1. ఋగ్వేద సాహిత్యంలో పేర్కొన్న నగరం ఏది?
ఎ) మొహంజదారో బి) హరప్పా
సి) కాళిభంగన్ డి) లోధార్
2. ఇటుకలతో నిర్మించిన కృత్రిమమైన ఓడరేవు గల ఏకైక సింధు నగరం?
ఎ) కోట్ జిజి బి) చన్హుదారో
సి) లోధాల్ డి) సుక్తాంజెర్
3. గుర్రపు ఎముకలు లభించిన ప్రాంతం ఏది?
ఎ) లోధార్ బి) సుర్కోటడా
సి) కాళిభంగన్ డి) పైవన్నీ
4. సప్త సింధూ ప్రాంతంలో ఆర్యులు మొదటగా స్థిరపడిన ప్రాంతం ఏది?
ఎ) పంజాబ్ బి) గుజరాత్
సి) రాజస్థాన్ డి) ఉత్తరప్రదేశ్
5. ఋగ్వేద కాలంలో వృద్ధులు, మేధావులను ఎంపిక చేసేది ఏది?
ఎ) సభ బి) రణం సి) సమితి డి) విధాత
6. ఋగ్వేదంలో 'నాగలి'ని ఏమని పేర్కొన్నారు?
ఎ) సిర బి) లాంగులా
సి) హల డి) పైవన్నీ
7. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) గోవికర్త - పశుసంవర్థకాధికారి
బి) తక్షణ్ - వడ్రంగి
సి) గ్రామేయ - గ్రామ శిస్తు వసూలు అధికారి
డి) పైవన్నీ
8. నీటి పారుదల గురించి పేర్కొన్న వేదం ఏది?
ఎ) ఋగ్వేదం బి) సామవేదం
సి) యజుర్వేదం డి) అధర్వణవేదం
9. మొట్టమొదటగా 'పునర్జన్మ' గురించి పేర్కొన్న బ్రాహ్మణం ఏది?
ఎ) శతపథ బ్రాహ్మణం బి) కౌషితకీ బ్రాహ్మణం
సి) ఐతరేయ బ్రాహ్మణం డి) తైత్తరీయ బ్రాహ్మణం
10. వేదకాలం నాటి ఆలోచనా ధోరణికి పరిపూర్ణతను కల్గించేవి?
ఎ) అరణ్యకాలు బి) ఉపనిషత్తులు
సి) వేదాలు డి) బ్రాహ్మణాలు
11. 'ఓంకార ధ్యానం' ఏ ఉపనిషత్తులో పేర్కొనబడింది?
ఎ) ప్రశ్నోపనిషత్తు బి) ఈశోపనిషత్తు
సి) కేనోపనిషత్తు డి) కఠోపనిషత్తు
12. 'రామాయణ కల్ప వృక్షం' గ్రంథ రచయిత ఎవరు?
ఎ) వావికొలను సుబ్బారావు
బి) విశ్వనాథ సత్యనారాయణ
సి) గోనబుద్దారెడ్డి డి) కంచర్ల గోపన్న
13. కురువంశంలో చివరివాడు ఎవరు?
ఎ) ఇంద్రసేనుడు బి) చిత్రసేనుడు
సి) ఉగ్రసేనుడు డి) జనమేజయుడు
14. ఈ కింది వాటిలో శాతవాహనుల గురించి తెలిపే పురాణం ఏది?
ఎ) వాయు పురాణం బి) బ్రహ్మాండ పురాణం
సి) మత్య్సపురాణం డి) పైవన్నీ
15. 'యతివృషభ' అను జైన గ్రంథంను రచించింది ఎవరు?
ఎ) వట్టకేరు కార్తీకేయ బి) హరిసేనుడు
సి) సోమదేవసూరి డి) కొండా కుందాచార్యులు
16. జైన మత ప్రచార భాష ఏది?
ఎ) సంస్కృతం బి) ప్రాకృతం
సి) తెలుగు డి) సింథీ
17. ఏ శాసనం ప్రకారం లుంబిని గ్రామాన్ని మౌర్య సామ్రాజ్యం మొత్తం ప్రాంతంలో పన్ను మినహా యింపు ప్రాంతంగా ప్రకటించారు?
ఎ) బబ్రూ శాసనం బి) రుమిందై శాసనం
సి) భట్టిప్రోలు శాసనం డి) తాటికొండ శాసనం
18. స్థవిరవాదుల మూల పురుషుడు ఎవరు?
ఎ) మహకాశ్యపుడు బి) మహాకాచ్ఛయన
సి) బుద్ధఘోశుడు డి) అజాత శత్రువు
19. త్రిపీఠకాలకు సంబంధించి సరైనది ఏది?
ఎ) వినయపీఠకం బి) సుత్త పీఠకం
సి) అభిదమ్మ పీఠకం డి) పైవన్నీ
20. 'వేలువనం'ను బుద్దునికి దానం చేసిన రాజు ఎవరు?
ఎ) అశోకుడు బి) కనిష్కుడు
సి) బింబిపారుడు డి) బిందుసారుడు
21. 'సాంచీ', 'బార్హూత్' స్థూపాలకు తోరణ ద్వారాలు ఏర్పాటు చేసినది ఎవరు?
ఎ) పుష్యమి శుంగుడు బి) కుబేరుడు
సి) రెండవ శాతకర్ణి డి) శైలేంద్ర మహారాజు
22. మగధను తొలిసారిగా పాలించిన వంశం ఏది?
ఎ) హర్యాంక వంశం బి) బార్హుద్ర వంశం
సి) శుంగ వంశం డి) శశినాగ వంశం
23. 'అలెగ్జాండర్ భారతదేశంపైకి ఒక తుఫాను లాగా వచ్చి సుడిగాలిలా వెనుతిరిగాడు' అని అభిప్రాయ పడిన వాడు ఎవరు?
