అంతర్జాతీయం
పశ్చిమాసియాకు అమెరికా సైనికులు
ఇరాన్తో అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరో వెయ్యి మంది సైనిక సిబ్బందిని పశ్చిమాసియా ప్రాంతానికి పంపేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. గగన, సముద్ర, భూతలంలో ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు పశ్చిమాసియాకు కొత్తగా వెయ్యి మందిని పంపుతున్నట్లు అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి ప్యాట్రిక్ షనాహన్ చెప్పారు. అణు ఒప్పందం లో నిర్దేశించిన దానికన్నా అధికంగా యూరేనియంను తాము వచ్చే పది రోజుల్లోనే నిల్వచేయనున్నామంటూ ఇరాన్ ప్రక టించిన వెంటనే అమెరికా ఈ నిర్ణయం తీసుకొంది. అణు ఒప్పందం నుంచి అమెరికా ఇప్పటికే బయటకు వచ్చింది.
చైనాలో వరుస భూకంపాలు
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో రెండు వరుస భూకంపాలు సంభ వించాయి. ఈ భూకంపాల్లో 12 మంది మతి చెందగా 125 మంది గాయపడ్డారని చైనా ప్రభుత్వం తెలిపింది. 2019 జూన్ 17న రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో మొదటి భూకంపం రాగా, రెండవది జూన్ 18న సంభ వించింది. చాంగింగ్ కౌంటీలోని యిబిన్ నగరానికి దగ్గర్లో భూమికి 16 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం కారణంగా పలు భవనాలు కూలి పోయాయి.
అమెరికా డ్రోన్ను కూల్చిన ఇరాన్
తమ భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన అమెరికాకు చెందిన ఒక నిఘా డ్రోన్ను కూల్చివేసినట్టు ఇరాన్ వెల్లడించింది. తమ దేశ గగన తలంలోకి ప్రవేశించిన మానవర హిత, ఆయుధరహిత ఆర్క్యూ 4ఏ నిఘా డ్రోన్ను కూల్చేసినట్టు పేర్కొంది. డ్రోన్ కూల్చివేత విషయమై అమెరికా స్పందిస్తూ హార్మోజ్గాన్ ప్రావిన్స్ వరకు ఆ డ్రోన్ వెళ్లిందని అది అంతర్జాతీయ గగనతలమని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాది క్రితం ఇరాన్తో అణు ఒప్పందం వెనక్కి తీసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
కిర్గిజ్తో పెట్టుబడుల ఒప్పందం
కిర్గిజిస్తాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణి జ్యాన్ని పెంచుకో వడానికి ఇరు దేశాలు అయిదేళ్ల మార్గదర్శ ప్రణాళికలను రూపొందించు కున్నట్లు ప్రధాని నరేంద్రమోడి తెలిపారు. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో 2019 జూన్ 14న జరిగిన భారత్- కిర్గిజ్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సంద ర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాలు 15 ఒప్పందాలపై సంతకాలు చేశాయి.
గల్ఫ్ ప్రాంతానికి భారత యుద్ధ నౌకలు
అమెరికా-ఇరాన్ల మధ్య ఘర్షణ కారణంగా ఒమన్, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తత నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారత నౌకా దళం యుద్ధనౌకలను మోహ రించింది. ఆ ప్రాంతం గుండా ప్రయాణించే భారత నౌకలకు రక్షణ కోసమే ఈ పని చేసినట్లు 2019 జూన్ 20న నౌకాదళం తెలిపింది. ఐఎన్ఎస్ చెన్నై, ఐఎన్ఎస్ సునయనలను ఒమన్, పర్షియన్ సింధు శాఖలకు పంపినట్లు పేర్కొంది.
అమెరికా నుంచి దిగుమతయ్యే 28 వస్తువులపై పన్ను పెంపు
అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై భారత్ భారీగా సుంకాలు పెంచింది. భారత్ నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమి నియం ఉత్పత్తులపై ఇటీవల అమెరికా ప్రభుత్వం పన్నులు పెంచింది. ఇందుకు ప్రతిగా భారత్ అమెరికా నుంచి దిగుమ తయ్యే బాదం, పప్పుధాన్యాలు, వాల్నట్ తదితర 28 వస్తువులపై పన్ను పెంచుతు న్నట్లు ప్రకటించింది. జూన్ 16 నుంచే ఈ పెంపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో తయా రయ్యే, అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వాల్నట్పై 30 శాతం నుంచి 120 శాతానికి, పప్పులపై 30 నుంచి 70 శాతానికి పన్ను పెరిగింది.
