అంతర్జాతీయం
కొలంబియాతో సరిహద్దులను తెరిచిన వెనెజులా
కొలంబియాతో ఉన్న సరిహద్దులను పాక్షికంగా తెరుస్తు న్నట్లు వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో 2019 జూన్ 7న ప్రకటించారు. అమెరికా సామ్రాజ్యవాదం మానవతా సాయం పేరుతో సరిహద్దు గుండా ప్రతిపక్షాలకు ఆయుధాలను గుట్టుగా చేరవేసేందుకు పథకం వేసిందని వెనెజులా భావించింది. దీంతో కొలంబియా, బ్రెజిల్, డచ్ యాంటిల్లిస్ దీవులతో వెనిజులాకు ఉన్న సరిహద్దులను 2019, ఫిబ్రవరిలో మదురో ప్రభుత్వం మూసివేసింది. పరిస్థితి మెరుగుపడడంతో బ్రెజిల్, అరుబా ఐలండ్లతో ఉన్న సరిహద్దులను ఇంతకుముందే తెరిచింది. ఇప్పుడు పశ్చిమ రాష్ట్రమైన తచిరాతో ఉన్న కొలంబియా సరిహద్దులను కూడా తెరవాలని నిర్ణయించింది.
బ్రిటన్తో దక్షిణ కొరియా వాణిజ్య ఒప్పందం
బ్రిటన్తో ప్రత్యేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై దక్షిణ కొరియా 2019 జూన్ 10న ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ కొరియా పార్లమెంట్ ఆమోదాన్ని పొందిన తరువాతే ఒప్పందం ఖరారు కానున్నది. దక్షిణ కొరియా ఈ ఒప్పం దాన్ని ఈ ఏడాది అక్టోబరు 31లోగా ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆటో విడి భాగాలు, ఆటో మొబైల్స్ వంటి దక్షిణ కొరియా ఎగుమతులపై ఎటువంటి సుంకాలు విధించకపోవడం వంటి అంశాలు ఒప్పందంలో భాగంగా ఉన్నాయి.
కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి మే రాజీనామా
కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వానికి బ్రిటన్ ప్రధాని థెరీసా మే రాజీనామా చేశారు. కొత్త ప్రధాని వచ్చేంత వరకు తాత్కాలిక ప్రధానిగా కొనసాగుతానని 2019 జూన్ 7న ఆమె తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే ప్రక్రియ జూన్ 10న మొదలుకానుంది. బ్రెగ్జిట్ ఒప్పందంపై ఏకాభిప్రాయ సాధనకు మూడేళ్ల పాటు పోరాడి ఓడిన మే బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తానని 23న తెలిపారు. 2016లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్కు అను కూలంగా ఓటు వేశారు. ఆ నేపథ్యంలో ప్రధాని డేవిడ్ కామెరాన్ పదవీచ్యుతుడవడంతో థెరీసా ప్రధాని పగ్గాలు చేపట్టారు.
ఐరాస భద్రతా మండలికి వియత్నాం ఎన్నిక
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అయిదు శాశ్వ తేతర సభ్యత్వ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆసియా దేశాల ప్రతినిధిగా వియత్నాం ఏకగ్రీవంగా ఎన్నికైంది. వియత్నాం అభ్యర్థిత్వాన్ని 193 దేశాల ఐరాస జనరల్ అసెంబ్లీలో 192 దేశాలు ఆమోదం తెలిపాయి. ప్రస్తుత ఆసియా ప్రతినిధి కువైట్ రెండేళ్ల పదవీ కాల పరిమితి 2018 చివరి నాటికి ముగియనుంది. దాని స్థానంలో వచ్చే సంవత్సర ఆరంభంలో వియత్నాం భద్రతా మండలిలో ప్రవేశిస్తుంది. అలాగే లాటిన్ అమె రికా, కరీబి యన్ దేశాల నుంచి సెయింట్ విన్సెంట్, గ్రెనైడియన్ దేశాలు ఎన్నికయ్యాయి. ఆఫ్రికా స్థానాలకు ట్యూనిషియా, నైగర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా తూర్పు ఐరోపా స్థానానికి జరిగిన పోటీలో ఎస్తోనియా రుమేనియాపై విజయం సాధించింది.
