అంతర్జాతీయం
అమెరికాకు వందనం : ట్రంప్ ప్రసంగం
అమెరికా స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా 'అమెరికాకు వందనం' పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా ప్రసంగించారు. 70 ఏళ్లలో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన తొలి అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. దేశ సైనిక శక్తిని చాటిచెప్పేలా భారీ కవాతుతో స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సిలో 2019 జూలై 4న నిర్వహించిన ఈ వేడకలకు వేలాదిమంది హాజర య్యారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, దేశ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ తదితరులు పాల్గొన్నారు. 1776 జులై 4న బ్రిటన్ నుంచి అమెరికా స్వాతంత్య్రం పొందింది.
గ్రీన్కార్డు కోటా బిల్లుకు అమెరికా ఆమోదం
గ్రీన్కార్డులను ఒక్కో దేశానికి గరిష్టంగా ఏడు శాతం మాత్రమే మంజూరు చేయాలన్న కోటా పరిమితిని ఎత్తివేసే బిల్లుకి అమెరికా ప్రతినిధుల సభ 2019 జూలై 11న ఆమోద ముద్ర వేసింది. ఫెయిర్నెస్ ఫర్ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ యాక్ట్ ఆఫ్ 2019 (హెచ్ఆర్ 1044) పేరుతో జోలాఫ్రెన్, కెన్బర్గ్లు 2019 ఫిబ్రవరిలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా కుటుం బాల ప్రాతిపదికన వలస వీసా కోటాను ఏడు నుంచి 15శాతానికి పెంచడంతో వలసదారులకు భారీగా ఊరట లభిస్తోంది. సెనేట్లోనూ ఈ బిల్లుకి ఆమోద ముద్రపడాల్సి ఉంది.
తైవాన్కు 220 కోట్ల డాలర్ల ఆయుధాలు
అబ్రామ్స్ టాంకులు, స్టింగర్ క్షిపణులు వంటి మొత్తం 220 కోట్ల డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలను తైవాన్కు విక్రయించే ఒప్పందానికి అమెరికా విదేశాంగశాఖ ఆమోదముద్ర వేసినట్లు పెంటగాన్ వెల్లడించింది. 108ఎం1ఎ2టి అబ్రామ్స్ ట్యాంకులు, 250కి పైగా స్టింగర్ క్షిపణులు, సంబంధిత సామగ్రి, ఇతర పరికరాలు, మద్దతు సేవలను ఒప్పందం ద్వారా తైవాన్కు అందజేయనున్నట్లు తెలిపింది. తైవాన్ను తమ భూభాగంగా పరిగణిస్తున్న చైనా ఈ ఒప్పందంపై ఇప్పటికే వ్యతిరేకతను అధికారికంగా తెలియజేసింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలు గాడితప్పిన నేపథ్యంలో తైవాన్కు ఆయుధ విక్రయాలు పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది.
గిరిజనుల తరలింపు నిలిపేయాలి: ఐరాస
అడవి తల్లిని నమ్ముకొని బతుకుతున్న 90 లక్షల మంది గిరిజనులను అడవుల్లో నుంచి తరలించే ప్రక్రియను నిలిపి వేయాలని ఐక్యరాజ్యసమితి నిపుణులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల విభాగం ప్రకటన విడుదల చేసింది. రక్షిత అటవీ ప్రాంతాలను ఆక్రమించడం వల్ల అడవులు అంతరించిపోతున్నాయంటూ వన్యప్రాణి సంరక్షణ సంస్థలు వేసిన కేసులో 2019 ఫిబ్రవరి 13న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం ఆదివాసీలను ఖాళీ చేయించేందుకు సిద్ధమైన విషయాన్ని గుర్తుచేసింది.
ఐక్యరాజ్యసమితి నివేదికపై భారత్ అభ్యంతరం
కశ్మీర్లో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం జారీచేసిన నివేదికపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దురుద్దేశాలు, అవాస్తవాలతో కూడిన ఈ నివేదిక.. పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదం అనే మూలాంశాన్ని విస్మరించిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే కశ్మీర్లో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు పాకిస్తాన్, ఇండియా ఏ చర్యలూ తీసుకోలేదని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది.
