అంతర్జాతీయం :
అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితి
విదేశీ ప్రతికూల శక్తుల నుంచి తమ దేశ కంప్యూటర్ నెట్వర్క్కు రక్షణ కల్పించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2019 మే 15న జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణ మించే అవకాశం ఉన్న విదేశీ టెలికాం కంపెనీలతో ఎలాంటి వ్యాపారాలు నిర్వహించకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. తన ఆదేశాల్లో ఏ కంపెనీ పేరు ప్రస్తావించకపోయినా, చైనా టెలికాం సంస్థ హువావేను లక్ష్యంగా చేసుకుని ఈ ఆదేశాలు జారీ చేశారనేది బహిరంగ రహస్యం.
అమెరికా నూతన వలస విధానం ఆవిష్కరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 16న నూతన వలస విధానాన్ని ఆవిష్కరించారు. అమెరికాకు వలస రావాలను కునే వారు ఇకపై ఇంగ్లీషు నేర్చుకోవడంతో పాటు అమెరికా చరిత్ర, సమాజం గురించిన ప్రాథమిక వాస్తవాలను తెలుసుకోవాలని ట్రంప్ తెలిపారు. అడ్మిషన్కు ముందు దరఖాస్తుదారులు పౌరశాస్త్ర (సివిక్స్) పరీక్షలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుందని పేర్కొన్నారు. స్కిల్డ్ వర్కర్ల వలసను 12 నుంచి 57 శాతానికి పెంచడం తాము చేస్తున్న పెద్ద మార్పు అని చెప్పారు. అయితే వీరంతా ప్రతిభ, నైపుణ్యం ఆధారంగానే రావలసి ఉంటుందని ట్రంప్ వివరించారు. గ్రీన్ కార్డుల జారీలోనూ అత్యున్నత ప్రతిభ ఉన్న వలస ఉద్యోగుల కోటాను 12 నుంచి 51శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ కొత్త నిర్ణయంతో ప్రతిభ ఉన్న వారికి మేలు జరగనుంది.
చైనాలో రంజాన్ ఉపవాసంపై నిషేధం
చైనా ప్రభుత్వం రంజాన్ ఉపవాసంపై నిషేధాన్ని కొనసాగిస్తోంది. 2015లో అక్కడ తొలిసారిగా ఈ నిషేధం విధించారు. ఉరుఫర్లు, ఇతర ముస్లిం వర్గాలు ఎక్కువగా ఉన్న వాయవ్య ప్రాంత జిన్జియాంగ్ ప్రావిన్స్లో దీన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు.
వికీపీడియాపై చైనా నిషేధం
కమ్యూనిటీ-ఎడిటెడ్ ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడి యాపై చైనా నిషేధం విధించింది. గతంలో వికీపీడియా చైనీస్ వెర్షన్ను మాత్రమే బ్యాన్ చేసిన ఆ దేశం తాజాగా అన్ని భాషల వికీపీడియా వెర్షన్లపై నిషేధం విధించింది. దాంతో పాటు దలైలామా, తియానమెన్ మసీద్ లాంటి సున్నితమైన అంశాలను సెర్చ్ చేయడంపై కూడా ఆంక్షలు విధించింది. తమ దేశ సంస్కతిని పరిరక్షించు కోవడంతో పాటు ఇంటర్నెట్ వినియోగదారులు విదేశాల ప్రభావాలకు లోనుకాకుండా అరికట్టేలా 'కల్చరల్ గ్రేట్ వాల్'ను డ్రాగన్ రూపొందిస్తోంది. గూగుల్, ఫేస్బుక్, లింక్డ్ ఇన్పై చైనాలో ఇప్పటికే నిషేధం ఉంది. టర్కీలో కూడా వికీపీడియాపై నిషేధం ఉంది.
మూడు ఇస్లాం తీవ్రవాద సంస్థలపై శ్రీలంకలో నిషేధం
శ్రీలంక ప్రభుత్వం ఇస్లాం ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు గట్టి చర్యలకు ఉపక్రమించింది. 2019 ఏప్రిల్ 21న వరుస ఆత్మాహుతి దాడులతో 250 మందిని పొట్టనబెట్టుకున్న నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే)తో పాటు జామాతె మిలాతే ఇబ్రహీం (జేఎంఐ), విలాయత్ అస్ సైలానీ (డబ్ల్యూఏఎస్) అనే మూడు ఇస్లాం తీవ్రవాద సంస్థలపై నిషేధం విధించింది. ఈ మేరకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అసాధారణ అధికారిక ఆదేశాలను జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకూ దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగంపైనా ఆంక్షలు విధించారు. పుకార్ల వ్యాప్తిని అడ్డు కోవటానికి సామాజిక మాధ్యమాలపైనా ఆంక్షలు కొనసాగిస్తున్నారు.
