ప్రభుత్వ విత్తం
దేశంలోని ప్రజలకు కావలసిన సామూహిక వస్తు సేవల ఉత్పత్తిని, వ్యక్తుల పరంగా ఉత్పత్తి చేయడం సాధ్యంకాదు. ముఖ్యంగా ప్రజాసంక్షేమం దష్ట్యా ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఉత్పత్తిని కొనసాగించడానికి ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ ఆసక్తిని చూపరు. అందువల్లే సామూహిక వస్తు సేవలను అందించడానికి ప్రభుత్వమే పూనుకొనవలసి ఉంటుంది. ప్రజా సంక్షేమం కొరకు నిర్వహించే ఆర్థిక కార్యకలాపాలను అధ్యయనం చేయడమే ప్రభుత్వ విత్త శాస్త్రం ముఖ్య ఉద్దేశం.
డాల్టన్ ప్రకారం ''ప్రభుత్వ విత్త శాస్త్రమనేది, అర్థశాస్త్రానికి, రాజనీతి శాస్త్రానికి మధ్య ఉన్న సరిహద్దుపై ఉండే శాస్త్రాలలో ఒకటి. ఇది ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు వీటి మధ్య సర్దుబాటుకు సంబంధించి ఉంటుంది.
బాస్టబుల్ ప్రకారం ''ప్రభుత్వ వనరుల సప్లై వాటిని ఉపయో గించడం, ఈ రెండు ప్రభుత్వ విత్త శాస్త్ర పాఠ్యభాగాలు''
షిర్రాస్ ''ప్రభుత్వ నిధుల ఖర్చు సేకరణలో ఇమిడి ఉన్న సూత్రాలను ప్రభుత్వ విత్త శాస్త్రంలో అధ్యయనం చేయడం జరుగుతుంది''
శ్రీమతి హిక్స్ ప్రకారం ''ప్రభుత్వం ప్రజల సమిష్టి కోరికలను తీర్చుటకు అవసరమైన వనరులను సమకూర్చుకునే పద్ధతుల పరిశీలనే ప్రభుత్వ విత్త శాస్త్రం''
ప్రభుత్వ విత్త శాస్త్రం నిర్వచనాలను పరిశీలించినప్పుడు, ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలను ముఖ్యంగా విత్త సంబంధ విషయాలను లేదా ఆదాయ వనరులను తెలియజేస్తాయి. ప్రభుత్వ విత్త శాస్త్రంలో ప్రభుత్వ ఆదాయ వనరుల అధ్యయనం జరుగుతుంది. అందువల్ల ప్రభుత్వ విత్త శాస్త్ర పరిధిని నాలుగు భాగాలుగా విభజించవచ్చు 1. ప్రభుత్వ ఆదాయం, 2. ప్రభుత్వం వ్యయం, 3. ప్రభుత్వ రుణం, 4. విత్త పరిపాలన.
1. ప్రభుత్వ ఆదాయం: ఈ విభాగంలో ప్రభుత్వ ఆదాయ మార్గాల గురించి వివరించడం జరుగుతుంది. ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరు పన్నులు, కనుక పన్నుల సిద్ధాం తాలు, పన్నుల నియమాలు, మంచి పన్నుల వ్యవస్థ, పన్నుల భారం, పన్నుల బదిలీ, ఉత్పత్తి, ఉద్యోగిత, పంపిణీలపై పన్నుల ప్రభావం ఎట్లా ఉంటుందనే అంశాలను తెలుసుకోవడం జరుగుతుంది.
2. ప్రభుత్వ వ్యయం: ఈ విభాగంలో ప్రభుత్వ వ్వయ స్వభావం, ప్రభుత్వ వ్యయ నియమాలు, ఉత్పత్తి ఉద్యోగిత, ఆదాయ పంపిణీపై ప్రభుత్వ వ్యయ ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది.
3. ప్రభుత్వ రుణం: ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాలకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సరిపోనప్పుడు ప్రభుత్వం రుణం ద్వారా ఆదాయం పొందుతుంది. రుణ సేకరణ మార్గాలు, వాటి స్వరూప స్వభావాలు, రుణ విమోచన పద్ధతులు, ఆర్థిక వ్యవస్థపై రుణ ప్రభావం మొదలైన అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుంది.