జాతీయం
రైళ్లలో మసాజ్ ప్రతిపాదన ఉపసంహరణ
రైళ్లలో ప్రయాణికులకు మసాజ్ అందించే ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు పశ్చిమ రైల్వే 2019 జూన్ 16న స్పష్టం చేసింది. మహిళలు ప్రయాణించే చోట ఇలాంటివి తగవని, ఇది భారత సంప్రదాయాలకు విరుద్ధమైనదంటూ బీజేపీ ఎంపీ శంకర్ లాల్వాణీ, రైల్వే మంత్రి పియూష్ గోయల్కు జూన్ 10న లేఖ రాశాడు. లేఖ రాసిన కొద్ది రోజులకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
45వేల కోట్లతో 6 జలాంతర్గాములు
అధునాతన పరిజ్ఞానంతో దేశం లో ఆరు జలాంతర్గా ములను నిర్మించేందుకు భారత నౌకా దళం చర్యలు మొదలు పెట్టింది. పి-75(ఐ) ప్రాజెక్టు కింద రూ.45వేల కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ కార్యక్ర మంలో భాగంగా వ్యూహాత్మక భాగస్వాములను ఎంపిక చేసేందుకు 'ఆసక్తి వ్యక్తీకరణ' పత్రాలను జారీ చేసింది. కొత్తగా రూపొందించిన 'వ్యూహాత్మక భాగస్వామ్యం' నమూనా కింద చేపడుతున్న రెండో ప్రాజెక్టు ఇది.
బీహార్లో యూనివర్సల్ ఓల్డేజ్ పెన్షన్
బీహార్లో 'ముఖ్యమంత్రి వద్ధజన్ పెన్షన్ యోజన' పేరుతో యూనివర్సల్ ఓల్డేజ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలిపారు. దీంతో ఈ విధమైన పెన్షన్ పథకాన్ని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. 2019, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం ద్వారా 60 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తీ తన ఆర్థిక స్థితి, కుటుంబ నేపథ్యం, కులాలకు అతీతంగా పెన్షన్ను అందుకుంటారు.
సంస్కత భాషలో పత్రికా ప్రకటన
సంస్కత భాష పరిరక్షణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హిందీ, ఇంగ్లీషులతో పాటు సంస్కత భాషలోనూ పత్రికా ప్రకటనలను విడుదల చేయనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు సీఎం కార్యాలయంలోని సంబంధిత విభాగం దీనిని అమలులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన నమూనా పత్రాన్ని విడుదల చేసింది. దీంతో సంస్కత భాషలో పత్రికా ప్రకటనలు విడుదల చేయనున్న తొలి ముఖ్యమంత్రిగా యోగి నిలవనున్నారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సంస్కత తరగతులను ప్రారంభించాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది.
బీహార్లో 103 మంది చిన్నారులు మతి
బీహార్ రాష్ట్రంలో మెదడు వాపు వ్యాధి కారణంగా 103 చిన్నారులు మరణించారు. ముజఫర్పూర్లో ఆరుగురు పిల్లలు 2019 జూన్ 17న ప్రాణాలు కోల్పోవడంతో మతి చెందిన వారి సంఖ్య 103కి చేరింది. చిన్నారుల మరణాలపై స్పందించిన రాష్ట్ర ముఖ్య మంత్రి నితీశ్కుమార్ బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు బీహార్లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బీహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది.
