అంతర్జాతీయం
నవంబర్లో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
2019, నవంబర్ 15 నుంచి డిసెంబర్ 7 మధ్య శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్టు శ్రీలంక ఎన్నికల సంఘం అధ్యక్షుడు మహీంద్ర దేశప్రియ తెలిపారు. ప్రస్తుత అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఐదేండ్ల పదవీకాలం 2020 జనవరి 5కి ముగుస్తుంది. నిబంధనల ప్రకారం దీనికి నెల రోజుల ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మాజీ అధ్యక్షుడు మహింద్ర రాజపక్సేను ఓడించి 2015 జనవరి 8న సిరిసేన లంక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
గగనతల నిషేధాన్ని పొడిగించిన పాక్
భారత సరిహద్దుల్లోని గగనతలంపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్ వరుసగా రెండోసారి పొడిగించింది. 2019 జూన్ 14 వరకు ఈ మార్గంలో వాణిజ్య విమాన సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 26న పాకిస్తాన్లోని బాలాకోట్ లో భారత వైమానికదాడులు తర్వాత.. భారత సరిహద్దుల్లోని తన గగనతలంపై వాణిజ్య విమానాలు వెళ్లకుండా నిషేధం విధించింది. మే 15తో ఇది ముగియడంతో... మే 30 వరకు నిషేధాన్ని పొడిగించింది. తాజాగా జూన్ 14 వరకు తమ గగనతలంపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. నిషేధం కారణంగా యూరోప్, ఆగేయాసియా విమానాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
రక్షణ బడ్జెట్ను తగ్గించుకున్న పాక్ సైన్యం
పాకిస్తాన్ సైన్యం తన రక్షణ బడ్జెట్ను స్వచ్ఛందంగా తగ్గించుకుంది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్లో స్వచ్ఛందంగా కోత విధించినా భద్రతాపరంగా ఎలాంటి ప్రభావం ఉండబోదని సైనిక మీడియా విభాగం పేర్కొంది. కోత ప్రభావాన్ని త్రివిధ దళాలు అంతర్గత చర్యల ద్వారా సర్దుబాటు చేసుకుంటాయన్నారు.
శ్రీలంకలో 9 మంది ముస్లిం మంత్రుల రాజీనామా
శ్రీలంకలో ముస్లిం వర్గానికి చెందిన 9 మంది మంత్రులు, ఇద్దరు ప్రొవిన్షియల్ గవర్నర్లు 2019 జూన్ 3న రాజీనామా చేశారు. ముగ్గురు ముస్లిం నేతలకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ ఆరోపణలొచ్చిన నేపథ్యంలో.. వారిపై దర్యాప్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను తాము పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. దేశ జనాభాలో 9 శాతంగా ఉన్న తమ వర్గం ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు.
'మీటూ' తరహాలో జపాన్లో 'కూటూ' ఉద్యమం
ఉద్యోగ వేటయినా... పనిచేసే చోట యినా... మహిళలు తప్పని సరిగా ఎత్తు జోళ్లనే ధరించి రావాలని యాజ మాన్యాలు కోరుతుండటాన్ని నిరసిస్తూ, జపాన్లో ప్రారంభమైన 'కూటూ' ఉద్యమం తీవ్రరూపం దాల్చు తోంది. పాదరక్షలను ధరించే విషయంలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం చూపడం వివక్ష పూరితమంటూ 2019 జూన్ 3న కొందరు మహిళలు ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఎత్తు జోళ్లు వేసుకుని రావాలని యాజమాన్యాలు ఉద్యోగినులను ఒత్తిడి చేయకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఈ మేరకు కార్మికశాఖలో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
భారత్కు జీఎస్పీ హోదా రద్దు
భారత్కు కల్పించిన ప్రాధాన్య వాణిజ్య హోదా(జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్-జీఎస్పీ)ని అమెరికా రద్దు చేసింది. 2019, జూన్ 5వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాంతో ఈ హోదా కింద భారత్కు అమెరికా నుంచి అందుతున్న సుమారు రూ.39 వేల కోట్ల(560 కోట్ల డాలర్లు) విలువైన వాణిజ్య రాయితీలు రద్దవుతాయి. తన మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తులకు సమానమైన అవకాశం కల్పిస్తామని భారత్ హామీ ఇవ్వదని నిర్ధారణకు రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు.
