1. కింది వాటిలో ఏ కార్యక్రమాన్ని 'స్వర్ణాంధ్ర' సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది?
ఎ) నీరు - చెట్టు బి) జన్మభూమి
సి) పేదరికంపై గెలుపు డి) స్వచ్ఛ ఆంధ్రా
2. ఏ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ భూభాగంలో 50 శాతం చెట్లతో నిండాలని 'వనం-మనం' కార్య క్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ) 2022 బి) 2025
సి) 2029 డి) 2030
3. టిల్, మొరైన్లు, బౌల్డర్ మట్టి నిక్షేపాలు ఎలా ఏర్పడతాయి?
ఎ) ఉపరితల నీటి చర్యల వల్ల
బి) భూగర్భ జలాల చర్యల వల్ల
సి) ఆకాశ చర్యల వల్ల
డి) హిమనీ నదాల చర్యల వల్ల
4. కింద పేర్కొన్న వాటిలో ఏది సునామీకి ప్రధాన కారణం?
ఎ) సముద్రగర్భంలో భూ పగుళ్ళు కదలికలు
బి) సముద్రగర్భంలో కొండచరియలు విరిగిపడడం
సి) సముద్రగర్భంలో అగ్విపర్వత విస్ఫోటనం
డి) సముద్రగర్భంలో గనుల తవ్వకపు విస్ఫోటనం
5. కింది వాటిలో సరికాని ప్రకటనను కనుగొనండి?
ఎ) దక్షిణ అర్థగోళంలో అన్ని నెలల కంటే జనవరి నెల అత్యధిక వేడిగా ఉండును
బి) ఎల్లో సముద్రం ప్రపంచంలో తీరం లేని సముద్రం
సి) అతి పెద్దదైన చమురుశుద్ధి కర్మాగారం హల్దియాలో ఉన్నది
డి) నైలునది ఒక విలక్షణమైన నది
6. షెడ్యూల్డ్ తెగల, ఇతర సాంప్రదాయక అటవీ వృత్తుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 ప్రకారం అటవీ హక్కుల స్వభావం పరిధిని నిర్ణ యించే పద్ధతిని ఏ అధికారి మొదలు పెడతారు?
ఎ) రాష్ట్ర అటవీ విభాగం బి) కలెక్టర్
సి) తహశీల్దార్ డి) గ్రామసభ
7. కింది వాటిలో ఏది సరైనదో గుర్తించండి?
1. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర గవర్నర్చే నియమించ బడతారు
2. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి నిర్ణీత కాలపరిమితి ఉంటుంది
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) పై రెండూ డి) ఏదీకాదు
8. కింది వాటిలో ఏ ఏజెన్సీకి సమాచార హక్కు చట్టం 2005 నుంచి మినహాయింపు ఉంటుంది?
1) సిబిఐ 2) ఇంటెలిజెన్స్ బ్యూరో
3) కేబినెట్ సెక్రటేరియట్ 4) ఎన్.ఎస్.జి
5) పి.ఎం.ఓ
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 2, 3, 4 డి) 1, 3, 4
9. ఇటీవల వార్తల్లో నిలిచిన 'సిట్వీ పోర్టు' ఏ దేశంలో ఉంది?
ఎ) వియత్నాం బి) మయన్మార్
సి) ఇండోనేషియా డి) ఇరాన్
10. భారత్కు కింది ఏ అంశంలో అమెరికా వ్యూహాత్మక వాణిజ్య అధికారం - 1 (ఎస్టిఏ - 1) కింద మినహాయింపులను మంజూరు చేసింది?
ఎ) సాంకేతిక రంగానికి ఉచిత అనుమతులు
బి) ఆయుధాల కొనుగోలుకు
సి) ఆర్థిక సహకారం అందించడం
డి) పైవేవీకాదు
11. కింది వాక్యాలను పరిశీలించి సరైనదేదో తెలుపండి?
1. నాగాలాండ్లోని 'నోక్సెన్' శాసనసభా నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తొలిసారిగా ఈ వివరాలతో పాటు వీవీ ప్యాట్ యంత్రాలను ఉపయోగించారు.
2.ఓటరు తాను వేసిన ఓటు ఎంచుకున్న అభ్యర్థికే వెళ్లిందని నిర్ధారించుకోవడానికి వీవీ ప్యాట్ ఉపయోగ పడుతుంది.
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) రెండూ డి) ఏదీకాదు
12. 'ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్'కి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి సరైన వాక్యాలేవో తెలుపండి?
1. దీనిని స్వల్ప లేదా పరిమిత కాలం కోసం తయారు చేస్తారు.
2. గడిచిన సంవత్సరంలో చేసిన వ్యయాలు, ఆదాయాల సారాంశాన్ని ఇది కలిగి ఉంటుంది. అలాగే పన్నుల ద్వారా సమకూరిన ఆదాయాన్ని ఇది కలిగి ఉంటుంది.