వ్యర్థాల ఉత్పత్తిలో అమెరికాకు అగ్రస్థానం
ప్రపంచంలోనే ఎక్కువగా వ్యర్థాలు ఉత్పత్తి చేసే దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచ సరాసరి కన్నా మూడు రెట్లు ఎక్కువగా తలసరి చెత్త వెలువడుతున్నట్లు 'వేస్ట్ జనరేషన్ ఇండెక్స్' అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనం పరిశీలించిన నాలుగు అంశాల్లోనూ అమెరికా పౌరులు, అక్కడి వ్యాపార సంస్థలే చెత్త సమస్యకు అతిపెద్ద కారకులుగా తేలింది. అమెరికాలో తలసరి వ్యర్థాలు 773 కిలోల మేర ఉన్నాయి. ప్రపంచ జనాభాలో 4శాతం వాటా ఉన్న అమెరికా.. 12 శాతం ఘనవ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది. అంతేకాదు.. వ్యర్థాల రీసైక్లింగ్లోనూ మిగతా దేశాలకంటే అమెరికా వెనుకబడి ఉంది.
ప్రకతి వైపరీత్యాలతో రూ.250 లక్షల కోట్ల నష్టం
1998-2017 మధ్య సంభవించిన ప్రకతి వైపరీత్యాల కారణంగా రూ.250 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష ఆర్థికనష్టం జరిగిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ మేరకు 2019 జూలై 9న సుస్థిర అభివద్ధి లక్ష్యాల నివేదిక 2019ను విడుదల చేసింది.
బ్రిటన్లో భారతీయులకే అధిక వేతనాలు
బ్రిటన్లో బ్రిటీషర్ల కంటే భారతీయులు, చైనీయులే అధిక మొత్తాల్లో జీతాలు అందుకుంటున్నారని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటస్టిక్స్ అనే సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 2019 జూలై 10న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం బ్రిటిషర్ల కంటే భారతీయులు 12 శాతం అధిక వేతనాలు అందుకుంటు న్నారు. భారతీయులు, చైనీయుల్లో వత్తి పరమైన నైపుణ్యంతో పాటు విద్యార్హతలు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. జీతాల విషయంలో మిగతా దేశాలకంటే బంగ్లాదేశీయులు బాగా వెనకబడి ఉన్నారు. నల్ల జాతీయులు, కరీబియన్ కార్మికులు బ్రిటిష్ కార్మికులతో దాదాపు సమానంగా జీతాలు అందుకుంటున్నారు.
మల్టీడైమన్షనల్ పావర్టీ ఇండెక్స్
భారత్లో దశాబ్ద కాలంలో 27.1 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడినట్టు ఐక్య రాజ్య సమితి వెల్లడిం చింది. ఈ మేరకు యూఎన్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ డీపీ), ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ ఇనిషియేటివ్ కలసిరూ పొందిం చిన బహుపార్శ్వపు పేదరిక సూచిక (మల్టీడైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ - ఎంపీఐ)ని జూలై 12న ఐరాస విడుదల చేసింది.
భారతదేశం వేగంగా పేదరికాన్ని తగ్గించగలుగుతోంది. జార్ఖండ్ వేగవంతమైన అభివద్ధి దిశగా సాగుతోంది. ఆ రాష్ట్రంలో పదేళ్ల(2005-6, 2015-16)కాలంలో పేదరికం 46.5 శాతం మేరకు తగ్గింది. ఇండియా, ఇథియోపియా, పెరూ దేశాలు పేదరికాన్ని తగ్గించడంలో చెప్పుకోదగ్గ రీతిలో ముందున్నాయి. 200 కోట్ల జనాభా గల 10 దేశాలు దశాబ్ది కాలంలో పేదరిక నిర్మూలన దిశగా చెప్పుకోదగ్గ ప్రగతి సాధించాయి. పై పది దేశాల్లో పట్టణ ప్రాంతాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాలు మరింత పేదరికం మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. 101 దేశాల సూచికలను ఎంపీఐలో పొందుపరిచారు. ఇందులో 31 స్వల్పాదాయ దేశాలు, 68 మధ్యాదాయ దేశాలు. ఆయా దేశాల్లో 130 కోట్ల మంది బహుముఖ పేదరికాన్ని అనుభవిస్తున్నారు.