4. విత్త పరిపాలన: ఈ విభాగంలో ఆదాయ వ్యయాలకు సంబం ధించిన అనేక అంశాలను చర్చించి వాటిని బేరీజు వేయడం జరుగుతుంది. బడ్జెట్ తయారీ అనే ముఖ్యమైన అంశం పరిశీలించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన పత్రాన్నే బడ్జెట్ అంటారు.
ప్రభుత్వ విత్త శాస్త్రం, ప్రభుత్వ ఆదాయ వనరులను విశ్లేషిం చడమే కాకుండా ప్రభుత్వ విధానాలు, ఆదాయవనరులు సేకరించ డానికి, వ్యయం చేయడానికి ఎంతో తోడ్పడతాయి. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేయడం, ఆర్థికాభివద్ధికి కషి చేయడం, ఆర్థిక సంక్షోభాలను అధిగ మించడం, ప్రాంతీయ అసమానతలు, నిరుద్యోగం, సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించడం మొదలైన కార్యక్రమాల మూలంగా ప్రభుత్వ విత్త శాస్త్రం ప్రాధాన్యత పెరుగుతుంది.
ప్రభుత్వ విత్తం - ప్రైవేటు విత్తం
ప్రభుత్వ విత్త విషయాలు, ప్రభుత్వ ఆదాయ వ్యయాలతో సంబంధం కలిగి ఉంటాయి. అదే విధంగా వ్యక్తులు లేదా ప్రైవేటు సంస్థల విత్త విషయాలు వారి ఆదాయ వ్యయాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ రెండింటికి మధ్య పోలికలు భేదాలు ఉన్నాయి. వీటి మధ్య తేడాను అర్థం చేసుకోవడం ద్వారా పబ్లిక్ విత్త శాస్త్రంలోని సూక్ష్మ, స్థూల అంశాలను అవగాహన చేసుకొనవచ్చును.
పోలికలు: 1.కోరికలను తృప్తి పరచడం, 2. రుణం, 3.ఆదాయ పరిమాణం.
1. కోరికలను తృప్తి పరచడం: పబ్లిక్, ప్రైవేటు విత్త లక్ష్యం కోరికలను తృప్తి పరచడం. ప్రైవేటు విత్తం ప్రైవేటు వ్యక్తుల కోరికలను తీరిస్తే, పబ్లిక్ విత్తం సామూహిక కోరికలను తీరుస్తుంది.
2. రుణం: వ్యయ్యానికి సరిపడా ఆదాయం సమకూర నప్పుడు ప్రభుత్వమైనా, ప్రైవేటు వ్యక్తులైనా రుణం చేయడం తప్పనిసరి.
3. ఆదాయ పరిమాణం: పబ్లిక్ విత్తమైనా, ప్రైవేటు విత్త మైనా, ఆదాయ పరిమాణం ఎప్పుడూ ఒకే రకంగా స్థిరంగా ఉండదు అది హెచ్చుతగ్గులకు లోనవుతుంది.
తేడాలు: 1. ఆదాయ వ్యయాల సర్దుబాటు, 2. వనరుల స్వభావం, 3. బడ్జెట్ విధానం, 4 ఉపాంత ప్రయోజనాల్లో సమత్వం, 5. వ్యయ స్వభావం, 6.ధర - వ్యయం, 7. ఆదాయ వ్యయాల బహిర్గతం, 8. మార్పులు, 9 వ్యయం-ప్రాధాన్యత.
1. ఆదాయ వ్యయాల సర్దుబాటు: వ్యక్తుల విషయంలో ఆదాయం వారి వ్యయాన్ని నిర్ణయిస్తుంది. వ్యక్తి తన వ్యయాన్ని ఆదాయానికి సరిపోయేటట్లు సర్దుబాటు చేసుకుంటాడు. అయితే ప్రభుత్వం తన ఆదాయాన్ని, వ్యయానికి సరిపోయే విధంగా సర్దుబాటు చేసుకుంటుంది. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల కంటే ప్రభుత్వానికి ఉండే ఆదాయ మార్గాలు ఎక్కువగా ఉంటాయి.
2. వనరుల స్వభావం: ప్రైవేటు వ్యక్తుల కంటే ప్రభుత్వానికి ఆదాయ వనరులు అధికంగా ఉంటాయి. పన్నులు, అంత ర్గత రుణం, బహిర్గత రుణం, లోటు ద్రవ్యం మొదలైనవి ప్రభుత్వ విత్తానికి ఆదాయ మార్గాలు. ప్రైవేటు వ్యక్తులు బహిర్గత రుణం మాత్రమే పొందగలుగుతారు, కనుక ఆదాయవనరులు పరిమితం.