జాతీయం
దేశంలో 6.1 శాతంగా నిరుద్యోగ స్థాయి
దేశంలో నిరుద్యోగ స్థాయి 6.1 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గడిచిన 45 ఏళ్లలో ఇదే అత్యధిక స్థాయి. ఎన్నికలకు ముందు లీకైన ఒక పత్రాన్ని ఇది ధ్రువీక రించింది. కేంద్రంలో నరేంద్రమోడి నేతత్వంలోని సర్కారు రెండోసారి బాధ్యతలు చేపట్టిన రోజునే ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. ఉద్యోగ అర్హత కలిగిన యువతకు సంబంధించి పట్టణాల్లో 7.8 శాతం, గ్రామాల్లో 5.3 శాతం మేర నిరుద్యోగం ఉన్నట్టు వెల్లడైంది. పురుషుల్లో 6.2 శాతం, మహిళల్లో 5.7 శాతం మందికి ఉద్యోగాలు లేవు.
త్రిభాషా విధానానికి కేంద్రం సవరణ
దేశంలోని విద్యార్థులందరూ హిందీ తప్పనిసరిగా నేర్చుకో వాలంటూ జాతీయ నూతన విద్యా విధాన ముసాయిదా (డ్రాఫ్టు)లో పొందుపరిచిన నిబంధనను కేంద్రం సవరించింది. కేంద్ర మానవ వనరుల అభివద్ధిశాఖ 2019 జూన్ 3న ఈ మేరకు ముసాయిదాలో మార్పులు చేసింది. హిందీయేతర రాష్ట్రాల్లోనూ తతీయ భాషగా హిందీని విద్యార్థులు అభ్యసించాలన్న ప్రతిపాదనపై దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడటంతో కేంద్రం వెనక్కు తగ్గింది. 6వ లేదా 7 తరగతి(గ్రేడ్)లో విద్యార్థులు తతీయ భాషను ఎంచుకోవటం /మార్చుకోవటం చేయవచ్చని పేర్కొంది.
20 నుంచి రాజ్యసభ సమావేశాలు
రాజ్యసభ సమావేశాలు 2019 జూన్ 20 నుంచి జూలై 26 వరకు నిర్వహిం చనున్నట్టు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ ప్రకటన లో వెల్లడించారు. లోక్సభ సమా వేశాలు 2019 జూన్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి. 17, 18 తేదీల్లో కొత్తగా ఎంపికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగ నుంది. 19వ తేదీన స్పీకర్ను ఎన్నుకుం టారు. 20వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించనున్నారు. ఈ సమా వేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
మోడీ అధ్యక్షతన 2 మంత్రివర్గ సంఘాలు
ఆర్థికాభివద్ధి, ఉద్యోగ కల్పనలపై సూచనలు ఇవ్వడానికి ప్రధాని నరేంద్రమోడీ మంత్రులతో 2 ఉన్నత స్థాయి సంఘాలను ఏర్పాటు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో జనవరి-మార్చి త్రైమాసికంలో వద్ధి రేటు 5.8 శాతం ఉంటుందని అంచనా వేయగా, అంతకన్నా తక్కువగానే నమోదయింది. నిరుద్యోగం గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా 2017-18లో 6.1 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో కమిటీల ఏర్పాటుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 5న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ కమిటీల సిఫార్సులను పొందుపరుస్తారు.
ప్రధాని అధ్యక్షతన భద్రత వ్యవహారాల మంత్రివర్గ సంఘం
భద్రత వ్యవహారాల మంత్రివర్గ సంఘాన్ని(సీసీఎస్) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2019 జూన్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జరుశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభ్యులుగా ఈ కమిటీ ఏర్పాటయింది. జాతీయ భద్రత, విదేశీ సంబంధాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
నీతి అయోగ్ పునర్వ్యవస్థీకరణ
రాజీవ్కుమార్ ఉపాధ్యక్షుడిగా నీతి అయోగ్ పునర్వ్యవస్థీ కరణకు ప్రధాని నరేంద్రమోడీ 2019 జూన్ 6న ఆమోదం తెలిపారు. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతా రామన్, నరేంద్ర సింగ్ తోమర్ లను నీతి అయోగ్లో ఎక్స్ అఫీషియో సభ్యునిగా నియమించారు. కాగా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, తవార్చంద్ గెహ్లాట్, ఇంద్రజిత్ సింగ్లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియ మించారు. నీతి అయోగ్లో ప్రస్తుతం శాశ్వత సభ్యులుగా ఉన్న వీకే సారస్వత్, రమేష్ చంద్, వీకే పాల్లు కొనసాగనున్నారు. అయితే, 2015 సంవత్సరంలో నీతి ఆయోగ్ ఏర్పాటైనప్పుడు శాశ్వత సభ్యుడిగా ఉన్న వివేక్ దెబ్రోరుకు ఉద్వాసన పలికారు.
