1. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన సంవత్సరం?
ఎ) 1886 బి) 1925
సి) 1892 డి) 1896
2. కలెక్టర్లకు గల న్యాయాధికారాలను రద్దుచేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) కానింగ్ బి) లిట్టన్
సి) కారన్వాలీస్ డి) మెకాలే
3. 1837లో మద్రాస్ క్రైస్తవ కళాశాలను స్థాపించిన వాడు?
ఎ) రాబర్ట్ నోబుల్ బి) అండర్సన్
సి) ట్రివెలియన్ డి) దిన్షావాచ
4. ఏ చట్టం ద్వారా ఆరుగురు న్యాయ మూర్తులతో అత్యున్నత ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు?
ఎ) 1892 చట్టం బి) 1909చట్టం
సి) 1919 చట్టం డి) 1935 చట్టం
5. చార్లెస్ ఉడ్ కమిటీ సిఫార్స్ల ద్వారా ఏర్పడిన తొలి విశ్వవిద్యాలయం?
ఎ) కలకత్తా విశ్వవిద్యాలయం
బి) బొంబాయి విశ్వవిద్యాలయం
సి) మద్రాస్ విశ్వవిద్యాలయం
డి) పైవన్నీ
6. గులాం రసూల్ఖాన్ను ఆంగ్లేయులు ఓడించి కర్నూలును ఆక్రమించిన సంవత్సరం?
ఎ) 1839 బి) 1842 సి) 1846 డి) 1836
7. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు చేసిన సంవత్సరం?
ఎ) 1842 బి) 1849 సి) 1846 డి) 1841
8. బ్రిటీష్ సైన్యంలో ఆంగ్లేయ సైనికులు కేవలం ఎంత శాతం కలరు?
ఎ) 10% బి) 20% సి) 30% డి) 5%
9. సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆగ్రా ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు?
ఎ) కున్వర్ సింగ్ బి) రావు సాహెబ్
సి) అమర్సింగ్ డి) మాన్సింగ్
10. హైదరాబాద్లోని మక్కా మసీదులో ఆంగ్లేయులు ఇస్లాం శత్రువులని, వారిని తరిమివేయాలని పిలుపు నిచ్చిన తిరుగుబాటు దారుడు?
ఎ) మాల్వీ అల్లావుద్దీన్ బి) తుర్రేబాజ్ఖాన్
సి) జనరల్ భక్తిఖాన్ డి) మౌల్వీ ఆహ్మదుల్లా
11. రెసిడెంట్ డేవిడ్సన్పై హత్యాప్రయత్నం చేసిన తిరుగుబాటు దారుడు?
ఎ) జహంగీర్ఖాన్ బి) మీర్ఫిదాఅలీ
సి) షేర్ అలీ డి) రసూల్ ఖాన్
12. ఇంగ్లాండ్ పార్లమెంట్లో 'రాయల్ టైటిల్స్యాక్ట్' చట్టం ఆమోదించిన సంవత్సరం ఏది?
ఎ) 1866 బి) 1877
సి) 1891 డి) 1874
13. హైదరాబాద్ నిజాం మహబూబ్ ఆలీకి మైనారిటీ తీరిన తర్వాత అధికారాన్ని అప్పగించిన వైశ్రారు ఎవరు?
ఎ) రిప్పన్ బి) డల్హౌసీ
సి) కర్జన్ డి) లాన్స్డౌన్
14. టిబెట్ యుద్ధ కాలం నాటి టిబెట్ పాలకుడు ఎవరు?
ఎ) 12వ దలైలామా బి) 13వ దలైలామా
సి) 10వ దలైలామా డి) 9వ దలైలామా
15. మెసపటోమియన్ కమిషన్ రిపోర్ట్ వల్ల రాజీనామా చేసిన వైశ్రారు ఎవరు?