ఎ) వి.ఎ.స్మిత్ బి) కొసానిసస్
సి) ఎన్.సి.రారు చౌదరి డి) రోమిలా థాపర్
24. 'మువెంతార్'గా ప్రసిద్ధి చెందిన సంగమ యుగం నాటి రాజ్యం ఏది?
ఎ) చోళరాజ్యం బి) చేర రాజ్యం
సి) పాండ్యరాజ్యం డి) పైవన్నీ
25. చంద్రగుప్తు మౌర్యుడిని 'యాంద్రకొట్టిస్' అని పిలిచినది ఎవరు?
ఎ) ప్లూటార్క్ బి) అలెగ్జాండర్
సి) కౌటిల్యుడు డి) మెగస్తనీస్
26. ఈ కింది వాటిలో 'బిందుసారుడి' బిరుదు ఏది?
ఎ) అమిత్రఘాత బి) శత్రుసంహారకుడు
సి) సంహసేనుడు డి) పైవన్నీ
27. శాసనాల ద్వారా తన ప్రజలతో మాట్లాడిన మొట్ట మొదటి రాజు ఎవరు?
ఎ) భద్రబాహు బి) అశోకుడు
సి) అజాతశత్రువు డి) రుద్రదమనుడు
28. అశోకుడి బౌద్ధమత స్వీకారం గురించి తెలిపే శాసనం ఏది?
ఎ) మస్కీ శాసనం బి) మీరట్ స్తంభ శాసనం
సి) బబ్రూ శిలా శాసనం డి) కౌశాంబి స్తంభ శాసనం
29. మౌర్యుల కాలంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉన్న అధికారులను ఏమని పిలిచేవారు?
ఎ) పతివేదకులు బి) రజ్జుక
సి) అగరనేమి డి)కర్మాంథిక
30. ఉత్తర భారతదేశంలో మగధలో మౌర్యుల పాలన అస్తమించిన వెనువెంటనే రాజ్యాధికారాన్ని స్థాపిం చిన వంశం ఏది?
ఎ) ఛేది వంశం బి) శుంగ వంశం
సి) కుషాణ వంశం డి) శక వంశం
31. పుష్యమిత్ర శుంగుడిని 'బౌద్ధమత వినాశకుడు' అని పేర్కొన్నది?
ఎ) కాళిదాసు బి) పతంజలి
సి) బౌద్ధసాహిత్యం డి) దివ్యవదన గ్రంథం
32. సంస్కృతంలో 'విందవర్ణుడు'గా పేర్కొన్న పార్థియన్ రాజు ఎవరు?
ఎ) గండోఫర్నిస్ బి) మవుస్
సి) డెమిట్రియస్ డి) మినాండర్
33. ఈ కింది వాటిలో 'వీమాకాడ్పైసిస్' బిరుదును గుర్తిం చండి?
ఎ) సర్వలోకేశ్వర బి) రక్షకుడు
సి) మహేశ్వరుడు డి) పైవన్నీ
34. కార్తికేయుని బొమ్మ ఉన్న నాణేలను ముద్రించిన కుషాణరాజు ఎవరు?
ఎ) వాసుదేవుడు బి) హవిష్కుడు
సి) కుజులకాడ పైసిస్ డి) కనిష్కుడు
35. సముద్రగుప్తుడిని 'ఇండియన్ నెపోలియన్' అని వర్ణించి నది ఎవరు?
ఎ) వి.ఎ.స్మిత్ బి) థేవ్నాట్
సి) ఇత్సింగ్ డి) వసుబందు
36. గుప్తులకు సంబంధించి భూమి రకాలలో సరైన అంశం ను గుర్తించండి?
ఎ) అప్రహత్ - అటవీభూమి
బి) గపథసార - పచ్చికభూమి
సి) క్షేత్రం - దున్నేభూమి డి) పైవన్నీ సరైనవే
37. ఈ కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?
ఎ) ప్రస్తపాల - భూదస్తావేజుల పర్యవేక్షణాధికారి
బి) గ్రామిణి - గ్రామ పాలకుడు
సి) ధ్రువాధి కారనిక - భూసర్వే భూపర్యవేక్షణ
డి) పైవన్నీ సరైనవే
38. గుప్తుల కాలంలో శాశ్వతంగా భూమిని దానం చేసే విధానానికి గల పేరు?
ఎ) అగ్రహర బి) దేవాగ్రహర
సి) నివిధర్మ డి)హిరణ్య
39. భారత దేశంలో 'జ్యోతిష్యశాస్త్రం'ను ప్రవేశపెట్టినది ఎవరు?
ఎ) వరాహమిహురుడు బి) ఆర్యభట్టు
సి) ధన్వంతరి డి) సుశ్రుతుడు
40. జైనులలో మొట్టమొదటి తర్కశాస్త్ర పండితుడు ఎవరు?
ఎ) బాణుడు బి) సిద్ధసేన దివాకరుడు
సి) అసంగుడు డి)దిజ్ఖాగుడు
- సమాధానాలు
1.బి 2.సి 3.డి 4.ఎ 5.ఎ
6.డి 7.డి 8.డి 9.ఎ 10.బి
11.ఎ 12.బి 13.డి 14.డి 15.ఎ
16.బి 17.బి 18.బి 19.డి 20.సి
21.ఎ 22.బి 23.సి 24.డి 25.ఎ
26.డి 27.బి 28.సి 29.ఎ 30.బి
31.సి 32.ఎ 33.డి 34.బి 35.ఎ
36.డి 37.డి 38.సి 39.ఎ 40.బి
- షేక్ సయ్యద్ మియా
ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఫోన్: 9652748580
Authorization