జాతీయం
కథువా కేసులో పఠాన్కోట్ కోర్టు తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన కథువా సామూహిక అత్యాచారం, హత్య కేసులో పంజాబ్లోని పఠాన్కోట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తేజ్వీందర్ సింగ్ 2019 జూన్ 10న తీర్పు వెలువరించారు. ఈ కేసులోని ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులగా తేల్చిన కోర్టు.. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సంజీరామ్ కొడుకు అయిన విశాల్ను కోర్టు సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో ఆలయ సంరక్షకుడు సంజీరామ్, ప్రత్యేక పోలీస్ అధికారి (ఎస్పీవో) దీపక్ ఖజూరియాతోపాటు మరో వ్యక్తి ప్రవేశ్ కుమార్లను దోషులగా తేల్చిన కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది. అలాగే మరో ఎస్పీవో సురేంద్ర వర్మ, ఎస్సై ఆనంద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్లు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వారికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోతే మరో ఆరునెలలు ఎక్కువగా జైలు జీవితం గడపాలని ఆదేశించింది.
లోక్సభ ప్రోటెం స్పీకర్గా వీరేంద్ర కుమార్
లోక్సభ ప్రోటెం స్పీకర్గా మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్ను నియమిస్తూ 2019 జూన్ 11న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 7 సార్లు ఎంపీగా పనిచేసిన ఆయన ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టికమ్గఢ్ నుంచి ఎన్నికయ్యారు. మోడి ప్రభుత్వంలో ఇంతకుముందు కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. ప్రోటెం స్పీకర్గా ఆయన ఆధ్వర్యంలోనే కొత్త ఎంపీల ప్రమాణస్వీకారంతో పాటు, స్పీకర్ ఎన్నిక జరగనున్నాయి. 17వ లోక్సభ సమావేశాలు జూన్ 17వ తేదీ నుంచి జూలై 26 వరకు జరగనున్నాయి.
రైతులందరికీ పీఎం-కిసాన్
దేశంలోని రైతులందరికీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సిద్ధి (పీఎం-కిసాన్) పథకం వర్తింప జేయాలనే నిర్ణయంపై కేంద్రప్రభుత్వం 2019 జూన్ 8న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 14.5 కోట్ల మంది రైతులకు.. వారికెంత భూమి ఉంది అన్న విషయం పరిగణనలోకి తీసుకోకుండా ఏడాదికి రూ.6 వేల చొప్పున సాయం జేస్తారు. ప్రస్తుతం సవరించిన పథకం ప్రకారం.. మరో 2 కోట్ల మంది రైతులు దీనికింద లబ్ధి పొందుతారు. ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజనలో భాగంగా రైతులు ఇకపై ప్రతినెలా రూ.100 చెల్లించాల్సి ఉంటుందని కేంద్రప్రభుత్వం తెలిపింది.
ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
ట్రిపుల్ తలాక్ విధానంపై నిషేధం విధిస్తూ రూపొం దించిన బిల్లును కేంద్ర కేబినెట్ జూన్ 12న ఆమోదించింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరిలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. 16వ లోక్సభ రద్దు కావడంతో రాజ్యసభ వద్ద పెండింగ్లో ఉన్న ఈ బిల్లుకు కాలపరిమితి తీరింది. దీంతో ప్రభుత్వం మళ్లీ ఈ బిల్లు రూపొందించింది. ట్రస్టులకు ప్రత్యేక ఆర్థిక మండలా(ఎస్ఈ జెడ్)లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించే ఎస్ఈజెడ్ సవరణ బిల్లుపైనా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, మొబైల్ ఫోన్ కనెక్షన్లు పొందేందుకు ఆధార్ను గుర్తింపు ధ్రువీకరణగా వాడుకునేందుకు వీలు కల్పిస్తూ రూపొందించిన ఆధార్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ జూన్ 12న ఆమోదం తెలిపింది. అయితే 18 ఏండ్లు నిండిన వారు బయోమెట్రిక్ విధానం నుండి బయటకు వచ్చేందుకు వీలు కల్పించే ప్రతిపాదన కూడా ఉంది.
ప్రపంచ శాంతిలో భారత్కు 141వ స్థానం
ప్రపంచ శాంతియుత దేశాల జాబితాలో భారత్కు 141వ స్థానం దక్కింది. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన 'ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకానమిక్స్ అండ్ పీస్' 163 దేశాలతో రూపొందించిన ప్రపంచ శాంతీ సూచీ-2019(జీపీఐ)ను 2019 జూన్ 12న విడుదల చేసింది. ఈ సూచీలో వరుసగా 12వసారి ఐస్ల్యాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఐస్ల్యాండ్ తర్వాతి స్థానాల్లో న్యూజిల్యాండ్, ఆస్ట్రియా, పోర్చుగల్, డెన్మార్క్ ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్(163) చివరి స్థానంలో నిలిచింది. 2018 ఏడాదిలో సిరియా అట్టడుగున నిలువగా ఈసారి మాత్రం ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుంది. సమాజ భద్రత, భద్రత స్థాయి, దేశీయ, అంతర్జాతీయ విభేదాలు, సైనికీకరణ వంటి పలు అంశాలను కొలమానంగా తీసుకొని ఈ ర్యాంకులను ప్రకటించారు.