ఎ) ఛేమ్స్ఫర్డ్ బి) ఇర్విన్
సి) హర్డింజ్ డి) రీడింగ్
16. లిన్లిత్గో కాలంలో జరిగిన సంఘటనలకు సంబం ధించి సరైనది ఏది?
ఎ) 1937 శాసనసభ ఎన్నికలు
బి) 1942 క్రిప్స్ రాయబారం
సి) 1940 వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం
డి) పైవన్నీ సరైనవే
17. వేవెల్ కాలంలో జరిగిన సంఘటనలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి?
ఎ) 1945 సిమ్లా సమావేశం
బి) 1946 రాజ్యాంగ సభ ఏర్పాటు
సి) 1946 బొంబాయి నావికుల తిరుగుబాటు
డి) పైవన్నీ సరైనవే
18. స్వరాజ్యపార్టీ స్థాపించిన సంవత్సరం ఏది?
ఎ) 1922 బి) 1932 సి) 1944 డి) 1927
19. రామ్మోహన్రారు కలకత్తాలో బ్రహ్మ మందిరాన్ని నిర్మించిన సంవత్సరం ఏది?
ఎ) 1825 బి) 1818
సి) 1830 డి) 1833
20. బ్రహ్మసమాజ ప్రధాన ఆచార్యుడిగా దేవేంద్రనాథ్ ఠాగూర్ నియమించిన 24 సంవత్సరాల యువకుడు ఎవరు?
ఎ) కేశవ చంద్రసేన్ బి) శివనాథశాస్త్రి
సి) పండిట్ రామచంద్ర డి) కందుకూరి
21. కన్యాశుల్కం, బాల్యవివాహాలు, మితిమీరిన పెండ్లి ఖర్చులను విమర్శిస్తూ కందుకూరి రచించిన హాస్య నాటిక ఏది?
ఎ) రాజశేఖర చరిత్ర బి) బ్రహ్మవివాహం
సి) సత్యసంవర్ధిని డి) సతీహితబోధిని
22. రఘుపతి వెంకటరత్నం నడిపిన పత్రిక ఏది?
ఎ) పీపుల్స్ ఫ్రెండ్ బి) బ్రహ్మప్రకాశిక
సి) ఫెలోవర్కర్ డి) పైవన్నీ
23. దేశిరాజు పెద బాపయ్య సంస్కరణోద్యమానికి కేంద్రం ఏది?
ఎ) కాకినాడ బి) పిఠాపురం
సి) రాజమండ్రి డి) గుంటూరు
24. మహిళాభ్యుదయానికి 'ఆర్య మహిళా సమాజం'ను స్థాపించింది ఎవరు?
ఎ) జ్యోతిరావుపూలే బి) పండిట్ రమాబాయి
సి) బి.ఎం.నులబారీ డి) పండిట్ సరస్వతి
25. ఈ కింది వారిలో స్వామి దయానంద సరస్వతి అనుచరుడు ఎవరు?
ఎ) పండిట్ దేవరాజ్ బి) స్వామి శ్రద్ధానంద
సి) పండిట్ దేవరాజ్ డి) పైవారందరూ
26. గిడుగు రామ్మూర్తి తెలుగులో నడిపిన పత్రిక ఏది?
ఎ) ఆంధ్రప్రభ బి) ఎడిటర్
సి) ఆంధ్రభూమి డి) కృష్ణ పత్రిక
27. తెలుగులో వెలువడిన తొలి పిల్లల పత్రిక ఏది?
ఎ) చిన్నారి బి) శశిరేఖ
సి) బాల డి) సందడి
28. కేంబ్రిడ్జ్ కాలేజి విద్యార్థి యూనియన్కు ఉపాధ్య క్షుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు?
ఎ) కట్టమంచి రామలింగారెడ్డి
బి) గణేశ్ వాసుదేవ్జోషి
సి) సుబ్రమణ్య అయ్యర్ డి) ఫిరోజ్షా మెహతా
29. ఈ కింది వారిలో 'భూస్వామ్య సంస్థ'ను స్థాపించిన వాడు ఎవరు?