జాతీయం
కౌశల్ యువ సంవాద్
యువతను నైపుణ్యాభివద్ధి సాధన దిశగా మరింతగా ప్రోత్స హించేందుకు, వారి ఆలోచనలను నేరుగా తెలుసుకునేందుకు ఉద్దేశించిన 'కౌశల్ యువ సంవాద్' కార్యక్రమాన్ని కేంద్ర నైపుణ్యాభివద్ధి మంత్రిత్వశాఖ ఢిల్లీలో 2019 జూలై 8 నుంచి 10 వరకు నిర్వహించింది. దేశ వ్యాప్తంగా ఉన్న నైపుణ్యాభివద్ధి శిక్షణ కేంద్రాల్లో యువతతో ముఖాముఖికి ఈ కార్యక్రమం ఓ వేదికలా పని చేస్తుంది.
తేజస్ ఎక్స్ప్రెస్ ప్రైవేటీకరణ
ఢిల్లీ-లక్నో మార్గంలో నడిచే తేజస్ ఎక్స్ప్రెస్తో పాటు మరో రైలును ప్రైవేటీకరించాలని 2016 లోనే రైల్వే శాఖ నిర్ణయిం చింది. ఈ మేరకు టైం టేబుల్ను 2019 జూలై 8న విడుదల చేసింది. దీంతో దేశంలో ప్రైవేటీ కరణ చేసిన తొలి రైలుగా తేజస్, తొలి రైలు మార్గంగా ఢిల్లీ-లక్నో మార్గం నిలవనుంది. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి టెండర్లను ఆహ్వానించి త్వరలోనే వారికి అప్పగించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ రైలు ప్రస్తుతం యూపీలోని ఆనంద్నగర్ రైల్వే స్టేషన్లో ఉంది.
ఐఆర్సీటీసితో రైల్ యాత్రి ఒప్పందం
భారత రైల్వేకు చెందిన ఐఆర్సీటీసితో ట్రావెల్ యాప్ రైల్ యాత్రి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పంద విషయాన్ని రైల్ యాత్రి సీఈవో మనీష్ రాఠీ 2019 జూలై 6న వెల్లడించారు. ఈ ఒప్పందంతో రైలు యాత్రి వినియోగ దారులకు పిఎన్ఆర్ స్టేటస్, లైవ్ ట్రైన్ స్టేటస్, స్టేషన్ల మధ్య రైలు, సీటు లభ్యత, కన్ఫర్మేషన్ లాంటి రైలు సంబంధిత సమాచారాన్ని అందజేయడానికి వీలు కలుగుతుంది.
విశాఖలో తీర గస్తీ దళానికి ఎయిర్ ఎన్క్లేవ్
తూర్పు తీరంలో విశాఖపట్నం కేంద్రంగా భద్రత చర్యలు చేపడుతున్న భారత తీర గస్తీ దళానికి 'ఎయిర్ ఎన్క్లేవ్'ను మంజూరు చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ 2019 జూలై 10న అనుమతులు జారీ చేసింది. హ్యాంగర్స్, యాప్రాన్, లింక్ ట్యాక్సీ ట్రాక్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు 5 ఎకరాల స్థల కేటాయింపు పూర్తయిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), తీరగస్తీ దళాలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని వెల్లడించాయి.
జన్ధన్ ఖాతాల్లో లక్ష కోట్ల డిపాజిట్లు
ప్రధానమంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం కింద ప్రారంభమైన 36.06 కోట్ల బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లు 2019 జూలై 3 నాటికి రూ.1,00,495.94 కోట్లకు చేరాయి. ఈ మేరకు జూలై 10న ఆర్థిక శాఖ గణాంకాలను విడుదల చేసింది. జూన్ 6 నాటికి ఈ డిపాజిట్లు రూ.99,649.84 కోట్లుగా ఉండగా, క్రమంగా పెరుగుతున్నట్టు తెలిపింది.
