అంతర్జాతీయం
జపాన్ కొత్త చక్రవర్తిగా నరుహితో
జపాన్కు 126వ చక్రవర్తిగా నరుహితో 2019 ఏప్రిల్ 30 అర్ధరాత్రి బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రి అకిహితో (85) క్క్రెసెంథమమ్ సింహాసనం నుంచి దిగిపో వడంతో జపాన్కు నరుహితో తదుపరి చక్ర వర్తి అయ్యారు. ప్రపంచం లోనే అత్యంత ప్రాచీన రాజ్యం జపాన్. 59 ఏళ్ల నరుహితో 2019 మే 1న సింహాసనాన్ని అధిష్టించారు. ఒక చక్రవర్తి పదవి నుంచి తనంతట తాను తప్పుకోవడం జపాన్లో గత 200 ఏళ్లలో ఇదే తొలిసారి.
అంగరక్షకురాలిని వివాహమాడిన థారు రాజు
థాయిలాండ్ రాజు మహా వజ్రలోంగ్ కోర 2019 మే 2న తన వ్యక్తిగత బాడీగార్డుల డిప్యూటీ హెడ్ను వివాహం చేసుకుని, ఆమెకు రాణి సుతిధ అనే పేరు పెట్టారు. 66 ఏళ్ల వజ్రలోంగ్ కోర్న 2019 మే 4న రాజుగా పట్టాభిషేకం జరుపుకున్నారు. ఆయన ఈ సింహాసనం అధిష్టించి 10వ రామగా బిరుదును అందుకున్నారు.
అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్
పాకిస్తాన్ ప్రేరేపిత జైష్ ఎ మహ్మద్ అధిపతి మసూద్ అజార్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిం చింది. అతడిని నిషేధ జాబితాలో చేర్చే అంశంపై పదేళ్లుగా అడ్డుపడుతూ వచ్చిన చైనా.. అంతర్జాతీయ ఒత్తిడితో తన వైఖరిని మార్చు కోవడంతో మార్గం సుగమమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయం వల్ల అన్ని దేశాలూ తక్షణం అజార్, అతడి సంస్థ ఆస్తులు, ఆర్థిక వనరులను స్తంభింపజేయాల్సి ఉంటుంది. ఆయుధ విక్రయాలు చేపట్టకూడదు. అతడి ప్రయాణాలపై నిషేధం విధించాల్సి ఉంటుంది. ఐక్యరాజ్యసమితి తీర్మానంలో జమ్ముకశ్మీర్లోని పుల్వామా ఉగ్ర దాడి ప్రస్తావన లేదు.
వెనిజులాలో సంక్షోభం
వెనిజులా తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది. అధ్యక్షుడు నికోలస్ మడురోకు వ్యతిరేకంగా తిరగబడాలని అమెరికా మద్దతు ఉన్న విపక్ష నాయకుడు జువాన్ గ్వాడో దేశ సైన్యానికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రాజధాని కరాకాస్లో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించాలనే గ్వాడో సూచనకు అనుగుణంగా ఆయన మద్దతుదారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కఠినంగా వ్యవహరించాలని మడురో తన బలగాలను ఆదేశించడంతో సైన్యం కాల్పులు, బాష్ప వాయుగోళాలు, నీటి ఫిరంగులతో ఆందోళనకారులను చెదరగొట్టింది.
ఇంటర్నేషనల్ హార్టీకల్చరల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
చైనా రాజధాని బీజింగ్లో 'ద ఇంటర్నేషనల్ హార్టీకల్చరల్ ఎగ్జిబిషన్ -2019' ప్రారంభ మైంది.'లివ్ గ్రీన్, లివ్ బెటర్' నినాదంతో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్ను ఏప్రిల్ 28న చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిన్పింగ్ మాట్లాడుతూ... ప్రపంచంలోని ప్రతి మూలకు హరిత అభివద్ధి భావన చేరాలని అన్నారు. ప్రకతి నిబంధనలకు అనుగుణంగా పర్యావరణంతో మైత్రిని నెరిపితే భవిష్యత్ ఉజ్వలంగా వుంటుందని చెప్పారు.