ఫోర్బ్స్ మహిళా వ్యాపారవేత్తల జాబితా విడుదల
అమెరికాలోని 80 మందితో కూడిన అత్యంత ధనిక మహిళల జాబితాను 2019 జూన్ 7న ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఏబీసీ సప్లై సంస్థ చైర్పర్సన్ డయానే హెండ్రిక్స్ దాదాపు రూ.4 లక్షల కోట్ల సంపాదనతో మొదటి స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ముగ్గురు భారత సంతతి వ్యాపారులు స్థానం సంపాదించారు. భారత సంతతికి చెందిన వారిలో అరిస్టా నెట్వర్క్స్ సీఈవో జయశ్రీ ఉల్లాల్ 8వ స్థానంలో, సింటెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథీ 23వ స్థానంలో, కన్ఫ్లుయెంట్ టెక్నాలజీ కంపెనీ సహవ్యవస్థాపకురాలు నేహా నార్కేడే 60వ స్థానంలో నిలిచారు.
ఫోర్బ్స్ జాబితాలో 57 భారత కంపెనీలు
ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొం దించిన 'ప్రపంచంలోని అతిపెద్ద పబ్లిక్ కంపెనీలు-2000' జాబి తాలో మొత్తం 57 భారత కంపెనీలకు చోటు లభించింది. 2019 జూన్ 13న విడుదలైన ఈ జాబితాలో ఇండస్టియ్రల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ఐసీబీసీ) వరుసగా ఏడో ఏడాదీ అగ్రస్థానంలో నిలిచింది.
అత్యంత విలువైన బ్రాండ్గా అమెజాన్
ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్గా అమెరికా కు చెందిన అగ్రగామి రిటైల్ సంస్థ అమెజాన్ నిలిచింది. అమెజాన్ బ్రాండ్ విలువ 2018లో 52 శాతం (108 బిలియన్ డాలర్ల మేర) పెరిగి 315 బిలియన్ డాలర్ల కు (రూ.22.05 లక్షల కోట్లకు) చేరినట్టు అంతర్జాతీయ మార్కెట్ పరిశోధనా సంస్థ కాంటార్ తెలిపింది. ఈ మేరకు 2019 జూన్ 11 తన 2019వ సంవత్సరపు 100 టాప్ బ్రాండ్స్ నివేదికను కాంటార్ విడుదల చేసింది. 2018లో అమెజాన్ మూడో స్థానంలో ఉండగా, గూగుల్ నంబర్ 1 బ్రాండ్గా ఉంది. తాజాగా వీటి స్థానాలు మారిపోయాయి. అమెజాన్ రెండు మెట్లు పెకైక్కి మొదటి స్థానానికి రాగా, గూగుల్ మూడో స్థానానికి పడిపోయింది. రెండో స్థానంలో యాపిల్ నిలిచింది.
ఫోర్బ్స్ ధనిక క్రీడాకారుల్లో కోహ్లీ
ఫోర్బ్స్ 2018 సంవత్సరానికి గానూ విడుదల చేసిన అత్యంత ధనిక క్రీడాకారు లు-100 జాబితాలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి చోటు లభించింది. ఈ జాబితాలో రూ.2.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.173 కోట్లు) ఆదాయంతో కోహ్లీ 100వ స్థానంలో నిలిచాడు. దీంతో ఈ జాబితాలో చోటు సంపాందించిన ఏకైక భారత క్రీడాకారుడి గా కోహ్లీ గుర్తింపు పొందాడు. 2017 జాబితాలో 2.4 కోట్ల డాలర్ల ఆదాయంతో 83వ స్థానంలో కోహ్లీ ఉన్నాడు. ఫోర్బ్స్ అత్యంత ధనిక క్రీడాకారులు-100 జాబితాలో అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ మెస్సీ 127 మిలియన్ డాలర్లతో అగ్రస్థానం లో నిలిచాడు.
