దేశాభివృద్ధిలో ఉపాధ్యాయులది కీలకపాత్ర. దేశానికి ఉత్తమ పౌరులను అందించడంలో వీరే ప్రధానం. విద్యార్థులకు విద్యతోపాటు విజ్ఞానాన్ని అందించే బాధ్యత కూడా వీరిదే. విద్యార్థులలో వ్యక్తిత్వాన్ని పెంపొందించి, వారిలోని సామర్థ్యాన్ని వెలికి తీయడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిది.
ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినంతవరకు 'విద్యాబోధన అనేది అన్ని వృత్తులను తయారు చేసే వృత్తి' అనే ప్రసిద్ధమైన వ్యాఖ్యానం ఉంది. పిల్లలను సమాజంలో ఉత్తమ వ్యక్తులుగా తీర్చి దిద్దే ఉపాధ్యాయ వృత్తి చాలా విలువైనది, ఎన్నో సవాళ్ళతో కూడుకున్నది. ఒక మంచి ఉపాధ్యాయుడు భావ వ్యక్తీకరణ, చదవడం, రాయడం, పాఠ్యాంశాలను కథల రూపంలో చెప్పడం వంటి అనేక నైపుణ్యాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. భారతదేశాన్ని విద్యాధికంగా మార్చాలంటే... ప్రతిభా వంతులైన ఉపాధ్యాయులు అవసరం ఎంతైన ఉంది. అందుకు అనుగుణంగా 2011లోనే భారత ప్రభుత్వం సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(CTET) ను ప్రారంభించింది. దీని ద్వారా నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంది.
బోధనకు అర్హత తప్పనిసరి
సీటెట్ అనేది ఉపాధ్యాయులు కావడానికి జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రామాణిక పరీక్ష. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు జాతీయ స్థాయిలో ప్రమాణాలను కలిగి ఉండడానికి ఒక నిర్థిష్ట స్థాయిని నిర్ణయించడానికి ప్రవేశపెట్టారు. 1-8 వ తరగతి విద్యార్థుల వరకు బోధించేందుకు అవసరమైన సాధారణ అర్హతను నిర్ణయిస్తుంది. ఈ పరీక్ష పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగు పరిచేందుకు, విద్యా హక్కు చట్టం కింద పిల్లలకు ఉచిత విద్య లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా నిర్వహిస్తున్నారు. విద్యాహక్కు చట్టంలోని 23(1)వ సెక్షన్ ప్రకారం ది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(NCTE) ద్వారా 1 నుంచి 8 వ తరగతి వరకు బోధించే వారికి ఉండాల్సిన కనీస అర్హతలను నిర్ణయిస్తారు. NCTE మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తి ఉపాధ్యాయుడిగా నియమితమవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)లో అర్హత సాధించాలి. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) బాధ్యతలను మానవ వనరుల మంత్రిత్వ శాఖ ( ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ) ఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కు అప్పగించింది.
కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో బోధించాలంటే..
కేేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సెంట్రల్ టిబెటన్ స్కూళ్ళు, కేంద్ర పాలిత ప్రాంతాలు (చంఢఘీర్, దాద్రాఅండ్ నగర్ హవేలి, డామన్ అండ్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు, ఎన్సీటీ ఆఫ్ ఢిల్లీ) పరిధిలో ఉన్న పాఠశాలల్లో బోధించాలనుకునే వారు కచ్చితంగా సీటెట్లో అర్హత సాధించాలి. కొన్ని అన్ ఎయిడెడ్, ప్రయివేటు పాఠ శాలలు ఉపాధ్యాయులను నియమించుకునేందుకు సీటెట్ని అర్హతగా పరిగణిస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సీటెట్ అర్హత ఉన్న వారిని టెట్ లేకుండానే నియమించుకుంటున్నాయి. సీటెట్ అర్హత సాధించడం వలన కేంద్ర ప్రభుత్వ పాఠశాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సైతం అవకాశాలను అందుకోవచ్చు.
ఏడాదికి రెండు సార్లు..