23వ సారి ఎవరెస్ట్ శిఖరారోహణ
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని వరుసగా 23వ సారి అధిరోహించిన నేపాలీ షెర్పా పర్వతా రోహకుడు కామీ రిటా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఎవరెస్ట్ పర్వత సమీపంలోని థామే గ్రామానికి చెందిన రిటా ఎవరెస్టును ఈశాన్య రిట్జ్ మార్గంలో 2019 మే 14న అధిరోహించాడని నేపాల్ పర్యాటకశాఖ తెలిపింది.1994లో తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రీటా ఏటా తన మిత్రులైన షెర్పా గైడ్లతో కలిసి ఎవరెస్టును అధిరొహిస్తున్నాడు.
బ్రిటన్ కుబేరుల్లో హిందూజాలకు అగ్రస్థానం
బ్రిటన్ కుబేరుల్లో అగ్రస్థానం భారతీయ మూలాలు కలిగిన హిందూజా సోదరులకు దక్కింది. 22 బిలియన్ పౌండ్ల (సుమారు రూ.1.98 లక్షల కోట్ల) సంపదతో సండేటైమ్స్ రిచ్లిస్ట్ వార్షిక జాబితాలో అగ్రస్థానం పొందారు. తరవాతి స్థానంలోనూ ముంబయిలో జన్మించిన రూబెన్ సోదరులు నిలిచారు. వీరి సంపద 18.66 బిలియన్ పౌండ్లు (సుమారు రూ.1.68లక్షల కోట్లు). హిందూజా గ్రూప్ సంస్థల నిర్వాహకులైన శ్రీచంద్- గోపిచంద్ హిందూజా సోదరుల సంపద ఏడాది క్రితం కంటే 1.35 బిలియన్ పౌండ్లు (సుమారు రూ.12,200 కోట్లు) పెరిగింది.
జాతీయం :
ఐఏఎఫ్కు తొలి అపాచీ హెలికాప్టర్
భారత వాయుసేన (ఐఏఎఫ్)కు తొలి అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్ను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ అప్పగించింది. భారత వాయుసేన (ఐఏఎఫ్) 2015 సెప్టెంబర్లో అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థతో భారత వాయుసేన 22 అపాచీ హెలికాప్టర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మొదటి హెలికాప్టర్ను అరిజోనాలోని మెసాలో మే 10న భారత వాయుసేనకి అమెరికా అప్పగించింది. జూలైలో మొదటి హెలికాప్టర్ భారత్కు రానుంది. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్, హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టం సంయుక్తంగా ఈ హెలికాప్టర్ల విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నాయి.
పిట్స్బర్గ్ యూనివర్సిటీతో ఐఎస్బీ సహకార ఒప్పందం
అమెరికాలోని అగ్రగామి విద్యాసంస్థ అయిన పిట్స్బర్గ్ యూనివర్సిటీతో హైదరాబాద్కు చెందిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సహకార ఒప్పందం కుదుర్చు కుంది. ఇది అయిదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఉమ్మడిగా పరిశోధనలు చేపట్ట టానికి, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవటానికి, విద్యార్ధులు- బోధనా సిబ్బంది మార్పిడి కార్యక్రమాలు అమలు చేయటానికి వీలుంటుంది.
ప్రధాని నరేంద్రమోడిపై 'టైమ్' ముఖచిత్ర కథనం
ప్రముఖ మ్యాగజైన్ 'టైమ్' తన తాజా అంతర్జాతీయ సంచికలో ప్రధాన మంత్రి నరేంద్రమోడిపై ముఖచిత్ర కథనాన్ని ప్రచురించింది. 'ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్' (భారత ప్రధాన విభజనదారు) అంటూ పతాక శీర్షికను పెట్టింది. అదే సమయంలో 'మోదీ ద రిఫార్మర్' (మోదీ ఓ సంస్కర్త) అంటూ మరో చిన్న శీర్షికను కూడా ఉంచింది. విపక్ష కాంగ్రెస్పైనా విమర్శలు చేసింది. వారసత్వ అంశం తప్ప ఆ పార్టీకి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదని పేర్కొంది. ఐరోపా, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా, దక్షిణ పసిఫిక్ ప్రాంతాలకు వెళ్లిన అంతర్జాతీయ సంచికలో మోడిపై ముఖచిత్ర కథనాన్ని 'టైమ్' ప్రచురించింది. 'భారత ప్రధాన విభజనదారు' కథనాన్ని భారత పాత్రికేయురాలు తవ్లీన్ సింగ్, పాకిస్థాన్ రాజకీయవేత్త సల్మాన్ తసీర్ల కుమారుడు ఆతిష్ తసీర్ రాశారు. 'సంస్కరణదారు మోదీ' కథనాన్ని అంతర్జాతీయ రాజకీయ మేథోమదన సంస్థ 'యూరేషియా గ్రూప్' వ్యవస్థాపకుడు ఇయాన్ బ్రెమర్ రాశారు. అలాగే 'భారత్లో మరో ఐదేళ్లు మోదీ సర్కారు కొనసాగుతుందా?' 'ఆర్థిక సంస్కరణలకు మోదీయే అద్భుత ఆశాదీపం' శీర్షికన కూడా కథనాలు వచ్చాయి.