జమిలి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు
ఒకే దేశం, ఒకే ఎన్నిక అంశంపై నిర్ణీత గడువులోగా సూచనలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ 2019 జూన్ 19న ప్రకటించారు. నిర్దిష్ట కాలవ్యవధిలోగా భాగస్వా మ్యపక్షాలతో ఈ కమిటీ చర్చలు జరుపుతుందని తెలిపారు. జమిలి ఎన్నికలపై ఏకాభిప్రాయ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించాలని భావించిన మోదీ ఆ మేరకు 40 మందికి ఆహ్వానం పలికారు. అయితే 21 పార్టీలు మాత్రమే జూన్ 19 నాటి ఈ భేటీకి హాజరుకాగా మరో మూడు పార్టీలు ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలియజే శాయి. ఇది రాజకీయ కమిటీ. వివిధ రాజకీయ పార్టీల నేతలు ఇందులో సభ్యులుగా ఉంటారు.
క్యూఎస్ ర్యాంకింగ్స్లో ఐఐటీ బాంబే, ఢిల్లీ
క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ యూని వర్సిటీ ర్యాకింగ్స్ 2019 జూన్ 19న విడుద లవ్వగా ఐఐటీ-బాంబే (152), ఐఐటీ-ఢిల్లీ(182), ఐఐ ఎస్సీ-బెంగళూరు (184)లకు టాప్- 200లో స్థానం లభించింది. ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-ఖరగ్పూర్, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-రూర్కీలకు టాప్-400లో చోటు దక్కింది. క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్ 2020ని లండన్లో విడుదల చేశారు. భారత్ నుంచి ఓపీ జిందాల్ టాప్-1,000లో చోటు సంపాదించిన అత్యంత కొత్త యూనివర్సిటీగా నిలిచింది. జామియా మిలియా ఇస్లామియా, జాదవ్పూర్ యూని వర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, హైదరాబాద్ యూని వర్సిటీ, కలకత్తా యూనివర్సిటీ, ముంబై యూని వర్సిటీ తదితరాలకు కూడా ర్యాంకులు దక్కాయి.
అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా అమెజాన్
భారత ఉద్యోగుల్లో అత్యంత ఆకర్షణీయమైన సంస్థగా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా నిలిచింది. 2019 ఏడాదికి గానూ రూపొందించిన జాబితాను రాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్ఈబీఆర్) 2019 జూన్ 17న విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ ఇండియా 2వ, సోనీ ఇండియా 3వ స్థానంలో ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ 4వ స్థానం, ఐబీఎం (5), లార్సెన్ అండ్ టూబ్రో (6), నెస్లే ఇండియా (7 ), ఇన్ఫోసిస్ (8), శాంసంగ్ (9), డెల్ (10)వ స్థానాల్లో నిలిచాయి
ప్రపంచవ్యాప్తంగా 7.1 కోట్ల మంది శరణార్థులు
2018 ఏడాది చివరినాటికి యుద్ధాలు, హింస, విద్వేష పూరిత ఘటనల కారణం గా ప్రపంచ వ్యాప్తంగా 7.1 కోట్ల మంది ప్రజలు నిరాశ్రయిల య్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలిపింది. 2017తో పోల్చుకుంటే 20 లక్షల మంది శరణార్థులు పెరిగారని, ఈ మొత్తం శరణార్థుల సంఖ్య ప్రపంచంలో 20వ అతిపెద్ద దేశ జనాభాకు సమానమని పేర్కొంది. ఈ మేరకు యుఎన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా జూన్ 20న ఒక నివేదికను విడుదల చేసింది.
అత్యధిక జనాభా గల దేశంగా భారత్
2027 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఈ మేరకు ఐరాసకి చెందిన ఆర్థిక సామాజిక వ్యవహారాల సంస్థకు అనుబంధంగా ఉండే జనాభా విభాగం 'ప్రపంచ జనాభా అంచనాలు-2019' పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2027 నాటికి చైనా జనాభాను భారత్ దాటేస్తుంది. 2019-50 మధ్యనాటికి భారత్లో జనాభా 27.3 కోట్లు అదనంగా పెరుగుతుంది. ఈ శతాబ్దం చివరివరకు భారతే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగుతుంది.
2022 జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం
2022లో జరిగే ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి 2019 జూన్ 20న ప్రసంగించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఐదేళ్ల పాలనలో భారత్కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందని, విదేశాలతో సంబంధాలు బలోపేతమయ్యాయని, ఈ నేపథ్యంలోనే 2022 జీ20 దేశాల సదస్సును భారత్లో నిర్వహిస్తున్నామని కోవింద్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలన్నీ సమర్థిస్తున్నాయన్నారు.