ఇంటర్నెట్ వినియోగంలో భారత్ రెండో స్థానం
ఇంటర్నెట్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో నిలిచింది.యూజర్ బేస్లో ప్రపంచవ్యాప్తంగా 12 శాతం వాటాతో ఇండియా 2వ స్థానంలో ఉందని '2019 మారీ మీకర్' రిపోర్ట్ వెల్లడించింది. ఇంటర్నెట్ ట్రెండ్స్పై రూపొందించిన ఈ నివేదిక ప్రకారం అమెరికా వెలుపల జరిగిన అత్యంత వినూత్నమైన ఇంటర్నెట్ కంపెనీగా 'రిలయన్స్ జియో' నిలిచింది. ఈ నివేదిక ప్రకారం ఇంట్ర్ నెట్ వినియోగంలో 21 శాతం వాటాతో చైనా మొదటి స్థానంలో ఉండగా... 8 శాతం వాటాతో అమెరికా మూడో స్థానం పొందింది.
ఏటీఎం చార్జీల సమీక్షకు కన్నన్ కమిటీ
ఏటీఎం చార్జీలను పునఃసమీక్షిం చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వి.జి.కన్నన్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులు ఈ కమిటీలో ఉంటారని 2019 జూన్ 11న ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చార్టీలు, వ్యయాలను సమీక్షించి.. అవసరమైన మార్పులను కమిటీ సూచిస్తుందని పేర్కొంది. కమిటీ తొలి సమావేశమైన నాటి నుంచి రెండు నెలల వ్యవధిలో తన నివేదికను అందించాల్సి ఉంటుంది. 2019, ఏప్రిల్ చివరినాటికి దేశవ్యాప్తంగా 2 లక్షల ఏటీఎంలు ఉండగా.. 88.47 కోట్ల డెబిట్ కార్డులు, 4.8 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 80.9 కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు ఆర్బీఐ వివరించింది.
జూలై 1 నుంచి ఆర్టీజీఎస్ చార్జీలు ఎత్తివేత
ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ(నెఫ్ట్)లపై అన్ని రకాల చార్జీలను 2019 జూలై 1 నుంచి ఎత్తివేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. అదే రోజు నుంచి కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని బదిలీ చేయాలని బ్యాంకులను కోరినట్టు జూన్ 11న తెలిపింది. ప్రస్తుతం ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా చేస్తున్న నగదు బదిలీలపై ఆర్బీఐ నామమాత్రపు చార్జీలను బ్యాంకుల నుంచి వసూలు చేస్తోంది. దీంతో బ్యాంకులు సైతం కస్టమర్ల నుంచి చార్జీల రూపంలో ఆదాయాన్ని రాబట్టుకుంటున్నాయి. ఎస్బీఐ అయితే నెఫ్ట్ లావాదేవీలపై రూ.1-5 వరకు, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ.5-50 మధ్యలో వసూలు చేస్తోంది.
ప్రాంతీయం
జూన్ 21న కాళేశ్వరం పథకం ప్రారంభం
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వ రం ఎత్తిపోతల పథకం 2019, జూన్ 21న ప్రారంభంకానుంది. కాళేశ్వ రం ప్రాజెక్టులోని మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని ఎత్తి పోయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త శకానికి నాంది పలక నుంది. తెలంగాణ భూభాగంలోని దాదాపు 70 శాతం జిల్లాలకు సాగు, తాగు, పరిశ్రమల అవసరా లను తీర్చే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రారం భించనున్నారు. గోదావరిలో వరద ఉండే దినాలను బట్టి కనిష్టంగా 150 టీఎంసీల నీటిని ఈ పథకం ద్వారా ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.50 వేల కోట్ల మేర నిధులను ఖర్చు చేసింది. కాళేశ్వరం పథóకానికి 20 16, మే 2న కన్నెపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఆపద్బంధు పథకం పొడిగింపు
తెలంగాణలో బాధిత కుటుంబాలకు ఆపన్నహస్తం అందించే ఆపద్బంధు పథకాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019 జూన్ 10న ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు వర్తించే ఈ పథకం 2018 నవం బర్ 1తో ముగిసింది. తాజాగా ఈ పథకాన్ని 2019, నవం బర్ 1 వరకు పొడిగిస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 17 కేటగిరీల కింద ప్రమాదవశాత్తు చనిపో యిన వారి కుటుంబీకులు ఈ పథకానికి అర్హులు. ఆపద్బం ధు కింద రూ.50 వేల సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది.