పోక్సో చట్టానికి కీలక సవరణలు
చిన్నారులను లైంగిక దాడులనుంచి కాపాడే చట్టం-2012 (పోక్సో)కు కేంద్ర కేబినెట్ పలు సవరణలు చేసింది. ఇకపై చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన జూలై 10న ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అద్దె చట్టం ముసాయిదా బిల్లు విడుదల
దేశంలో భవనాలు, స్థలాలను అద్దెకు ఇవ్వడానికి సంబంధించి పలు నిబంధనలను రూపొందిస్తూ 'అద్దె చట్టం' తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 2019 జూలై 11న అద్దె చట్టం ముసాయిదాను విడుదల చేసింది. ఈ ముసాయిదా బిల్లుపై ఆగస్టు 1లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలప వచ్చు. స్థల/భవన యజమా నులతో పాటు అద్దెకు ఉండేవారు నష్టపోకుండా ఉండటం కోసం కేంద్రం పలు నిబంధనలను ఈ బిల్లులో ప్రతిపాదించింది.
ద్వారకా క్షేత్రానికి ఐఎస్వో గుర్తింపు
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రానికి వరుసగా రెండో ఏడాదీ ఐఎస్వో గుర్తింపు లభిం చింది. ఈ క్షేత్రానికి వచ్చే భక్తు లకు రుచికరమైన, నాణ్యమైన ప్రసాదాలను అందిస్తున్నం దుకు హెచ్వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఐఎస్వో 22200 : 2018 ధ్రువ పత్రాన్ని అందించింది. చిన్న తిరుపతిగా పేరొందిన ద్వారకా తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు నిత్యం 10వేల నుంచి 15వేల మంది భక్తులు తరలివస్తుంటారు.
ప్రపంచ వారసత్వ నగరంగా జైపూర్
చారిత్రక నగరం, రాజస్థాన్ రాజధాని జైపూర్కు అరుదైన గుర్తింపు లభించింది. చారిత్రక కట్టడాలతో భార తీయ సంస్క తిని ప్రతిబింబించేలా ఉన్న ఈ నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా గుర్తిం చింది. ఈ మేరకు యునెస్కో 2019 జూలై 6న వెల్లడించింది. అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 43వ సదస్సులో జైపూర్ నామినేషన్ను పరిశీలించిన సభ్యులు ఈ నగరాన్ని ప్రపంచ వారసత్వ ప్రాంతాల జాబితాలో చేరుస్తున్నట్లు ప్రకటించారు.
నీరవ్మోడీకి రుణ రికవరీ ట్రిబ్యునల్ ఆదేశం
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)కు రూ.7,200 కోట్లు వడ్డీతో కలిపి చెల్లించాలని పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని రుణ రికవరీ ట్రిబ్యునల్ 2019 జూలై 6న ఆదేశించింది. పీఎన్బీని మోసం చేసిన కేసులో నీరవ్ ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నాడు. జూన్ 30, 2018 నుండి సంవత్సరానికి 14.30 శాతం వడ్డీతో రూ. 7,200 కోట్ల మొత్తాన్ని ఏకమొత్తంగా లేదా విడతలవారీగా దరఖాస్తు దారునికి (పీఎన్బీ) చెల్లించాలని ప్రతివాదిని, అతని భాగస్వాములను ఆదేశిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఉత్తర్వును వెలువరిస్తూ, జూలై 27, 2018 నుండి 16.20 శాతం వడ్డీతో రూ. 232 కోట్లు చెల్లించాలని న్యాయమూర్తి నీరవ్ని ఆదేశించారు.
ప్రభుత్వం చేతికి స్విస్ ఖాతాదారుల వివరాలు
స్విస్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారులందరి ఆర్థిక లావాదేవీల వివరాలు 2019, సెప్టెంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం చేతికి రానున్నాయి. 2018 ఏడాదిలో మూసివేసిన ఖాతాల వివరాలు కూడా లభించనున్నాయి. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) విధానం కింద భారత ప్రభుత్వానికి ఈ వివరాలు అందజేయనున్నట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ (ఎఫ్డీఎఫ్) 2019 జూలై 10న వెల్లడించింది. ఇప్పటికే ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న దాదాపు 100 మంది వ్యక్తులు, సంస్థల సమాచారాన్ని భారత్కు స్విట్జర్లాండ్ అందిస్తోంది. తాజా వివరాలు దీనికి అదనంగా ఉంటాయి.
