1. ఏ చట్టం ద్వారా కొన్ని ప్రాంతాలను భారతదేశంలో బ్రిటీష్ పాలన ప్రాంతాలు అని పేర్కొన్నారు?
ఎ) 1784 పిట్స్ ఇండియా చట్టం
బి) 1773 రెగ్యులేటింగ్ చట్టం
సి) 1793 చార్టర్ చట్టం డి) 1813 చార్టర్ చట్టం
2. మార్క్స్ మరియు ఎంగెల్స్లు ఏ చట్టాన్ని 'భారత దేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసినది'గా అభివర్ణించారు?
ఎ) 1813 చార్టర్ చట్టం
బి) 1784 పిట్స్ ఇండియా చట్టం
సి) 1833 చార్టర్ చట్టం
డి) 1773 రెగ్యులేటింగ్ చట్టం
3. భౌగోళిక పరిశోధన రంగం నందు మొదటిసారిగా ప్రవేశించిన దేశం?
ఎ) లండన్ బి) డెన్మార్క్
సి) పోర్చుగల్ డి) ఆస్ట్రేలియా
4. పోర్చుగీసు వారిని ఓడించి బేసిన్, సాల్సెట్టి వర్తక స్థావరాలను ఆక్రమించిన మహారాష్ట్ర పీష్వా ఎవరు?
ఎ) విశ్వనాథ్రావు బి) మాధవరావు
సి) నారాయణరావు డి) బాజీరావు
5. బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీలు మరియు మిలటరీ ప్రభుత్వాలపై గవర్నర్ జనరల్కు పూర్తి అధికారం కల్పించిన చట్టం ఏది?
ఎ) 1793 చార్టర్ చట్టం బి) 1813 చార్టర్ చట్టం
సి) 1833 చార్టర్ చట్టం
డి) 1909 మింటో-మార్లే చట్టం
6. భారతదేశంలో ఆంగ్లేయ పాలనను కేంద్రీకరించిన చట్టం ఏది?
ఎ) 1833 చార్టర్ చట్టం
బి) 1909 మింటో-మార్లే చట్టం
సి) 1919 మాంటేగ్ ఛేమ్స్ఫర్డ్ చట్టం
డి) 1784 పిట్స్ ఇండియా చట్టం
7. ఏ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ను భారతదేశంలో బానిస విధానాన్ని రద్దు పరచడానికి చర్యలు తీసుకోవ లసిందిగా ఆదేశించడమైంది?
ఎ) 1919 మాంటేగ్ ఛేేమ్స్ఫర్డ్ చట్టం
బి) 1833 చార్టర్ చట్టం
సి) 1813 చార్టర్ చట్టం
డి) 1773 లెగ్యులేటింగ్ చట్టం
8.'The act for the good government of india' గా పిలిచిన చట్టం ఏది?
ఎ) 1856 భారత ప్రభుత్వ చట్టం
బి) 1909 చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) 1947 భారత ప్రభుత్వ చట్టం
9. ''ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం లాంటిది'' అని అభిప్రాయపడిన వారు ఎవరు?
ఎ) అసఫ్ ఆలీ
బి) జోగిందర్నాథ్ మండల్
సి) గజ్నఫ్ర్ ఆజాంఖాన్
డి) బల్దేవ్ సింగ్
10. రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించినది అని అన్నది ఎవరు?
ఎ) లార్డ్ సైమన్ బి) గ్రాన్ విల్లే ఆస్టిన్
సి) జస్టిస్ హిదయతుల్లా డి) ఐవర్ జెన్నింగ్స్
11. భారతదేశంలో పోర్చుగీసు అధికార స్థాపనకు మిక్కిలి కృషి చేసినవాడు ఎవరు?
ఎ) వాస్కోడిగామా
బి) మార్టిన్ అల్ఫన్సో డిసౌజా
సి) ప్రాన్సిస్ -డి-అల్మిడా
డి) అల్ఫన్సో -డి- అల్బుకర్క్
12. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) సివిల్ ప్రొసిజర్ కోడ్ -1859
బి) ఇండియన్ పీనల్ కోడ్ -1860
సి) క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ - 1861
డి) పైవన్నీ సరైనవే
13. ఎక్కడ జరిగిన సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా 'రాజ్యాంగ సభ' కొరకు డిమాండ్ చేసింది?
ఎ) ఫైజ్పూర్ బి) లక్నో
సి) లాహౌర్ డి) ముంబయి
14. భారత రాజ్యాంగం ''నూయి జెనిరస్'' అని వ్యాఖ్యా నించింది ఎవరు?
ఎ) అలెగ్జాండ్రోవిజ్ బి) రాబర్ట్ క్లాక్విల్
సి) కె.సి. వేర్ డి) ఐవర్ జెన్నింగ్స్
15. మొగల్ చక్రవర్తి 'ఫరూక్ సియార్' కు రోగాన్ని నయం చేసినందుకు బహుమానంగా డా. హమిల్టన్కు ఇచ్చిన గ్రామం ఏది?