ఎల్టీటీఈపై మరో ఐదేళ్ల నిషేధం
శ్రీలంక తమిళ వేర్పాటువాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)పై మరో ఐదేళ్లపాటు నిషేధం కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967 కింద ఈ నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. 1991లో రాజీవ్గాంధీ హత్యానంతరం ఎల్టీటీఈపై భారత్ నిషేధం విధించింది.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ రద్దు
భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు చెందిన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ రిజిస్ట్రేషన్ను కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(FCRA) పరిధిలోకి తమ NGO రాదని, తమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలన్న విన్నపాన్ని కేంద్రం మన్నిం చిందని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తెలిపింది. ఇన్ఫోసిస్ ఆరేండ్లుగా ఆదాయ వ్యయాలను కేంద్రానికి అందించడం లేదు. ఒకవేళ ఎలాంటి నిధులు రాకున్నా నిల్ అని చూపించాల్సి ఉంటుంది. ఇవేమీ జరగకపోవడంతో కేంద్రం 2018లో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతకుముందే ఇన్ఫోసిస్ రద్దుకు సంబంధించిన వినతిని అందించి ఉండడంతో సమర్పించింది. నిబంధనలు పాటించని సుమారు 1755 సంస్థలకు కేంద్ర హోంశాఖ 2018లో షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
అభినందన్ స్క్వాడ్రన్కు స్లేయర్స్ బ్యాడ్జీ
భారత వింగ్ కమాండర్ అభినందన్కు చెందిన 51 స్క్వాడ్రన్ వైమానిక దళానికి 'ఫాల్కన్ స్లేయర్స్' 'అమ్రామ్ డాడ్చర్స్' బ్యాడ్జీలు లభించాయి. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక ఎఫ్-16 విమానాలతో పాటు అమ్రామ్ క్షిపణులను స్క్వాడ్రన్ 51 దీటుగా తిప్పికొట్టినందుకు ఈ బ్యాడ్జీలను జారీ చేసినట్లు భారత వైమానిక దళం తెలిపింది.
వందే భారత్ ప్రయాణం లక్ష కి.మీ.
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణం లక్ష కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఢిల్లీ-వారణాసి మధ్య రాకపోకలు సాగించే ఈ రైలు మూడు నెలల్లో నిరంతరాయంగా ప్రయాణించి 2019 మే 15న కాన్పూర్ సమీపంలో కొచ్చే సమయానికి లక్ష కిలో మీటర్లు పూర్తిచేసుకుంది. దేశంలో అత్యంత వేగం ప్రయాణించే ఈ రైలును ప్రధాని నరేంద్రమోడి న్యూఢిల్లీలో 2019, ఫిబ్రవరి 15న ప్రారంభించారు. బుల్లెట్ రైలు తరహాలో ఉండే ఈ రైలులో అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
లోక్పాల్ వెబ్సైట్ ప్రారంభం
దేశంలో మొదటిసారి 2019 మార్చి 18న ఏర్పాటైన లోక్పాల్కు సంబంధించిన వెబ్సైట్ 2019 మే 16న ప్రారంభమైంది. లోక్పాల్ మొదటి చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ దీన్ని ప్రారంభించారు. ఇందులో లోకపాల్ విధివిధానాలు, పనితీరును పొందుపరిచారు. ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగుల అవినీతి, అక్రమాలు లోకపాల్, లోకాయుక్త పరిధిలోకి వస్తాయి. ఆ కేసులను త్వరితగతిన విచారించి శిక్షలు ఖరారు చేయడం దీని ప్రధాన కర్తవ్యం. అంతేకాకుండా లోకపాలకు చేసే ఫిర్యాదుల విషయమై కేంద్ర ప్రభుత్వం నిర్ణీత నమూనా పత్రాన్ని రూపొందిస్తోంది. దీన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది.