3. ఓటాన్ ఎకౌంట్ లాంఛనప్రాయమైంది. దీనిని లోక్సభ ఎలాంటి చర్చ లేకుండా ఆమోదిస్తుంది.
4. కేంద్ర మంత్రి పీయూష్గోయల్ వోటాన్ ఎకౌంట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు.
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) పైవన్నీ
13. గవర్నర్ పదవికి నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది?
ఎ) ఫూంచీ కమిషన్
బి) పరిపాలనా సంస్కరణల కమిషన్
సి) సర్కారియా కమిషన్
డి) రాజమన్నార్ కమిషన్
14. లోక్సభ, రాజ్యసభలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి సరైన దానిని తెలుపండి?
1. రాష్ట్రపతి ఎన్నిక, అభిశంసన
2. ద్రవ్య బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదించడం
3. రాజ్యాంగబద్ద సంస్థల నివేదికలు పరిశీలించడం
4. ఆలిండియా సర్వీసుల ఏర్పాటు
ఎ) 1, 2, 3 బి) 2, 3 మాత్రమే
సి) 1, 3 మాత్రమే డి) పైవన్నీ
15. ఆంధ్రప్రదేశ్ బయోటెక్నాలజీ పాలసీ (2015-20) కింద మెగా లైఫ్ సైన్సె పార్క్ను ఎక్కడ అభివృద్ధి చేశారు?
ఎ) అమరావతి బి) విశాఖపట్నం
సి) అనంతపురం డి) తూర్పు గోదావరి
16. రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి సలహాను పాటించడం తప్పనిసరి చేసిన మొదటి రాజ్యాంగ సవరణ ఏది?
ఎ) 24వ సవరణ బి) 42వ సవరణ
సి) 44వ సవరణ డి) 54వ సవరణ
17. ఈ కింది వాటిలో రాజ్యాంగ హోదా కలిగి ఉన్న సంస్థలు ఏవి?
1) ఆర్థిక సంఘం 2) అంతర్రాష్ట్ర మండలి
3) జోనల్ కౌన్సిల్ 4) మానవ హక్కుల కమిషన్
5) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
6) నీతి అయోగ్
ఎ) 1, 2, 5 బి) 1, 5
సి) 1, 2, 4, 5 డి) 2, 5, 6
18. భారత దేశం ఇటీవల 'ఈ-విద్యభారతి' 'ఈ- ఆరోగ్య భారతి' అనే డిజిటల్ నెట్వర్క్లను ఏ దేశంతో కలిసి ప్రవేశపెట్టింది?
ఎ) ఆస్ట్రేలియా బి) సింగపూర్
సి) ఆఫ్రికా దేశాలు డి) అమెరికా
19. ఏయే అంతర్జాతీయ సంస్థలలో భారత్ సభ్యత్వం ఉంది?
1. అపెక్ (ఎ.పి.ఈ.సి) 2. బి.సి.ఐ.ఎం
3. కామన్వెల్త్
4. ఆసియాన్(ఎ.ఎస్.ఈ.ఎ.ఎన్)
5. మెకాంగ్ - గంగా కార్పొరేషన్
ఎ) 1, 2, 3 బి) 2, 3, 5
సి) 3, 4, 5 డి) 1, 2, 5
20. 'ఓపెక్'లో సభ్యత్వం లేని దేశం ఏది?
ఎ) యు.ఎ.ఈ బి) నైజీరియా
సి) వెనిజులా డి) ఖతార్
21. కింద ఇచ్చిన సమాచారంలో ఏది సరైనదో గుర్తించండి?
1. ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి మండలి 2010లో ప్రారంభమైంది
2. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్గా ఉంటారు
3. ప్రధాన ఆర్థిక సలహాదారు ఈ మండలిలో సభ్యుడిగా ఉంటారు.
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3 డి) 1, 2, 3
22. కింది వానిలో ఏది చట్టబద్దమైన సంస్థ?
ఎ) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా
బి) వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్
సి) నీతి అయోగ్
డి) తీవ్రమైన మోసాలను విచారించే కార్యాలయం
23. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) కింది విధులలో వేటిని నిర్వహించబడును?
ఎ) భారత ఏకీకృత నిధి నుంచి చేసే అన్ని వ్యయాలను గణించి, నివేదిక సమర్పించడం
బి) భారత అత్యవసర నిధి నుంచి, ప్రభుత్వ ఖాతాల నుంచి చేసే అన్ని వ్యయాలను గణించి, నివేదిక సమర్పించడం
సి) అన్ని వ్యాపార, ఉత్పత్తి లాభ నష్ట ఖాతాలను గణించి, నివేదిక సమర్పించడం
డి) ప్రభుత్వ నగదు విడుదల, స్వీకరణలను నియంత్రిం చడం, ప్రజాధనం ప్రభుత్వ ఖజానాలో జమయ్యేలా చూడడం
24. కింది వాక్యాలను పరిశీలించి సరైనవి తెలపండి?