పాకాలలో అరుదైన త్రోటెడ్ లిజర్డ్
వరంగల్ రూరల్ జిల్లా ఖానాపు రంలోని పాకాల, పందెం అడవు ల్లో అరుదైన ఫ్యాన్ త్రోటెడ్ లిజర్డ్ (తొండ మాదిరిగా ఉండేది) కనిపించింది. వర్షాకాలానికి ముందు ఈ లిజర్డ్ మెడ భాగంలో ఉబ్బుగా వస్తూ ఉంటుంది. ఇది ఫ్యాన్ మాదిరిగా ఉండి దాని తో ఊపిరి లోపలకు తీసుకుంటుంది. ఈ లిజర్డ్ ఉనికి కేరళ రాష్ట్రంలో మాత్రమే ఉండగా ప్రస్తుతం పాకాల, పందెం అడవుల్లో గుర్తించినట్లు ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ తెలిపింది.
వార్తల్లో వ్యక్తులు
తాత్కాలిక సీవీసీగా శరద్ కుమార్
తాత్కాలిక కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా శరద్ కుమార్ను నియ మిస్తూ 2019 జూన్ 11న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సీవీసీగా ఉన్న కె.వి. చౌదరి పదవీ కాలం 2019 జూన్ 9న ముగిసింది. దీంతో విజిలెన్స్ కమిషనర్ (వీసీ) శరద్ కుమార్ను ప్రభుత్వం తాత్కాలిక సీవీసీగా నియమించింది. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) మాజీ అధిపతి అయిన శరద్ కుమార్ 2018, జూన్ 12న విజిలెన్స్ కమిషనర్గా నియమితు లయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్లో మరో కమిషనర్ అయిన టి.ఎం.భాసిన్ పదవీ కాలం జూన్ 10న ముగిసింది.
బీసీసీఐ ఎలక్టోరల్ అధికారిగా గోపాలస్వామి
బీసీసీఐ ఎలక్టోరల్ అధికారిగా ఎన్నికల మాజీ ప్రధాన కమి షనర్ ఎన్.గోపాల స్వామి నియమితుల య్యారు. బీసీసీఐ ఎన్నికల విధివిధా నాలపై 2019 జూన్ 7న చర్చించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఈ మేరకు వెల్లడించింది. రాష్ట్ర సంఘాలకు సెప్టెంబర్ 24న ఎన్నికలు జరుగనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 22న వార్షిక సర్యసభ్య సమావేశంలో జరుగనున్న బీసీసీఐ కార్యవర్గం ఎన్నికలకు గోపాలస్వామి ఎలక్టోరల్ అధికారిగా వ్యవహరించనున్నారు.
బహుభాషా నటుడు గిరీష్ కర్నాడ్ మృతి
బహుభాషా నటుడు, ప్రఖ్యాత నాటక రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ (81) మృతి చెందారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 2019 జూన్ 10న బెంగళూరులో లావెల్లీ రోడ్డులోని స్వగహంలో మృతి చెందారు. 1938 మే 19న మహారాష్ట్రలోని మాథెరన్ (ముంబైకి సమీపంలో ఉండే హిల్స్టేషన్)లో జన్మించిన కర్నాడ్ బాల్యం పూణెలో కౌమారం కర్నాటకలోని ధార్వాడ్లో గడిచింది. మరాఠి, కన్నడ మాట్లాడే ఆయన బిఎస్సీ మేథమేటిక్స్ చదివారు. పైచదువులకు ఇంగ్లండ్ వెళ్లి అక్కడ రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, ఫిలాసఫీలో పీజీ పూర్తిచేశారు. 1962-63లో ఆక్స్ఫర్డ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు.
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జర్దారీ అరెస్ట్
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అరెస్టయ్యారు. మనీ లాండరింగ్ కేసులో ఆయన్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) బందం 2019 జూన్ 10న అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) సహాధ్యక్షుడిగా ఉన్న జర్దారీతోపాటు ఆయన సోదరి ఫర్యాల్ తల్పూర్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. అధికారంలో ఉండగా అక్రమంగా సంపాదించిన రూ.6.80 కోట్లను విదేశాలకు తరలించేందుకు వేలాది నకిలీ అకౌంట్లను సష్టించారని వీరిపై ఆరోపణలున్నాయి.
