మూలధన మార్కెట్లో పాత సెక్యూరిటీల అమ్మకం, కొనుగోళ్ళలో ద్వితీయ మార్కెట్ నిర్వహణలో స్టాక్ ఎక్స్చేంజ్ల పాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. సెక్యూరిటీ కంట్రాక్టుల (క్రమబద్ధ) చట్టం ప్రకారం ''స్టాక్ ఎక్స్చేంజ్ అంటే సెక్యూరిటీల అమ్మకం, కొనుగోళ్ళ వ్యాపారాన్ని లేదా వర్తకాన్ని నియంత్రణ చేయడానికి లేదా సులభం చేయడానికి ఏర్పాటు చేసిన, నమోదైన వ్యక్తుల సంఘం'' కాబట్టి సెక్యూరిటీలు అమ్మడం కొనడం జరిగే మార్కెట్ను స్టాక్ ఎక్స్చేంజ్లు అంటారు.
ఆసియాలోనే పురాతనమైన, బొంబారు స్టాక్ ఎక్స్చేంజ్, ది నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ ద్వారా 1875లో బొంబారులోని దలాల్ స్ట్రీట్ నందు స్థాపించడం జరిగింది. దీనికి సెక్యూరిటీస్ కంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 ప్రకారం, 1957 లో స్టాక్ ఎక్స్చేంజ్ గుర్తింపును ప్రభుత్వం కల్పించింది.
అట్లాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాకు, ఏప్రిల్ 1993లో సెక్యూరిటీస్ కంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 ప్రకారం గుర్తింపు లభించింది. 1994 నుండి మార్కెట్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ప్రస్తుతం స్టాక్ ఎక్స్చేంజీల కార్యకలాపాలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించబడుతున్నాయి. షేర్లు భౌతిక రూపంలో గాకుండా ఎలక్ట్రానిక్ రూపంలోనికి మార్చినారు. వీటిని డిమాట్ షేర్లుగా పేర్కొంటారు. వీటిని నిర్వహించడానికి 1986లో ప్రభుత్వం స్టాక్ హౌల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను నెలకొల్పింది.
స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీల అమ్మకాలు, బదిలీలు నిర్వహించ డంలో పెట్టుబడిదారులకు అనేక మంది మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు.
బ్రోకర్లు
జాబర్లు.
డీలర్లు.
బద్లా ఫైనాన్సియర్స్.
ఆర్చిట్రేటర్స్.
పెట్టుబడి సలహాదారులు.
ఫోర్టుఫోలియో మేనేజర్లు.
సబ్ బ్రోకర్స్.
ఫ్లోర్ బ్రోకర్స్
కంపెనీ వాటాల క్రయ, విక్రయాలు జరిగే ప్రదేశాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు.
- ప్రపంచంలోని మొదటి స్టాక్ ఎక్స్చేంజ్ 1602లో ఏర్పాటైంది.
- అతి పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. మే 17, 1792. వాల్ స్ట్రీట్లో ఏర్పాటు చేశారు
- నాస్డాక్ 4 ఫిబ్రవరి, 1971 ద్వితీయ స్థానం
- బొంబారు స్టాక్ ఎక్స్చేంజ్ 11 వ స్థానం.
- సెక్యూరిటీస్ కంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 గుర్తిం చిన స్టాక్ ఎక్స్చేంజ్లు 23.
- సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రణ కు లోబడి ఇవి తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి.
- అభివద్ధి చెందిన దేశాలలో జి.డి.పిలో కార్పోరేట్ రంగం వాటా 70% వుండగా మనదేశంలో కేవలం 12% మాత్రమే. ఇందులో 4% మాత్రమే స్టాక్ ఎక్స్చేంజ్లలో నమోదౌతున్నయి.
- మనదేశంలో1875 స్థాపించిన బొంబారు స్టాక్ ఎక్స్చేంజ్, 1992 లో స్థాపించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కువ మార్కెట్ మూలధనాన్ని కలిగి వున్నాయి
బొంబారు స్టాక్ ఎక్స్చేంజ్
-9 ది నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ -1875 స్థాపించారు.
- బొంబారులోని దలాల్ స్ట్రీట్లో ఉంది.
- ఆసియాలో పురాతనమైనది.
- సెక్యూరిటీస్ కంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 - స్టాక్ ఎక్స్చేంజ్ గుర్తింపు-1956 ఇచ్చారు.
- 1986లో సెన్సెక్స్ ప్రవేశపెట్టినారు. (30 షేర్లు)
- 1978-79 సెన్సెక్స్ ఆధార సంవత్సరం.
- సెన్సెక్స్తో పాటు మరో 21 సూచీలను ప్రవేశపెట్టింది.
- 1995 నుండి (బోల్ట్) బొంబారు స్టాక్ ఎక్స్చేంజ్లో ఆన్ లైన్ ట్రేడింగ్.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్
- 1992 నవంబరులో ఏర్పాటు చేసినారు.
- సెక్యూరిటీస్ కంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 - ఈ స్టాక్ ఎక్స్చేంజ్కు ఏప్రిల్1993 లో గుర్తింపు లభించింది.
- నవంబర్ 1994 నుండి కార్యకలాపాల కొనసాగింపు.
- నిఫ్టీ (50) షేర్లు
సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
- షేర్వాణి కమిటి సిఫార్సుల ఆధారంగా సెబి 1988 ఏర్పాటు.
- సెబి 1992 చట్టం - 1992 ప్రకారం చట్టబద్దత కల్పించారు.
- దేశంలోని స్టాక్ ఎక్స్చేంజ్లు దీని నియంత్రణకు లోబడి పనిచేస్తాయి.
- ప్రస్తుత సెబి చైర్మెన్ అజరు త్యాగి.
Authorization