జాతీయం
యతి అడుగులపై నిపుణుల పరిశీలన
పురాణాల కాలం నుంచి వినిపి స్తున్న 'యతి' అడుగు జాడలుగా చెబుతున్న ముద్రల చిత్రాలను నిపుణులకు పంపించాలని భారత సైన్యం నిర్ణయించింది. హిమా లయ పర్వత శ్రేణుల్లో ఈ భారీ జీవి ఉన్నట్లు అనేక కథలు ప్రచారం లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2019 ఏప్రిల్ 9న నేపాల్లోని మకాలూ బేస్క్యాంప్నకు సమీపంలో మన సైన్యానికి కొన్ని 'అనుమానాస్పద పాద ముద్ర'లు 32ఞ15 అంగుళాల పరిమా ణంలో కనిపించాయి. మంచులో కనిపించిన ఈ ముద్రలు యతివా, ఇంకేదైనా వికతాకార జీవివా తేలాల్సి ఉంది. గతంలో మకాలూ-బరూన్ జాతీయ ఉద్యానవనం వద్ద ఇలాంటి అంతుచిక్కని జీవి కనిపించినట్లు భారత సైన్యం ట్విటర్లో వెల్లడించింది. సగటు మనిషి కంటే పెద్దగా, ఎత్తుగా ఉండే కోతిలాంటి జీవి- హిమాలయాలు, సైబీరియా, మధ్య-తూర్పు ఆసియా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు నేపాలీ జానపద కథలు చెబుతున్నాయి.
వేదాంత దేశికులు స్మారక తపాలా బిళ్ల విడుదల
వేదాంత దేశికులు 750వ జయంతి సందర్భంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్లను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2019 మే 2న ఢిల్లీలో విడుదల చేశారు
బ్యాంకుల వివరాలు ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్టు
చట్టపరమైన మినహాయింపులుంటే తప్ప బ్యాంకుల వార్షిక తనిఖీల నివేదికల వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఇచ్చి తీరాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం సంబంధిత విధానాలను పునఃసమీక్షిం చాలని సూచించింది. ఆర్టీఐ చట్టానికి అనుగుణంగా నడుచుకు నేందుకు ఆఖరు అవకాశం ఇస్తున్నట్టు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు సారథ్యం లోని బెంచ్ స్పష్టం చేసింది. ఆర్బీఐపై ఆర్టీఐ కార్యకర్త ఎస్సీ అగ్రవాల్ వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్పై విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.
సీజేఐ కుట్రపై ఏకసభ్య కమిటీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి(సీజేఐ) కుట్ర వ్యవ హారం పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతత్వంలో ఏకసభ్య కమిటీని 2019 ఏప్రిల్ 25న సుప్రీంకోర్టు నియమించింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోరుతో పాటు, న్యాయమూర్తులపై భారీ కుట్ర జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏకసభ్య కమిటీకి సీజేఐ అనుచిత ప్రవర్తన ఆరోపణలతో ఎటువంటి సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసింది. సీజేఐతో రాజీనామా చేయించేందుకు, ఇతర న్యాయమూర్తులను ప్రలోభాలకు గురి చేసి, తీర్పులను ప్రభావితం చేసేందుకు భారీ కుట్ర జరుగుతోందంటూ న్యాయవాది ఉత్సవ్సింగ్ బైన్స్ అఫిడవిట్ దాఖలు చేశారు.
సైనిక వ్యయంలో భారత్కు 4వ స్థానం
సైనిక వ్యయంలో భారత్ ప్రపంచంలో 4వ స్థానంలో ఉందని స్టాకహేోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) వెల్లడించింది. ఈ మేరకు 2019 ఏప్రిల్ 30న ఒక నివేదికను విడుదల చేసింది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, చైనా, సౌదీ అరేబియా ఉన్నాయి. 2018 నాటికి మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 1,822 డాలర్లకు చేరుకోగా, 2017తో పోల్చు కుంటే 2.6 శాతం పెరిగిందని తెలిపింది. 2018లో అమెరికా సైనిక వ్యయం 649 బిలియన్ డాలర్లకు పెరిగిందని వివరిం చింది. అదేవిధంగా భారత్ వ్యయం 3.1 శాతం పెరిగి 66.5 బిలియన్లకు (4.63 లక్షల కోట్లు) చేరుకోగా, పాకిస్తాన్ వ్యయం 11 శాతం పెరిగి 11.4 బిలియన్లకు చేరుకుందని పేర్కొంది.
ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్
లండన్లో విడుదలైన ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్లో భారత వర్సిటీలు మిశ్రమ పనితీరును కనబరిచాయి. కొన్ని సంస్థలు గణనీయంగా ముందడుగు వేయగా, కొన్ని తమ స్థానాలను కోల్పోయాయి. 'టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏటా ఈ ర్యాంకింగ్స్ను రూపొంది స్తుంది. గత ఏడాది భారత్కు చెందిన 42 విద్యా సంస్థలే ఈ జాబితాలో చోటు దక్కించు కోగా, ఈసారి ఆ సంఖ్య 49కి పెరిగింది. దీంతో ఈ ఏడాది జపాన్(108), చైనా(72) తర్వాత ఎక్కువ సంస్థల ప్రాతినిధ్య మున్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. తొలిసారిగా చైనా విద్యాసంస్థ సింగ్జువా విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ఓ) 29వ ర్యాంకును నిలబెట్టుకుంది. ఇండోర్లోని ఐఐటీ ఉమ్మడిగా 50వ స్థానానికి చేరింది. ఈ ఏడాది 100 అగ్రశ్రేణి సంస్థల్లో ఐఐటీ బాంబే, రూర్కీలు ఉమ్మడిగా 54వ స్థానంలో నిలిచాయి. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (62వ ర్యాంక్), ఐఐటీ ఖరగపూర్ (76), ఐఐటీ కాన్పూర్ (82), ఐఐటీ ఢిల్లీ (91) ఈ జాబితాలో ఉన్నాయి.