సంఘ సేవకుడు భాగవతుల మృతి
ప్రముఖ సంఘ సేవకుడు, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు భాగవతుల వెంకట పరమేశ్వరరావు (86) 2019 జూన్ 9న విశాఖపట్టణం లో మృతి చెందారు. విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన భాగవతుల అమెరికాలోని జేన్స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్డీ పట్టా పొందారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ముంబైలో రీసెర్చ్ అసోసియేట్గా కొన్నాళ్లు పని చేశారు. 1976 నవంబర్లో యలమంచిలి సమీప గ్రామం హరిపురంలో బీసీటీ అనే పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను భాగవతుల ఏర్పాటు చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై గ్రామాల్లో ప్రచారం చేసి వినూత్న మార్పునకు కషి చేశారు. స్వగ్రామం దిమిలిలో హైస్కూల్ని కూడా స్థాపించారు.
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా విజయానంద్
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా 1992 బ్యాచ్ ఐఏఎస్ కె.విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జూన్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ ప్రస్తుత్తం ఏపీ జెన్కో సీఎండీగా ఉన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకష్ణ ద్వివేదిని ఈసీఐ బదిలీ చేసింది. 2019, జనవరిలో ఏపీ సీఈవోగా ద్వివేది నియమితులయ్యారు.
అవార్డులు
షి జిన్పింగ్కు కిర్గిజ్ అత్యున్నత పురస్కారం
చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్కు కిర్గిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం మనాస్ ఆర్డర్ ఆఫ్ ద ఫస్ట్ డిగ్రీ లభించింది. కిర్గిస్థాన్ రాజ ధాని బిష్కెక్లో 2019 జూన్ 13న జరిగిన కార్యక్రమంలో జిన్పింగ్కు కిర్గిస్థాన్ అధ్యక్షుడు సూరోన్బే జీన్బెకోవ్ ఈ అవార్డు ప్రదానం చేశారు. కిర్గిస్థాన్-చైనా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య అభివద్ధికి జిన్పింగ్ అందించిన ప్రత్యేక సేవలను ఈ సందర్బంగా సూరోన్బే ప్రశంసించారు. జిన్పింగ్ మాట్లాడుతూ, చైనా ప్రజలకు, కిర్గిజ్ ప్రజలకు మధ్య వున్న ప్రగాఢ మైత్రిని ఈ అవార్డు ప్రతిబింబిస్తుందన్నారు.
అమితవ్ ఘోష్కు జ్ఞానపీఠ్ ప్రదానం
ప్రముఖ రచయిత అమితవ్ ఘోష్ కు 54వ జ్ఞానపీఠ్ అవార్డును ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా హేబిటాట్ సెంటర్లో జూన్12న జరిగిన కార్యక్రమంలో మాజీ దౌత్యవేత్త, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకష్ణ గాంధీ చేతుల మీదుగా అమితవ్ జ్ఞానపీఠ్ అవార్డు-2018ను అందుకున్నారు. దీంతో ఈ అవార్డు అందుకున్న మొదటి ఆంగ్ల రచయితగా ఆయన గుర్తింపు పొందారు. ఈ అవార్డు కింద రూ.11లక్షల నగదుతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తారు.
రామా చంద్రమౌళికి నాజినామన్ పురస్కారం
వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, కథానవలా రచయిత రామా చంద్రమౌళి నాజినామన్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో ఈ ఎంపికైన మొదటి తెలుగు సాహిత్య వేత్తగా ఆయన నిలిచారు. లెబనాన్కు చెందిన నాజినామన్ ఫౌండేషన్ మూడు విభాగాల్లో అం దించే ఈ పురస్కారానికి వివిధ దేశాల నుంచి మొత్తం 60 మంది ఎంపికయ్యారు. వీరిలో నలుగురు భారతీయులున్నారు. నలుగురు భారతీయులలో మెరిట్ ప్రైజ్ విభాగంలో బెంగాల్ కవి దెబశిశ్ లహరి, క్రియేటివిటీ ప్రైజ్ విభాగంలో అశోక్ చక్రవర్తి టోలోనా, దేవశ్రీ తివారీ ఎంపికయ్యారు. ఇక హానర్ ప్రైజ్ విభాగంలో 61 రచనలు చేసిన కవి, రచయితగా రామా చంద్రమౌళిని జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేశారు.