భారత్ వద్ధి రేటు 6.6 శాతమే: ఫిచ్
2019-2020లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు కేవలం 6.6 శాతమే నమోదవుతుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేసింది. తొలుత 7 శాతంగా ఉన్న ఈ అంచ నాలను మార్చిలో 6.8 శాతానికి తగ్గించిన ఫిచ్ తాజాగా 6.6 శాతానికి కుదించింది. గత ఏడాది కాలంగా తయారీ, వ్యవ సాయ రంగాల పేలవ పనితీరు తమ తాజా అంచనాలకు కారణ మని జూన్ 17న విడుదల చేసిన తన తాజా నివేదికలో ఫిచ్ పేర్కొంది.
భారత్ వద్ధి 6.8 శాతం: డీబీఎస్ బ్యాంక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత వద్ధి రేటు 6.8 శాతంగా నమోదవుతుందని డీబీఎస్ బ్యాంక్ అంచనా వేసింది. ముందు 7 శాతంగా అంచనా వేసిన డీబీఎస్.. తాజాగా దాన్ని 6.8 శాతానికి తగ్గించింది. ఈ మేరకు భారత ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన నివేదికను 2019 జూన్ 20న విడుదల చేసింది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అభిప్రాయపడిన డీబీఎస్ ఆర్బీఐ పరపతి విధానం వద్ధికి కీలకం కానుందని పేర్కొంది.
ప్రాంతీయం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం
కాళేశ్వరం ప్రాజెక్టును తెలం గాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 జూన్ 21న ప్రారం భించారు. గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, దేవేంద్ర ఫడ్నవీస్ల సమక్షం లో జయశంకర్ భూపాల పల్లిలోని మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. వేదిక ప్రాంగణం వద్ద గోదావరి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ను నియ మిస్తూ కేంద్ర న్యాయ శాఖ 2019 జూన్ 19న ఉత్తర్వు లు జారీ చేసింది. హైకోర్టు లో నంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ వి.రామసు బ్రమణియన్ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమిస్తూ మరో ఉత్తర్వు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగొరు, జస్టిస్ బాబ్దే, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన కొలీజియం ఇటీవల చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడంతో వాటికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
వార్తల్లో వ్యక్తులు
ఐఎస్ఐ చీఫ్గా ఫైజ్ హమీద్
పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)కు నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ను నియమిస్తున్నట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ప్రస్తుత ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. మునీర్ను గుజ్రన్వాలా కోర్ కమాండర్గా నియమించినట్లు పేర్కొంది. ఫైజ్ హమీద్ గతంలో ఐఎస్ఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్లో పని చేశారు.
మిస్ ఇండియా-2019 విజేత సుమన్రావ్
రాజస్తాన్కు చెందిన సీఏ విద్యార్థిని సుమన్రావ్ మిస్ ఇండియా-2019 విజేతగా నిలిచారు. ముంబై లోని సర్దార్ వల్లభభారు పటేల్ ఇండోర్ స్టేడియంలో 2019 జూన్ 15న ఈ కార్యక్రమం జరిగింది. సుమన్రావ్ డిసెంబర్లో బ్యాంకాక్ లో జరుగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన నున్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన ఇంజినీర్ శివాని జాదవ్ మిస్ గ్రాండ్ ఇండియాగా నిలిచారు. బీహార్కు చెందిన మేనేజ్మెంట్ విద్యార్థిని శ్రేయా శంకర్ మిస్ ఇండియా యునెటైడ్ కాంటినెంట్స్గా నిలిచారు. తెలంగాణకు చెందిన సంజనా విజ్ మిస్ ఇండియా రన్నరప్గా నిలిచారు.
