యారు. 35 దేశాల నుంచి 80మంది వర్గీకరణ శాస్త్రవేత్తలను ఐయూసీఎన్ నియమించగా, మనదేశం నుంచి షాబుద్దీన్ ఒక్కరికే అవకాశం లభించింది. గుహల జీవవైవిధ్య అంశంపై ఆయన సమర్పించిన థీసిస్ను, స్పెయిన్ ప్రభుత్వం ఉత్తమ థీసిస్గా ఎడ్యుడికేట్ చేసింది.
చెన్నకేశవరావుకు అంబేద్కర్ జాతీయ అవార్డు
ఆంధ్రప్రదేశ్కు చెందిన షెడ్యూల్డ్ కులాల రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు కె.చెన్నకేశవరావుకు అంబేడ్కర్ రత్న జాతీయ అవార్డు లభించింది. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బెంగళూరులో 2019 ఏప్రిల్ 22న నిర్వహించిన కార్యక్రమంలో చెన్నకేశవరావుకు ఈ అవార్డును అందజేశారు. కొన్నేళ్లుగా ఆయన ఏపీలో దళిత హక్కుల సొసైటీ ద్వారా పోరాటాలు చేస్తున్నారు.
ఆర్థికాంశాలు
ఎన్హెచ్బీ, నాబార్డ్ల నుంచి ఆర్బీఐ నిష్క్రమణ
నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్హెచ్బీ), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్)ల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిష్క్రమించింది. వాటిల్లో ఉన్న మొత్తం వాటాలను వరుసగా రూ.1450 కోట్లు, రూ.20 కోట్లకు ప్రభుత్వానికి విక్రయించింది. దీంతో అవి పూర్తి స్థాయి ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా మారాయి. 2019 మార్చి 19న ఎన్హెచ్బీలో, 2019 ఫిబ్రవరి 26న నాబార్డ్లో తన వాటాలను విక్రయించినట్లు ఆర్బీఐ 2019 ఏప్రిల్ 24న వెల్లడించింది. ఈ పెట్టుబడుల విక్రయంతో ఈ రెండు ఆర్థిక సంస్థల్లో ప్రభుత్వ వాటా 100 శాతానికి చేరింది. 2001 అక్టోబరులో నరసింహం కమిటీ ఇచ్చిన నివేదికతో పాటు, ఆర్బీఐ సొంతం చర్చా పత్రమైన 'హార్మనైజింగ్ ద రోల్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్యాంక్స్' సిఫారసుల అమలులో భాగంగానే ఈ పరిణామం చోటు చేసుకుంది.
త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్
త్వరలోనే రూ.50 నోటు నూతన సిరీస్ చలామణి లోకి రానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటించింది. గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో మహాత్మా గాంధీ బొమ్మ ఉండే కొత్త సిరీస్ త్వరలోనే చలామణిలోకి రానుందని, ఈ సిరీస్తో పాటు పాత రూ.50 నోట్లు కూడా చెల్లుతాయని ఆర్బీఐ 2019 ఏప్రిల్ 16న ప్రకటించింది.
సైన్స్ AND టెక్నాలజి
అంగారకుడిపై కంపనాలు
అంగారకుడిపై మొదటి సారి కంపనా లకు సంబం ధించిన శబ్దాలు రికార్డ య్యాయి. మార్స్పై పరిశోధనలు చేసేందుకు నాసా ప్రయోగించిన 'ఇన్సైట్' అంతరిక్షనౌక ఈ కంపనాల ధ్వనులను గుర్తిం చింది. ఇన్సైట్లో అమర్చిన సిస్మిక్ ఎక్స్పరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్(ఎస్ఈఐఎస్) పరికరం 2019 ఏప్రిల్ 6న ఈ కంపనాలను రికార్డు చేసినట్లు నాసా తెలిపింది. 2018 మే నెలలో ఇన్సైట్ను ప్రయోగించగా డిసెంబర్లో సిసిమోమీటర్ను అది అంగారకుడి ఉపరితలంపై ఉంచింది. ఈ కంపనాల్ని మార్టియన్ సోలార్ 128 కంపనాలుగా పిలుస్తున్నారు. అంగారకుడి అంతర్భాగం నుంచి మొట్టమొదటిసారి వచ్చిన కంపనాలు కూడా ఇవే. ఇప్పటివరకు అంగారకుడిపై మార్చి 14, ఏప్రిల్ 10, ఏప్రిల్ 11 తేదీల్లో అత్యంత చిన్న చిన్న కంపనాలను కూడా సిసిమోమీటర్ గుర్తించింది. అయితే సోలార్ 128 కంపనాలు ఇంతకుముందు నాసా చేపట్టిన మూన్ మిషన్లో కనుగొన్న కంపనాలను పోలి ఉన్నాయి. దీంతో సోలార్ 128 కంపనాలపైనే శాస్త్రవేత్తలు ఎక్కువగా దష్టి కేంద్రీకరిం చారు. ఈ కంపనాలు ఏర్పడటానికి గల అసలు కారణాన్ని విశ్లేషిస్తున్నారు.