సైన్స్ AND టెక్నాలజి
గూగుల్ మ్యాప్స్లో ఆఫ్ రూట్ ఫీచర్
టాక్సీ డ్రైవర్లు 500 మీటర్లు దాటి రాంగ్రూట్లో వెళ్తుంటే అలర్ట్ చేసేలా గూగుల్ మ్యాప్స్ 'ఆఫ్ రూట్' అనే నూతన ఫీచర్ను సిద్ధం చేస్తోంది. ఈ ఫీచర్ను ప్రత్యేకంగా భారత్లోనే అందించనున్నా రు. చేరాల్సిన గమ్యాన్ని మ్యాప్లో నిర్ధారించుకున్న తర్వాత మెనూలోని స్టే సేఫర్ అనే ఆప్షన్లో ఆఫ్ రూట్ అలర్ట్ అనే ఈ ఫీచర్ ఉంటుందని జూన్ 11న గూగుల్ తెలిపింది. అయితే మార్గం తప్పిన టాక్సీకి అక్కడి నుంచి తిరిగి గమ్యానికి కలిపే దారిని మాత్రం ఈ ఫీచర్ చూపించలేదు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో గూగుల్ ఇంకా ప్రకటించలేదు.
హెచ్ఎస్టీడీవీ విమాన పరీక్ష విజయవంతం
హైపర్సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్ (హెచ్ఎస్ టీడీవీ) అనే మానవరహిత విమానాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివద్ధి చేసిన ఈ స్క్రామ్జెట్ విమానాన్ని ఒడిశాలోని కలామ్ ద్వీపం నుంచి 2019 జూన్ 12న డీఆర్డీవో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. పునర్వి నియోగ వాహనమైన హెచ్ఎస్టీడీవీతో ఉపగ్రహాలను చవకగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. హెచ్ఎస్ టీడీవీ 20 సెకన్లలో 32.5 కి.మీ ఎత్తుకు చేరుకోగలదనీ, గంటకు 7,408 కి.మీ(6 మ్యాక్ల) వేగంతో దూసుకు పోగలదన్నారు. దీంతో శత్రుదేశాలపై క్రూయిజ్ క్షిపణులనూ ప్రయోగించవచ్చు.
జూలై 15న చంద్రయాన్ 2 : ఇస్రో చైర్మన్ శివన్
2019, జూలై 15న చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. జీఎస్ఎల్వీ ఎంకే-3 రాకెట్ సాయం తో చేపట్టే ఈ మిషన్ ద్వారా 2019, సెప్టెంబర్ 6 లేదా 7వ తేదీల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ దిగుతుందని తెలిపారు. చంద్రయాన్-2 మిషన్ ద్వారా మీటరు పొడవైన 25 కేజీల బరువున్న రోవర్, ఆర్బిటర్, లాండర్లను చంద్రుడి పైకి పంపనున్నట్లు వివరించారు. ఆర్బిటర్ ప్రొపెలైజేషన్ విధానంలో ఈ మూడు పరికరాలు చంద్రుడి కక్ష్యలోకి చేరతాయని పేర్కొన్నారు.
భూ కక్ష్యలో సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డా.కె.శివన్ ప్రకటించారు. ఢిల్లీలో జూన్ 13న నిర్వహించిన మీడియా సమావేశంలో శివన్ ఈ మేరకు తెలిపారు. చంద్రయాన్-2 ప్రయోగం పూర్తయ్యాక సూర్యుడిపై ఆదిత్య-ఎల్1 వాహకనౌక 2020 తొలి అర్ధభాగంలో పంపిస్తామని చెప్పారు. అనంతరం 2-3 సంవత్సరాల వ్యవధిలో ఫ్రాన్స్తో కలిసి శుక్రుడిని అధ్యయనం చేసేందుకు మరో ప్రయోగం చేపడతామని పేర్కొన్నారు. భారతీయుల్ని సొంతంగా అంతరిక్షంలోకి పంపేందుకు రూ.10,000 కోట్లతో ఇస్రో చేపట్టిన 'గగన్యాన్' ప్రాజెక్టుకు కొనసాగింపుగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం చేపడ తామన్నారు. అమెరికా, జపాన్, కెనడా, రష్యా, ఈయూ దేశాలు కలిసి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బరువు 420 టన్నులు ఉండగా, ఇస్రో ఏర్పాటుచేయనున్న అంతరిక్ష కేంద్రం బరువు 20 టన్నులు మాత్రమే. ఈ అంతరిక్ష కేంద్రంలో తొలుత వ్యోమగాములు 15-20 రోజులు గడిపేలా ఏర్పాట్లు, దాన్ని క్రమంగా విస్తరిస్తారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ప్రభుత్వ ఆమోదం లభించాల్సి ఉంది.