ఎ) సత్యేంద్రనాథ్ ఠాగూర్ బి) విలియం ఆడమ్స్
సి) ద్వారకానాథ్ ఠాగూర్ డి) రంగయ్య నాయుడు
30. ఒక జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటు కొరకు కలకత్తాలో జాతీయ సమావేశాన్ని నిర్వహించిన వారు?
ఎ) బద్రుద్దీన్ త్యాబ్జీ బి) దాదాబాయి నౌరోజీ
సి) గోపాలకృష్ణ గోఖలే డి) సురేంద్రనాథ్ బెనర్జీ
31. మితవాదులు కోర్కెల సాధనకు అనుసరించిన విధానం?
ఎ) ప్రార్థన బి) విజ్ఞప్తి
సి) నిరసన డి) పైవన్నీ
32. 'రక్తధారలతోనే మాతృదేశానికి విముక్తి కలుగు తుంది' అనే నినాదం ఇచ్చింది ఎవరు?
ఎ) భగత్సింగ్ బి) అరబిందోఘోష్
సి) తిలక్ డి) లాలాలజపతిరారు
33. ఇంగ్లాండ్లో బిపిన్ చంద్రపాల్ నడిపిన పత్రిక ఏది?
ఎ) స్వరాజ్య బి) పీపుల్స్
సి) కేసరి డి) సమాచార్
34. బెంగాల్లోని 'బారాసాల్' ప్రాంతంలో స్వదేశీ ఉద్య మాన్ని ఉధృతంగా నడిపిన వాడు ఎవరు?
ఎ) అబ్దుల్ రసూద్ బి) లియాఖత్హుస్సేన్
సి) అశ్వనీకుమార్ దత్తా డి) సరళాదేవి
35. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రలో పర్యటించిన సంవత్సరం?
ఎ) 1907 బి) 1905 సి) 1908 డి) 1903
36. తెనాలి బాంబు కేసులో జైలు శిక్షను పొందినవారు?
ఎ) బోడి నారాయణరావు
బి) గాడిచర్ల హరిసర్వోత్తమరావు
సి) చిన్నపరెడ్డి డి) లక్కిరాజు బసవయ్య
37. జాతీయ నాయకుల్ని విడుదల చేసి లక్నో కాంగ్రెస్ సమావేశ తీర్మానాన్ని స్వీకరించినవాడు?
ఎ) ఇర్విన్ బి) డిఫిన్
సి) మాంటేగ్ డి) మింటో
38. అనిబిసెంట్ పర్యటించిన ఆంధ్ర ప్రాంతం ఏది?
ఎ) కాకినాడ బి) రాజమండ్రి
సి) చిత్తూరు డి) పైవన్నీ
39. ఏ చట్టం ప్రకారం భారత రాజ్యకార్యదర్శి, అతని కౌన్సిల్ జీతాలను భారతదేశ ఆదాయం నుంచి కాకుండా ఇంగ్లాండ్ ప్రభుత్వం చెల్లించును?
ఎ) 1909 మింటో మార్లే చట్టం
బి) 1919 మాంటేగ్ ఛేమ్స్ఫర్డ్ చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి)1892 భారత కౌన్సిల్ చట్టం
40. వినాయక దామోదర సావర్కర్కు 'యావజ్జీవ శిక్ష'ను విధించి అండమాన్ జైలుకు తరలించమని ఆదేశించిన నాసిక్ జిల్లా న్యాయాధికారి ఎవరు?
ఎ) జాన్సన్ బి) జాక్సన్ సి) రాండ్ డి) కజిన్స్
41. 1919 సంస్కరణల ప్రతిపాదనలను పరిశీలించడానికి కాంగ్రెస్ ఏర్పరిచిన కమిటీ?