3. బడ్జెట్ విధానం: వ్యక్తులు తమ ఆదాయం కన్న వ్యయం తక్కువ ఉండేటట్లు చేయడం ద్వారా మిగులు బడ్జెట్కు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ప్రభుత్వానికి ఇది సాధ్యం కాదు, ఎందుకంటే ప్రభుత్వ కార్యకలాపాలు నానాటికీ పెరుగు తుండడం మూలాన లోటు బడ్జెట్ అవశ్యకత వుంటుంది.
4. ఉపాంత ప్రయోజనాలు సమత్వం: వ్యక్తుల తమ వద్ద ఉన్న ఆదాయంతో వివిధ వస్తువులను కొనుగోలు చేసేట ప్పుడు గరిష్ట ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తారు. అట్లాగే ప్రభుత్వం కూడా గరిష్ట సాంఘిక ప్రయోజనాన్ని పొందాలని ఆశిస్తుంది.
5. వ్యయ స్వభావం: ప్రభుత్వానికి దేశ రక్షణ, పరిపాలనా యంత్రాంగం మొదలైన వాటిపై తప్పనిసరి వ్యయాలు ఉంటాయి. అట్లాగే వ్యక్తులకు ఆహారం, గ హవసతి, వస్త్రం మొదలైన వాటిపై తప్పనిసరి వ్యయాలు ఉంటాయి.
6. ధర - ఉత్పత్తి వ్యయం: ప్రైవేట్ వ్యక్తుల ఉత్పత్తి లాభో ద్ధేశం కనుక వాటి ధరలు ఉత్పత్తి వ్యయం కన్న అధికంగా ఉంటాయి. ప్రభుత్వం ప్రజా సంక్షేమం కనుక వాటి ఉత్ప త్తుల ధరలు ఉత్పత్తి వ్యయంతో సమానంగా ఉంటాయి.
7. ఆదాయ వ్యయాల బహిర్గతం: ప్రభుత్వం ఆదాయ వ్యయా లను బహిర్గతం చేస్తుంది. వ్యక్తులు తమ ఆదాయ వ్యయాలను రహస్యంగా ఉంచుతారు.
8.మార్పులు: వ్యక్తులు తమ ఆదాయ వ్యయాలను వెంటనే మార్చలేరు (అవ్యాకోచం). ప్రభుత్వ ఆదాయ వ్యయాలు వ్యాకోచంగా ఉంటాయి మార్చుకోవడానికి వీలు ఉంది.
9.వ్యయం - ప్రాధాన్యత: వ్యక్తులు వర్తమాన అవసరాల కొరకు వ్యయం చేస్తే, ప్రభుత్వం భవిష్యత్ అవసరాల కొరకు వ్యయం చేస్తుంది.
పబ్లిక్ వస్తువులు - ప్రైవేటు వస్తువులు
(Public Goods - Private Goods)
పబ్లిక్ వస్తువులు అంటే మానవుల కోరికలు తీర్చేవే, కానీ వాటిని ప్రజలందరూ ఉపయోగించినప్పటికీ వాటి పరిమాణం, ప్రయోజనం తగ్గదు. అయితే ఈ వస్తువుల ఉత్పత్తికి వ్యయం అవసరమవుతుంది. ఇట్టి వస్తువులను ప్రజా సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకుని ప్రభుత్వమే ప్రజలకు అందిస్తుంది. ఈ వస్తుసేవలకు మార్కెట్ యంత్రాంగం ద్వారా ధర నిర్ణయించలేము. పబ్లిక్ వస్తువులను సామూహిక వస్తువులని కూడా పేర్కొంటారు. అయితే ప్రభుత్వం అందించే అన్ని వస్తువులు పబ్లిక్ వస్తువులు కావు. మార్కెట్ ధరలు చెల్లించి పొందే వస్తువులన్నీ ప్రైవేటు వస్తువులుగా పరిగణిస్తారు. ఈ వస్తువులను కావాలని కోరుకునే వారందరూ ధర చెల్లించాల్సిందే. కావున ధర చెల్లించిన వారి నుండి చెల్లించని వారిని వేరు చేయ వచ్చును. అనగా ధర చెల్లించి ఈ వస్తువులను కొనుక్కోవడానికి ఇష్టపడని వాళ్ళను మార్కెట్ యంత్రాంగం బహిష్కరిస్తుంది. మార్కెట్ యంత్రాంగంచే ధర నిర్ణయించబడిన వస్తువులన్నింటికి బహిష్కరణ సూత్రం వర్తిస్తుంది (Exclusive Principle). పబ్లిక్ వస్తువులకు బహిష్కరణ సూత్రం వర్తించదు. ప్రభుత్వం పబ్లిక్ వస్తుసేవలను ప్రజలందరికీ అందుబాటు లోకి