బిహార్లో ట్రైన్ అంబులెన్స్ ప్రారంభం
బిహార్లో అత్యవసర చికిత్స అవసరమైన బాధితుల కోసం ట్రైన్ అంబులెన్స్ సేవలు ప్రారం భమయ్యాయి. బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీ వరకు ఈ అంబు లెన్స్ సేవలను 2019 జూలై 9న అందు బాటులోకి తెచ్చారు. రాజధాని ఎక్స్ప్రెస్లో ఏసీ-2 కోచ్ను ట్రైన్ అంబులెన్స్గా తీర్చిదిద్దామని, దీనిలో ఒక డాక్టరు, ఒక నర్సింగ్ స్టాఫ్ ఉంటారని సంబంధిత అధికారులు తెలిపారు. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా రోగులను న్యూఢిల్లీలోని ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు.
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం
జేడీఎస్, కాంగ్రెస్పార్టీలకు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు 2019 జూలై 6న తమ పదవులకు రాజీనామా చేయడంతో కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తంది. రాజీనామాలను స్పీకర్ అంగీకరిస్తే కుమారస్వామి నేతత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుంది. మొత్తం 224 మందిగల కర్ణాటక అసెంబ్లీకి 2018లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 104, కాంగ్రెస్కు 80, జేడీఎస్ 37 సీట్లు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 113 సీట్లు ఎవరికీ రాలేదు. దాంతో కాంగ్రెస్, జేడీఎస్లు పొత్తు కట్టాయి. ప్రస్తుతం కాంగ్రెస్, జేడీఎస్లకు కలిపి 118 మంది సభ్యుల బలం ఉంది.
యూపీలో మూకదాడులపై ముసాయిదా
మూకదాడులకు పాల్పడేవారికి యావజ్జీవ కారగార శిక్ష విధించేలా ప్రతిపాదిస్తూ ముసాయిదా బిల్లును ఉత్తర్ప్రదేశ్ న్యాయ కమిషన్ రూపొందించింది. ఈ ముసాయిదాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కు కమిషన్ చైౖర్మన్ జస్టిస్ (రిటైర్డ్) ఏఎన్ మిత్తల్ 2019 జూలై 11న సమర్పించారు. రాష్ట్రంలో గోసంరక్షకులు సహా పలువురు చేసిన మూకదాడులను కమిషన్ తన 128 పేజీల నివేదికలో ప్రస్తావించింది.
అయోధ్యపై నివేదిక ఇవ్వండి: సుప్రీంకోర్టు
అయోధ్య వివాదానికి సామ రస్యపూర్వక పరిష్కారం కనుగొనేందుకు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ బందం ఇంత వరకు ఏ మేరకు పురోగతి సాధించిందో వివరిస్తూ 2019 జులై 18లోగా నివేదిక సమర్పిం చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నివేదికను పరిశీలించాక మధ్యవర్తిత్వం వల్ల లాభం లేదని భావిస్తే జులై 25 నుంచి తామే కేసు విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోరుతో కూడిన ధర్మాసనం జూలై 11న స్పష్టం చేసింది. అవసరమైతే రోజువారీ విచారణ జరుపుతామనీ పేర్కొంది. మధ్య వర్తిత్వం వల్ల ఉపయోగం లేదని, న్యాయస్థానమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కక్షిదారుల్లో ఒకరు సుప్రీం కోర్టును ఆశ్రయించడం తెల్సిందే.
