అంతర్జాతీయం
సౌదీలో విదేశీయులకు శాశ్వత నివాస పథకం
సంపన్నులైన విదేశీయులను ఆకర్షించడమే లక్ష్యంగా సౌదీ అరేబియా ప్రభుత్వం సరికొత్త శాశ్వత నివాస అనుమతి పథకాన్ని ప్రకటించింది. కొత్త పథకంలో భాగంగా సుమారు రూ.21 కోట్లు (8 లక్షల రియాళ్లు లేదా 2.13 లక్షల అమెరికా డాలర్లు) చెల్లిస్తే సౌదీలో శాశ్వత నివాస అనుమతి పొం దొచ్చు. రూ.27 లక్షలు (లక్ష రియాళ్లు లేదా 27వేల అమెరికా డాలర్లు) చెల్లిస్తే ఓ సంవత్సరం ఉండేందుకు అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
విక్టోరియాలో కారుణ్య మరణం చట్టబద్ధం
చికిత్సకు సైతం స్పందించని పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పౌరులు కారుణ్య మరణం కోసం అభ్యర్థించే అవకాశం ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో అందుబాటులోకి వచ్చింది. కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేస్తూ విక్టోరియా స్టేట్లో కొత్త చట్టాలు 2019 జూన్ 19న అమలులోకి వచ్చాయి. కోలుకోవడానికి వీలులేనంత తీవ్ర అనారోగ్యంతో, చికిత్సకు కూడా స్పందించలేని పరిస్థితుల్లో బాధపడుతున్న రోగులకు ఈ చట్టాల వల్ల హుందాగా కారుణ్య మరణం పొందే అవకాశం కలుగుతుందని విక్టోరియా ప్రధాని డేనియల్ ఆండ్రూస్ పేర్కొన్నారు.
వాల్మార్ట్కు 282 మిలియన్ డాలర్ల జరిమానా
భారత్ సహా 4 దేశాల్లో అవినీతి నిరోధక చట్టాలను ఉల్లం ఘించిన ఆరోపణలను సెటిల్ చేసుకునేందుకు గాను అమెరికన్ నియంత్రణ సంస్థలకు వాల్మార్ట్ 282 మిలి యన్ డాలర్ల పరిహారం చెల్లించనుంది. నిబంధనలకు విరు ద్ధంగా వాల్మార్ట్ తరఫున థర్డ్ పార్టీ మధ్యవర్తులు విదేశాల ప్రభుత్వాధికారులకు చెల్లింపులు జరపడం ద్వారా ఉల్లం ఘనలకు పాల్పడినట్లు అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) నిర్ధారించడమే ఇందుకు కారణం.
ప్రపంచపు తొలి మెగా ఆయిల్ ట్యాంకర్
ప్రపంచంలోనే తొలి ఇంటె లిజెంట్మెగా ఆయిల్ ట్యాం కర్ను చైనాకి చెందిన నౌక నిర్మాణ కంపెనీ డాలియన్ షిప్ బిల్డింగ్ ఇండిస్ట్రీ (డిఎస ్ఐసి) నిర్మించింది. ప్రపం చంలో తొలి స్మార్ట్ వెహికిల్ అయిన ఈ ట్యాం కర్కు న్యూ జర్నీ అని నామకరణం చేశారు. మూడు ఫుట్బాల్ మైదానాల పరిమాణంలో ఉండే ఈ ట్యాంకర్ 3,08,000 టన్నుల లోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అతి పెద్ద క్రూడ్ కెరీర్ (విఎల్సిసి) తరహాలకు చెందిన ఈ ట్యాంకర్లో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 300 మీటర్ల పొడవు ఉన్న న్యూ జర్నీ ఆటోపైలెట్ నావిగేషన్, ఇంటెలిజెంట్ లిక్విడ్ కార్గొ మేనేజ్మెంట్, ఇంటిగ్రెటెడ్ ఎనర్జీ ఎఫీషియన్సీ మేనేజ్మెంట్ల సహాయంతో నడుస్తుంది.