మేధాసంపత్తి హక్కుల ప్రయారిటీ వాచ్లిస్ట్లో భారత్
మేధాసంపత్తి హక్కుల ఉల్లంఘన విషయంలో భారత్ను ప్రయారిటీ వాచ్లిస్ట్ జాబితాలో చేర్చినట్లు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ (యూఎస్టీఆర్) ప్రకటించింది. ఐపీ ప్రొటెక్షన్, ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా పలు ఆర్థిక వ్యవస్థలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని, ఇందులో భారత్ కీలకంగా ఉందని యూఎస్టీఆర్ 2019 ఏప్రిల్ 25న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ప్రయారిటీ వాచ్లిస్ట్లో (అత్యంత ప్రాధాన్యత కలిగిన జాబితా) భారత్తో పాటు చైనా, ఇండోనేసియా, రష్యా, సౌదీ అరేబియా, వెనెజులా, సహా మొత్తం 11 దేశాలు ఉన్నాయి.
ప్రాంతీయం
అపెక్స్ బ్యాంకుకు జాతీయ అవార్డులు
రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టీఎస్సీఏబీ)కు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర సహకార, జిల్లా సహకార కేంద్ర బ్యాం కులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (ఎన్ఏఎఫ్ఎస్సీఓబీ) ఏటా పురస్కారాలు అందజేస్తోంది. ఇందులో భాగంగా 2017-18లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకుకు ప్రథమ, కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు ద్వితీయ అవార్డులు లభించాయి. సహకార శిక్షణ సంస్థల విభాగంలో తెలంగాణ రాష్ట్ర అపెక్స్ బ్యాంకు కోపరేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(టీఎస్సీఏబీ-సీటీఐ)కి తతీయ, సంఘాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ప్రథమ అవార్డు దక్కింది. 2019 ఏప్రిల్ 30న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఎన్సీడీసీ ఎండీ సుందీప్కుమార్ నాయక్ చేతుల మీదుగా బ్యాంకు ప్రతినిధులు అవార్డులు అందుకున్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ పురస్కారాలు
తెలంగాణ అకాడమీ ఆవిర్భావ దినోత్సవాన్ని 2019 మే 2న హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ నెలకొల్పిన తొలి పురస్కారాలను ప్రదానం చేశారు. ఉత్తమ వచన రచనా విభాగంలో ఉప్పల నరసింహం రచించిన 'మట్టి మనిషి' కథా సంపుటికి, ఉత్తమ కవితా పురస్కారాన్ని సిద్ధార్థ రచించిన 'బొమ్మల బాయి' కవితా సంపుటికి ప్రదానం చేశారు. పురస్కారం కింద లక్ష నూటా పదహారు రూపాయల నగదు (ఒక్కొక్కరికి) అందజేశారు. ఈ సందర్భంగా అకాడమీ ఆధ్వర్యంలో వెలువడే 'పునాస' త్రైమాసిక సంచికను ఆవిష్కరించారు.
హైకోర్టు న్యాయమూర్తిగా శ్రీదేవి
రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి నియమితుల య్యారు. ఈ మేరకు ఆమె బదిలీకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2019 మే 2న ఆమోదం తెలిపారు. దీంతో తెలంగాణ హైకోర్టుకు నియమితులైన తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీదేవి గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరానికి చెందిన జస్టిస్ శ్రీదేవి ఆలిండియా కోటాలో 2005లో యూపీ జ్యుడీషియల్ సర్వీసెస్కు ఎంపికయ్యారు. 2016లో జిల్లా, సెషన్స్ జడ్జిగా పదోన్నతి పొందారు. ఘాజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
సీసీఎంబీలో కణ పరిశోధన కేంద్రం ఏర్పాటు
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లోని అటల్ ఇంక్యు బేషన్ సెంటర్లో 2019 ఏప్రిల్ 25న కణాధారిత మాంసం తయారీ పరిశోధన కేంద్రం ఏర్పాటైంది. కణాధారిత మాంసాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.