కలకత్తా హైకోర్టు స్వీయ జరిమానా
దిగువ కోర్టు జడ్జికి హైకోర్టు విధించిన తప్పనిసరి పదవీ విరమణ శిక్షను కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచి పక్కన పెట్టింది. అత్యంత అరుదుగా తనకుతానే లక్ష రూపాయల జరిమానా విధించు కుంది. సదరు జడ్జిని వెంటనే మళ్లీ ఉద్యోగంలో నియమించాలని జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్ సువ్రా ఘోష్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. కక్షిదారుడికి హైకోర్టు లక్ష రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. సీల్డా కోర్టులో రైల్వే మేజిస్ట్రేట్గా ఉన్న మింటూ మల్లిక్ను 2007లో సస్పెండ్ చేసి, 2013లో తప్పనిసరి పదవీవిరమణ శిక్ష విధించారు. సబర్బన్ రైలును తరచు ఆలస్యంగా నడుపుతున్నందుకు ఒక డ్రైవరును తప్పుబట్టినందుకు ఆయనకీ శిక్ష వేశారు. ఆయన అలా చేయడం ఒకవేళ తప్పే అయినా విధించిన శిక్ష చాలా ఎక్కువ, దిగ్బ్రాంతికరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దేశద్రోహం కేసులో వైగోకు ఏడాది జైలు
దేహద్రోహం కేసులో ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైగోకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తమిళనాడు ప్రత్యేక కోర్టు 2019 జూలై 5న తీర్పు వెలువరించింది. 2008లో ఓ కార్యక్రమంలో దేశం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2009లో అప్పటి డీఎంకే ప్రభుత్వం సెక్షన్ 124(ఎ) (దేశద్రోహం) సెక్షన్ 153 (మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష తదితర అంశాలతో ఇరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం) కింద ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టింది. ఈ కేసుపై జూలై 5న తీర్పు వెలువరించింది.
ప్రాంతీయం
హైదరాబాద్లో ఎస్అండ్పీ సెంటర్
అనలిటిక్స్, డేటా సర్వీసుల రంగంలో ఉన్న ఎస్అండ్పీ గ్లోబల్ హైదరాబాద్లో 2019 జూలై 11న కొత్త 'ఓరియన్' సెంటర్ను ప్రారంభించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రానికి రూ.70 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశామని కంపెనీ ఇండియా ఎండీ అభిషేక్ తోమర్ తెలిపారు. 700 మంది సపోర్ట్ సిబ్బంది ఓరియన్లో ఉన్నారని చెప్పారు. ఇప్పటికే ఎస్అండ్పీ గ్లోబల్కు హైదరాబాద్లో 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైటెక్ సిటీ వద్ద ఒక కార్యాలయం ఉంది.
వార్తల్లో వ్యక్తులు
15వ దలైలామాగా సత్యసాయి విద్యార్థి
బౌద్ధ మతగురువు 15వ దలైలామాగా సత్యసాయి విద్యార్థి దావావంగ్డి ఎంపికయ్యాడు. ప్రస్తుత 14వ దలైలామా తన తదుపరి దలైలామాగా దావావంగ్డిని వివిధ కోణాల్లో క్షుణ్నంగా పరిశీలించి ఎంపిక చేశారు. ఈ బాలుడు మైసూరు సమీపంలోని బైలుకుప్పే (గోల్డెన్ టెంపుల్) బౌద్ధారామంలో 15 ఏళ్ల పాటు శిక్షణ తీసుకున్న అనంతరం బాధ్యతలు స్వీకరిస్తాడు. పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్కు చెందిన ప్రేమవంగ్డి, పంజూరారు దంపతుల కుమారుడైన దావావంగ్డి పుట్టపర్తిలోని సత్యసాయి ప్రాథమిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. సాయిరాం అని పిలిస్తే పలుకుతానని దావావంగ్డి తన స్నేహితులతో చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు.
లోక్సభ సచివాలయ డెరైక్టర్గా రంగారావు
లోక్సభ సచివాలయంలోని పరిశోధన, సమాచార విభాగం డెరైక్టర్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన గుమ్మడిదల రంగారావు నియమితులయ్యారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓంబిర్లా 2019 జూలై 8న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ పదవిని అలంక రించిన తొలి తెలుగు వ్యక్తిగా రంగారావు నిలిచారు. ప్రకాశం జిల్లా బ్రాహ్మణ నిడమానూరుకి చెందిన రంగారావు ఢిల్లీలోని జవహర్లాల్నెహ్రూ విశ్వ విద్యాల యంలో ఉన్నత విద్యను అభ్యసించారు. ముప్ఫై ఏళ్ల పాటు పార్లమెంట్లో పని చేసిన అనుభవం ఉన్న ఆయన కొంత కాలం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివద్ధి శాఖలో పని చేశారు.