చమురు ఓడల రక్షణ మీ బాధ్యతే: ట్రంప్
గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణించే చమురు ఓడల రక్షణ బాధ్యత ఆయా దేశాలే చూసుకోవాలని, ప్రమాదకరమైన ఆ ప్రాంతం పై తమకు అంతగా ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 2019 జూన్ 24న తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేకుండా చూడటం, ఉగ్రవాదాన్ని ఆ దేశం ప్రోత్సహిం చకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. మరోవైపు ఇరాన్పై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు వీలు కల్పించే ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. దీని ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ, ఇతర ఉన్నతాధికారుల ఆర్థిక లావాదేవీలను అమెరికా నిరోధించనుంది.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్కు మద్దతు
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశా లను ఎంపిక చేసేందుకు నిర్వహించే ఎన్నికల్లో ఇండియా అభ్యర్థిత్వానికి 55 దేశాలతో కూడిన ఆసియా-పసిఫిక్ బందం ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ విషయాన్ని భద్రతా మండలిలో భారత శాశ్వత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ 2019 జూన్ 26న తెలిపారు. చైనా, పాకిస్తాన్లు కూడా ఈ ఆసియా-పసిఫిక్ దేశాల బదంలో ఉన్నాయి. భద్రతా మండలిలో 5 దేశాలకు శాశ్వత సభ్యత్వం ఉండగా, మరో 10 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం కల్పిస్తారు. ఎన్నికలను నిర్వహించడం ద్వారా ఆ పది తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకుంటారు. ప్రతి ఏడాదీ ఎన్నిక నిర్వహించి ఐదు దేశాలను ఎంపిక చేస్తారు. ఒకసారి ఎన్నికైతే ఆ దేశాలకు రెండేళ్లపాటు భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వం లభిస్తుంది. 2021- 22 సంవత్సరాలకుగాను తాత్కాలిక సభ్యత్వం పొందే దేశాలను ఎంపిక చేసేందుకు 2020 జూన్లో ఎన్నికలు జరుగుతాయి.
మెహుల్ చోక్సీని భారత్కు అప్పగిస్తాం: ఆంటిగ్వా
పంజాబ్ నేషనల్ బ్యాంకుకి రూ.14 వేల కోట్లు కుచ్చుటోపి పెట్టిన కేసులో పరారీలో ఉన్న నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్కు అప్పగిస్తామని ఆంటిగ్వా ప్రభుత్వం ప్రకటిం చింది. అతని పౌరసత్వాన్ని రద్దు చేస్తామని, న్యాయపర మైన ప్రక్రియ ముగిశాక భారత్కు అప్పగిస్తామని ఆంటిగ్వా ప్రధాని గ్యాస్టన్ బ్రౌనే 2019 జూన్ 25న వెల్లడించారు. పీఎన్బీలో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చాక చోక్సీ 2018 జనవరిలో పరారై ఆంటిగ్వాలో తలదాచుకుంటున్నాడు.
జాతీయం
జూలై 1 నుంచి జల్శక్తి అభియాన్
దేశవ్యాప్తంగా 2019, జులై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు (ఎంపిక చేసిన జిల్లాల్లో నవంబరు వరకు) 'జల్శక్తి అభియాన్ (జేఎస్ఏ)' అమలు చేయనున్నారు. జల్శక్తి అభియాన్లో భాగంగా దేశంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్ఛార్జులుగా సీనియర్ అధికారులను నియమిస్తూ 2019 జూన్ 26న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. జల్శక్తి అభియాన్ ద్వారా జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఎన్ఆర్సీ నుంచి లక్ష పేర్లు తీసివేత
అస్సాంలో జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ముసాయిదా నుంచి మరో 1,02,462 మందిని పేర్లను 2019 జూన్ 26న తొలగించారు. వివిధ కారణాల చేత వారందరూ భారత పౌరసత్వం పొందేందుకు అనర్హులని ఈ మేరకు ఎన్ఆర్సీ నుంచి తొలగించినట్లు ఎన్ఆర్సీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ప్రకటించారు. ఎన్ఆర్సీలో తమ పేర్లను చేర్చాలంటూ అస్సాంలో మొత్తం 3.29 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా, గతంలోనే 40 లక్షల మందిని అనర్హులుగా గుర్తించి వారి పేర్లను ఎన్ఆర్సీ ముసాయిదా నుంచి తొలగించారు. తాజాగా మరో లక్ష మంది పేర్లను తొలగించారు. 2019 జూలై 21న ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల కానుంది.