డ్రెస్కోడ్పై తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు
ప్రభుత్వ ఉద్యోగులు హుందాగా ఉండే సంప్రదాయ డ్రెస్కోడ్ పాటించాలని తమిళనాడు ప్రభుత్వం 2019 జూన్ 1న ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సచివాలయ మహిళా ఉద్యోగులు ధరించాల్సిన దుస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ జీవో జారీ చేశారు. మహిళా ఉద్యోగులు ఇకపై చీర, సల్వార్ కమీజ్, చుడీదార్లను మాత్రమే ధరించి విధులకు హాజరు కావాలని కోరింది. పురు షులు ప్యాంటు, షర్టు ధరించాలని రంగు రంగుల టీ షర్టులు నిషేధమని పేర్కొంది.
ఆగస్టు తర్వాత కశ్మీర్ శాసనసభ ఎన్నికలు
2019, ఆగస్టు 15న అమర్నాథ్ యాత్ర ముగిసిన తర్వాత జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటిస్తామని ఎన్నికల సంఘం 2019 జూన్ 4న వెల్లడించింది. అమర్నాథ్ యాత్ర జూలై నెలలో ప్రారంభం కానుంది. 2018 జూన్లో పీడీపీ-బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన అనంతరం కశ్మీర్లో ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వ పాలన లేదు. ఆ రాష్ట్రంలో 2018 జూన్ 19 నుంచి డిసెంబర్ 19 వరకు గవర్నర్ పాలన, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన నడుస్తోంది. జూన్ 19న రాష్ట్రపతి పాలన గడువు ముగుస్తుండగా, దాన్ని పొడిగించేందుకు అంతా సిద్ధం చేశారు.
ఢిల్లీ మహిళలకు ఉచిత ప్రయాణం
ఢిల్లీ ప్రభుత్వం మహిళలకు అక్కడి ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో, సిటీ బస్సుల్లో, మెట్రో రైళ్లలో ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 2019 జూన్ 3న సీఎం కేజ్రీవాల్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు. ప్రజా రవాణాలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వారికి సురక్షితమైన రవాణా సదు పాయాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఎనిమిది కేబినెట్ కమిటీలు ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వం ఎనిమిది కీలక మంత్రివర్గ సంఘాలను (కేబినెట్ కమిటీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో కొన్నిటికి ప్రధాని నరేంద్ర మోడి, మరికొన్నిటికి హౌం మంత్రి అమిత్షా అధ్యక్షులుగా ఉన్నారు. మొత్తం ఎనిమిది కమిటీల్లో అమిత్షాకు స్థానం లభించగా... ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరు కమిటీల్లో చోటు దక్కించుకున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటయిన ఆరు మంత్రివర్గ సంఘాలను ఇప్పుడు పునర్వ్యవస్థీకరించారు. వీటితో పాటు పెట్టుబడి, ఆర్థిక వద్ధి, ఉపాధి, నైపుణ్యాభివద్ధిలపై కొత్తగా రెండు కమిటీలను ఏర్పాటు చేశారు.
స్త్రీ-పురుషుల సమానత్వంలో భారత్కు 95వ స్థానం
స్త్రీ-పురుషుల సమానత్వంలో భారత్ 95వ స్థానంలో నిలిచింది. 129 దేశాల్లో పేదరికం, ఆరోగ్యం, అక్షరాస్యత, విద్యార్హతలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాల ప్రాతిపదికన జాబితా రూపొందించగా... 56.2 సగటు స్కోరుతో భారత్ 95వ స్థానంలో నిలిచింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని 23 దేశాల్లో 17వ ర్యాంకు సాధించింది. డెన్మార్క్ మొదటి స్థానం దక్కించుకోగా, ఆఫ్రికా దేశం చాద్ చివరిలో నిలిచింది.