తెస్తుంది. ఈరకమైన వస్తు సేవలను మస్గ్రేవ్ ''మెరిట్ కోరికలు''గా (MeritWants) పేర్కొన్నాడు. ప్రజల జీవితాలను, ఆస్తిపాస్తులను దేశం రక్షిస్తుంది. దేశంలోని ప్రతి వ్యక్తికి అతడు కోరినా కోరక పోయినా ప్రభుత్వం పబ్లిక్ సేవలైన సైన్యం, రేడియో ప్రసారాలు, రోడ్డు రవాణా, గ్రంధాలయాలు, పార్కులు మొదలైనవి ప్రజలందరికీ ఉచితంగా అందిస్తుంది. ప్రభుత్వమే ఉత్పత్తి చేసి అందించే అన్ని వస్తు సేవలను పబ్లిక్గా పరిగణించరాదు. ఉదాహరణకు రైల్వేలు, టెలిఫోన్ మొదలైనవి. అందువల్ల బహిష్కరణ సూత్రం పని చేస్తే అవి ప్రైవేటు వస్తులుగా, బహిష్కరణ సూత్రం పని చేయకపోతే వాటిని పబ్లిక్ వస్తువులుగా పరిగణించాల్సి వుంటుంది. పబ్లిక్ వస్తువులకు ఉదాహరణ దేశ రక్షణ దళాలు, రేడియో ప్రసారాలు మొదలైనవి పేర్కొనవచ్చును.
ప్రభుత్వ రాబడి మార్గాలు
(Source of Public Revenue)
నేటి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని దష్టిలో పెట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నది. అందుకు తగ్గట్టుగా ఆదాయాన్ని సమకూర్చుకొనవలసిన అవసరముంది. ప్రభుత్వ ఆదాయ మార్గాలను తెలుసుకునే ముందు ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వ రాబడి అనే పదాలకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ రాబడిలో చేరి, ప్రభుత్వ ఆదాయంలో చేరని అంశాలలో ముఖ్యమైనవి ప్రభుత్వ రుణాలు, ప్రభుత్వ ఆస్తులను విక్రయించగా వచ్చిన రాబడి మొదలైనవి. దీనిని బట్టి ''ప్రభుత్వ రాబడి'' అనే పదం విస్త తార్థంలోను, ప్రభుత్వ ఆదాయం అనే పదం సంకుచితార్థం లోను ఉపయోగించడం జరుగుతుంది.
ప్రజా శ్రేయస్సును పెంచడానికి ప్రభుత్వం కొన్నివస్తు సేవలను ప్రజలకు ఉచితంగా అందజేయవలసి ఉంటుంది. ఉదాహరణకు విద్య, వైద్యం మొదలైనవి. అట్లాగే దేశ రక్షణ, శాంతిభద్రతలను కాపాడడం వీటి కొరకు చేసే వ్యయం నానాటికి పెరగడం వలన రాబడి కొరకు అనేక మార్గాలను అవలంబించ వలసి వస్తుంది. వాటిలో ముఖ్యంగా 1. పన్నులు, 2. ఫీజులు, 3. ప్రత్యేక విధిం పులు, 4. జరిమా నాలు, 5. జప్తులు. 6. ఎస్చీట్స్, 7. అభివద్ధి పన్ను, 8. వాణిజ్య ఆదాయాలు, 9. గ్రాంట్లు, కానుకలు, 10. ప్రభుత్వ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, 11. కరెన్సీ ముద్రణ.
1. పన్నులు: ప్రభుత్వానికి ప్రధానమైన ఆదాయ వనరులలో పన్నులు ముఖ్యమైనవి. ఇవి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకునే కాకుండా ఆర్థిక కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి తోడ్పడతాయి. ప్రత్యక్షంగా తాను పొందే ప్రయోజనంతో నిమిత్తం లేకుండా దేశ ప్రజలందరి ప్రయోజనాల కొరకు ప్రభుత్వం చేసే వ్యయానికి ప్రతి పౌరుడు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించాల్సిన మొత్తాన్ని పన్ను అంటారు. ఇవి రెండు రకాలు 1. ప్రత్యక్ష పన్ను, 2. పరోక్ష పన్ను.