వార్తల్లో వ్యక్తులు
న్యాక్' ఈసీ సభ్యుడిగా ఓయూ ప్రొఫెసర్ శ్రీనివాస్
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్కు అరుదైన అవకాశం లభించింది. ఆయనను బెంగళూరు కేంద్రంగా ఉన్న న్యాక్ (నేషనల్ అసెస్మెంట్-అక్రిడిటేషన్ కౌన్సిల్) ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ విశ్వవిద్యాలయ నిధుల సంఘం (యూజీసీ) ఆదేశాలు జారీచేసింది. ఆ పదవిలో శ్రీనివాస్ మూడేళ్లు కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన బోధనతో పాటు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనాపత్రాల్లో కొన్ని ఇప్పటికే వివిధ అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి.
సిమోన్ నూరాలీకి 7 అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఒకేసారి సీటు
భారతీయ బాలిక సిమోన్ నూరాలీ అమెరికాలో 7 ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఒకేసారి సీటు పొంది సంచలనం సష్టిం చింది. దుబారులోని ఈ 17 ఏళ్ల బాలికకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బర్క్లీ), జాన్ హాప్కిన్స్, ఏమోరీ, జార్జిటౌన్, జార్జివాషింగ్టన్ విశ్వవిద్యాలయాలతో పాటు ఐవీ లీగ్ స్కూల్స్ (డార్ట్ మౌత్ కాలేజీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీ) అనుమతి పత్రాలు పంపించాయి. సిమోన్ భారతదేశంలో మహిళల అక్రమ రవాణాపై 'ద గర్ల్ ఇన్ పింక్ రూమ్' అనే పుస్తకం కూడా రాసింది.
వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు అసాంజ్కు ఏడాది జైలు
బెయిల్ షరతులను ఉల్లంఘించినందుకు గాను వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్కు యూకేలోని ఓ న్యాయస్థానం 2019 మే 1న 50 వారాల జైలుశిక్ష విధించింది. యూకే బెయిల్ చట్టాన్ని అతను ఉల్లంఘించినట్లు లండన్ లోని వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తేల్చింది. గతంలో రహస్య పత్రాలను బహిర్గతం చేసిన వ్యవహారంలో తనను అమెరికాకు అప్పగించకుండా ఉండాలన్న ఉద్దేశంతో అసాంజ్ ఏడేళ్లుగా లండన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలోనే ఆశ్రయం పొందారు. ఈక్వెడార్ ప్రభుత్వం అసాంజ్కు ఆశ్రయాన్ని ఉప సంహరించడంతో ఇటీవల అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కోర్టు తీర్పును వెలువరించింది.
గూగుల్ బోర్డు నుంచి ష్మిట్ నిష్క్రమణ
గూగుల్ను మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్ ఆ సంస్థ బోర్డు నుంచి నిష్క్రమించనున్నారు. 2019 జూన్లో ఆయన తప్పుకో నున్నట్లు గూగుల్ మాతసంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది. 2018లో ఆల్ఫాబెట్ చైర్మన్ పదవి నుంచి ష్మిట్ తప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి బోర్డులో సభ్యుడిగా ఉన్నప్పటికీ.. సాంకేతిక సలహాదారు పాత్రకే పరిమితం అయ్యారు. జూన్తో ఆయన పదవీకాలం ముగియనుంది.
బ్రిటన్లో రీకాల్ విధానంలో ఎంపీకి ఉద్వాసన
బ్రిటన్లో ఫియోనా ఒనసాన్య(35) అనే మహిళా ఎంపీ రీకాల్ విధానంలో ఉద్వాసనకు గురయ్యారు. ఇలా ఒక ఎంపీకి ఉద్వాసన పలకడం ఇదే తొలిసారి. ఫియోనా ఒనసాన్య 2017లో పీటర్బరో నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరపున పోటీ చేసి అధికార కన్జర్వేటివ్ అభ్యర్థి పై 607 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018 జులైలో పరిమితికి మించిన వేగంతో కారులో ప్రయాణిస్తూ పోలీసులకు చిక్కారు. విచారణ సందర్భంగా అబద్దాలు చెప్పి బయట పడేందుకు ప్రయత్నించడాన్ని తప్పు పట్టిన న్యాయస్థానం 2019 జనవరిలో ఆమెకు 8 నెలల జైలు శిక్ష విధించింది. తమ ఎంపీ ఫియోనా నేరానికి పాల్పడ్డారని, ఆమెకు ఉద్వాసన పలకాలంటూ నియోజకవర్గానికి చెందిన 28% మంది ఓటర్లు 2019 మే 1న రీకాల్ పిటిషన్పై సంతకాలు చేశారు.