ప్రపంచంలో అత్యంత రద్దీ నగరంగా ముంబై
ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై నిలిచింది. ఈ మేరకు 2019 జూన్ 5న ట్రాఫిక్ ఇండెక్స్-2018ని టామ్ టామ్ సంస్థ విడుదల చేసింది. వాహనదారులు అత్యధికంగా ట్రాఫిక్ జామ్ బారిన పడుతున్న నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచిందని ఈ నివేదిక పేర్కొంది. టామ్ టామ్ నివేదిక ప్రకారం ముంబై తర్వాత కొలంబియా రాజధాని బొగోటా (63 శాతం), పెరూ రాజధాని లిమా(58 శాతం) నగరాల్లో అధిక ట్రాఫిక్ జామ్ ఉంది.
కేంద్ర మంత్రుల్లో 91శాతం కోటీశ్వరులు : ఏడీఆర్
కేంద్ర మంత్రివర్గంలో చేరిన వారిలో 91 శాతం మంది కోటీశ్వరులు కాగా, 39 శాతం మందిపై వివిధ కేసులున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంస్థ పేర్కొంది. మంత్రులుగా నియమితులైన 56 మంది ఎన్నికల్లో పోటీ సందర్భంగా ఈసీకి సమర్పించిన ప్రమాణ పత్రాలను ఏడీఆర్ విశ్లేషించి ఈ అంశాలను వెల్లడించింది. 2014లో మంత్రుల్లో 92 శాతం కోటీశ్వరులుండగా 2019 మంత్రివర్గంలో ఒక శాతం తగ్గారు.
చిన్నారుల ప్రాణాలు తీస్తున్న వాయుకాలుష్యం
భారత్లో వాయు కాలుష్యం పెను భూతంగా మారి ఏటా లక్షమంది చిన్నారుల ప్రాణాలను బలితీసు కుంటోందని ఒక నివేదిక వెల్లడించింది. దేశ వ్యాప్తంగా చోటుచేసు కుంటున్న 12.5శాతం మరణాలకు ఈ కాలుష్యమే కారణమవు తోందని తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో 'సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ)'.. 'భారత్లో పర్యావరణ పరిస్థితి(ఎస్వోఈ)' పేరుతో 2019 జూన్ 5న నివేదికను వెల్లడించింది. నివేదిక ప్రకారం.. మనదేశంలో ప్రతి పదివేల మంది చిన్నారుల్లో 8.5 మంది ఐదేళ్లు కూడా నిండకముందే వాయుకాలుష్యం కారణంగా మరణిస్తున్నారు.
భారత్ వద్ధి 7.5 శాతం :ప్రపంచ బ్యాంక్
2019-20 ఆర్థిక సంవత్సరం సహా వచ్చే మూడేళ్లూ భారత జీడీపీ వద్ధి 7.5 శాతంగా ఉంటుందని ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. దీంతో 2019-20 సంవత్సరానికి భారత వద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను కొనసాగించి నట్టయింది. భారత్లో పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం బలంగా ఉండడం వద్ధి రేటుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ఈ మేరకు అంతర్జాతీయ ఆర్థిక వద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు 2019 జూన్ 5న విడుదల చేసింది.
ఆన్లైన్లో నగదు బదిలీ ఉచితం
ఆన్లైన్లో నగదు బదిలీకి(ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిపే లావాదేవీలపై) ప్రస్తుతం విధిస్తున్న ఛార్జీలను తొలగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా జరిగే లావాదేవీలకు బ్యాంకులు కూడా వినియోగదా రులపై ఈ ఛార్జీలు విధించకూడదని, దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.
కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుసగా మూడోసారి పావుశాతం(25 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. దీంతో రెపో రేటు 5.75 శాతానికి, రివర్స్ రెపో 5.50 శాతానికి దిగొచ్చాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో 2019 జూన్ 6న జరిగిన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
పంజాబ్ మెయిల్కు 107 ఏళ్లు పూర్తి
మన దేశంలోనే అత్యంత దూరం నడిచే పాత రైలు బండి పంజాబ్ మొయిల్ 2019 జూన్ 1తో 107 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఆవిరితో నడిచే ఈ రైలును 1912 జూన్ 1న ప్రారంభిం చారు. బ్రిటిషు ఇండియాలో ముంబై నుంచి పెషావర్ (ప్రస్తుతం పాక్లో ఉంది) వరకు ఈ రైలు నడి చింది. బ్రిటీష్ ఇండియాలో అత్యంత వేగంతో ప్రయాణించే రైలుగా గుర్తింపు పొందిన పంజాబ్ మెయిల్ ప్రస్తుతం విద్యుత్తోనే నడుస్తుంది.
ప్రాంతీయం
హైదరాబాద్లో ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ సదస్సు
2019 జూన్ 9 నుంచి 21 వరకు హైదరాబాద్లో జాతీయ మత్స్య అభివద్ధి సంస్థ(NFDB) ఆధ్వ ర్యంలో ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ ఓ సదస్సు నిర్వహిం చనుంది. ట్యూనా జాతి చేపల సంతతి పెంపొందించడం, వాటి సంరక్షణ, మాంసం ఉత్పత్తిని విస్తతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 33 దేశాల ప్రతినిధులు పాల్గొనే సదస్సు తొలిసారిగా భారత్లో జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
2019 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా 2019 జూన్ 2న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జూలై నెలాఖరు నాటికి నిత్యం 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణ గత ఐదేళ్లలో సగటున 16.5 శాతం ఆదాయ వద్ధిరేటు సాధించిందని పేర్కొన్నారు. పేద వర్గాలకు చేయూతగా ఉన్న పింఛన్లను రూ. 1000 నుంచి రూ. 2,016కు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.. వికలాంగుల పింఛన్ను రూ. 1,500 నుంచి రూ. 3,016కు పెంచుతున్నామని, వద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తున్నామని చెప్పారు. కొత్త పింఛన్లు జూలై 1 నుంచి అందుతాయని వివరించారు.
తెలంగాణలో రైతుబంధు సాయం పెంపు
రైతుబంధు పథకం కింద చేసేపెట్టుబడి సాయాన్ని రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమలు మార్గదర్శకాలను రాష్ట్ర వ్యవసాయశాఖ 2019 జూన్ 1న విడుదల చేసింది. రైతుబంధు పథకం ద్వారా గత ఖరీఫ్, రబీల్లో రైతులకు దాదాపు రూ. 10 వేల కోట్ల మేర ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం రెండు సీజన్లకు కలిపి బడ్జెట్లో ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. ఆర్బీఐకి చెందిన ఈ-కుబేర్ ద్వారా ప్రతి రైతు ఖాతాలోకి వారికున్న పట్టాదారు భూమి ప్రకారం పెట్టుబడి సాయం జమచేస్తారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం
వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం మూడు స్థానాలనూ కైవసం చేసుకుంది. వరంగల్ లో పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, నల్గొండ స్థానంలో తేరా చిన్నపరెడ్డి, రంగారెడ్డి స్థానంలో మాజీమంత్రి పట్నం మహేందర్రెడ్డి విజయం సాధించారు. తెలంగాణలో శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తెలంగాణ పారిశ్రామిక విధానానికి గడువు పెంపు రాష్ట్ర ప్రభుత్వం 2014-19 పారిశ్రామిక విధానాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ విధానాన్ని కొనసాగించాలని సూచించింది.
కాంగ్రెస్ శాసనసభాపక్షం టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం
కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభాపక్షంలో విలీనమైంది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన 12 మంది శాసనసభ్యులు 2019 జూన్ 6న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కోరగా, ఉత్తర్వులు జారీ చేశారు. విలీనం కోరుతూ తీర్మానం చేసి లేఖ ఇచ్చిన 12 మంది కాంగ్రెస్ సభ్యులు ఇకపై టీఆర్ఎస్ సభ్యులేనని తెలంగాణ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక ఆ పార్టీకి ఆరుగురు సభ్యులే మిగిలారు.