2. ఫీజులు: సాధారణ ప్రయోజనాన్ని ద ష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించిన పరిపాలనా సంబంధమైన సేవలై ప్పటికీ, ఆ సేవల నుండి కొందరు వ్యక్తులు ప్రయోజనాన్ని పొందినప్పుడు వారి నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఫీజు అంటారు. ఉదాహరణకు పరీక్ష ఫీజు, కాలేజీ ఫీజు మొదలైనవి.
3. ప్రత్యేక విధింపులు: ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం చేపట్టి న పనుల వలన, ఆస్తుల విలువ పెరిగినప్పుడు, దాని వల్ల లాభం పొందిన ఆస్తి యజమానులు, వారు పొందిన లాభం అనుపాతం లో ఆ పనులకైన ఖర్చును రాబట్టడానికి గాను, ప్రభుత్వం ఒక సారి మాత్రమే వసూలు చేసిన మొత్తాన్ని ప్రత్యేక విధింపులు అంటారు. ఉదాహరణకు నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టనప్పుడు ఆ ప్రాంతంలోని భూముల విలువ పెరుగుతుంది. అట్లా లాభం పొందిన యజమానుల నుండి ఆ ప్రాజెక్టు నిర్మాణానికైన వ్యయంలో కొంత భాగం, కానీ పూర్తిగా కానీ రాబట్టుకోవడానికి ప్రభుత్వం ఈ విధమైన ప్రత్యేక విధింపులు విధిస్తుంది.
4. జరిమానాలు: చట్టాలను అతిక్రమించిన వారిపై ప్రభు త్వం జరిమానాలు విధిస్తుంది. వీటి ఉద్దేశం నేరాలను అదుపులో ఉంచడమే గాని ఆదాయాన్ని ఆర్జించడం కాదు.
5.జప్తులు: ప్రభుత్వానికి, వ్యక్తులకు మధ్య కుదిరిన ఒప్పందా నికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారు చేసిన డిపాజిట్ ద్రవ్యాన్ని జప్తు చేస్తుంది. అట్లాగే ఎవరైనా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఇతర చెల్లింపులు చేయని పక్షంలో వారి ఆస్తులను జప్తు చేసి బకాయిలను ప్రభుత్వం రాబట్టు కొంటుంది.
6. ఎస్చీట్స్: ఏ వ్యక్తి అయినా వారసులు లేకుండా, వీలునా మా వ్రాయకుండా మరణిస్తే అతని ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ఎస్చీట్స్ అంటారు.
7. అభివద్ధి పన్ను: ప్రభుత్వ పథకాల వల్ల లాభం పొందిన వారిపై విధించే పన్నును అభివ ద్ధి పన్ను అంటారు.
8. వాణిజ్య ఆదాయాలు: ప్రభుత్వం ఉత్పత్తి కార్యకలా పాల్లో పాల్గొనడం ద్వారా వాటి నుండి పొందే లాభాలను వాణిజ్య ఆదాయాలు అంటారు.
9. గ్రాంట్లు, కానుకలు: ఒక ప్రభుత్వం, మరొక ప్రభుత్వా నికి ఉదారంగా ఇచ్చే ద్రవ్యాన్ని గ్రాంట్లు అంటారు. అట్లాగే స్వచ్ఛందంగా ఇచ్చే వాటిని కానుకలు అంటారు.
10. ప్రభుత్వ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం: గనులు, అడవులు, పర్వతాలు మొదలైనవి లీజుకు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ఆదాయం పొందుతుంది.
11. కరెన్సీ ముద్రణ: ప్రభుత్వా వ్యయానికి సరిపోను రాబడి లేనప్పుడు కొత్త కరెన్సీ ముద్రిస్తుంది (లోటు ద్రవ్యం).
- డాక్టర్.అక్కెనపల్లి మీనయ్య
నల్లగొండ ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు, నల్లగొండ
రిటైర్డ్ (ఎచ్.ఓ.డి) ఎకనామిక్స్ నాగార్టున ప్రభుత్వ కళాశాల
ఫోన్:9490138118
Authorization