ఎన్డీటీవీ ప్రణరురారుపై సెబీ నిషేధం
ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణరురారు, ఆయన భార్య రాధికా రారు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. వారిద్దరి హౌల్డింగ్ కంపెనీలు 2 సం||ల పాటు క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని సెబీ ఆదేశించింది. ఈ రెండేళ్లలో ప్రణరు రారు, రాధికా రారులు బోర్డ్ పదవితో పాటు ఎలాంటి ఉన్నతోద్యోగాలు చేపట్టరాదని 2019 జూన్ 14న ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఏడాది కాలంలో ఏ లిస్టెడ్ కంపెనీలో కూడా డెరైక్టర్గా వ్యవహరించకూడదని పేర్కొంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇతర సంస్థల నుంచి రుణాలు తీసుకునే విషయం లో మైనారిటీ వాటాదారులకు తగిన వివరాలు వెల్లడించ నందుకే ఈ నిషేధం విధిస్తునుట్లు సెబీ వివరించింది.
11 ఏళ్లకే మెన్సా క్లబ్ సభ్యత్వం
భారత సంతతి బాలిక జియా వదు 11 ఏళ్ల వయసుకే బ్రిటిష్ మెనా పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి, ప్రతిష్టాత్మక మెన్సా సభ్యత్వ క్లబ్బులో చేరేందుకు ఆహ్వానం అందుకుంది. మేధో సామర్థ్యం (ఐక్యూ) ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే ఈ క్లబ్బులో సభ్యత్వం లభిస్తుంది. ఇటీవల నిర్వహించిన కేటెల్ 3బి పేపరులో జియాకు అత్యధికంగా 162 మార్కులు వచ్చాయి. మేధో సామర్థ్య పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచే 2 శాతం మందికి మాత్రమే మెన్సాలో సభ్యత్వం కల్పిస్తారు.
లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నిక
17వ లోక్సభ స్పీకర్గా భాజపా ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. లోక్ సభ ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ మూజు వాణి ఓటు ద్వారా 2019 జూన్ 19న ఎన్నిక ప్రక్రియ చేపట్టగా.. సభ్యులు బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజస్తాన్లోని కోట-బూందీ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 57 ఏళ్ల బిర్లా మొత్తం మీద రెండుసార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2003లో మొట్టమొదటిసారిగా కోట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో తొలిసారిగా తొలిసారి లోక్సభకు ఎన్నికైన ఆయన 2019లో వరుసగా రెండోసారి 2.79 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
హీరోమోటో కార్ప్ బ్రాండ్ అంబాసిడర్గా ఫెర్నాండో
హీరోమోటో బ్రాండ్ అంబాసిడర్గా కొలంబియా ఫుట్బాల్ క్రీడాకారుడు ఎరీ ఫెర్నాండో మినా నియమితులయ్యారు. కొలంబియా ద్విచక్ర వాహన మార్కెట్లో పట్టుపెంచుకో వడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు 2019 జూన్ 17న కంపెనీ వెల్లడించింది.
రుణ ఎగవేతదారుగా యశోవర్థన్ బిర్లా
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా యశోవర్థన్ బిర్లాను యూకో బ్యాంక్ ప్రకటించింది. బిర్లా సూర్య లిమిటెడ్ కంపెనీ కోసం యశోవర్థన్ బిర్లా రూ.67.55 కోట్ల రుణం తీసుకు న్నారని, ఎన్ని నోటీసులిచ్చినా, ఈ రుణం చెల్లించక పోవడంతో అతన్ని రుణ ఎగవేతదారుగా ప్రకటిస్తున్నామని 2019 జూన్ 17న యూకో బ్యాంక్ తెలిపింది. ఏదైనా బ్యాంక్ ఒక వ్యక్తిని రుణ ఎగవేతదారుగా ప్రకటిస్తే, ఆ వ్యక్తికి ఇతర బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు ఎలాంటి రుణాన్ని మంజూరు చేయవు. 665 మంది రుణ ఎగవేతదారులు /సంస్థల జాబితాను యూకో బ్యాంక్ తన వెట్సైట్లో ఉంచింది. ఈ జాబితాలో జూమ్ డెవలపర్స్ (రూ.310 కోట్ల రుణాలు), ఫస్ట్ లీజింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా(రూ.143 కోట్లు), మోజర్ బేయర్ ఇండియా(రూ.122 కోట్లు) సూర్య వినాయక్ ఇండిస్టీస్ (రూ.108 కోట్లు) ఉన్నాయి.