2020 నుంచి ఐఎస్ఎస్ యాత్రలు
అంతరిక్ష పర్యాటకం, తదితర వాణిజ్య అవస రాల కోసం 2020 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ఐఎస్ఎస్) సిద్ధం చేయనున్నట్లు నాసా ప్రకటించింది. కక్ష్యలో తిరుగుతున్న ఈ ఉపగ్రహం లో ఒక్క రాత్రి గడపాలను కునే వారి నుంచి 35 వేల డాలర్లు(రూ.24 లక్షలు) చొప్పున వసూలు చేస్తామని తెలిపింది. మొత్తం రానుపోను చార్జీలతో కలిపి ఒక్కొక్కరికి రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని వివరించింది. అంతరిక్ష కేంద్రం నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రయత్నం దోహద పడుతుందని నాసా భావిస్తోంది. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త డెన్నిస్ టిటో మొట్టమొదటి సారిగా అంతరిక్షంలోకి వెళ్లిన యాత్రికుడు. ఇందుకు రష్యాకు టిటో రూ.138 కోట్లు చెల్లించారు.
క్రీడలు
ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ విజేత నాదల్
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను స్పెయిన్ టెన్నిస్ క్రీడా కారుడు రాఫెల్ నాదల్ 12వసారి గెలుచుకున్నాడు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 2019 జూన్ 9న జరిగిన ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6-3, 5-7, 6-1, 6-1తో నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించి విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి యాష్లేబార్టీ విజేతగా నిలిచింది. పారిస్లో 2019 జూన్ 8న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ బార్టీ 6-1, 6-3తో అన్సీడెడ్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ క్రికెట్కు యువరాజ్ వీడ్కోలు
భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు 2019 జూన్ 10న వెల్లడించాడు. రిటైర్మెంట్ అనం తరం బీసీసీఐ అనుమతిస్తే ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు టి20 లీగ్లు ఆడాలను కుంటున్నట్లు తెలిపాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆఖరి సారిగా ప్రాతినిధ్యం వహించిన యువ రాజ్... జాతీయ జట్టు తరఫున రెండేళ్ల క్రితం 2017 జూన్లో ఆఖరి వన్డే ఆడాడు. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 402 మ్యాచ్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు.
బ్యాడ్మింటన్కు లీ చోంగ్ వీ వీడ్కోలు
మలేసియా బ్యాడ్మింటన్ క్రీడా కారుడు, ప్రపంచ మాజీ నంబర్ వన్ లీ చోంగ్ వీ ఆటకు వీడ్కోలు పలికాడు. అనారోగ్య కారణాల వల్లే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకు న్నట్లు 2019 జూన్ 13న లీ చోంగ్ తెలిపాడు. ముక్కు సంబంధిత క్యాన్సర్ బారినపడిన లీ చోంగ్ వీ 2018 ఏడాదిలో చికిత్స తీసుకున్నాడు. 348 వారాలపాటు ప్రపంచ ర్యాంకింగ్స్లో నంబర్వన్గా కొనసాగినా... లీ చోంగ్ మూడు ప్రపంచ చాంపియన్షిప్లలో (2011, 2013, 2015), మూడు సార్లు ఒలింపిక్స్లో (2008, 2012, 2016) రజత పతకాలు గెలుచుకున్నాడు. తన సుధీర్ఘ కెరీర్లో లీ చోంగ్ వీ 69 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు.
ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒలింపిక్ పోడియాలు
2020 టోక్యో ఒలింపిక్స్ విజేత లకు పతకాలను అందించేందుకు ఏర్పాటు చేయనున్న పోడియం లను ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపొం దించనున్నట్లు నిర్వాహకులు జూన్ 11న వెల్లడించారు. గహ, సముద్రాల్లో లభించే ప్లాస్టిక్ వ్యర్థాలను పోడియంల రూప కల్పనకు వాడనున్నారు. ఈ వ్యర్థాలను టోర్నీ ఆతిథ్య దేశమైన జపాన్ నుంచి మాత్రమే సేకరిస్తారు. టోర్నీలో భాగంగా మొత్తం 100 పోడియంలు నిర్మించాల్సి ఉన్నందున ఆ మేరకు 45 టన్నుల వ్యర్థాలు అవసరం కానున్నాయి. ఇప్పటికే ఒలింపిక్స్ విజేతలకు ఇచ్చే స్వర్ణ, రజత, కాంస్య పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో తయారుచేయనున్నట్లు ఒలింపిక్స్ నిర్వహకులు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక విశ్వక్రీడల్లో పాల్గొనే జపాన్ క్రీడాకారులు ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపొందించిన దుస్తులను ధరించనున్నారు.
Authorization