వార్తల్లో వ్యక్తులు
లులు గ్రూప్ చైర్మన్కు యూఏఈ 'గోల్డ్కార్డ్'
అబుదాబిలో నివాసముంటున్న భారత రిటైల్ దిగ్గజం ఎమ్.ఎ.యూసఫ్ అలి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. యూఈఏ నుంచి తొలి గోల్డ్కార్డ్ పొంది శాశ్వత నివాస హోదాను అందుకున్న ఈయన కేరళకు వాసి. పద్మశ్రీ పురస్కారం పొందిన ఈయన యూఏఈలోనే అగ్రగామి విదేశీ కుబేరుడు.
వికీపీడియాలో వెయ్యి రోజుల్లో వెయ్యి వ్యాసాలు
వికీపీడియాలో వెయ్యి రోజుల్లో వెయ్యి తెలుగు వ్యాసాలు రాసి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన వంగరి ప్రణరురాజ్ అరుదైన ఘనత సాధించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్ట్స్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్న ప్రణరు 2016 సెప్టెంబర్ 8న తొలి వ్యాసం ప్రారంభించారు. 2016 డిసెంబర్ 16 నాటికి రోజుకో వ్యాసం చొప్పున 100 వ్యాసాలు పూర్తి చేశారు. 2017 సెప్టెంబర్ 7 నాటికి 365 రోజులకు (ఏడాది) 365 వ్యాసాలు రాసి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు అందుకున్నారు. తెలంగాణ చరిత్ర, ప్రాధాన్యం గల ప్రాంతాలు, ప్రదేశాలు, ఇతర విశేషాలు కూడా రాయాలని అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రణరుని ప్రోత్సహిం చారు. లక్ష్యాన్ని మరవకుండా తన పెళ్లి రోజున కూడా వ్యాసం రాసి ప్రణరు ప్రత్యేకతను చాటుకున్నారు. 2019 జూన్ 4 నాటికి వికీపీడియాలో వెయ్యి వ్యాసాలు రాయడం పూర్తిచేశారు.
ఆస్టియ్రా తొలి మహిళా ఛాన్స్లర్గా బీర్లీన్
ఆస్టియ్రా తొలి మహిళా చాన్స్లర్గా బ్రిగిట్టీ బీర్లీన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆస్టియ్రా అధ్యక్షుడు వాన్డర్ బెలెన్ 2019 జూన్ 4న ఆమెతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. 2019, సెప్టెంబర్లో జరిగే ఎన్నికల వరకూ పనిచేసే సంకీర్ణ ప్రభుత్వానికి ఆమె సారథ్యం వహించ నున్నారు.
ఫిఫా అధ్యక్షుడిగా గియోనో ఇన్ఫాంటినో
ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) అధ్యక్షుడిగా గియోనో ఇన్ఫాంటినో వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 2019 జూన్ 5న జరిగిన ఫిఫా సభ్యదేశాల పాలకమండలి సమావేశంలో గియోనోను ఫిఫా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2023 వరకు ఈయనే ఫిఫా అధ్యక్షుడు. తొలిసారి 2016లో ఫిఫా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఫుట్బాల్ క్రీడలో ఎన్నో సంస్కరణలు, విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారు.
యూఎన్-ఉమెన్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అనితా భాటియా
ఐక్యరాజ్యసమితిలోని ప్రతిష్ఠాత్మక పదవిలో భారత సంతతికి చెందిన మహిళ అనితా భాటియా నియమి తులయ్యారు. మహిళా సాధికారత, స్త్రీ-పురుష సమానత్వంపై కషి చేసే యూఎన్-ఉమెన్ సంస్థకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆమెను నియమి స్తున్నట్టు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రకటించారు.
జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ డోభాల్
జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ డోభాల్(74) రెండోసారి నియమితులయ్యారు.ఈసారి ఆయన హోదాను కేబినెట్ మంత్రి స్థాయికి పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. నరేంద్రమోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇదే తొలి కీలక నియామకం. 2019, మే 31 నుంచి ఐదేండ్ల పాటు పదవీకాలంలో ఉంటారు. వరసగా రెండుసార్లు ఈ పదవిని దక్కించుకున్న తొలి ఎన్ఎస్ఏగా అజిత్ పేరొందారు.