బాలాకోట్పై వైమానిక దాడులకు సంకేతనామం
పాకిస్థాన్లోని బాలాకోట్లో 'జైష్ ఎ మహ్మద్' ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాలపై 2019 ఫిబ్రవరి 26న జరిపిన వైమానిక దాడులకు భారత సైనిక దళాలు సంకేతనామాన్ని వినియోగిం చాయి. 12 మిరాజ్ -2000 యుద్ధవిమానా లతో బాలకోట్పై దాడి చేసిన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) 'ఆపరేషన్ బందర్(కోతి)' అని పేరు పెట్టింది. అదే సమయంలో పాకిస్థాన్ దాడులు చేస్తే తిప్పికొట్టడానికి గాను సరిహద్దుల వెంబడి మన సైన్యం భద్రతను బలోపేతం చేసింది. అత్యున్నతమైన కార్యాచరణ అప్రమత్తతను ప్రకటించింది. దీనికి 'ఆపరేషన్ జఫ్రాన్ (కుంకుమ పువ్వు)' అనే సంకేతనామం పెట్టింది. భారతీయ నావికాదళం మాత్రం ఎలాంటి సంకేత నామం పెట్టలేదు.
భారత్లో తొలి డైనోసార్ పార్క్ ప్రారంభం
భారతదేశంలోనే తొలిసారిగా రాక్షస బల్లుల శిలాజాల పార్కును గుజరాత్లోని మహి సాగర్ జిల్లాలో ప్రారంభించారు. బాలా సినోర్ సమీపంలోని రారు యోలి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజరు రూపాని ప్రారంభించారు. పార్కు మన దేశంలోనే తొలి డైనోసార్ పార్క్ అని, ప్రపం చంలో మూడోదని తెలిపారు. బాలాసినోర్లో 1980 ప్రాంతంలో పలు డైనోసార్ శిలాజాలు, వాటి గుడ్లు దొరికాయి.
దేశంలోనే 'తొలి కట్టెల పొయ్యి రహిత గ్రామం' బాన్చా
ఉత్తర్ప్రదేశ్ బెతుల్ మున్సిపాలిటీ లోని బాన్చా గ్రామం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. బాన్చాలో ఉన్న 75 గహాల వారు వంటకు సౌర విద్యుత్తో పనిచేసే ఎలక్ట్రా నిక్ స్టవ్లనే వినియోగిస్తున్నారు. దేశంలోనే కట్టెల పొయ్యి రహిత గ్రామంగా బాన్చా గ్రామం గుర్తింపు పొందింది.
మోటార్ వాహనాల బిల్లుకు కేబినెట్ ఆమోదం
మోటార్ వాహనాల(సవరణ) బిల్లు-2019తో పాటు డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు-2019కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2019జూన్ 24న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డీఎన్ఏ బిల్లు ప్రకారం ప్రభుత్వం జాతీయ డీఎన్ఏ బ్యాంకు, ప్రాంతీయ డీఎన్ఏ బ్యాంకులను ఏర్పాటు చేస్తుంది. ఈ బ్యాంకుల్లో నేరం జరిగిన ప్రాంతంలోని డేటా, నిందితుల డేటా, అదశ్యమైన వ్యక్తుల డేటా, గుర్తుతెలియని మృతుల డేటాను విడివిడిగా నిర్వహించాలి. అలాగే డీఎన్ఏ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తారు. మరోవైపు వాహ నాలు నడిపేటప్పడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధించేలా మోటార్ వాహనాల (సవరణ) బిల్లు-2019ను రూపొందించారు.
మరాఠాలకు రిజర్వేషన్లు సబబే: బాంబే హైకోర్టు
మరాఠా వర్గానికి ప్రభుత్వ ఉద్యో గాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించింది. అయితే రిజర్వే షన్లను 16 శాతం బదులు రాష్ట్ర వెనుకబడిన కులాల కమిషన్ సూచించిన విధంగా 12 నుంచి 13 శాతం మధ్యలో ఉండేలా చూడాలని సూచించింది. మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై 2019 జూన్ 27న తుది తీర్పు వెలువరించింది.
అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించండి
అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోరు ప్రధాని మోడికి 2019 జూన్ 23న లేఖ రాశారు. మెడికల్ కాలేజీలకు అనుమతులిచ్చే విషయం లో ముడుపులు అందుకున్నారని జస్టిస్ శుక్లాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరిపేందుకు త్రిసభ్య అంతర్గత కమిటీని వేశారు. ఈ కమిటీ శుక్లాపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది. దీంతో శుక్లాను విధుల నుంచి తొలగించండని గొగోరు ప్రధానిని కోరారు.
