1. మే 21న ఐ.పీ.ఎల్ - 12 విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్ జట్టు మొత్తం ఎన్నిసార్లు కప్ను గెలుచుకుంది?
ఎ) నాలుగు సార్లు బి) అయిదు సార్లు
సి) రెండు సార్లు డి) మూడు సార్లు
2. అసోం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ఇందిరా మిరి యూనివర్సల్ విడో పెన్షన్ పథకం ప్రవేశపెట్టింది. దీని కింద భర్తను కోల్పోయిన 45 ఏళ్ళ మహిళలకు తక్షణ కుటుంబ సాయంగా ఎంత మొత్తం ఇవ్వనున్నారు?
ఎ) రూ.20,000/- బి) రూ.30,000/-
సి) రూ.40,000/- డి) రూ.25,000/-
3. కింది వాటిని జతపరచండి?
1. జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం
ఎ. మే నెలలో తొలి మంగళవారం
2. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం బి. ఏప్రిల్ 11
3. ప్రపంచ ఆస్థమా దినోత్సవం సి. మే 11
4. జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవం డి. ఏప్రిల్ 22
ఎ) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
బి) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
సి) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
డి) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4. వేదాంత దేశికులు (వెంకటనాథన్) 750 వ జయంతి సందర్భంగా మే 2న భారత ప్రభుత్వం తపాలా బిళ్ళను విడుదల చేసింది. గణిత శాస్త్రం. సైనిక వ్యూహం వంటి బహుళ రంగాల్లో ప్రావీణ్యత ఉన్న ఈ వైష్ణవ మత గురువు ఏ రాష్ట్రంలో జన్మించారు?
ఎ) కర్ణాటక బి) ఆంధ్రప్రదేశ్
సి) తెలంగాణ డి) తమిళనాడు
5. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ 2019 ఏప్రిల్ 18న విడుదల చేసిన నివేదిక ప్రకారం 'ప్రపంచ పత్రికా స్వేచ్ఛ' సూచీ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
ఎ) 136 బి) 140 సి) 128 డి) 133
6. దేశంలోనే తొలి హరిత సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పార్కును తెలంగాణలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?
ఎ) సుల్తాన్ పూర్ బి) దండు మైలారం
సి) ఆదిభట్ల డి) దండు మల్కాపూర్
7. కింది వాటిలో ఏ సంస్థ ఏప్రిల్ 20న తట్టు వ్యాధి (మీజిల్స్)ని ప్రపంచ సంక్షోభంగా ప్రకటించింది?
ఎ) వరల్డ్ బ్యాంక్ బి) ఐక్యరాజ్యసమితి
సి) ప్రపంచ ఆరోగ్య సంస్థ డి) యునిసెఫ్
8. ఏ రకం బంగాళా దుంపలపై పేటెంట్ హక్కు ఉన్నందున, తమ అనుమతి లేకుండా రైతులు సాగు చేయరాదని పెప్సికో సంస్థ అభ్యంతరం తెలిపింది?
ఎ) ఎఫ్.సి - 5 బి) ఎఫ్.సి - 3
సి) ఎఫ్.సి - 2 డి) ఏదీకాదు
9. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి?
1. 2019 ఏప్రిల్ 3 నాటికి జన్ధన్ ఖాతాల్లో ఉన్న నగదు - రూ.97,665 కోట్లు
2. 2019 ఏప్రిల్ 3 నాటికి జన్ధన్ ఖాతాల సంఖ్య - 35.39 కోట్లు
3. 'ప్రధాన మంత్రి జన్ధన్ యోజన'ను 2014 ఆగస్టు 28న ప్రారంభించారు
ఎ) పైవన్నీ బి) 1, 3 మాత్రమే
సి) ఏదీకాదు డి) 2 మాత్రమే
10. మానవ చర్యల ఫలితంగా పది లక్షల వృక్ష, జంతు జాతులు అంతరించిపోయే ప్రమాదం బారిన పడ్డాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఐ.పి.బీ.ఈ.ఎస్ (ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫాం ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టమ్ సర్వీసెస్) మే 6న విడుదల చేసినట్టు ఒక నివేదికలో తెలిపింది. ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2015 ఏప్రిల్ బి) 1997 జూన్
సి) 2003 సెప్టెంబర్ డి) 2012 ఏప్రిల్
11. ఏ దేశాల మధ్య ఉండే డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజెడ్) లో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ 'అంతరించి పోతున్న జాతి'గా గుర్తించిన ఏషియన్ నల్ల ఎలుగు బంటి ఇటీవల కనిపిం చింది?
ఎ) అమెరికా, మెక్సికో
బి) చైనా, భూటాన్
సి) ఇరాక్, కువైట్
డి) ఉత్తర కొరియా, దక్షిణ కొరియా
12. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన తొలి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ విధానానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి, సరైనవేవో గుర్తించండి?