జస్టిస్ సుభాషణ్రెడ్డి కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తిగా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానాల ప్రధాన న్యాయ మూర్తిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్గా, లోకాయుక్తగా సేవలు అందించిన జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి 2019 మే 1న హైదరాబాద్లో మృతిచెందారు. వైఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008 ఆగస్టు 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏర్పాటైంది. దానికి తొలి చైౖర్మన్గా నియమితులయ్యారు. తర్వాత లోకాయుక్తగా జస్టిస్ బి.సుభాషణ్రెడ్డి తనదైన ముద్ర వేశారు.
అవార్డులు
లామకాన్కు యుధ్వీర్ అవార్డు
హిందీ మిలాప్ వ్యవస్థాపకుడు యుధివీర్ పేరిట నెలకొల్పిన యుధ్వీర్ ఫౌండేషన్ అవార్డును 2019 సంవత్సరానికి ప్రముఖ సాంస్కతిక కేంద్రం లామకాన్కు ఇవ్వనున్నట్లు ఫౌండేషన్ ప్రకటించింది. 1991లో ఏర్పాటైన యుధివీర్ ఫౌండేషన్ ఏటా వివిధ రంగాల్లో విశిష్ట కషి చేసిన వ్యక్తులకు అవార్డు అందజేస్తోంది. ప్రస్తుతం 28వ అవార్డును లామకాన్ వ్యవస్థాపకులు అశ్హర్ ఫర్జాన్, బిజూ మాథ్యూ, హుమ్రా అహ్మద్, ఇలాహీ హిపూలాలకు ప్రకటించారు. అవార్డు కింద ప్రశంసాపత్రం, లక్ష రూపాయల నగదు పురస్కారం ఇస్తారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, ఐకే గుజ్రాల్, ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్, సామాజికవేత్త శాంతా సిన్హా తదితరులు ఈ అవార్డు గ్రహీతల్లో ఉన్నారు.
రవిశంకర్కు సెయింట్ జార్జ్ అవార్డు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, యోగా గురువు శ్రీశ్రీ రవిశంకర్కు ఆర్డర్ ఆఫ్ సెయింట్ జార్జ్ అవార్డు లభించింది. సెయింట్ గీవర్ఘీస్ సంస్మరణసభలో ఈ అవార్డును అందజేయనున్నారు. కేరళలోని కొట్టాయం జిల్లా పుత్తుపల్లిలోని సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ చర్చిలో మే 5న నిర్వహించే ఈ సభను కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రారంభించనున్నారు.
తరుణ్ చెరుకూరికి ఒబామా ఫెలోషిప్
ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్కు విజయవాడకు చెందిన తరుణ్ చెరుకూరి(35) ఎంపికయ్యారు. పౌర సమస్యల పరిష్కారానికి కషి చేస్తున్న 10 దేశాల్లోని 20 మంది ఈ ఏడాది ఒబామా ఫౌండేషన్ ఫెలోషిప్కు ఎంపికయ్యారు. వీరిలో తరుణ్ చెరుకూరి ఒకరు. భారతదేశం నుంచి ఒక్క తరుణ్ మాత్రమే ఫెలోషిప్కు ఎంపికయ్యారు. తరుణ్ ఢిల్లీ కేంద్రంగా ఇండస్ యాక్షన్ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, ఆర్టీఈ అమలుకు కషి చేస్తున్నారు. ఇప్పటి వరకు 90వేల మంది పేద విద్యార్థులను ఆర్టీఈ పరిధిలో పాఠశాలల్లో చేర్పించారు.
వరంగల్ శాస్త్రవేత్త యుగంధర్కు జర్మన్ ఫెలోషిప్
వరిలో తెగుళ్లపై పరిశోధనకు వరంగల్కు చెందిన శాస్త్రవేత్త ఎర్ర యుగంధర్ జర్మనీలోని అలెగ్జాండర్ వోన్ హోంబోల్డ్ ఫౌండేషన్ ఫెలోషిప్నకు ఎంపికయ్యారు. వరి పైరులో తెగుళ్ల నివారణకు జన్యుమార్పిడి ఇంజినీరింగ్పై ఆయన పరిశోధనలు చేయనున్నారు. జర్మనీలోని డస్సెల్ డోర్ఫ్ వద్ద గల హెయిన్రిచ్ హేయిన్ విశ్వవిద్యాలయంలో యుగంధర్ 2 ఏండ్ల పాటు పరిశోధ నలు చేస్తారు. నెలకు 2650 యూరోల చొప్పున 24 నెలల పాటు ఆయనకు స్కాలర్షిప్ ఇస్తామని ఫౌండేషన్ వెల్లడించింది. జేఎన్టీయూలో పీహెచ్డీ పూర్తి చేసిన యుగంధర్ గతంలో భారత వరి పరిశోధనా సంస్థలో రీసెర్చ్ స్కాలర్గా పనిచేశారు.