చెల్లింపుల డేటా భారత్లోనే ఉండాలి: ఆర్బీఐ
పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సంస్థలు (పీఎస్వో) చెల్లింపుల లావాదేవీల డేటా మొత్తం భారత్లోని సిస్టమ్స్లోనే భద్రపర్చాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మేరకు 2019 జూన్ 26న డేటా లోకలైజేషన్ నిబంధనలపై ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. అవసరమైతే డేటాను విదేశాల్లో ప్రాసెస్ చేయొచ్చని... కానీ దాన్ని 24 గంటల్లోగా భారత్కు మార్చాల్సి ఉంటుందని, విదేశీ సర్వర్ల నుంచి తొలగించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
ఆరోగ్య సూచీలో కేరళకు అగ్రస్థానం
నీతి ఆయోగ్ 2019 జూన్ 25న విడుదల చేసిన 'ఆరోగ్య వంతమైన రాష్ట్రాలు-అభివద్ధి భారతం' అనే సూచీలో కేరళకు అగ్రస్థానం లభించింది. కేరళ తర్వాతి స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. 2015-16 నుంచి 2017-18కాలంలో ఆరోగ్య పరిరక్షణకు ఆయా రాష్ట్రాలు తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ ఈ సూచీని రూపొందిం చింది. మొత్తం 23 అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును నీతి ఆయోగ్ అంచనా వేసింది. ఈ సూచీలో ఉత్తర ప్రదేశ్, బీహార్లు దిగువ స్థానాల్లో ఉన్నాయి. హరియాణా, రాజస్తాన్, జార్ఖండ్ అభివద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ముందున్నాయి.
59 శాతం రైతులకు రుణాలు అందడం లేదు
దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 59 శాతం రైతులకు రుణ పథకాలు అందడం లేదని గావ్ కనెక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రుణ పథకాల సమాచారం వారికి అందనందునే ఇలా జరుగుతోందని తేలింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్ సహా 19 రాష్ట్రాల్లోని 18 వేల మంది రైతులను సర్వే చేసి గావ్ కనెక్షన్ ఈ విషయాలను గుర్తించింది.
అమెరికా మత నివేదికపై భారత్ ఆగ్రహం
2018లో అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా 2019 జూన్ 21న విడుదల చేసిన నివేదికపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలోని ప్రజల రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడే హక్కు ఓ విదేశీ ప్రభుత్వానికి లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. భారత్లో మైనారిటీలపై హిందూ అతివాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ తన నివేదికలో చెప్పిన అంశాలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ జూన్ 23న ఖండించారు.
జీ20 సదస్సు-2019
జపాన్లోని ఒసాకాలో 2019 జూన్ 28న ప్రారంభమైన జీ20 సభ్యదేశాల సదస్సుకు ప్రధాని నరేంద్రమోడి హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేతో త్రైపాక్షిక చర్చల్లో ప్రధాని పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, మౌలిక వసతుల అభివద్ధిలో మెరుగైన సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్లు మోడి తెలిపారు. జూన్ 27న జపాన్లోని ఓసాకా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని షింబో అబేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జపాన్ పర్యటనలో భాగంగా కోబే నగరంలో జూన్ 27న భారత సంతతి ప్రజలతోనూ మోదీ సమావేశమయ్యారు.
ప్రధాని మోడీతో అమెరికా మంత్రి సమావేశం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో 2019 జూన్ 26న జరిగిన ఈ సమావేశంలో ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ భేటీ సందర్భంగా నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో, ఉగ్రవాద వ్యతిరేకపోరులో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించాయి.
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా టంకశాల అశోక్
సీనియర్ పాత్రికేయుడు, రచయిత టంకశాల అశోక్ను సీఎం కేసీఆర్ తెలం గాణ ప్రభుత్వ సలహాదారుగా నియమిం చారు. ఆయనను అంత ర్రాష్ట్ర సలహా దారుగా నియమిస్తూ 2019 జూన్ 25న ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతర్రాష్ట్ర సలహాదా రుగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వ్యవహరించేవారు.
తెలంగాణ 'మీ సేవ'తో ఎన్పీసీఐ ఒప్పందం
తెలంగాణ ప్రభుత్వంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) ఒప్పం దం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, తెలంగాణ ప్రభుత్వ అధికారిక సేవల పోర్టల్ 'మీ సేవ' వినియోగదారులకు యూపీఐ కలెక్ట్ ఆప్షన్తో పాటు రూపే డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపుల సౌకర్యం అందుబాటులోకి రానుంది. మీ సేవ పోర్టల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 150కి పైగా సేవలందిస్తోంది.