1. ప్రజాపద్దులు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీల సభ్యులను రాజ్యసభ నుంచి తీసుకోగా, అంచనాల కమిటీ సభ్యులను లోక్సభ నుంచి తీసుకుంటారు.
2. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల కాబినెట్ కమిటీ మార్గనిర్దేశం ప్రకారం పని చేస్తుంది.
3. భారత ప్రభుత్వం వివిధ మంత్రిత్వశాఖల్లో ఏర్పాటు చేసే కమిటీలు, కౌన్సిల్లు బోర్డులు, కమిషన్లలో పార్లమెంటు సభ్యులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమిస్తుంది
ఎ) పైవన్నీ బి) 2, 3 సి) 1, 3 డి) 1, 2
25. కింది వాటిలో ప్రైవేటు వ్యక్తులతో పాటు ప్రభుత్వ అధి కారులు / సంస్థలకు వ్యతిరేకంగా జారీ అయ్యే రిట్లు ఏవి?
1. హెబియస్ కార్పస్ 2.మాండమస్
3. ప్రొహిబిషన్
ఎ) 1, 2 బి) 1, 3 సి) 1 డి) 2
26. లోక్సభ పేరును సిఫార్సు చేసే లోక్పాల్ ఎంపిక కమిటీలో ఎవరెవరు ఉంటారు?
1. ప్రధాన మంత్రి 2. లోక్సభ స్పీకర్
3. లోక్సభలో ప్రతిపక్షనేత
4. భారత ప్రధానన్యాయమూర్తి
5. భారత ప్రధాన న్యాయమూర్తి నియమించే ప్రముఖ న్యాయ నిపుణుడు
ఎ) 1, 2, 3,4 మాత్రమే బి) 2, 3, 4, 5 మాత్రమే
సి) 1, 3, 4, 5 మాత్రమే డి) పైవన్నీ
27. కింది ఏ విషయాలలో రాజ్యం (ప్రభుత్వం) సాయం చేయాలని ఆదేశిక సూత్రాలు పేర్కొంటున్నవి?
1. వృద్ధాప్యం 2. నిరుద్యోగం
3. అనారోగ్యం 4. అంగవైకల్యం
ఎ) 1, 2 బి) 1, 2, 3 సి) 1 డి) పైవన్నీ
28. కింది వాటిలో సరైన జతను గుర్తించండి?
1. ఫోయన్ - ఉష్ణ పవనం
2. మిస్ట్రాల్ - శీతల పవనాలు
3. లూ - వేసవిలో వీచే పొడిగాలులు
4. చినూక్స్ - శీతల గాలులు
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 4
29. దక్షిణ అట్లాంటిక్, ఆగేయ పసిఫిక్ ప్రాంతాల్లో ఉష్ణ మండల అక్షాంశాల్లో తుఫానులు రావు. ఇందుకు కారణం ఏంటి?
ఎ) సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం
బి) అంతర ఉష్ణమండల కలయిక మండలాలు తక్కువగా ఉండడం
సి) కొరియాలిస్ శక్తి బలహీనంగా ఉండడం
డి) ఈ ప్రాంతాల్లో భూమి లేకపోవడం
30. భూమధ్య రేఖా ప్రాంతంలో కాలికమైన వ్యత్యాసాలు తక్కువగా ఉండటానికి కారణం?
ఎ) సంవత్సరం పొడవునా వర్షపాతం
బి) దట్టమైన అటవీ విస్తీర్ణం
సి) సంవత్సరం పొడవునా సూర్యకిరణాలు దాదాపుగా నిలువుగా పడడం డి) పైవన్నీ
31. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీ - 2018కు సంబంధించిన సరైన సమాచారాన్ని గుర్తించండి?
1. జాతీయ స్థూల ఉత్పత్తిలో డిజిటల్ కమ్యూనికేషన్ రంగం వాటాను 8 శాతం పెంచడం
2. ఈ విభాగంలో 5 మిలియన్ల మంది ఉపాధి కల్పించడం
3.'ఐసిటి' అభివృద్ధి సూచీలో మొదటి 50 దేశాలలో భారత్ను చేర్చడం
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3 డి) 1, 2, 3
32. 'పైసా' (పిఎఐఎస్ఏ) యాప్ను ప్రవేశపెట్టింది?
ఎ) గృహ, పట్టణ వ్యవహారాల శాఖ బి) వాణిజ్య శాఖ సి) ఆర్థిక శాఖ
డి) మానవ వనరుల అభివృద్ధి శాఖ
సమాధానాలు
1.బి 2.సి 3.డి 4.ఎ 5.బి
6.డి 7.డి 8.బి 9.బి 10.ఎ
11.సి 12.సి 13.ఎ 14.సి 15.బి
16.బి 17.ఎ 18.సి 19.బి 20.డి
21.డి 22.ఎ 23.డి 24.ఎ 25.సి 26.ఎ 27.డి 28.ఎ 29.ఎ 30.సి
31.సి 32.ఎ
Authorization