బీఎస్ఎన్ఎల్ సీఎండీగా ప్రవీణ్కుమార్
పభుత్వరంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్గా ప్రవీణ్కుమార్ పూర్వర్ నియమి తులయ్యారు. ఈ మేరకు 2019 జూలై 9న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఐదేళ్లపాటు సేవలందిం చనున్నారు. 2019 జూన్ 30న పదవీ విరమణ చేసిన అనుపమ్ శ్రీవాస్తవ స్థానాన్ని ప్రవీణ్కుమార్ భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(ఎంటీఎన్ఎల్) సీఎండీగా ప్రవీణ్ పనిచేస్తున్నారు.
బీహెచ్ఈఎల్ సీఎండీగా నలిన్ షింగల్
ప్రభుత్వరంగ ఇంజినీరింగ్ సంస్థ బీహెచ్ఈఎల్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్గా నలిన్ షింగల్ 2019 జూలై 9న బాధ్యతలు స్వీకరిం చారు. 2019 జూలై 1 నుంచి ఐదేళ్లు నలిన్ పదవీకాలం ఉండనుంది. జూన్ 30న పదవీ విరమణ చేసిన ఎంవీ గౌతమ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. ఇంతకు ముందు సెంట్రల్ ఎలక్టాన్రిక్స్ చైర్మన్గా ఎండీగా షింగల్ పనిచేశారు.
సైన్స్ AND టెక్నాలజి
చైనా అంగారక రోవర్ సిద్ధం
అంగారకుడిపైకి మొట్ట మొదటిసారిగా చేపడుతున్న యాత్ర కోసం రోవర్ నిర్మా ణాన్ని చైనా పూర్తి చేసింది. 2020లో ఈ రోవర్ను ప్రయోగించన్నట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రోవర్ ఏడు నెలలు ప్రయాణించి అంగారకుడి వద్దకు వెళుతుంది. ఈ యాత్రలో భాగంగా ఆ గ్రహ కక్ష్యలోకి ఆర్బిటర్ను, ఉపరితలం మీదకు ల్యాండర్, రోవర్ను చైనా పంపుతోంది. అంగారకుడి వాతావరణం, ఉపరితలం, అయస్కాంత క్షేత్రంపై పరిశోధనలు సాగిస్తోంది.
శిథిల భవనాలు గుర్తించే శాటిలైట్ ఆవిష్కరణ
భూమిపై శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను అంతరిక్షం నుంచే గుర్తించేలా శాటిలైట్ టెక్నాలజీని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఆవిష్కరించింది. నాసా జెట్ ప్రపల్షన్ ల్యాబరేటరీ 2019 జూలై 10న ఈ వివరాలను వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం.. 2018 ఏడాది ఆగస్టులో ఇటలీలో మోరండీ వంతెన కూలిపోయినప్పుడు పదుల సంఖ్యలో ప్రజలు మతిచెందారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరముందని బ్రిటన్, ఇటలీ దేశాలు నాసాను కోరడంతో.. పతనావస్థకు చేరిన బ్రిడ్జీలను గుర్తించేందుకు రాడార్ల సాయంతో నాసా ఈ శాటిలైట్ను రూపొందించింది.
క్రీడాంశాలు
ప్రపంచకప్ విజేత ఇంగ్లాండ్
ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాడ్ జట్టు విజయం సాధించింది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు స్కోర్లు సమానం కావడంతో మ్యాచ్ టై అయింది. దాంతో సూపర్ ఓవర్ బౌండరీలు ఆధారంగా విజేతను నిర్ణయించారు. ఇంగ్లాండ్కు కప్ రావడం ఇదే మొదటిసారి. కాగా వరల్డ్ కప్కు ఆతిధ్యం ఇచ్చిన దేశమే విజేతగా నిలవడం ఇది మూడో సారి.