ప్రతి యేటా ఫిబ్రవరి, సెప్టెంబర్ నెలలో సీటెట్ పరీక్ష నిర్వహిస్తారు. అర్హత సాధించేంత వరకు ఎన్ని సార్లైనా ఈ పరీక్ష రాయవచ్చు. అర్హత సర్టిఫికెట్ వచ్చాక కూడా స్కోర్ పెంచుకు నేందుకు మళ్ళీ రాసే వెసులుబాటు ఉంది. ఈ పరీక్ష రాయాలనుకునే వారు ctet.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసు కోవచ్చు. పరీక్ష తేదీకి మూడు నెలల ముందు నుంచి, నెల ముందు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 60% మార్కులు సాధించిన వారికి సర్టిఫికెట్ అందిస్తారు. ఈ సర్టిఫికెట్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి 7 ఏండ్ల వరకు చెల్లుబాటవుతుంది.
అర్హత సాధించాలంటే..
సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 1- 8వ తరగతి వరకు వేర్వేరు సబ్జెక్టులను బోధించేందుకు సీటెట్ అర్హత సాధించాలని సీబీఎస్సీ సూచిస్తుంది. ఈ నిబంధనల ప్రకారం మార్చి 2012 తర్వాత విధుల్లో చేరే ఉపాధ్యాయులు సీటెట్ లేదా టెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 1-5వ తరగతి వరకు బోధించేందుకు ఇంటర్మీడియట్లో కనీసం 50 శాతం మార్కులతో, రెండేండ్ల పాటు ఉండే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ డిప్లోమా లేదా నాలుగేండ్ల బ్యాచ్లర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.El. Ed) పూర్తిచేసి లేదా చివరి సంవత్సరం చదువుతుండాలి. 6-8వ తరగతి వరకు బోధించేందుకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు, రెండేండ్ల పాటు ఉండే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ డిప్లొమా లేదా గ్రాడ్యు యేషన్లో 50 శాతం మార్కులతో పాటు బీఈడీ మొదటి సంవత్సరం చదువుతూ లేదా పూర్తి చేసిన వారు లేదా B.El. Ed నాలుగో సంవత్సరంలో ఉన్న వారూ అర్హులు.
సీటెట్ పరీక్షా విధానం
ఇందులో రెండు పేపర్లుంటాయి. ఒక ప్రశ్నకు ఒకమార్కు. మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. నెగటివ్ మార్కులు ఉండవు. 1-5వ తరగతి వరకు బోధించాల నుకునే వారికి పేపర్ 1, 6-8వ తరగతి వరకు బోధించాలనుకునే వారికి పేపర్ 2 ఉంటుంది. రెండింటికి సంబంధించి కావాలనుకుంటే రెండు పేపర్లలో అర్హత సాధించాల్సి ఉంటుంది. పరీక్షకు రెండున్నర గంటల సమయం ఉంటుంది.
సిలబస్
ఈ ఏడాది నిర్వహిస్తున్న సీటెట్ 2018లో రెండు పేపర్లకు సంబంధించిన సిలబస్ను ఎన్సీఈఆర్టీ నిర్ణస్తుంది. సిలబస్ ఇంటర్మీడియట్ స్థాయి వారికి కొంచెం కష్ట తరంగానే ఉంటుంది. అభ్యర్థులను రెండు భాషలలో పరీక్షిస్తారు. అందులో ఒకటి బోధనా మాధ్యమం రెండోది వారు నిర్ణయించుకున్నది. రెండో భాషకు సంబంధించి భాష, కమ్యూనికేషన్, గ్రహణశక్తి సామర్థ్యాలపై పరీక్ష ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్, బోధనా విభాగానికి సంబంధించిన సిలబస్లో టీచింగ్ ఆప్టిట్యూడ్, మెథడాలజీకి సంబంధించిన అంశా లుంటాయి. సీటెట్లో అర్హత సాధిస్తే, భారతదేశంలోని ఏ ప్రాధమిక పాఠశాలలోనైనా ఉపాధ్యాయునిగా నియామకానికి అర్హులవుతారు. పేపర్ 1లో 6- 11 ఏండ్ల వయసు గల పిల్లల మానసికాభివృద్ధి, బోధనా విధానంలో ఉండాల్సిన మానసిక స్థితి, సంబంధిత అంశాలు ఉంటాయి. పిల్లలను, వారి ప్రవర్తనను అర్థం చేసుకోవడం, విభిన్న అభ్యాసన విధానాలు, సులభంగా అర్థమయ్యేలా బోధించడం వంటి అంశాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి.