అరుణాచల్ప్రదేశ్లో కొత్త రకం సర్పం
అరుణాచల్ప్రదేశ్లోని పశ్చిమ కామెంగ్ జిల్లాలో కొత్త రకం పాము వెలుగు చూసింది. ఇటుక రంగులో ఉన్న ఈ సర్పం రక్తపింజరి జాతిదని, దీనికి వేడిని పసిగట్టే లక్షణం ఉందని చెబుతున్నారు. అశోక్ కెప్టెన్ నేతత్వంలోని నిపుణులు దీన్ని కనుగొనట్లు రష్యా జర్నల్ 'హెర్పెటాలజీ'లో ప్రచురించారు.
మహిళలతో యాంటీ నక్సల్స్ కమాండో యూనిట్
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 30 మంది మహిళలతో యాంటీ నక్సల్స్ కమాండో యూనిట్ను ఏర్పాటు చేసింది. నక్సల్స్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టే చర్యల్లో భాగంగా ఏర్పాటైన ఈ బందానికి 'దంతేశ్వరి లఢకే' అని నామకరణం చేశారు. మావో ప్రభావిత ప్రాంతాలైన బస్తర్, దంతెవాడ ప్రాంతాల్లో ఈ మహిళా కమాండోల బందం సేవలు అందించనుంది. ఈ ప్రత్యేక బందంలో 10 మంది మాజీ నక్సలైట్లు ఉన్నారు.
లోక్సభకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యంత ధనికుడు ఆర్.కె.శర్మ
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా బీహార్కు చెందిన స్వతంత్ర అభ్యర్థి ఆర్.కె.శర్మ(రమేష్కుమార్ శర్మ) నిలిచారు. రెండో అత్యంత ధనికుడిగా తెలంగాణలోని చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి నిలిచారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రత్యర్థి రంజిత్రెడ్డి దేశంలో అత్యధిక వార్షిక ఆదాయం పొందుతున్న వారిలో మూడో వ్యక్తిగా నిలిచారు. దేశవ్యాప్తంగా లోక్సభ బరిలో నిలిచిన 8,049 అభ్యర్థుల నుంచి 7,928 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించి నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) సంస్థ లు ఈ మేరకు 2019 మే 13న నివేదికను వెల్లడించాయి.
చిన్నబోతున్న చంద్రుడు
చంద్రుడి పరిమాణం గత కోట్ల సంవత్సరాల్లో 50 మీటర్ల మేర తగ్గిపోయిందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అంత ర్భాగం చల్లబడుతున్న నేపథ్యం లోనే ఇలా జరుగుతుందని తెలిపారు. చంద్రుడి పైపొర దఢంగా ఉండడం వల్ల కుచించుకుపోయే కొద్దీ ఆ పొరల్లో పగుళ్ళు ఏర్పడతాయని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త థామస్ వాటర్స్ తెలిపారు. దీని వల్ల చంద్రుడిపై కంపాలు ఏర్పడతాయని చెప్పారు. 'అపోలో' యాత్రల సందర్భంగా గతంలో అమెరికా వ్యోమగాములు చంద్రుడిపై ఉంచిన సైస్మోమీటర్లు ఇప్పటివరకు 28 చంద్రకంపాలను నమోదు చేశాయి. రిక్టర్ సూచీపై వీటి తీవ్రత 2-5 వరకూ ఉంది. పగుళ్ల వల్ల ఉత్పన్నమైన 'ఫాల్ట్'ల కారణంగానే కొన్ని ప్రకంపనలు ఏర్పడినట్లు గుర్తించారు.
ప్రాంతీయం:
ఇఫ్కో డైరెక్టర్గా దేవేందర్రెడ్డి
ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ (ఇఫ్కో) డైరెక్టర్గా మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మాధవరెడ్డిగారి దేవేందర్రెడ్డి ఎన్నికయ్యారు. 2019 మే 10న ఢిల్లీలోని ఇఫ్కో సదన్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన నియోజకవర్గం నుంచి దేవేందర్రెడ్డి ఎన్నికయ్యారు. ఐదేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు.
భారజల కర్మాగారం తాత్కాలిక మూసివేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఆసియాలో పెద్దదైన మణుగూరు భారజల కర్మాగారం (హెవీవాటర్ ప్లాంట్)ను 2019 మే 11 నుంచి షట్డౌన్ చేశారు. నీరు అందుబాటులో లేక ప్లాంటును తాత్కాలికంగా మూసివేయడం 28 ఏళ్ల కర్మాగార చరిత్రలో ఇదే తొలిసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద గోదావరిపై 165 ఏళ్ల కిందట సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట నిర్మించారు.