నగెన్ సైకియాకు ఎన్టీఆర్ పురస్కారం
ప్రముఖ అస్సామీ కథకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, అస్సామీ పత్రికల సంపాదకుడు నగెన్ సైకియాకు ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం-2019 లభించింది. ఈ మేరకు ఎన్టీఆర్ పురస్కారానికి నగెన్ను ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి 2019 మే 2న వెల్లడించారు. 2006లో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ను స్థాపించగా 2007 నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 26 భాషల్లోని ప్రముఖులకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు.
ఆర్థికాంశాలు
త్వరలో కొత్త రూ.20 నోటు
త్వరలో కొత్త రూ.20 నోటును చలామణిలోకి తీసుకు రానున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటిం చింది. గతంలో లాగే గాంధీజీ సిరీస్లోనే ఈ కొత్త నోట్ కూడా ఉంటుందని 2019 ఏప్రిల్ 27న తెలిపింది. నోటుపై కొత్త డిజైన్లు, అందులో కలిసేలా రేఖాగణిత నమూనాలు ఉంటాయి. అలాగే రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. ఈ నోటు వెనుకవైపు మన చారిత్రక వారసత్వ సంపదైన ఎల్లోరా గుహల చిహ్నం, దేవనాగరి లిపిలో 20 అంకె, స్వచ్ఛభారత్ లోగో, నినాదం ఉంటాయి. కొత్త నోట్తో పాటు పాత నోట్లూ చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ తెలిపింది.
భారత్ జీడీపీ వద్ధి రేటు తగ్గింపు
భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వద్ధి రేటును అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ గ్రూప్ విభాగం అయిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7.5 శాతం కాగా, దీనిని 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.3 శాతానికి కుదించింది. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు, పారిశ్రామిక ఉత్పత్తి భారీ వద్ధిపై అనుమానాలు వంటి అంశాలు తమ వద్ధిరేటు కోత అంచనాలకు కారణమని 2019 ఏప్రిల్ 30న ఇండియా రేటింగ్స్ పేర్కొంది.
సైన్స్ and టెక్నాలజి
కష్ణ పదార్థం ఉనికి నిర్ధారణ
విశ్వంలో అంతుచిక్కని కష్ణ పదార్థం (డార్క్ మ్యాటర్) ఉనికిపై ఉన్న సందేహాలను శాస్త్ర వేత్తలు పటాపం చలు చేశారు. దీనికి ప్రత్యా మ్నాయంగా వచ్చిన సిద్ధాం తాలను కొట్టి పారేశారు. కష్ణ పదార్థం ఉనికిని నిర్ధారించారు. విశ్వం విస్తరణ నుంచి గెలాక్సీ ల్లోని నక్షత్రాల కదలిక వరకూ అనేక అంశాల తీరు తెన్నులను సాధారణ పదార్థం వివరించడం లేదు. దీంతో గుర్తించడానికి వీల్లేని కష్ణ పదార్థం ఉనికిపై ఒక సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. విశ్వంలోని మొత్తం పదార్థంలో దీని వాటా 90 శాతం మేర ఉంటుందని అంచనా. అయితే దీని ఉనికిపై ఇప్పటివరకూ పరోక్ష ఆధారాలే దొరికాయి.
శనగలో మేలైన జన్యువుల గుర్తింపు
శనగలో మేలైన లక్షణాలను అందివ్వగల జన్యువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో కరువు కాటకాలను తట్టుకుని ఎక్కువ దిగుబడులు ఇవ్వగల సరికొత్త శనగ వంగడాల అభివద్ధికి మార్గం సుగమమైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం(ఇక్రిశాట్) నేతత్వంలో జరిగిన ఓ అంత ర్జాతీయ పరిశోధన ద్వారా ఈ జన్యువులను గుర్తించారు. పరిశోధనలో భాగంగా దాదాపు 45 దేశాల్లోని 429 రకాల శనగ పంటల జన్యుక్రమాన్ని విశ్లేషిం చారు. ఆర్ఇఎన్-1, 3-గ్లుకనేస్, ఆర్ఈఎఫ్ 6 అనే జన్యువులను ఇక్రిశాట్ శాస్త్రవేత్త, అధ్యయనానికి నేతత్వం వహించిన డాక్టర్ రాజీవ్ వార్ష్ణీ తెలిపారు. ఈ పరిశోధనలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ), బీజీఐ (చైనా), ఐఆర్డీ (ఫ్రాన్స్), ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్(బెంగళూరు) లతోపాటు జర్మనీ, కీనా, ఇథియోపియా, కొరియా, అమెరికా, మెక్సికో, ఆస్ట్రేలియాలకు చెందిన పలు పరిశోధన సంస్థలు పాల్గొన్నాయి.