ఉపాధి హామీ ర్యాంకులు వెల్లడించిన కేంద్రం
గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో రాజన్న సిరిసిల్ల జిల్లా, వికారాబాద్ జిల్లాలు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును సాధించాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ర్యాంకులు విడుదల చేసింది. సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు సగటున రోజుకు రూ. 176.5 పైసలు కూలీ చెల్లిస్తుండగా 53.9 సగటు పని దినాలను కల్పించారు. వంద రోజులు పని కల్పించిన జిల్లాల్లో సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో, ఏడు రోజుల లోపు కూలీల పనుల వివరాలను అప్లోడ్ చేయడంలో ప్రథమ స్థానంలోనూ నిలిచింది. ఉపాధిహామీ పనులను జియో ట్యాగింగ్ చేయడంలోనూ పనితీరు కనిపించింది. మూడో స్థానంలో నిర్మల్, నాలుగో స్థానంలో మెదక్, 5,6,7 స్థానాల్లో సిద్ధిపేట, వనపర్తి, రంగారెడ్డి జిల్లాలు నిలిచాయి.
ఆస్పత్రి కాన్పుల్లో తెలంగాణకు అగ్రస్థానం
నీతి ఆయోగ్ రెండో విడత ఆరోగ్య సూచీలో తెలంగాణకు 10వ స్థానం లభించింది. ఇది మొత్తం పనితీరు ఆధారంగా దక్కిన ర్యాంకు. 'పెరుగుతున్న పనితీరు' విభాగంలో 6వ ర్యాంకు సాధించింది. ఆస్పత్రి కాన్పుల్లో దేశంలో అగ్రభాగాన నిలిచింది.
ప్రాంతీయం
తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ.లక్షా 80వేల కోట్లు
2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.1,80,239 కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ అలీఖాన్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ అప్పు గత ఐదేళ్లలో 159 శాతం పెరిగిందని నిర్మలా చెప్పారు. 2014 జూన్ 2 నాటికి తెలంగాణ అప్పు రూ. 69,517 కోట్లుగా ఉంది.
పెద్దపల్లి జిల్లాకు స్వచ్ఛ సుందర శౌచాలయ పురస్కారం
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన స్వచ్ఛ సుందర శౌచాలయ పురస్కారానికి పెద్దపల్లి జిల్లా ఎంపికైంది. మరుగుదొడ్ల వినియోగం, సరైన రీతిలో వాటి నిర్వహణ, రంగులు వేసి బాగా ఉంచడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశవ్యాప్తం గా అనేక జిల్లాలు పోటీ పడగా తెలంగాణ నుంచి పెద్దపల్లికి చోటు దక్కింది. ప్రత్యేక కేటగిరీ విభాగంలో వరంగల్ అర్బన్ జిల్లాను ఎంపిక చేశారు. గతంలో 'స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్' కార్యక్రమ నిర్వహణలో దక్షిణ భారతదేశంలో ప్రథమ, దేశం మొత్తం మీద మూడో స్థానం సాధించిన పెద్దపల్లి జిల్లాకు తాజాగా 'స్వచ్ఛ సుందర శౌచాలయ పురస్కారం లభించింది.
వార్తల్లో వ్యక్తులు
బ్రిటన్లో ప్రధాన ఆర్థికవేత్తగా కుమార్ అయ్యర్
బ్రిటన్ ప్రభుత్వ పరిధిలోని విదేశీ, కామన్వెల్త్ కార్యాలయం లో ప్రధాన ఆర్థికవేత్తగా భారత సంతతికి చెందిన కుమార్ అయ్యర్ నియమితులయ్యారు. ఈ పదవిలో నియమితులైన తొలి భారత సంతతి వ్యక్తి కుమార్ అయ్యర్ ఇంతకు ముందు ముంబయిలో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్గా పనిచేశారు. విదేశీ విధానాల రూపకల్పనలో ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఆయన సూచనలు ఇస్తారు. ఆయన బాల్యం భారత్లోనే గడిచింది. తమిళం, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంది.