1. 2014 ఎన్నికల్లో ఈ విధానాన్ని తొలిసారిగా ప్రవేశ పెట్టారు
2. ఇస్లామాబాద్ (పాకిస్తాన్)లో ఉన్న భారత హైకమిషన్ ఉద్యోగులు ఈ విధానాన్ని మొట్టమొదట ఉపయోగించుకు న్నారు.
3. ఈ విధానాన్ని ఎలక్ట్రానికల్ టాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ అంటారు
ఎ) 1 మాత్రమే బి) 2, 3 మాత్రమే
సి) 1, 3 మాత్రమే డి) 3 మాత్రమే
13. యూరప్లో ఒక్కో పార్లమెంట్ / జాతీయ శాసన సభ సభ్యుడు 63.25 మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తాడు. భారతదేశంలో ఈ నిష్పత్తి ఎంత?
ఎ) 1 : 1500 బి) 1 : 1000
సి) 1 : 800 డి) 1 : 1800
14. ఏప్రిల్ 19 - 26 తేదీల మధ్య బ్యాంకాక్లో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ తరుపున స్వర్ణ పథకాలు గెలిచిన క్రీడాకారులు ఎవరు. సరైన జవాబు గుర్తించండి?
1) నిఖత్ జరీన్ 2) దీపక్ సింగ్
3) అమిత్ పంఘాల్ 4) పూజారాణి
ఎ) 1, 2 మాత్రమే బి) 2 మాత్రమే
సి) 3, 4 మాత్రమే డి) పైవన్నీ
15. పౌరులకు సంబంధించిన వివిధ ధృవపత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరిచి, అవసరమైనపుడు అందించేందుకు 'ధృవ' పేరుతో ఇటీవల పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) తమిళనాడు బి) కర్ణాటక
సి) గుజరాత్ డి) మహారాష్ట్ర
16. 2018 - 19 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఏ ఖండానికి అత్యధికంగా ఔషధాలను ఎగుమతి చేసింది?
ఎ) ఆఫ్రికా బి) ఐరోపా
సి) ఆస్ట్రేలియా డి) ఉత్తర అమెరికా
17. భారతదేశ మిరప ఉత్పత్తులు చైనాకు ఎగుమతి చేసే అంశంపై మే 9న ఇండో - చైనా ప్రొటోకాల్ ఒప్పందం జరిగింది. అయితే చైనా భారత్కు ఎన్నవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశం?
ఎ) రెండవ బి) మూడవ
సి) మొదటి డి) అయిదవ
18. స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 2019 ఏప్రిల్ 30న విడుదల చేసిన నివేదిక ప్రకారం సైనిక వ్యయంలో భారత్ స్థానం?
ఎ) నాలుగు బి) అయిదు
సి) మొదటి డి) రెండవ
19. అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ నుంచి భారత్కు రప్పించాలని దాఖలైన పిటీషన్ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 29న కొట్టేసింది. కాగా 'కోహినూర్' అనే పర్షియన్ పదానికి అర్థం ఏంటి?
ఎ) ఎత్తయిన శిఖరం బి) అందమైన వజ్రం
సి) కాంతి శిఖరం డి) దేవుని వరం
20. నిరుపేద కుటుంబాలలో మరణించిన వారి కోసం ఒక రూపాయికే అంతిమ యాత్ర, అంత్యక్రియలు, 50 మందికి భోజనం పెట్టే పథకాన్ని జూన్ 15 నుంచి కరీంనగర్ కార్పొరేషన్లో ప్రారంభించ నున్నారు. ఈ పథకం పేరు ఏంటి?
ఎ) చివరి మజిలి - అఖరి సఫర్
బి) అంతిమ యాత్ర - అఖరి సఫర్
సి) వైకుంఠ ప్రస్థానం
డి) మహా ప్రస్థానం
21. ఏప్రిల్ 21న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా గెలిచిన హాస్యనటుడి పేరు?
ఎ) పెట్రో పొరొషెంకో
బి) వ్లాదిమర్ జెలెన్ స్కీ
సి) మహా వజిర లాంగ్ కోర్న్
డి) వ్లాదిమిర్ గ్రాస్మిన్
22. 2030 నాటికి భారత దేశంలో మలేరియాను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో 'మలేరియా ఎలిమినేషన్ రీసెర్చ్ అలయెన్స్' (మేరా ఇండియా) అనే కూటమిని ఏర్పాటు చేసిన సంస్థ?
ఎ) ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్)
బి) ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)
సి) ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డి) ఏదీకాదు
23. 2019 ఏప్రిల్ 9న నేపాల్లోని మకాలు పర్వతంపై భారత మేజర్ మనోజి జోషి నేతృత్వంలోని సైనిక బృందం 'యతి' అడుగులు గుర్తించినట్టు వార్తలు వచ్చాయి. 'యతి' గురించి కింది వాక్యాలను పరిశీలించి సరైన దానిని తెలపండి?
