1. కింది సమాచారాన్ని పరిశీలించి, సరైన దానిని గుర్తించండి?
1) ఈ మండలంలో వేసవికాలం పొడిగా, శీతాకాలం లో వర్షం సంభవిస్తుంది
2) ఆలీవ్, ఓక్ వంటి వృక్షజాతులు పెరుగుతాయి
3) ఈ మండలం ముఖ్యంగా పండ్లతోటలకు ప్రసిద్ధి
ఎ) ఉష్ణ మండల పచ్చిక బయళ్ళు
బి) మధ్యధరా శీతోష్ణస్థితి మండలం
సి) సమశీతోష్ణమండల గడ్డి భూములు
డి) టైగా మండలం
2. మహదాయి నదీ జలాల పంపకంపై ఇటీవల అంతిమ తీర్పు వెలువడింది. ఈ నది ప్రవహించే రాష్ట్రాలు ఏవి?
1) గుజరాత్ 2) కర్ణాటక
3) గోవా 4) మహారాష్ట్ర
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 3, 4
3. ఎవరెస్ట్ పర్వతం నెలకొని ఉన్నది ఎక్కడ?
ఎ) మధ్య హిమాలయాలలో
బి) బాహ్య హిమాలయాలలో
సి) కేంద్ర హిమాలయాలలో డి) శివాలిక్
4. ప్రణాళిక వనరులు అంచనాతో కూడిన జాతీయ ప్రణాళిక రూపకల్పనకు తగిన నిర్దేశిక సూత్రాలను తయారు చేయు బాధ్యత కలది?
ఎ) ప్రణాళికా సంఘం బి) జాతీయ అభివృద్ధి మండలి
సి) ఆర్థిక మంత్రిత్వ శాఖ డి) కేంద్ర మంత్రి వర్గం
5. కింది వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను అవి ఉండే జిల్లాలతో జతపరచండి?
1. కౌండిన్య ఎ. నెల్లూరు
2. కండలేరు బి. కర్నూలు
3. కోరింగ సి. చిత్తూరు
4. రోళ్ళపాడు డి. తూర్పుగోదావరి
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
సి) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
6. కింది వాటిని జతపరచండి?
జాబితా 1 జాబితా 2
1. చెరుత్తోని డ్యాం ఎ. మధ్యప్రదేశ్
2. ఇందిరాసాగర్ డ్యాం బి. తమిళనాడు
3. శ్రీశైలం డ్యాం సి. ఆంధ్రప్రదేశ్
4. మెట్టూరు డ్యాం డి. కేరళ
ఎ) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
బి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
7. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని తెలపండి?
1. ఖాదర్ - నూతనంగా ఏర్పడిన ఒండలి మైదానం
2. భంగర్ - వరద మైదానాల్లో పురాతన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానం
3. టెరాయి - నదుల వల్ల ఏర్పడిన చిత్తడి ప్రాంతం
ఎ) 1, 2 బి) 2,3
సి) 3 మాత్రమే డి) అన్నీ సరైనవే
8. కింది వాటిని జతపరచండి?
1. మహాబలేశ్వర్ ఎ. నీలగిరి కొండలు
2. దూప్ఘర్ బి. పశ్చిమ కనుమలు (సహ్యాద్రి)
3. దొడబెట్ట సి. అన్నామలై కొండలు
4. పాల్ఘాట్ డి. సాత్పూరా పర్వతాలు
ఎ) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
బి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
సి) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
డి) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
9. ఇటీవల భారతదేశం, పాకిస్తాన్తో సింధునది జలాల ఒప్పందం సమీక్షిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏఏ నదీ జలాలను భారత్ ఈ ఒప్పందంలో భాగంగా కలిగి ఉంది?
1. రావి 2. బియాస్ 3. జీలం
4. సట్లెజ్ 5. చీనాబ్
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 3, 5
10. కింది వాటిని కోడ్ ఆధారంగా జతపరచండి?
1. దచిగాం జాతీయ పార్కు ఎ. అస్సాం
2. ఇంద్రావతి జాతీయ పార్కు బి. కేరళ
3. గరంపానీ జాతీయ పార్కు సి. జమ్మూకాశ్మీర్
4. సైలెంట్ వ్యాలీ డి. ఛత్తీస్గఢ్
ఎ) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
డి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
11. తేలినీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
ఎ) విశాఖపట్నం బి) శ్రీకాకుళం
సి) తూర్పుగోదావరి డి) పశ్చిమ గోదావరి
12. ఆరవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన విశిష్ట భావన?
ఎ) దీర్ఘకాలపు ప్రణాళిక బి) కనీస అవసరాల పథకం
సి) నిరంతర ప్రణాళిక డి) గ్రామీణాభివృద్ధి పథకం
13. మానవాభివృద్ధి సూచీ - 2018 ప్రకారం భారత్లో సగటు ఆయుర్ధాయం ఎంత ఉంది?
ఎ) 68.8 సంవత్సరాలు బి) 67.2 సంవత్సరాలు
సి) 69.1 సంవత్సరాలు డి) 70 సంవత్సరాలు
14. కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాలలో పేదరిక నిర్మూల న పథకాలను గుర్తించండి?
1. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్
2. జనశ్రీ బీమా యోజన
3. ప్రధానమంత్రి ముద్రా యోజన
4. భారత్ నిర్మాణ్ 5. హృదరు పథకం
ఎ) 1, 2, 4 బి) 2, 3, 4
సి) 3, 4, 5 డి) 1, 4, 5
15. భారత దేశంలో సాధారణంగా కనిపించని నిరుద్యోగం ఏది?
ఎ) వ్యవస్థాపక నిరుద్యోగం బి) ప్రచ్ఛన్న నిరుద్యోగం
సి) ప్రత్యక్ష నిరుద్యోగం
డి)ఒరిపిడి (ఫ్రిక్షనల్) నిరుద్యోగం
16. 'ఆయుష్మాన్ భారత్' పథకానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి?
1. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకమైన దీనిని 'ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన' పేరుతో ప్రారంభించారు.
2. లబ్దిదారులను సామాజిక, ఆర్థిక కుల గణన (ఎన్ఇసీసీ) 2011 ఆధారంగా ఎంపిక చేస్తారు
3. దేశ వ్యాప్తంగా 50 కోట్ల మంది లబ్దిదారులకు రూ. 10 లక్షల బీమా సౌకర్యం కలుగుతుంది.
ఎ) 1 మాత్రమే బి) 1, 2 మాత్రమే
సి) 3 మాత్రమే డి) పైవన్నీ
17. 'నీతి అయోగ్ 75' వ్యూహం ప్రకారం 2022 - 23 నాటికి ఆర్థిక వృద్ధి ఎంత ఉండాలని సూచించారు?
ఎ) 8 శాతం బి) 10 శాతం
సి) 9 శాతం డి) 12 శాతం
సమాధానాలు
1.బి 2.బి 3.సి 4.బి 5.ఎ
6.ఎ 7.డి 8.బి 9.సి 10.బి
11.బి 12.సి 13.ఎ 14.ఎ 15.డి
16.బి 17.సి
Authorization