ఎఫ్ఎఓ డెరైక్టర్ జనరల్గా చైనా మంత్రి
ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఎఓ) డెరైక్టర్ జనరల్గా చైనా వ్యవసాయ, గ్రామీణాభివద్ధి శాఖ ఉప మంత్రి క్యూ డోంగ్యూ ఎన్నికయ్యారు. దీంతో ఎఫ్ఎఓ సారథిగా ఎన్నికైన తొలి చైనా వ్యక్తిగా క్యూ గుర్తింపు పొందారు. ఎఫ్ఎఓ 41వ వార్షిక సదస్సు సందర్భంగా 2019 జూన్ 23న నిర్వహించిన ఓటింగ్లో క్యూకు మొత్తం పోలయిన 191 ఓట్లలో 108 ఓట్లు లభించాయి. 2019, ఆగస్టు 1న క్యూ ఎఫ్ఎఓ డెరైక్టర్ జనరల్గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
'రా' ఛీప్గా సామంత్ గోయెల్
విదేశీ నిఘా వ్యవహారాలను పర్య వేక్షించే కీలక విభాగమైన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) ఛీప్గా సామ్ంత్ గోయెల్, ఇంటెలి జెన్స్ బ్యూరో(ఐబీ) డెరైక్టర్గా అరవింద్ కుమార్ నియమి తులయ్యారు. ఈ మేరకు 2019 జూన్ 25న ప్రధాని నరేంద్ర మోడి నేతత్వంలోని కమిటీ నిర్ణయం తీసు కుంది. ఈ ఇద్దరూ 1984 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన అధికారులు. సామంత్ పంజాబ్లో, అరవింద్ అసొం-మేఘాలయ కేడర్లో పని చేశారు.
షార్ డెరైక్టర్గా ఆర్ముగం రాజరాజన్
ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డెరైక్టర్గా ఆర్ముగం రాజరాజన్ నియమితుల య్యారు. ఈ మేరకు బెంగళూరు లోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి 2019 జూన్ 27న ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో షార్ డెరైక్టర్గా జూలై 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభారు స్పేస్ సెంటర్లో స్ట్రక్చర్స్, పీఎస్ఆర్వో విభా గంలో డిప్యూటీ డెరైక్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుత డెరైక్టర్ ఎస్.పాండ్యన్ జూన్ 30న పదవీ విరమణ చేయనున్నారు.
నీతి ఆయోగ్ సీఈఓ పదవీకాలం పొడిగింపు
నీతిఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ 2019 జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2021 జూన్ 30 వరకు నీతి ఆయోగ్ సీఈవోగా అమితాబ్ కొనసాగనున్నారు. 1980లో ఐఏఎస్కు ఎంపికైన అమితాబ్ కాంత్ 2016 ఫిబ్రవరి 17న నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు.
ఎన్హెచ్బీ ఎండీగా శారద కుమార్ హోతా
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ)గా శారద కుమార్ హోతాను నియమిస్తూ 2019 జూన్ 27న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుమార్ ఎన్హెచ్బీ ఎండీగా మూడేళ్ల పాటు కొనసాగు తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంతకుముందు కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థ కెన్ ఫిన్ హోమ్స్ జనరల్ మేనేజర్గా ఆయన సేవలందించారు.
ఏఎఫ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ స్వరూప్రెడ్డి
తెలంగాణ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ స్వరూప్రెడ్డి నియమి తులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్రెడ్డి 2019 జూన్ 27న జీవో 98 జారీ చేశారు. అలాగే ఏఎఫ్ఆర్సీ కమిటీ ఏర్పాటుతో పాటు సభ్యులను కూడా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2016-17 నుంచి 2018-19 వరకు ఆయనే ఏఎఫ్ఆర్సీ చైర్మన్గా వ్యవహరించారు.
భారతీయ తీర రక్షక దళం డీజీగా నటరాజన్
భారతీయ తీర రక్షక దళం డెరైక్టర్ జనరల్(డీజీ)గా తమిళనాడుకు చెందిన కె.నటరాజన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న రాజేంద్రసింగ్ పదవీ విరమణ కానున్న సందర్భంగా కొత్త డీజీగా నటరాజన్ 2019, జూలై 1 నుంచి కొనసాగుతారని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ 2019 జూన్ 25న ప్రకటించింది.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాళ్ రాజీనామా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా డాక్టర్ విరాళ్ ఆచార్య 2019 జూన్ 23న రాజీనామా చేశారు. తన మూడు సంవత్సరాల పదవీకాలం ఇంకో ఆరు నెలలు ఉండగానే ఆయన తన బాధ్యతలను విరమించారు. వ్యక్తిగత కారణాలే తన రాజీనామాకు కారణమని పేర్కొన్నారు. ఇదే కారణంగా చూపుతూ ఆర్బీఐ గవర్నర్గా రాజీనామా చేసిన ఉర్జిత్పటేల్ తర్వాత, బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఉన్నత పదవికి రాజీనామా చేసిన వ్యక్తిగా ఆచార్య ఉన్నారు.
రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి కన్నుమూత
ప్రముఖ తెలుగు కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి(83) 2019 జూన్ 28న హైదరాబాద్లో మృతి చెందారు. ఛాయాదేవి 1938 అక్టోబరు 13న రాజమహేంద్రవరం లో జన్మించారు. ఆమె భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా ప్రముఖ తెలుగు రచయిత. 1951-53 మధ్య నిజాం కళాశాలలో ఎం.ఏ. పూర్తి చేసిన ఛాయాదేవి స్త్రీవాద రచయిత్రిగా పేరు గాంచారు. ఆమె రాసిన 'బోన్ సారు బ్రతుకు' అనే కథను 2000 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. 2005లో 'తనమార్గం' అనే కథాసంకలనానికి ఛాయాదేవికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
గోవా ఉద్యమకారుడు మోహన్ రనడే కన్నుమూత
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, గోవా విముక్తి ఉద్యమ కారుడు మోహన్ రనడే(90) 2019 జూన్ 25న పుణెలో మృతి చెందారు. రనడేకు 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది.
రేడియో నాటక ప్రయోక్త శ్యామలదేవి కన్నుమూత
ఆకాశవాణి రిటైర్డు నాటక ప్రయోక్త ఎం.జి.శ్యామలదేవి(88) 2019 జూన్ 24న హైదరాబాద్లో మృతి చెందారు. శ్యామలదేవి కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మగా మరియు ఉదయ తరంగిణి నాటకంలో అమ్మ పాత్ర పోషించింది. ఈమె ప్రముఖ కాంగ్రెస్ నేత భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మనవరాలు. బందరు (మచిలీపట్నం) స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు.
నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత
నటి, దర్శకురాలు, ప్రముఖ నటుడు కష్ణ సతీమణి విజయ నిర్మల 2019 జూన్ 26న హైదరా బాద్లో మృతి చెందారు. 1946 ఫిబ్రవరి 20న ఆమె తమిళ నాడులో జన్మించారు. తనకు సినీ పరిశ్రమలో మొదటిసారి అవకాశమిచ్చిన విజయ స్టూడియోస్కు కతజ్ఞతగా విజయనిర్మలగా పేరు మార్చు కున్నారు. 1950లో మత్య్సరేఖ అనే తమిళ చిత్రం ద్వారా విజయనిర్మల తన ఏడో ఏటనే బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు (44) దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా ఆమె 2002లో గిన్నీస్ బుక్లో చోటు సంపాదించారు. తొలిసారి ఆమె 'మీనా' అనే చిత్రాన్ని 1971లో తెరకెక్కించగా.. అప్పటి నుంచి 2009 వరకూ మొత్తం 44 సినిమాలు తీశారు.
కవి మహాస్వప్న కన్నుమూత
ప్రముఖ సాహితీవేత్త, దిగంబర ఉద్యమ కవుల్లో ఒకరిగా పేరుగాంచిన మహాస్వప్న (79) ప్రకాశం జిల్లా లింగ సముద్రంలో 2019 జూన్ 25న మృతి చెందారు. తెలుగు సాహిత్యాన్ని 1960 ల్లో పెను కంపానికి గురి చేసిన ఆరుగురు దిగంబర కవుల్లో మహా స్వప్న ఒకరు. ఆయన అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు.
అవార్డులు
అస్కా సలోమీకి నైటింగేల్ నర్సెస్ పురస్కారం
ప్రభుత్వ వైద్యంలో నర్సింగ్ వత్తిలో విశేష సేవలందించి నందుకు అస్కా సలోమీకి అత్యున్నత పురస్కారం లభించింది. నర్సింగ్ వత్తిలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారంగా భావించే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అవార్డు-2019 ఆమెకు లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన ఈమె పేరును కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వశాఖ ఆమోదించింది. ఈ మేరకు 2019 జూన్ 27న దేశవ్యాప్తంగా పురస్కార గ్రహీతల జాబితాను విడుదల చేసింది. అస్కా సలోమీ 2009లో గాంధీ నర్సింగ్ కళాశాల నుంచి ప్రధానాచార్యులుగా పదవీ విరమణ పొందారు.
సైన్స్ AND టెక్నాలజి
ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం విజయవంతం
అమెరికాలోని కేప్ కెనవెరాల్లోగల కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ ఎక్స్ సంస్థ 2019 జూన్ 25న చేపట్టిన ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా 24 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు. డీప్స్పేస్ అటామిక్ క్లాక్, సౌర తెరచాప, హరిత ఇంధనాన్ని పరీక్షించే వ్యవస్థ అందులో ఉన్నాయి. మానవ అస్థికలను కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపారు. సౌరకాంతితో నడిచే వ్యోమనౌకగా ఇందులోని తెరచాప రికార్డు నెలకొల్పింది.