ఎ) 1, 4 మాత్రమే బి) పైవన్నీ
సి) 2, 4 మాత్రమే డి) 1, 2, 3 మాత్రమే
24. 2019 ఏప్రిల్ 24న విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఆర్బీఐ వాటాల విక్రయం ద్వారా కింది ఏ సంస్థల నుంచి వైదొలగింది?
ఎ) నేషనల్ హౌజింగ్ బ్యాంక్ బి) నాబార్డ్
సి) భారత ఆహార సంస్థ (ఎఫ్.సీ.ఐ) డి) ఎ, బి
25. లింక్డ్-ఇన్ సంస్థ ఇటీవల విడుదల చేసిన భారత ఉద్యో గుల నివేదిక - 2018 ప్రకారం నైపుణ్యం గల మానవ వనరుల లభ్యతలో 'హైదరాబాద్' దేశంలో మూడవ స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన నగరాలు ఏవి?
ఎ) ముంబై, బెంగుళూరు బి) ముంబై, ఢిల్లీ
సి) ఢిల్లీ, అహ్మదాబాద్ డి) ఢిల్లీ, బెంగుళూరు
26. కింది వాక్యాలను పరిశీలించి, వాటిలో సరైన వాటిని కోడ్ల ద్వారా తెలుపండి?
1. చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా ఇప్పటివరకు 10 శాతం సుంకం వసూలు చేస్తున్నది.
2. తాజాగా చైనా ఉత్పత్తులపై 25 శాతం పన్ను విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.
3. చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల విలువ 539.5 బిలియన్ డాలర్లు.
ఎ) 1, 2 మాత్రమే బి) పైవన్నీ
సి) 2 మాత్రమే డి) 1 మాత్రమే
27. పసుపు పంటకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఇటీవల తెలంగాణలో రైతులు నిజామాబాద్ లోక్సభ స్థానానికి భారీగా నామినేషన్లు వేశారు. కాగా పసుపు పంట ప్రస్తుతం ఏ బోర్డు పరిధిలో ఉంది?
ఎ) జాతీయ హార్టికల్చర్ (ఉద్యాన) బోర్డు
బి) కాయిర్ (కొబ్బరి పీచు) బోర్డు
సి) వాణిజ్య పంటల బోర్డు
డి) సుగంధ ద్రవ్యాల బోర్డు
28. మే 11న మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఐ.టి.సి. చైర్మన్ వై.వి. దేవేశ్వర్ 1947లో బ్రిటీష్ ఇండియాలో బ్రిటీష్ ఇండియాలోని ఏ నగరంలో జన్మించారు?
ఎ) కరాచీ బి) లాహోర్
సి) కోల్కతా డి) రావల్పిండి
29. గత కొన్ని సంవత్సరాలుగా 'ఉగ్రవాదం' వివిధ దేశాల అంతర్గత భద్రతకు సవాల్ విసురుతున్నదని ప్రపంచ ఉగ్రవాద సూచీ - 2018 తెలిపింది. దీని ప్రకారం 2017 సంవత్సరంలో ఎంత మంది ప్రజలు తీవ్రవాదానికి బలయ్యారు?
ఎ) 18,814 బి) 18,000
సి) 19,000 డి) 20,000
30. ఏ రాష్ట్రంలో ఇటీవల సరీసృపాల శాస్త్రవేత్తలు (హెర్పటా లజిస్టులు) కొత్తరకం 'రక్తపింజరి' పామును కనుగొన్నారు?
ఎ) నాగాలాండ్ బి) అస్సాం
సి) అరుణాచల్ప్రదేశ్ డి) ఉత్తరాఖండ్
31. రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న రూ.9.6 లక్షల కోట్ల మిగులు నిధులు ఆర్బీఐ స్థూల ఆస్తుల్లో ఎంత శాతంగా ఉన్నాయి?
ఎ) 28 శాతం బి) 14 శాతం
సి) 25 శాతం డి) 23 శాతం
32. 'మెలమైన్' అనే విషపదార్థాలు ఉన్నాయేమో అని పరీక్షించడానికి నౌకా కేంద్రాల వద్ద ప్రయోగ శాలలు ఏర్పాటయ్యే దాకా చైనా నుంచి పాల ఉత్పత్తుల దిగుమతుల్ని భారత్ నిషేధించింది. 'మెలమైన్' అనే రసాయనాన్ని ఏ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు?
ఎ) ప్లాస్టిక్, ఎరువులు
బి) ఔషధాలు
సి) అల్యూమినియం ఉత్పత్తులు
డి) పెయింట్లు
సమాధానాలు
1.ఎ 2.ఎ 3.ఎ 4.డి 5.బి
6.డి 7.బి 8.ఎ 9.ఎ 10.డి
11.డి 12.బి 13.ఎ 14.సి 15.సి
16.డి 17.ఎ 18.ఎ 19.సి 15.బి
21.బి 22.ఎ 23.బి 24.డి 25.డి
26.బి 27.డి 28.బి 29.ఎ 30.సి
31.ఎ 32.ఎ
Authorization