ఎ) కాశీం బజార్ బి) గోవిందాపూర్
సి) సుతామతి డి) పైవన్నీ
16. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఫరూక్ సియార్ నుండి ఫర్మానా పొందిన సంవత్సరం ఏది?
ఎ) 1717 బి) 1714
సి) 1727 డి) 1737
17. అంబూరు యుద్ధంలో మరణించిన కర్ణాటక నవాబు ఎవరు?
ఎ) అన్వరుద్దీన్ బి) జాఫర్ జంగ్
సి) చందాసాహెబ్ డి) దోస్త్ ఆలీ
18. భారత దేశానికి రాజ్యాంగం అవసరమని మొదట గా సూచించిన వారెవరు?
ఎ) గాంధీ బి) నెహ్రూ
సి) మదన్మోహన్ మాలవ్య డి) అంబేద్కర్
19.బ్రిటీష్ చక్రవర్తి ఏ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం Ê రూపొందించిన శాసనాల మీద వీటో చేసే అధికారం కోల్పోయాడు
ఎ) 1935 భారత ప్రభుత్వ చట్టం
బి) 1919 భారత ప్రభుత్వ చట్టం
సి) 1947 భారత ప్రభుత్వ చట్టం
డి) 1909 భారత ప్రభుత్వ చట్టం
20. 1935 చట్టం నూతన బానిస విధానానికి నాంది వంటిది' అని అన్నది ఎవరు?
ఎ) గాంధీ బి) నెహ్రు
సి) విన్స్టన్ చర్చిల్
డి) మదన్ మోహన్ మాలవ్య
21. బక్సారు యుద్ధంలో పాల్గొన్నందుకు ఘజాఉద్దౌలా ఈస్టీండియా కంపెనీకి చెల్లించిన పరిహారం ఎంత?
ఎ) 70 లక్షలు బి) 90 లక్షలు
సి) 30 లక్షలు డి) 50 లక్షలు
22. హైదరాలీ ఎవరి సాయంతో దిండిగళ్ ప్రాంతంలో ఆధునిక ఆయుధాల కర్మాగారంను ఏర్పాటు చేశాడు?
ఎ) ఫ్రెంచ్ బి) బ్రిటీష్
సి) పోర్చుగీస్ డి) డెన్మార్క్
23. ఈ కిందివారిలో ఎవరికి ''షేర్-ఎ-మైసూర్ అనే బిరుదు కలదు?
ఎ) హైదరాలీ బి) టిప్పుసుల్తాన్
సి) హేస్టింగ్స్ డి) కారన్వాలీస్
24. ఏ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్కు స్థానిక శాస నాలపై వీటో అధికారాలు ఇవ్వడం జరిగింది?
ఎ) 1861 భారత కౌన్సిళ్ళ చట్టం
బి) 1919 మాంటేగ్ ఛేమ్స్ ఫర్డ్ చట్టం
సి) 1909 మింటో మార్లే చట్టం
డి) 1935 భారత ప్రభుత్వ చట్టం
25. 'స్వపరిపాలన దిశగా వేసిన నిజమైన ముందంజ'గా ఏ చట్టాన్ని అభివర్ణించవచ్చు?
ఎ) 1935 భారత ప్రభుత్వ చట్టం
బి) 1919 భారత ప్రభుత్వ చట్టం
సి) 1947 భారత ప్రభుత్వ చట్టం
డి) పైవన్నీ
26. ఏ చట్టం ద్వారా సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పేరును ఇంపీరియల్ లేజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చడం జరిగింది?
ఎ) 1919 భారత ప్రభుత్వ చట్టం
బి) 1935 భారత ప్రభుత్వ చట్టం
సి) 1909 భారత కౌన్సిళ్ళ చట్టం
డి) 1984 పిట్స్ ఇండియా చట్టం
27. అమృతసర్లో ''హరి మందిర్ సాహెబ్''ను నిర్మించి నది ఎవరు?
ఎ) గురు హరికిషన్
బి) గురు అర్జున్ సింగ్
సి) గురు హరగోవింద్ సింగ్
డి) గురు హరిరారు
28. సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఆంగ్ల భాషను తప్పనిసరి గా చేసినది ఎవరు?
ఎ) లార్డ్ హర్టింజ్ బి) డల్హౌసి
సి) వారెన్ హేస్టింగ్స్ డి) లార్డ్ మెకాలే
29. ప్రతి ఏటా వేలం వేసే పద్ధతి ద్వారా పన్నులను వసూలు చేయుటను రద్దు చేసినది ఎవరు?
ఎ) సర్జాన్ షార్ బి) వారెన్ హేస్టింగ్
సి) సర్ థామస్ మన్రో డి) లార్డ్ మేయో
30. ఈస్టీండియా కంపెనీ కాలంలో జమిందారీ విధానానికి బాగా కృషి చేసిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) కారన్ వాలీస్ బి) వెల్లస్లీ
సి) విలియం బెంటింక్ డి) పైవన్నీ
31. స్వర్గం నుండి దిగివచ్చిన సేనాని అని రాబర్ట్ క్లైవ్ను వర్ణించింది ఎవరు?