తొలి హెచ్ఆర్ హ్యూమనాయిడ్ రోబో
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టెక్ మహీంద్రా తొలి మానవ వనరుల హ్యూమనాయిడ్ రోబోను 2019 జూన్ 24న నోయిడా క్యాంపస్లో ప్రవేశ పెట్టింది. కె2గా పిలిచే ఈ హ్యూమనాయిడ్ను జూన్ ఆరంభంలో హైదరాబాద్ క్యాంపస్లో ఆవిష్కరించింది. తాజాగా నోయిడా ఎస్ఈజడ్ క్యాంపస్కు పరిచయం చేసింది. ఈ రోబో మానవ వనరులకు సంబంధించిన సాధారణ పనులన్నీ చేసి పెడు తుంది. హెచ్ఆర్ టీమ్కి సహాయపడుతుంది. అత్యాధునిక కత్రిమ మేధతో పని చేసే కె2 ఎలాంటి ఆదేశాలు అవసరం లేకుండానే ఇతరులతో సంభాషణ ప్రారంభిస్తుంది.
క్రీడలు
2026 శీతాకాల ఒలింపిక్స్కు ఇటలీ ఆతిథ్యం
2026లో జరగనున్న శీతాకాల ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్కు ఇటలీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బక్ 2019 జూన్ 25న ప్రకటించారు. ఈ క్రీడల ఆతిథ్యం కోసం ఇటలీ, స్వీడన్ బిడ్ దాఖలు చేయగా, ఎక్కువ మంది ఐఓసీ సభ్యులు ఇటలీకే ఓటేశారు. 2026 ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు వింటర్ ఒలింపిక్స్, మార్చి 6 నుంచి 15 వరకు వింటర్ పారాలింపిక్స్ జరగనున్నాయి. ఇటలీలోని మిలానో, కార్టినా నగరాల్లో వీటిని నిర్వహించనున్నారు. ఇప్పటివరకు ఇటలీ రెండుసార్లు 1956, 2006లో వింటర్ ఒలింపిక్స్ను నిర్వహించింది.
టీటీ టోర్ని సింగిల్స్ విజేతగా శ్రీజ
జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టీటీ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణకి చెందిన ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. హర్యానాలోని సోనెపట్లో 2019 జూన్ 27న ముగిసిన ఈ టోర్నిలో ఆర్బీఐ తరుపున బరిలోకి దిగిన శ్రీజ ఫైనల్లో సుతీర్థ ముఖర్జీ (హర్యానా)పై విజయం సాధించింది. దీంతో శ్రీజ తొలిసారి సీనియర్ స్థాయిలో విజేతగా నిలిచినట్లయింది. అలాగే జాతీయ ర్యాంకింగ్ టీటీ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించిన తొలి తెలంగాణ అమ్మాయిగా కూడా శ్రీజ గుర్తింపు పొందింది.
వన్డే ర్యాంకుల్లో భారత్కు అగ్రస్థానం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2019 జూన్ 27న విడుదల చేసిన వన్డే ర్యాంకుల జాబితాలో భారత్కు అగ్ర స్థానం లభించింది. ఈ జాబితాలో 123 పాయింట్లతో భారత్ మొదటి స్థానంలో నిలవగా ఇప్పటివరకు టాపర్గా ఉన్న ఇంగ్లండ్ 122 పాయింట్లతో రెండో స్థానానికి పడి పోయింది. న్యూజిలాండ్ (114), ఆస్ట్రేలియా (112) వరు సగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికే భారత్ టెస్టుల్లో అగ్రస్థానంలో ఉంది.
భారత కెప్టెన్ కోహ్లి మరో రికార్డు
టీమ్ ఇండియా సారథి కోహ్లి తాజాగా మరో ఘనత సాధించాడు. దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండుల్కర్, బ్రయాన్ లారాల పేరిట ఉన్న ఉమ్మడి రికార్డును అధిగమించి, అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 20 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. 417 ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లి ఘనత సాధించాడు. సచిన్, లారా ఇద్దరూ 453 ఇన్నింగ్స్ల్లోనే 20 వేల క్లబ్లోకి అడుగు పెట్టాడు. వన్డేల్లో 232 మ్యాచ్ లాడి 11,159 పరుగులు చేసిన కోహ్లి 11 టెస్టుల్లో 6613 పరుగులు, 67 టీ20ల్లో 2263 పరుగులు సాధించాడు.
Authorization