ప్రాచీన మానవుడి పాదముద్రల గుర్తింపు
చిలీ పురాతత్వ శాస్త్రవేత్తలు 15 వేల కిందటి ప్రాచీన మానవుడి పాదముద్రలను గుర్తించినట్లు ప్రకటించారు. వీటి ఆధారంగా జరిపిన అధ్యయనంలో 12 వేల ఏళ్ల కిందటి వరకూ దక్షిణ అమెరికా ఖండం దక్షిణ అంచున ఉన్న పెటగోనియా ప్రాంతంలో మానవుల జాడే లేదని తేలిందని కెరెన్ మొరెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వాస్తవానికి 2010లోనే చిలీలోని ఒసొర్నో నగర శివారులో ఈ పాదముద్రలు లభ్యమయ్యాయి. దాదాపు 9 ఏళ్ల పరిశోధనల అనంతరం కార్బన్ డేటింగ్ ఆధారంగా అవి 15 వేల ఏళ్ల కిందటివని తేల్చారు.
లక్ష కోట్ల డాలర్లకు చేరిన మైక్రోసాఫ్ట్ విలువ
సత్య నాదెళ్ల సారథ్యంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ మార్కెట్ విలువ తొలిసారిగా లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.10 లక్షల కోట్లు) మైలురాయిని తాకింది. ఈ ఘనత సాధించిన మూడో టెక్నాలజీ కంపెనీగా మైక్రోసాఫ్ట్ చరిత్రలో నిలిచింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీ మైక్రోసాఫ్టే. యాపిల్, అమెజాన్ల కంటే ముందుంది. గతేడాదిలో ఈ రెండు కంపెనీలు లక్ష కోట్ల డాలర్ల మైలు రాయిని తాకి, తర్వాతి కాలంలో దిగువకు చేరుకున్నాయి.
క్రీడాంశాలు
ఎంసీసీ అధ్యక్షుడిగా సంగక్కర
మెరీల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర నియమితుడయ్యాడు. క్రికెట్ నిబంధనల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఎంసీసీకి అధ్యక్షుడిగా పని చేయబోతున్న తొలి బ్రిటిషేతరుడు సంగక్కర. 2019 అక్టోబరు 1న బాధ్యతలు అందుకోనున్న సంగక్కర ఏడాది పాటు పదవిలో కొనసాగుతాడు. ప్రస్తుతం ఆంటోనీ రెఫార్ట్ ఎంసీసీ అధ్యక్షు డిగా ఉన్నాడు. 2012లో ఎంసీసీ గౌరవ జీవితకాల సభ్యత్వం అందుకున్న సంగక్కర.. క్లబ్ ప్రపంచ క్రికెట్ కమిటీలోనూ భాగమయ్యాడు.
అజర్బైజాన్ గ్రాండ్ప్రి విజేత బొటాస్
అజర్బైజాన్ గ్రాండ్ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తేరి బొటాస్ విజేతగా నిలిచాడు. అజర్బైజాన్ రాజధాని బాకులో 2019 ఏప్రిల్ 28న జరిగిన ఈ రేసులో బొటాస్ 51 ల్యాప్ల దూరాన్ని గంటా 31 నిమిషాల 52.942 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానాన్ని సంపాదించాడు. దీంతో 2019లో జరిగిన తొలి నాలుగు రేసుల్లోనూ తొలి రెండు స్థానాలు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే వచ్చాయి. 1992లో విలియమ్స్ జట్టు సీజన్లోని తొలి మూడు రేసుల్లో ఈ ఘనత సాధించింది. తాజా రేసుతో మెర్సిడెస్ ఈ రికార్డును సవరించింది.
పురుషుల మ్యాచ్కు తొలిసారి మహిళా అంపైర్
పురుషుల క్రికెట్ మ్యాచ్కు అంపైర్గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళగా ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్ పొలొసక్ ఘనత సాధించింది. నమీబియా రాజధాని విండ్హక్లో 2019 ఏప్రిల్ 27న నమీబియా, ఒమన్ మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2 మ్యాచ్కు 31 ఏళ్ల క్లైర్ అంపైర్గా వ్యవహరించింది. కైలర్ గత రెండున్నరేళ్లలో మహిళల క్రికెట్లో 15 వన్డేలకు అంపైరింగ్ చేసింది. దేశవాళీల్లోనూ పురుషుల మ్యాచ్ (2017లో ఆస్ట్రేలియాలో లిస్ట్ 'ఎ')కు అంపైరింగ్ చేసిన తొలి మహిళగా కైలర్ ఘనతకెక్కింది.