భారత క్రికెట్ జట్టు వన్డే వరల్డ్కప్-2019 నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్లోని మాంచెస్టర్ వేదికగా 2019 జూలై 9, 10 తేదీల్లో జరిగిన సెమీఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.
చైనా మహిళల ఫుట్బాల్కు 995 కోట్లు విరాళం
చైనా మహిళల ఫుట్బాల్ జట్టును అన్ని రకాలుగా ఆదుకునేం దుకు విఖ్యాత అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు, చైనా కుబేరుడు జాక్ మా ముందుకొచ్చారు. చైనా మహిళల ఫుట్బాల్ అభివద్ధికి తన వంతుగా 100 కోట్ల యువాన్లు (రూ.995 కోట్లు) విరాళం ఇవ్వాలని నిర్ణయించారు. రాబోయే పదేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని చైనా మహిళల ఫుట్బాల్ రంగంపై వెచ్చిస్తారు. గాయపడిన క్రీడాకారిణీల చికిత్సకు, రిటైరయిన వారి జీవనోపాధికి, యువ క్రీడాకారిణీల అభ్యున్నతికి ఈ డబ్బును ఉపయోగించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చైనా పురుషుల ఫుట్బాల్ జట్టుకంటే మహిళల ఫుట్బాల్ జట్టు మెరుగ్గా రాణిస్తోంది.
క్రికెట్కు షోయబ్ మాలిక్ వీడ్కోలు
పాకిస్తాన్ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా భర్త షోయబ్ మాలిక్ అంతర్జాతీయ వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు 2019 జూలై 5న ప్రకటించాడు. 2019 ప్రపంచకప్లో మూడు మ్యాచ్లే ఆడిన అతను 8, 0, 0 పరుగులు చేశాడు. 1999లో తొలి వన్డే ఆడిన మాలిక్ 20 ఏళ్ల కెరీర్లో 287 వన్డేల్లో పాక్కు ప్రాతినిధ్యం వహించాడు. 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. 39.19 సగటుతో 158 వికెట్లు పడగొట్టాడు.
కామన్వెల్త్ చెస్ విజేతగా అర్జున్
కామన్వెల్త్ చెస్ చాంపియన్ షిప్లో భారత చెస్ క్రీడాకారుడు ఎరిగైసి అర్జున్ విజేతగా నిలిచాడు. న్యూఢిల్లీలో 2019 జూలై 9న ముగిసిన ఈ టోర్నమెంట్లో అర్జున్ (తెలంగాణ) ఆరు పాయింట్లతో అండర్-16 ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నాడు. అలాగే అండర్-14 బాలికల విభాగం లో ఆంధ్రప్రదేశ్కు చెందిన చిన్నం వైష్ణవి, అండర్-14 ఓపెన్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ గంపా ఆదిత్య, అండర్-20 బాలికల విభాగంలో మౌనిక అక్షయ కాంస్య పతకాలు గెలిచారు. సీనియర్ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్మాస్టర్ అభిజిత్ గుప్తా ఐదోసారి చాంపియన్గా నిలిచాడు. మహిళల విభాగంలో తానియా సచ్దేవ్ విజేతగా నిలిచింది.
సునీల్ ఛెత్రికి ఏఐఎఫ్ఎఫ్ అవార్డు
భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అరుదైన రికార్డు సాధించాడు. భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) ఏటా ప్రకటించే ఉత్తమ ఆటగాడి అవార్డును దక్కించుకున్నాడు. ఈ అవార్డు ఛైత్రికి లభించడం ఇది ఆరోసారి. 2007, 2011, 2013, 2014, 2017లో అతడు ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. కెరియర్లో మొత్తం 10 అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఛత్రి ప్రస్తుత తరం ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ చేసిన వారిలో క్రిస్టియానో రొనాల్డో(149) తర్వాత 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. 68 గోల్స్తో లయెనేల్ మెస్సీ 3వ స్థానంలో ఉన్నాడు.
- యన్.సంతోష్కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270
Authorization