పెద్దల సంరక్షణకు వన్ బిగ్ ఫ్యామిలీ యాప్
పెద్దల సంరక్షణకు ఉద్దేశిం చిన 'వన్ బిగ్ ఫ్యామిలీ' యాప్ను వెస్కో టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా తమ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా, వారి కోసం వివిధ రకాల సేవలను అందించేందుకు, తద్వారా వారి అవసరాలను తీర్చేందుకు వీలుంటుంది. లొకేషన్ ట్రాకింగ్ సర్వీసెస్, ట్రావెల్ ప్రణాళికలు, మెడికల్ హిస్టరీ, కుటుంబ సభ్యులు, స్నేహితులను లింక్ చేసుకోవడం వంటి ఫీచర్లు ఈ యాప్లో ఉన్నాయి.
టిక్టాక్పై నిషేధం ఎత్తివేత
టిక్టాక్ యాప్పై నిషేధాన్ని మద్రాసు హైకోర్టు 2019 ఏప్రిల్ 24న ఎత్తేసింది. అశ్లీల వీడియో లను వ్యాప్తి చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడకుండా చూసుకో వాలని, ఎవరైనా అలాంటి వీడియో లను పోస్ట్ చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది. టిక్టాక్ను నిషేధిస్తూ మద్రాసు హైకోర్టు ఏప్రిల్ 3న ఉత్తర్వు లిచ్చింది. బైట్ డ్యాన్స్ సంస్థ టిక్టాక్ యాప్ను అందిస్తుంది.
చైనాలో అమెజాన్ ఈ-కామర్స్ సేవలు నిలిపివేత
అమెరికాకు చెందిన ఆన్లైన్ వ్యాపార సంస్థ అమెజాన్.. చైనాలో తన ఈ-కామర్స్ సేవలను 2019, జూలై 18 నుంచి నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అక్కడి ప్రాంతీయ మార్కెట్లో బలపడిపోయిన ఆలీబాబా, జేడీ డాట్ కాం, పిన్డ్యూడ్యూ సంస్థలతో పోటీపడలేక తన 15 ఏళ్ల మార్కెట్ స్థానాన్ని వదులు కోవడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. మార్కెట్ వాటాలో ఆలీబాబాకు 58.2 శాతం ఉండగా.. ఆ రెండు సంస్థలకు 22 శాతం వరకు వాటా ఉంది. క్రీడాంశాలు
పీహెచ్ఎఫ్కు భారీ జరిమానా
పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్)కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) భారీ జరిమాన విధించింది. ప్రో లీగ్ టోర్నమెంట్కు జాతీయ జట్టును పంపకుండా నిబంధ నలు ఉల్లంఘించి నందుకు గాను జూన్ 20లోగా లక్షా 70 వేల యూరోలు (పాక్ కరెన్సీలో రూ. 2 కోట్ల 71 లక్షలు) చెల్లించాలని ఆదేశిం చింది. లేని పక్షంలో దానికి రెట్టింపు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది.
మోంటెకార్లో చాంపియన్గా ఫాగ్నిని
మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టోర్నమెంట్లో చాంపి యన్గా ఇటలీ ప్లేయర్ ఫాబియో ఫాగ్నిని నిలిచాడు. మొనాకోలో 2019 ఏప్రిల్ 21న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫాగ్నిని 6-3, 6-4తో దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. దీంతో ఫాగ్నిని తన కెరీర్లో తొలి మాస్టర్స్ సిరీస్ టైటిల్ను దక్కించుకున్నట్లయింది. విజేతకు 9,58,055 యూరోలు (రూ. 7 కోట్ల 48 లక్షలు) ప్రైజ్మనీతో పాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ప్రపంచ రెజ్లింగ్ ర్యాంకింగ్స్లో పునియాకు
మొదటి ర్యాంక్
ప్రపంచ రెజ్లింగ్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా అగ్రస్థా నంలో నిలిచాడు. 65 కిలోల విభాగంలో అతడు నం.1 స్థానంలో ఉన్నాడు. నిరుడు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు సాధించడంతో పాటు ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతం గెలిచిన 25 ఏళ్ల బజరంగ్ ఖాతాలో 58 ర్యాంకింగ్ పాయింట్లు ఉండగా.. రెండో స్థానం లో ఉన్న చకేవ్ (రష్యా) ఖాతాలో 21 పాయింట్లున్నాయి.
ఐపీఎల్లో 200 సిక్సర్లు సాధించిన తొలి భారత ప్లేయర్ ధోని
చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్లో 200 సిక్సర్లు సాధిం చిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సష్టించడంతో పాటు కెప్టెన్గా 4,000 పరుగులు పూర్తి చేశాడు. 2019 ఏప్రిల్ 21న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో ధోనీ ఈ ఘనత సాధించాడు. ధోనీ కంటే ముందు క్రిస్ గేల్ (328), ఏబీ డివిలియర్స్ (204) ఉన్నారు. ధోనీ 203 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ తర్వాత రోహిత్ శర్మ (190), సురేశ్ రైనా (190), విరాట్ కోహ్లి (186) ఉన్నారు.
Authorization