ఉత్తమ స్టేడియంగా ఉప్పల్ స్టేడియం
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఉత్తమ స్టేడియంగా నిలిచింది. ఉప్పల్తో పాటు మొహాలీ స్టేడియంను కూడా ఉత్తమ స్టేడియంగా ప్రకటించారు. 2019 మే 12న జరిగిన ఫైనల్ అనంతరం హైదరాబాద్, మొహాలీ మైదానాల్ని ఉత్తమ మైదానాలుగా ప్రకటించారు. ఐపీఎల్ ఒక్కో వేదికకు రూ.25 లక్షలు నగదు బహుమతి అందజేశారు.
హైదరాబాద్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ
హైదరాబాద్లో 2019 అక్టోబర్ 11, 12 తేదీల్లో 'వరల్డ్ డిజైన్ అసెంబ్లీ' నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక డిజైనింగ్ రంగంలో సజనాత్మకత పెరుగుతుందని భావిస్తున్నారు. 31వ ద్వైవార్షిక వరల్డ్ డిజైన్ అసెంబ్లీని హైదరాబాద్లో నిర్వహిస్తామని 2018 జూలైలో వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూడీఓ) అధ్యక్షులు లూయిసా బొషిటో ప్రకటించారు.
వార్తల్లో వ్యక్తులు :
కవల పిల్లలకు జన్మనిచ్చిన ఇరోమ్ షర్మిల
మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల 46 ఏళ్ల వయసులో 2019 మే 12న కవల పిల్లలకు జన్మనిచ్చారు. మాత దినోత్సవం అయిన మే 12న ఇరోమ్ షర్మిల బెంగళూరులో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. వీరికి నిక్స్ సఖి, ఆటం తారా అనే పేర్లను ఖాయం చేశారు. షర్మిల, డెస్మండ్ దంపతులు. మణిపూర్ రాష్ట్రంలో భద్రతా దళాలకు ప్రత్యేక అధికారం అందించే చట్టాన్ని (AఖీూూA-Aతీఎవస ఖీశీతీషవర (AFSPA-Armed Forces (Special Powers) Act, 1958) రద్దు చేయాలని కోరుతూ ఇరోమ్ షర్మిల 2000 నవంబర్ 5 నుంచి 2016 ఆగస్టు 9 వరకు 16 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటంతో ఉక్కు మహిళగా ఘనత కెక్కారు.
ఫిజి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మదన్ బి లోకూర్
సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్కు అరుదైన గౌరవం లభించింది. నాన్ రెసిడెంట్ ప్యానెల్లో భాగంగా 3 సం||ల పాటు ఆయనను ఫిజి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే), సుప్రీంకోర్టు అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఫిజి సుప్రీంకోర్టులో ప్రతి సంవత్సరం 3 సెషన్లు ఉంటాయి. రానున్న ఆగస్టు సెషన్ (ఆగస్టు 15 నుంచి 30 వరకు) నుంచి లోకూర్ ఆ దేశ సుప్రీంకోర్టు వ్యవహారాల్లో పాలుపంచుకోనున్నారు. 2018 డిసెంబరు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ మదన్ బి లోకూర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.
జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దూబే రాజీనామా
జెట్ ఎయిర్వేస్ సీఈఓ వినయ్ దూబే 2019 మే 14న తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన చేసిన రాజీనామా వెంటనే అమల్లోకి వచ్చిందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు సంస్థ సమాచారం ఇచ్చింది. సంస్థ డిప్యూటీ సీఈఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయిన అమిత్ అగర్వాల్ కూడా వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి వైదొలిగనట్లు జెట్ ఎయిర్వేస్ వెల్లడించింది. ఆర్థిక సంక్షోభం వల్ల 2019 ఏప్రిల్ 17న జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిపేసింది.
ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, సెంట్రల్ లెఫ్ట్ లేబర్ పార్టీ నేత బాబ్ హాక్ (89) సీడ్నీలో 2019 మే 16న మృతి చెందాడు. వామపక్ష భావజాలం ఉన్న బాబ్ 18 ఏండ్ల వయసులో లేబర్ పార్టీలో చేరారు. 1969లో ఆస్ట్రేలియన్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1980లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికై 1983లో కార్మిక నేతగా బాధ్యతలు చేపట్టారు. ఆస్ట్రేలియా ప్రధానిగా 1983 మార్చి 11 నుంచి 1991 డిసెంబర్ 20 వరకు సేవలందించారు. ఆయన పదవీకాలంలో చేపట్టిన పలు కీలక సంస్కరణల కారణంగా ఆస్ట్రేలియా ప్రగతి పథంలో శరవేగంతో దూసుకెళ్లింది.