అవార్డులు
ప్రియాంకాచోప్రాకు యునిసెఫ్ అవార్డు
బాలల విద్య, సామాజిక సేవా కార్యక్ర మాలు నిర్వహిస్తు న్నందుకు నటి ప్రియాంక చోప్రాకు యునిసెఫ్ అమెరికా డానీకేయి మానవతా పురస్కారాన్ని ప్రకటించారు. డిసెంబరులో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ప్రియాంక యునిసెఫ్కు గుడ్విల్ అంబా సిడర్గా వ్యవహ రిస్తున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన 'గర్ల్ అప్' అనే ప్రచారంలో భాగంగా భారత్లో బాలికల విద్య, ఆరోగ్యం, రక్షణపై వివిధ ఎన్జీవోలతో ఆమె సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
భారత ఇంజనీర్కు కామన్వెల్త్ ఇన్నోవేషన్ అవార్డు
భారత్కి చెందిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ నితేశ్కుమార్ జాం గిర్కు కామన్వెల్త్ సెక్రెటరీ జనరల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టయినబుల్ డెవలప్ మెంట్-2019 అవార్డు లభిం చింది. లండన్లో 2019 జూన్ 18న జరిగిన కార్యక్రమంలో బ్రిటన్ యువరాజు హ్యారీ చేతులమీదుగా నితేశ్ ఈ అవార్డును అందుకున్నారు. కంటిన్యుయస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ (సీపీఏపీ) పరికరాన్ని ఆవిష్కరించినందుకుగాను నితేశ్కు ఈ అవార్డు దక్కింది.
భారత సంతతి వ్యక్తికి పాలస్తీనా అవార్డు
భారత సంతతికి చెందిన షేక్ మొహమ్మద్ మునీర్ అన్సారీకి పాలస్తీనా ఇచ్చే విదేశీ అత్యున్నత పురస్కారం స్టార్ ఆఫ్ జెరూసలేం లభించింది. ఈ మేరకు జెరూసలేంలో 2019 జూన్ 14న జరిగిన కార్యక్రమంలో పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ ఈ అవార్డును అన్సారీకి ప్రదానం చేశారు. భారత్-పాలస్తీనా మధ్య సంబంధాల బలోపేతానికి కషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. జెరూసలేం నగరంలోని భారత ధర్మశాలకు అన్సారీ డెరైక్టర్గా వ్యవహరిస్తున్నారు.
కష్ణారావుకు సాహిత్య అనువాద పురస్కారం
ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు ఎ.కష్ణారావు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. త్రిపుర రాజధాని అగర్తలాలో 2019 జూన్ 14న జరిగిన అవార్డుల ప్రదా నోత్సవ కార్యక్రమంలో అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ కంబర్ చేతుల మీదుగా కష్ణారావు అవార్డుతో పాటు రూ.50 వేల నగదు బహుమానాన్ని అందుకున్నారు. 2018 ఏడాదికి గానూ కష్ణారావు అనువదించిన 'గుప్పెడు సూర్యుడు మరికొన్ని కవితలు' కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అనువాద పురస్కారం వరించింది.
అక్షయపాత్రకు గ్లోబల్ చాంపియన్ అవార్డు
బెంగళూరుకు చెందిన అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ చాంపియన్ అవార్డు లభించింది. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్లో 2019 జూన్ 14న జరిగిన కార్యక్రమంలో బీబీసీ వరల్డ్ సర్వీస్ విభాగం ఈ అవార్డును అక్షయపాత్రకు ప్రదానం చేసింది. భారత్లోని వేలాది పాఠశాలల్లో పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనాలు సమకూరుస్తున్నందుకుగాను అక్షయపాత్రకు ఈ అవార్డు దక్కింది. 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన అక్షయపాత్ర సంస్థ, నేడు దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలను అందిస్తుంది. ప్రసుత్తం అక్షయపాత్ర సీఈవోగా శ్రీధర్ వెంకట్ ఉన్నారు.