ఐఎండీ అధిపతిగా మత్యుంజయ
ప్రముఖ శాస్త్రవేత్త, తుఫాను హెచ్చరికల నిపుణుడిగా పేరొందిన మత్యుంజయ మొహాపాత్ర భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అధి పతిగా నియమితులయ్యారు. ఐఎండీ లోని తుపాను హెచ్చరికల డివిజన్కు నేతత్వం వహించిన మత్యుంజయ, అతని బందానికి తుఫాన్ల రాక, గాలి వేగం, ప్రజలు, ఆస్తులపై ప్రభావం వంటి హెచ్చరికలను నిక్కచ్చిగా అంచనా వేస్తారనే పేరుంది. ఆయనను సైక్లోన్ మ్యాన్ అని పేర్కొంటారు.
అమెరికా తాత్కాలిక స్పీకర్గా ప్రమీల జయపాల్
అమెరికా ప్రతినిధుల సభ తాత్కాలిక స్పీకర్గా ప్రమీల జయపాల్(53) 2019 జూన్ 4న సభా కార్యక్రమాలను నిర్వహిం చారు. ఆమె ఈ పదవిని అధిష్ఠించిన తొలి దక్షిణాసియా అమెరి కన్ మహిళ. ప్రమీల జయపాల్ 2016లో తొలిసారిగా ఈ సభకు ఎన్నికయ్యారు. స్పీకర్గా నాన్సీ పెలోసీ కొనసాగుతున్నారు. ఈ బాధ్యతలు వంతుల వారీగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
విప్రో చైౖర్మన్ అజీమ్ ప్రేమ్జీ పదవీ విరమణ
విప్రో వ్యవస్థాపకులు అజీమ్ హెచ్.ప్రేమ్జీ, సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. 2019 జులై 30న ఆయన పదవీ విరమణ చేసి, తనయుడు రిషద్ ప్రేమ్జీకి బాధ్య తలు అప్పగించనున్నారు. ప్రస్తుతం రిషద్ సంస్థ ముఖ్య వ్యూహాత్మక అధికారిగా, నాస్కామ్ చైర్మన్గా వ్యవహరి స్తున్నారు. కాగా అజీమ్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, వ్యవస్థాపక ఛైర్మన్గా అయిదేళ్లపాటు (2024 జులై వరకు) కొనసాగనున్నారు. రిషద్ 2019 జులై 31 నుంచి 2024 జులై 30 వరకు పదవిలో ఉంటూ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
థాయ్ లాండ్ ప్రధానిగా ప్రయూత్ చాన్ ఓచా
థాయ్ లాండ్ ప్రధానిగా సైనిక జుంటా పార్టీ అధినేత ప్రయూత్ చాన్ ఓచా(65) ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి థనాత్రోన్ జువాంగ్రోంగ్ రువాంకిట్పై విజయం సాధించారు. థారులాండ్లో ప్రధానిని ఎన్నుకో వడానికి ప్రతినిధుల సభ, సెనెట్ కలిపి 350 సభ్యుల మద్దతు ఉండాలి. 250 మంది సభ్యులున్న సెనెట్లో జుంటా పార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఉండటంతో కౌంటింగ్ కొనసాగుతుండగానే ప్రయూత్ విజయం ఖరారైపోయింది.
శుక్లాల చికిత్స నిపుణురాలు డా|| బాత్ మృతి
కంటి శుక్లాలకు నిర్దిష్టమైన చికిత్స ను రూపొందించి, ఎంతో మందికి దష్టిని ప్రసాదించిన ఘనతను పొందిన డా|| ప్యాట్రీసియా బాత్ (76) మృతి చెందారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన కాలి ఫోర్నియా విశ్వవిద్యాల యానికి చెందిన శాన్ఫ్రాన్సిస్కో వైద్య కేంద్రంలో 2019 మే 30న మరణించారు. వైద్య పేటెంట్ పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా వైద్యురాలిగా డా|| బాత్ గుర్తింపు పొందారు. 1988లో లేజర్ఫేకో ప్రోబ్ అనే ఉపకరణా నికి గాను పేటెంట్ సాధించారు. లేజర్ ద్వారా కంటి శుక్లాలను కరిగించేందుకు లేజర్ఫేకో ప్రోబ్ తోడ్పడుతుంది.