ఐటీసీ చైౖర్మన్ దేవేశ్వర్ కన్నుమూత
దేశీయ కార్పొరేట్ దిగ్గజం ఐటీసీ చైౖర్మన్ వైసీ దేవేశ్వర్(72) 2019 మే 10న మృతి చెందారు. వైసీడీ గా ఆయన కార్పొరేట్ రంగానికి సుపరిచితులు. 2011లో దేవేశ్వర్ పద్మభూషణ్ అవార్డును అందుకొన్నారు. ఐటీసీని ఒక ఎఫ్ఎంసీజీగా మలిచిన ఘనత దేవేశ్వర్కే దక్కుతుంది.
ఇద్దరు భారతీయ పర్వతారోహకుల కన్నుమూత
నేపాల్లోని కంచన్గంగా పర్వతాన్ని అధిరోహించి తిరిగి వస్తూ ఇద్దరు భారతీయ పర్వతారోహకులు 2019 మే 15న మతి చెందారు. వీరిని బిప్లబ్ బైద్య (48), కుంతల్ కరార్ (46)లుగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్లిన వీరిద్దరూ పర్వతాన్ని అధిరోహించి కిందికి దిగే క్రమంలో పర్వత ప్రాంతాల్లో తలెత్తే అనారోగ్యానికి గురయి మతి చెందారని నేపాల్ పర్యాటకశాఖ అధికారి మిరా ఆచార్య తెలిపారు.
స్విమ్మర్ ఎంబీ బాలకష్ణన్ కన్నుమూత
దక్షిణాసియా క్రీడల్లో పతకం సాధించిన స్విమ్మర్ ఎంబీ బాలకష్ణన్(29) 2019 మే 15న మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై తన ఇంటికి వెళ్తున్న అతను అదుపుతప్పి లారీ టైర్ల కింద పడటంతో దుర్మరణం పాలయ్యాడు. చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్ కాలేజి విద్యార్థి అయిన బాలకష్ణన్ 2007లో గువాహటిలో జరిగిన జాతీయ స్విమ్మింగ్లో స్వర్ణం సాధించాడు. 2010 సీనియర్ నేషనల్ చాంపియన్షిప్ (ఢిల్లీ)లో 50మీ. బ్యాక్స్ట్రోక్ విభాగంలో జాతీయ రికార్డును నెలకొల్పాడు. అదే ఏడాది దక్షిణాసియా క్రీడల్లో 100మీ., 200మీ. బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లలో పసిడి పతకాలను సాధించాడు.
విజయా ప్రొడక్షన్స్ అధినేత వెంకట్రామిరెడ్డి కన్నుమూత
ప్రముఖ సినీ నిర్మాత, విజయా ప్రొడక్షన్స్ అధినేత బి.వెంకట్రామిరెడ్డి (75) 2019 మే 12న చెన్నైలో మృతి చెందాడు. ఈయన ప్రముఖ నిర్మాత బి.నాగిరెడ్డి కుమారుడు. భైరవద్వీపం, బందావనం తదితర చిత్రాలు నిర్మించారు.
ఇక్బాల్సింగ్కు డైరెక్టర్ జనరల్ కమెండేషన్ డిస్క్
పుల్వామాలో ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఇక్బాల్సింగ్కు పారామిలిటరీ దళాల అత్యున్నత అవార్డు డైరెక్టర్ జనరల్ కమెండేషన్ డిస్క్ను ప్రకటించింది. పక్షవాతంతో చేతులు సరిగ్గా పనిచేయని, ఆకలితో అలమటిస్తున్న శ్రీనగర్లోని ఓ బాలుడికి తాను తెచ్చుకున్న భోజనాన్ని ఇక్బాల్సింగ్ తినిపించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సష్టించడంతో సీఆర్పీఎఫ్ స్పందించింది.
ఉత్తమ వర్సిటీగా వీఐటీకి యునికా పురస్కారం
భారత్లో ఉత్తమ విశ్వవిద్యాలయంగా వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)కి యునికా పురస్కారం లభించింది. ఈ మేరకు ఐరోపాలో ఉన్న విశ్వవిద్యాలయాల సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పడిన యునికా సంస్థ వీఐటీని ఎంపిక చేసింది. బెల్జియం రాజధాని బ్రషల్స్ కేంద్రంగా కొనసా గుతున్న యునికా అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాల యాలతో కలిసి ప్రపంచ స్థాయిలో ఉన్నత విద్యను అందించడానికి సూచనలు చేస్తుంది.
ఆండీ ముర్రేకు సర్ బిరుదు
మూడు గ్రాండ్స్లామ్ టోర్నీలు, రెండు ఒలింపిక్ స్వర్ణాల విజేత అయిన టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేను బ్రిటన్ ప్రభుత్వం 'సర్' బిరుదుతో సత్కరించింది. 2019 మే 16న జరిగిన కార్యక్రమంలో ముర్రేకు ప్రిన్స్ చార్లెస్ 'నైట్హుడ్' పురస్కారాన్ని అందజేశారు.