ఎ) విలియం పిట్ బి) విలియం బెంటింక్
సి) ఎల్ఫిన్ స్టోన్ డి) లార్డ్ మింటో
32. భారత్లో గవర్నర్ జనరల్ కాక ముందు అమెరికా స్వాతంత్య్ర యుద్ధంలో ఆంగ్లసేనలను నడిపి, జార్జి వాషింగ్టన్ చేతిలో పరాజయం పొందినది ఎవరు?
ఎ) లార్డ్వెల్లస్లీ బి) సర్జాన్షోర్
సి) కారన్వాలీస్ డి) లార్డ్ అమ్హరెస్ట్
33. ''సామంత నిబంధ నిరోధ విధానం'' ను ప్రవేశ పెట్టినది ఎవరు?
ఎ) లార్డ్ విలియం బెంటింక్ బి) లార్డ్ వెల్లస్లీ
సి) లార్డ్ మింటో డి) లార్డ్ హేస్టింగ్స్
34. ప్రాంతీయ భాషలను ఆస్థాన భాషలుగా మార్చిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) విలియం బెంటింక్ బి) మింటో
సి) ఆక్ లాండ్ డి) జార్జి బార్లో
35. బెంగాల్లో నీలిమందు విప్లవం ఏ గవర్నర్ జనరల్ కాలంలో సంభవించింది?
ఎ) చార్లెస్ మెట్కాఫ్ బి) కానింగ్
సి) డల్హౌసి డి) ఎలిబన్బరో
36. ఈ కింది వాటిలోసరైనది ఏది?
ఎ) చూర్ తిరుగుబాటు - 1799
బి) రంగాపూర్ తిరుగుబాటు - 1783
సి) బిష్నుపూర్ తిరుగుబాటు -1789
డి) పైవన్నీ సరైనవే
37. వేలు తంపి తిరుగుబాటు ఎప్పుడు జరిగింది?
ఎ) 1809 బి) 1806 సి) 1804 డి) 1801
38. దయారాం తిరుగుబాటుకు ముఖ్య కారణం ఏమిటి?
ఎ) శిస్తు చెల్లించక పోవడం
బి) రాజభరణముల రద్దు
సి) దత్తత అధికారాలు రద్దు
డి) న్యాయాధికారాల రద్దు
39. కిత్తూరి చెన్నమ్మ పేరు మీద ఒక తీర రక్షణ నౌకను భారత నౌకదళంలో ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ) 1936 బి) 1938 సి) 1934 డి) 1940
40. 'మెంటి' గిరిజన తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
ఎ) పశ్చిమ బెంగాల్ బి) అస్సాం
సి) బీహార్ డి) ఒరిస్సా
41. భారతదేశం ఒక చివరి నుంచి మరో చివరకి క్రైస్తవ పతాకం ఎగుర వేయడానికి దేవుడు హిందూస్థాన్ సామ్రాజ్య విస్తరణను ఇంగ్లాండుకు అప్పగించాడని అభిప్రాయపడినవారు ఎవరు?
ఎ) మాజెల్స్ బి) రూబెల్స్
సి) మెకాలే డి) హేస్టింగ్స్
42. రాజపుత్రుల సాంప్రదాయమైన స్త్రీ, శిశు హత్యలను నిషేదించే చట్టంను ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) నికల్సన్ బి) డల్హౌసి
సి) కానింగ్ డి) లార్డ్ వెల్లస్లీ
43. 1857 సిపాయి తిరుగుబాటు ''చేతులతో మన ఆజాద్ షాహిని పూడ్చిపెట్టవద్దు'' అని ప్రకటించింది ఎవరు?
ఎ) ఝూన్సీ లక్ష్మిబాయి బి) రావు సాహెబ్
సి) తాంతియా తోపే డి) బంద్రనవాబు
44. తాంతియా తోపేను ఒక గొప్ప గెరిల్లా యుద్ధ వీరుడుగా వర్ణించింది ఎవరు?
ఎ) మాన్సింగ్ బి) బీష్మా చార్యుడు
సి) మాలిసన్ డి) కున్వర్ సింగ్
45. 1857 సిపాయిల తిరుగుబాటును '' హిందూ ముస్లీం మత సంప్రదాయ వాదులు క్రైస్తవులపై చేసిన తిరుగుబాటు'' అని అన్నది ఎవరు?
ఎ) ఎస్.ఎస్. సేన్ బి) బెంజమన్ డిజ్రే
సి) లారెన్స్ డి) జప్రేలీ
సమాధానాలు
1.ఎ 2.బి 3.సి 4.డి 5.ఎ
6.ఎ 7.బి 8.ఎ 9.బి 10.ఎ
11.డి 12.డి 13.ఎ 14.ఎ 15.డి
16.ఎ 17.ఎ 18.సి 19.సి 20.ఎ
21.డి 22.ఎ 23.బి 24.ఎ 25.బి
26.సి 27.బి 28.ఎ 29.బి 30.డి
31.ఎ 32.సి 33.డి 34.ఎ 35.సి
36.డి 37.ఎ 38.ఎ 39.బి 40.బి
41.ఎ 42.డి 43.ఎ 44.సి 45.ఎ
46.బి 47.సి 48.ఎ 49.బి 50.ఎ
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580