సైన్స్ and టెక్నాలజి
అంతరిక్షంలోకి శ్రీలంక, నేపాల్ ఉపగ్రహాలు
శ్రీలంక, నేపాల్ దేశాలు మొట్టమొదటిసారిగా రూపొందిం చిన ఉపగ్రహాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోని జపాన్కు చెందిన కిబో మాడ్యూల్ ద్వారా కక్ష్యలోకి చేరాయి. శ్రీలంకకి చెందిన రావణ-1 ఉపగ్రహం 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తూ శ్రీలంక, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను ఇది ఫొటో తీయడం సహా పలురకాల విధులను నిర్వర్తిస్తుంది. శ్రీలంకలోని పెరాడి నియా విశ్వవిద్యాలయం, ఆర్థర్ సి క్లార్క్ ఇన్స్టిట్యూట్ ఫర్ మోడర్న్ టెక్నాలజీస్ విద్యార్థులు రూపొందించిన రావణ-1 ఏడాదిన్నర పాటు సేవలందిం చనుంది. నేపాల్కు చెందిన నేపాలీశాట్-1 ఉపగ్రహాన్ని అబ్బాస్ మాష్కే, హరిరామ్ శ్రేష్ఠ అనే శాస్త్రవేత్తలు రూపొందించారు.
మీథేన్పై ఐఐటీ మద్రాస్ పరిశోధనలు
దేశ తీర ప్రాంతాల్లోని గ్యాస్ హైడ్రేట్ల నుంచి మీథేన్ తయారీపై ఇండి యన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ (ఐఐటీ ఎం) విద్యా ర్థులు పరిశోధనలు చేస్తున్నారు. నేచురల్ గ్యాస్ను స్థానికంగా తయారుచేసుకోవడం ద్వారా దిగుమ తులు తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నూతన విధానంతో చేపడుతున్న ఈ పరిశోధనల గురించి 'ఎనర్జీ అండ్ ఫ్యుయల్స్, అప్లైడ్ ఎనర్జీ' వంటి అంత ర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమైనట్లు ఐఐటీ ఎం 2019 జూన్ 18న తెలిపింది. ఐఐటీ ఎం ఓషియన్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు డాక్టర్ జితేంద్ర సంగ్వారు ఆధ్వ ర్యంలో పవన్గుప్తా, సి.విష్ణులు ఈ పరిశోధనలు చేస్తున్నారు.
కరువును తట్టుకునే గోధుమ
వాతావరణ మార్పుల కారణం గా వచ్చే కరువు పరిస్థితులను తట్టుకుని నిలదొక్కుకునే గోధుమ వంగడాలను శాస్త్ర వేత్తలు రూపొందిం చారు. ఇవి నీటిని కూడా పొదుపుగా వాడుకునేలా జన్యు మార్పులు చేశారు. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త గోధుమ వంగడాలను రూపొందించారు. కొత్త వంగడాల్లో తక్కువ పత్ర రంధ్రాలు ఉండేలా జన్యు మార్పులు చేశారు. దీంతో తక్కువ నీటిని వినియోగించుకోవడంతో పాటు మంచి దిగుబడులు కూడా వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫేస్బుక్ క్రిప్టో కరెన్సీ
సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ క్రిప్టో కరెన్సీ ప్రపం చంలోకి అడుగు పెట్టింది. లిబ్రా అనే పేరుతో సొంత డిజిటల్ కరెన్సీని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా ప్రజలు నగదును దాచుకోవడం, ఇతరులకు పంపడం లేదా ఖర్చు పెట్టడం లాంటివి సులువుగా చేసుకోవచ్చని ఫేస్బుక్ పేర్కొంది. వచ్చే ఏడాది ఈ అంతర్జా తీయ డిజిటల్ కరెన్సీని మార్కెట్లోకి ప్రవేశ పెట్టనున్నారు. ఆసక్తి ఉన్న డెవలపర్లు ఉపయోగిం చుకోవడానికి వీలుగా లిబ్రా ప్రోటోటైప్ను (నమూనా) ఓపెన్ సోర్స్ కోడ్ (అందరూ ఉపయోగించు కునేలా) తరహాలో విడుదల చేసింది.