పేపర్ 1 విధానం
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 30
లాంగ్వేజ్1(తప్పనిసరి) 30 30
లాంగ్వేజ్2(తప్పనిసరి) 30 30
మాథమెటిక్స్ 30 30
ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 30
మొత్తం 150 150
పేపర్ 2కు సంబంధించి 11-14 సంవత్సరాల వయస్సు గల విద్యార్థుల చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, బోధన, అభ్యాసనంకు సంబంధించి విద్యా మనస్తత్వ శాస్త్రంపై దృష్టి పెడుతుంది.పేపర్1లో ఉండే విధానాలపై థియరీలు ఉంటాయి.
పేపర్ 2లో మాథమాటిక్స్, సైన్స్
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
చైల్డ్ డెవలప్మెంట్ అండ్
పెడగోగి(తప్పనిసరి) 30 30
లాంగ్వేజి 1(తప్పనిసరి) 30 30
లాంగ్వేజి 2(తప్పనిసరి) 30 30
మాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 60
మొత్తం 150 150
సోషల్ స్టడీస్/ సోషల్ సైన్స్
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
చైల్డ్ డెవలప్మెంట్ అండ్
పెడగోగి(తప్పనిసరి) 30 30
లాంగ్వేజి 1(తప్పనిసరి) 30 30
లాంగ్వేజి 2(తప్పనిసరి) 30 30
సోషల్ స్టడీస్/ సోషల్ సైన్స్ 60 60
మొత్తం 150 150
మిగిలిన వారికి
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
చైల్డ్ డెవలప్మెంట్
అండ్ పెడగోగి(తప్పనిసరి) 30 30
లాంగ్వేజి 1(తప్పనిసరి) 30 30
లాంగ్వేజి 2(తప్పనిసరి) 30 30
సోషల్ స్టడీస్/ సోషల్ సైన్స్ (లేదా)
మాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 60
మొత్తం 150 150
ఈ పరీక్షలో అడిగే ప్రశ్నలు NCERT పుస్తకాల నుంచే ఉంటాయి. వార్తా పత్రికలు రోజు చదువుతుండాలి. న్యూస్ చూస్తుండాలి. గత పరీక్షలకు సంబంధించి పేపర్లు కూడా చూడాలి. ఈ పరీక్షలో సమయాన్ని సర్దుబాటు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ప్రశ్నలు సులభంగా ఉన్నప్పటికీ సమాధానాలు చేస్తూ సమయం అనుకూలంగా ఉంచుకోవడం కొంచెం కష్టతరమైనది. ఏదిఏమైనప్పటికీ కష్టపడి చదివి మంచి భావి పౌరులను తీర్చిదిద్దాలనుకునేవారు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవచ్చు.ల
కేంద్రీయ విద్యాలయాల్లో నేరుగా అవకాశం
రాష్ట్ర ఆధ్వర్యంలో టెట్, డీఈఎడ్ ఆ రాష్ట్రం వరకే పరిమితమవుతుంది. దేశ వ్యాప్తంగా నిర్వహించే సీటెట్ మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో ఉంటుంది. దీనిని సీబీఎస్ఈ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. బీఎడ్ చేసే విద్యార్థులకు ఆయా కళాశాలల వాళ్ళు ఈ టెస్ట్ గురించి తెలియజేస్తుంటారు. ఎవరికి వారు ఉన్న ఆసక్తిని బట్టి ఈ ఎగ్జామ్ రాసేందుకు సన్నద్ధమవు తారు. నెట్ ఎగ్జామ్ ఎలాగో సీటెట్ అలా ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలు, ఆర్మీ స్కూల్స్లలో సీటెట్లో ఉత్తీర్ణత సాధించిన వారికి అవకాశం ఉంటుంది. అంతేకాదు పెద్ద పెద్ద ప్రయివేటు స్కూళ్ళలోనూ వీరికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష కావడంతో, కాంపీటీషన్ ఎక్కువగా ఉంటుంది. అందిరికీ అవకాశాన్ని కల్పిం చేందుకు ప్రతి యేటా రెండు సార్లు సీటెట్ను నిర్వహి స్తున్నారు. ప్రతిభ ఉన్న వారు అర్హత సాధించి, ఉద్యోగా వకాశం పొందేందుకు అవకాశం మెండుగా ఉంటుంది.
- డా|| కె.రాందాస్
ఎన్సీటీఈ అకడమిక్ స్టాండింగ్ కమిటీ సభ్యులు