బార్సిలోనా జట్టుకు లా లిగా టైటిల్
యూరోపియన్ క్లబ్ టోర్నీలో ప్రతిష్టాత్మకమైన లా లిగా టైటిల్ను బార్సిలోనా జట్టు వరుసగా రెండో ఏడాది గెలుచుకుంది. బార్సిలోనాలో 2019 ఏప్రిల్ 28న క్యాంప్ నౌలో లెవాంటె జట్టుతో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ మెస్సీ చేసిన ఏకైక గోల్తో బార్సిలోనా చాంపియన్గా నిలిచింది. వివిధ జట్ల మధ్య రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మరో మూడు మ్యాచ్లు మిగిలి ఉండగానే పాయింట్ల పరంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న బార్సిలోనాకు ట్రోఫీ దక్కింది. దీంతో రియల్ మాడ్రిడ్(33) తర్వాత అత్యధిక లీగ్ టైటిళ్లు గెలిచిన జట్టుగా బార్సిలోనా(26) రికార్డు సష్టించింది.
అమెరికా, ఒమన్లకు వన్డే హోదా
అమెరికా, ఒమన్ దేశాలకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే జట్ల హౌదా లభించింది. యూఏఈలోని దుబారులో 2019 ఏప్రిల్ 24న జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్-2లో ఒమన్ 4 వికెట్లతో నమీబియాపై, అమెరికా 84 పరుగుల తేడాతో హాంకాంగ్పై విజయం సాధించడంతో వన్డే హోదాకు అర్హత సాధించాయి. డివిజన్-2లో ప్రస్తుతం స్కాట్లాండ్, నేపాల్ ఉన్నాయి.
వింబుల్డన్ టోర్నీ ప్రైజ్మనీ పెంపు
వింబుల్డన్ టోర్నీ ప్రైజ్మనీని గత ఏడాది కంటే 11.8 శాతం పెంచుతున్నట్లు (ఓవరాల్ ప్రైజ్ మనీ రూ. 344 కోట్లు) ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. ఇక నుంచి పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలు రూ.21.33 కోట్ల చొప్పున బహుమతిగా అందుకోనున్నారు. ఇది గత ఏడాది కంటే రూ. 90 లక్షలు అధికం.
ఐఎస్ఎస్ఎఫ్ ర్యాంకింగ్స్లో అపూర్వీకి అగ్రస్థానం
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ ర్యాంకింగ్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్కు చెందిన అపూర్వీ చండేలా తొలిసారి అగ్రస్థా నంలో నిలిచింది. 2019 మే 1న విడుదల చేసిన ర్యాంకింగ్స్లో అపూర్వీ 1926 రేటింగ్ పాయింట్ల తో మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. భారత్కే చెందిన మరో రైఫిల్ షూటర్ అంజుమ్ మౌద్గిల్ 1695 రేటింగ్ పాయింట్లతో రెండో ర్యాంక్లో ఉంది. 2019 ఫిబ్రవరిలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో అపూర్వీ 252.9 పాయింట్ల స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. 2014 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, 2018 కామన్వెల్త్ గేమ్స్లో కాంస్యం గెలుచుకుంది.
ఆఫ్రిది ఆత్మకథ గేమ్ చేంజర్ విడుదల
పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆత్మకథ 'గేమ్ చేంజర్' భారత్, పాకిస్తాన్లలో విడుదలైంది. 1996లో శ్రీలంకపై 37 బంతుల్లోనే చేసిన సెంచరీని గేమ్ చేంజర్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, తాను 1975లో పుట్టినట్లు ఆఫ్రిది పేర్కొన్నాడు. అందులో తేదీని మాత్రం ప్రస్తావించలేదు. వాస్తవానికి క్రికెట్లో కొనసాగినన్నాళ్లు ఆఫ్రిది పుట్టింది 1980 మార్చి 1న అని రికార్డుల్లో ఉండేది. పాకిస్తాన్ తరఫున అతడు 2015లో చివరి వన్డే, 2018లో చివరి టి20 ఆడాడు.
ఐసీసీ ర్యాంకుల్లో భారత్కు అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక ర్యాంకుల్లో భారత్ (113 పాయింట్లు) నంబర్వన్ టెస్టు జట్టుగా నిలిచింది. వన్డేల్లో ఇంగ్లండ్ (123 పాయింట్లు) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టెస్టుల్లో భారత్ తర్వాతి స్థానాల్లో వరుసగా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నిలిచాయి. భారత్ 2016 అక్టోబర్ నుంచి టెస్టుల్లో టాప్ ర్యాంకులో కొనసాగుతోంది. వన్డేల్లో ఇంగ్లండ్ తర్వాత స్థానాల్లో వరుసగా భారత్(121), దక్షిణాఫ్రికా (115) ఉన్నాయి. తాజా ర్యాంకుల గణనలో 2015-16 సీజన్ ప్రదర్శనను తొలగించి, 2016-17, 2017-18 సీజన్ల ప్రదర్శనకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు.
Authorization