క్రీడలు
ఆసియా చెస్ బ్లిట్జ్ చాంపియన్గా నిహాల్
భారత యువ గ్రాండ్మాస్టర్ నిహాల్ సరీన్ ఆసియా చెస్ చాంపి యన్షిప్లో బ్లిట్జ్ విభాగంలో టైటిల్ సాధిం చాడు. 2019 జూన్ 15న ముగిసిన ఈ టోర్నమెంట్ లో నిహాల్ ఎనిమిది పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. భారత్కే చెందిన ఎస్.ఎల్. నారాయ ణన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకోగా... తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. క్లాసిక్ విభాగం ఓపెన్ కేటగిరీలో భారత గ్రాండ్మాస్టర్స్ కార్తికేయ మురళి, సేతురామన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. కార్తికేయ, సేతురామన్తోపాటు నారాయణన్ కూడా వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్కు అర్హత పొందారు.
ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత్కు రజతం
ప్రపంచ ఆర్చరీ చాంపి యన్షిప్లో భారత్కు రజత పతకం లభిం చింది. 14 ఏళ్ల తర్వాత ప్రపంచ ఆర్చరీ చాంపి యన్ షిప్లో ఫైనల్కు చేరిన భారత పురుషుల రికర్వ్ జట్టు మళ్లీ రజతం తోనే సరిపెట్టు కోవాల్సి వచ్చింది. 2019 జూన్ 16న జరిగిన ఫైనల్లో తరుణ్దీప్ రారు, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్లతో కూడిన భారత్ 2-6 పాయింట్ల తేడాతో చైనా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది.
ఎఫ్ఐహెచ్ సిరీస్లో భారత్ విజేత
భారత పురుషుల హాకీ జట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో చాంపియన్గా నిలిచింది. 2019 జూన్ 15న జరిగిన ఫైనల్లో మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా 5-1 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
అత్యధిక సిక్స్లు సాధించిన క్రికెటర్గా మోర్గాన్
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓ మ్యాచ్ లో అత్యధిక సిక్స్లు సాధించిన క్రికెటర్గా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నిలిచాడు. వన్డే క్రికెట్ ప్రపం చకప్-2019లో భాగంగా ఇంగ్లండ్లోని మాంచెస్టర్ మైదానం లో 2019 జూన్ 18న అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో మోర్గాన్ 17 సిక్స్లు కొట్టాడు. దీంతో అత్య ధిక సిక్స్లు సాధించిన క్రికెటర్గా మోర్గాన్ రికార్డు నెలకొల్పాడు. మోర్గాన్ తరువాత రోహిత్శర్మ (16), ఏబీ డివిలియర్స్(16), క్రిస్ గేల్(16) ఉన్నారు.
2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్
2022లో ఇంగ్లండ్లోని బర్మింగ్ హామ్ వేదికగా నిర్వహించే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్నూ ఓ అంశంగా చేరుస్తూ కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) 2019 జూన్ 20న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2018 నవంబరులో అంతర్జా తీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సంయుక్తంగా సమర్పించిన బిడ్ను పరిశీలించి ఆమోదించింది. 1998లో కౌలాలంపూర్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్ను ఓ క్రీడాంశంగా చేర్చారు.
భారత్పై ఐఓసీ ఆంక్షల ఎత్తివేత
ప్రపంచ స్థాయి క్రీడా టోర్నీల నిర్వహణ విషయంలో భారత్పై విధించిన ఆంక్షలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జూన్ 20న ఎత్తివేసింది. పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యం లో... 2019, ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరిగిన షూటింగ్ ప్రపంచ కప్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ షూటర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత్ నిరాకరించింది. దీంతో భవిష్యత్లో ఒలింపిక్ అర్హత సంబంధిత క్రీడా పోటీల నిర్వహణను కేటాయించేది లేదంటూ ఐఓసీ మన దేశంపై ఆంక్షలు విధించింది. అయితే, ఇకపై అర్హులైన క్రీడాకారులు ఎవరికీ రాజకీయ కారణాలతో వీసాలు నిరాకరిం చమని భారత్ హామీ ఇవ్వడంతో ఐఓసీ ఆంక్షలు ఎత్తివేసింది.
Authorization