ఆర్థికాంశాలు
మాస్టర్ కార్డ్ సేవలు మరింత విస్తతం
డిజిటల్ చెల్లింపు సేవలు అందించే సంస్థ మాస్టర్ కార్డ్ భారతదేశంలో వచ్చే అయిదేళ్లలో 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,000 కోట్లు) పెట్టుబడిగా పెట్టనుంది. సైబర్ భద్రతను పటిష్టం చేయడానికి, పట్టణాలు, గ్రామాల్లో డిజిటల్ చెల్లింపు సేవలను విస్తరించడానికి ఈ సొమ్ము వెచ్చిస్తామని మాస్టర్ కార్డ్ దక్షిణాసియా విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ వెల్లడించారు.
సైన్స్ & టెక్నాలజి
'బ్లూ మూన్'ను ఆవిష్కరించిన అమెజాన్ అధినేత
ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 2019 మే 9న తన 'బ్లూ ఆరిజిన్' అంతరిక్ష కంపెనీ రూపకల్పన చేసిన 'లూనార్ ల్యాండర్'ను ఆవిష్కరించారు. ఈ వాహనంలో 2024 నాటికి సాంకేతిక ఉపకరణాలతో పాటు మనుషులను కూడా చంద్రుడిపైకి పంపనున్నట్లు ప్రకటిం చారు. వాషింగ్టన్లో నిర్వహించిన కార్యక్రమంలో 'బ్లూ మూన్' ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. దీన్ని ఎప్పుడు ప్రయోగిస్తారనేది వెల్లడించలేదు.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ ఇన్నోవేషన్ విజేతలుగా హైదరాబాద్ స్టార్టప్లు
సైబర్ సెక్యూరిటీ, ఏఆర్/వీఆర్ కత్రిమ మేధ, వ్యవసాయం తదితర రంగాల్లోని సమస్యలపై పని చేస్తున్న స్టార్టప్లను ప్రోత్సహించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు నిర్వహించిన ప్రాంతీయ డిజిటల్ ఇన్నోవేషన్ సమ్మిట్లో 3 హైదరాబాద్ స్టార్టప్ సంస్థలు విజేతలుగా నిలిచాయి. మొత్తం 130 స్టార్టప్లు ఇందులో పోటీ పడ్డాయి. అందులో నుంచి 23 సంస్థలను ఎంపిక చేశారు. వీటిలో లూప్ రియాల్టీ, బ్లూసఫైర్ సైబర్ సిస్టమ్స్, యాప్నోవేషన్ టెక్నాలజీ సొల్యూ షన్స్ తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి. వినూత్న ఆవిష్కరణలు చేసే స్టార్టప్లను ప్రోత్సహిం చేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఇస్రో యువిక కార్యక్రమం ప్రారంభం
విద్యార్థి దశలోనే అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచే వినూత్న కార్యక్రమం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్- యువిక-2019 ను 2019 మే 13న ప్రారంభించారు. బెంగళూరు లోని భారతీయ అంతరిక్ష విజ్ఞాన సంస్థ(ఇస్రో) కేంద్ర కార్యాల యంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 110 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా విజ్ఞాన శిక్షణ ఇస్తారు. రెండు వారాల పాటు వసతితో కూడిన శిక్షణ ఇస్తారు.
చంద్రుడిపై మహిళను దించే 'ఆర్టెమిస్'
చంద్రుడిపైన మహిళా వ్యోమగామిని దించేందుకు చేపట్టిన ప్రాజెక్టుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 'ఆర్టెమిస్' అని పేరు పెట్టింది. 2024లో చేపట్టదలచిన ఈ యాత్ర కోసం ఆ సంస్థ ఇంకా నిధుల వేటలో ఉంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును 2028లో సాకారం చేయాలని నాసా అనుకుంది. 2019 మార్చిలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దాన్ని 4 సం||ల ముందుకు జరిపింది. ఈ గడువును అందుకోవడానికి తమకు కొన్ని మౌలిక వసతులు, అంతరిక్ష వాహనాలు కావాలని నాసా అధిపతి జిమ్ బ్రైడెన్స్టైన్ తెలిపారు. అపోలో పేరిట 1969 నుంచి 1972 మధ్య కాలంలో 12 మంది వ్యోమగాములను నాసా చంద్రుడి మీదకు పంపింది.