అవార్డులు
అమల్రాజ్కు 'షాన్ ఈ మహమ్మదిన్' అవార్డు
భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ విక్టర్ అమల్రాజ్కు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. భారత ఫుట్బాల్ రంగానికి చేసిన సేవలకు గాను కోల్కతాకు చెందిన ప్రముఖ మహమ్మదిన్ స్పోర్టింగ్ క్లబ్ అమల్రాజ్ను జీవితకాల సాఫల్య పురస్కారం 'షాన్ ఈ మహమ్మదిన్' అవార్డుతో సత్కరించింది. అమల్రాజ్ ఎంఎస్సీ తరపున 6 సం||లు ప్రాతినిథ్యం వహించాడు. ఆ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు.
దక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి ఈక్వేటరీ అవార్డు
పర్యావరణ పరిరక్షణకు కషి చేస్తున్న వారికి ఏటా ఐక్యరాజ్య సమితి ప్రకటించే ఈక్వేటరి అవార్డు 2019 తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని డీడీఎస్(దక్కన్ డెవలప్ మెంట్ సొసైటీ)కి దక్కింది. యూఎన్ఓ అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యూఎన్డీపీ) ఏటా ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణవేత్తలు, పర్యావరణ పరిరక్షణకు కషి చేసే సంస్థలను గుర్తించి అవార్డును ప్రకటిస్తుంది.
సుందర్ పిచాయ్, అడెనా ఫ్రీడ్మన్కు గ్లోబల్ లీడర్షిప్ పురస్కారం
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, నాస్డాక్ అధ్యక్షుడు అడెనా ఫ్రీడ్మన్లు 2019 ఏడాదికిగాను గ్లోబల్ లీడర్షిప్ పురస్కారాలకు ఎంపికయ్యారు. 2007 నుంచి వాషింగ్టన్కు చెందిన యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ ఐబీసీ) ఈ పురస్కారాలను అందజేస్తోంది. సాంకేతికతతో నడిచే ఉన్నతశ్రేణి ప్లాట్ఫామ్లను అందించినందుకు గూగుల్, నాస్డాక్ సంస్థల్ని యూఎస్ఐబీసీ గుర్తించి ఆ సంస్థల కీలక అధికారులను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది.
సైన్స్ & టెక్నాలజి
తేలియాడే వేదిక నుంచి రాకెట్ ప్రయోగం
అంతరిక్ష పరిశోధన రంగంలో చైనా కీలక ముందడుగు వేసింది. నీటిపై తేలియాడే ప్రయోగ వేదిక నుంచి చాంగ్ ఝెంగ్ 11 వాహక రాకెట్ను తొలిసారి విజయవం తంగా నింగిలోకి పంపింది. 2019 జూన్ 5న పసుపు సముద్రంలో ఈ ప్రయోగం చోటు చేసుకున్నట్టు చైనా సెంట్రల్ టెలివిజన్ వార్తాసంస్థ వెల్లడించింది. 'చాంగ్ ఝెంగ్ 11' ఘన ఇంధనంతో నడిచే లాంచ్ వెహికిల్. వాహక రాకెట్గా దాన్ని తీర్చిదిద్దారు. అత్యంత తక్కువ సమయంలోనే ఈ రాకెట్ను ప్రయోగించొచ్చు. సులువుగా నియంత్రించవచ్చు.
క్రీడలు
చాంపియయి లీగ్ విజేత లివర్పూల్
యూరోపియన్ క్లబ్ జట్ల మధ్య జరిగిన చాంపియన్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో లివర్పూల్ జట్టు చాంపియన్గా నిలిచింది. మాడ్రిడ్లో 2019 జూన్ 2న జరిగిన ఫైనల్లో లివర్పూల్ (ఇంగ్లండ్) 2-0 గోల్స్ తేడాతో టోటెన్హామ్ హాట్స్పర్ క్లబ్ (ఇంగ్లండ్) జట్టుపై గెలిచింది. విజేతగా జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు (రూ. 147 కోట్లు) ప్రైజ్మనీ లభించింది. చాంపియన్ లీగ్లో 1977, 1978, 1981, 1984, 2005లలో విజేతగా నిలిచింది. ఇది ఆరోసారి.
యన్.సంతోష్కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270