ఎ) చాపేకర్ కమిటీ బి) మహదేవ్ కమిటీ
సి) హసన్ ఇమామ్ కమిటీ
డి) లెఫ్టినెంట్ ఐరిష్ట్ కమిటీ
42. గదర్ పార్టీలో చేరిన దర్శి చెంచయ్య ఏ ప్రాంతానికి చెందినవాడు?
ఎ) నెల్లూరు బి) విజయవాడ
సి) భీమిలి డి) జగ్గయ్యపేట
43. చంపారన్ సత్యాగ్రహానికి గల మరొక పేరు?
ఎ) తెల్ల విప్లవం బి) పసుపు విప్లవం
సి) ఎర్ర విప్లవం డి) నీలివిప్లవం
44. జూలు తిరుగుబాటులో ఇంగ్లాండ్కు మద్దతిచ్చిన భారతీయుడు ఎవరు?
ఎ) గాంధీ బి) సురేంద్రనాద్ బెనర్జీ
సి) తిలక్ డి) గోఖలే
45. హిందూ వివాహ పద్ధతులు చెల్లవని దక్షిణాఫ్రికా సుప్రీం కోర్టు తీర్పిచ్చిన సంవత్సరం ఏది?
ఎ) 1909 బి) 1911 సి) 1914 డి) 1914
46. పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ-డయ్యర్ను లండన్లో కాల్చి చంపిన యువకుడు ఎవరు?
ఎ) ఫజుల్ హక్ బి) శంకరన్ నాయర్
సి) ఉద్దంసింగ్ డి) సర్దార్ రావన్సింగ్
47. జామియామిలియా విద్యాసంస్థ మొదట ఆలీఘర్లో ఏర్పడి తర్వాత ఎచటకు మార్చబడింది?
ఎ) ముంబాయి బి) ఢిల్లీ
సి) కలకత్తా డి) ఉత్తరాఖండ్
48. జలియన్వాలాబాగ్ సంఘటనను విచారించడానికి కాంగ్రెస్ నియమించిన కమిటీలో సభ్యులు ఎవరు?
ఎ) సి.ఆర్.దాస్ బి) అబ్బాస్ త్యాబ్జీ
సి) ఎం.ఆర్.జయకర్ డి) పైవారందరూ
49. పల్నాడు సత్యాగ్రహం కాలంలో మించాలపాడు గ్రామం లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన గ్రామపెద్ద ఎవరు?
ఎ) ఉన్నవ లక్ష్మీనారాయణ
బి) పర్వతనేని వీరయ్య చౌదరి
సి) కన్నెగంటి హనుమంతు
డి) కొండా వెంకటప్పయ్య
50. బ్రిటీష్ రాజ్య పునాదులనే కదిలించిన ఉద్యమమని పెదనందిపాడు ఉద్యమం గురించి ఇంగ్లాండ్ పార్ల మెంట్లో ప్రకటించిన మద్రాస్ గవర్నర్ ఎవరు?
ఎ) విల్లింగ్టన్ బి) సర్ థామస్ మన్రో
సి) హెన్రీ కాటన్ డి) రూథర్ ఫర్డ్
51. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఏర్పరిచిన యువకుల దళం పేరేమిటి?
ఎ) శాంతిసేన బి) రామదండు
సి) లక్ష్మణ దండు డి) దుగ్గిరాల సేన
సమాధానాలు
1.ఎ 2.సి 3.బి 4.డి 5.డి
6.ఎ 7.సి 8.బి 9.సి 10.ఎ
11.ఎ 12.బి 13.ఎ 14.బి 15.సి
16.డి 17.డి 18.ఎ 19.సి 20.ఎ
21.బి 22.డి 23.సి 24.బి 25.డి
26.బి 27.సి 28.ఎ 29.సి 30.డి
31.డి 32.బి 33.ఎ 34.సి 35.ఎ
36.డి 37.సి 38.డి 39.బి 40.బి
41.సి 42.ఎ 43.డి 44.ఎ 45.డి
46.సి 47.బి 48.డి 49.సి 50.ఎ
51.బి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580