గుండె వ్యాధులను పసిగట్టే సరికొత్త వ్యవస్థ
ఫిన్లాండ్కి చెందిన శాస్త్రవేత్తలు హదయ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించే ఓ సరికొత్త వ్యవస్థను రూపొందించారు. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్తులో వచ్చే గుండె వ్యాధులను డాక్టర్ల కంటే కచ్చితంగా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సుమారు 950 మంది రోగులపై 6 సం||ల పాటు పరిశోధన జరిపిన అనంతరం వైద్యులు ఈ టెక్నాలజీ పనితీరు పట్ల నిర్ధారణకు వచ్చారు.
ఆల్ఫా ఎక్స్ను పరీక్షించిన జపాన్
ఆల్ఫా ఎక్స్ అనే కొత్త బుల్లెట్ రైలును జపాన్ 2019 మే 11న విజయవం తంగా పరీక్షించింది. గంటకు 400 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించే ఈ రైలు 2030లో పట్టాలెక్క నుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రెయిన్ అయిన ఈ రైలు 10 బోగీలను కలిగిఉంది. ఆల్ఫా ఎక్స్ ముక్కు భాగం 72 అడుగుల పొడవు ఉంది. దీని వల్ల రైలు అత్యధిక వేగంతో ప్రయాణించేటప్పుడు శబ్దం తక్కువగా రావడంతో పాటు సొరంగాలు వంటి వాటిల్లో రైలుపై తక్కువ ఒత్తిడి పడుతుంది.
వాతావరణంలో అధికంగా కార్బన్ డై ఆక్సైడ్
మానవ తప్పిదాల కారణంగా భూ వాతావరణంలో గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల స్థాయి ప్రమాదకర స్థాయిని దాటుతోంది. భూమిని వేడెక్కించే కార్బన్డయాకై ్సడ్(సీఓ2) స్థాయిలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. హవారులోని మౌనా లోవా అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు 2019 మే 11న వాతావరణం లో 415.26 పీపీఎం(పార్ట్స పర్ మిలియన్) సీఓ2 ఉన్నట్లు గుర్తించారు. 1950ల నుంచి వాతావరణం లోని సీఓ2 స్థాయిలను ప్రతి రోజూ రికార్డు చేస్తున్న ఈ అబ్జర్వేటరీ ఇంతటి గరిష్ట స్థాయిలను గుర్తించడం ఇదే ప్రథమం.
విజయవంతంగా 'అభ్యాస్'
భారత్ అభ్యాస్-హైస్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ (హీట్) అనే డ్రోన్ను విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా లోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్రేంజ్లో ఈ పరీక్షను భారత రక్షణరంగ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్డీవో) 2019 మే 13న నిర్వహించింది. ఆటోపైలట్ వ్యవస్థ సాయంతో అభ్యాస్ ముందుకు దూసుకెళుతుంది. ఇందులో చిన్న గ్యాస్ టర్బైన్ ఇంజిన్లతో పాటు దేశీయంగా అభివద్ధి చేసిన ఎంఈఎంఎస్ నేవిగేషన్ వ్యవస్థను డీఆర్డీవో శాస్త్రవేత్తలు వినియోగించారు.
క్రీడాంశాలు
ప్రపంచకప్ ప్రైజ్ మనీ పెంపు
ప్రపంచకప్ అందుకోబోయే జట్టుకు ఐసీసీ భారీ నజరానా ప్రకటించింది. విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు అత్యధికంగా 4 మిలియన్ డాలర్ల నగదు బహుమతి లభించనుంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.28 కోట్లకు పైగానే. రన్నరప్కు 2 మిలియన్ డాలర్లు (రూ.14 కోట్లకు పైగా), సెమీ ఫైనల్లో ఓటమిపాలైన రెండు జట్లకు చెరో 8 లక్షల డాలర్లు (దాదాపు రూ. 5 కోట్లకు)పైగా అందుతాయి. లీగ్ దశలో గెలిచే ప్రతి మ్యాచ్కు 40 వేల డాలర్ల చొప్పున విజేతలు గెలుచుకోనున్నారు. లీగ్ దశలోనే నిష్క్రమించే ప్రతి జట్టుకు లక్ష డాలర్ల నగదు అందనుంది. ఇంగ్లండ్, వేల్స్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్ 2019 వేడుకకు సర్వం సిద్ధమైంది. మొత్తం 46 రోజుల సంగ్రామం మే 30 నుంచి జులై 14 వరకు కొనసాగనుంది.
IPL విజేతగా ముంబై ఇండియన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 12వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ జట్టు నిలి చింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 2019 మే 12న జరిగిన ఫైనల్లో ముంబై 149/8, 148/7తో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. మొత్తంగా నాలుగోసారి టైటిల్ నెగ్గిన ముంబై ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
- యన్.సంతోష్కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270
Authorization