అంతర్జాతీయం :
గ్వాటెమాలా నూతన అధ్యక్షుడిగా అలెజాండ్రో
గ్వాటెమాలా నూతన అధ్యక్షుడిగా కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి అలెజాండ్రో గియామాట్టి ఎన్నికయ్యారు. గ్వాటెమా లాలో జరిగిన తాజా అధ్యక్ష ఎన్నికల్లో అలె జాండ్రో 90 శాతం ఓట్ల ఆధిక్య తతో ప్రత్యర్థి సాండ్రా టోరెస్ (మాజీ అధ్యక్షుడు అల్వారో కొలొం సతీమణి)పై విజయం సాధించారు. అవి నీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత అధ్యక్షుడు జిమ్మీ మొరేల్స్ జనవరిలో పదవీ విరమణ చేసిన తరువాత ఆయన స్థానంలో అలెజాండ్రో బాధ్యతలు స్వీకరించనున్నారు.
వెనిజులాలో చమురుశుద్ధి కర్మాగారం
వెనిజులా రాజధాని కారకాస్లో చైనా సహకారంతో నిర్మించిన చమురుశుద్ధి కర్మాగారాన్ని వెని జులా అధ్యక్షుడు నికొలస్ మదురో 2019 ఆగస్టు 8న ప్రారంభించారు. వెనిజులాలో చమురు ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ సహకారంతో నిర్మించిన ఈ రిఫైనరీని సైనో వెన్సా సంస్థ నిర్వహిస్తుంది. ఈ రిఫైనరీ ద్వారా చమురు ఉత్పత్తిని రోజుకు ప్రస్తుతం ఉన్న 1.1 లక్షల బ్యారెళ్ల స్థాయి నుండి 1.65 లక్షల బ్యారెళ్ల స్థాయికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. చైనా-వెనిజులా సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు, పరస్పర గౌరవం, నిరంతర చర్చల ప్రాతిపదికన తాము ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మదురో పేర్కొన్నారు.
భారత్ వర్ధమాన దేశం కాదు : ట్రంప్
భారత్, చైనాలు ఆసియాలో పెద్ద ఆర్థిక శక్తులుగా ఎదిగాయని.. అవి ఇంకా వర్ధమాన దేశాలేమీ కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యా నించారు. అమెరికాలోని పెన్సిల్వేనియా లో 2019 ఆగస్టు 13న జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన 'వర్ధమాన దేశాల' హోదా ముసుగులో భారత్, చైనా అక్రమంగా ప్రయోజనాలు పొందుతున్నాయ న్నారు. వర్థమాన దేశాలనే హోదాను అడ్డం పెట్టుకుని అమెరికా నుంచి ఏళ్ల తరబడి ప్రయోజనాలు పొందుతూనే ఉన్నాయని విమర్శించారు. ఇకపై మాత్రం అలాంటి దేశాలు అక్రమంగా వర్ధమాన దేశాల హోదాను వాడుకుని అక్ర మంగా ప్రయోజనాలు పొందనిచ్చేది లేదని పేర్కొన్నారు.
జాతీయం :
డిస్కవరీలో మోడీ సాహసయాత్ర ప్రసారం
ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్, ప్రధాని నరేంద్రమోడీ కలిసి ఉత్తరాఖండ్లోని జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో చేపట్టిన సాహసయాత్ర 2019 ఆగస్టు 12న డిస్కవరీ గ్రూప్ ఛానళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 180కిపైగా దేశాల్లో ప్రసారమైంది. 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో భాగంగా ఈ సాహస యాత్రను చిత్రీకరించారు. ఈ యాత్రలో బెంగాల్ పులులు, మొసళ్లు, విషసర్పాల మధ్య ఎలా మనుగడ సాగించాలో గ్రిల్స్ మోడీకి వివరించారు. అంతర్జాతీయంగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్క్రెడిబుల్ ఇండియా కార్యక్రమానికి 'వైల్డ్ లైఫ్'ను ఇతివత్తంగా ఎంచుకోనున్నట్లు కేంద్ర పర్యాటక మంత్రి ప్లహాద్ పటేల్ 2019 ఆగస్టు 11న వెల్లడించారు.
స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ ప్రారంభం
దేశాన్ని ఓడీఎఫ్గా మార్చే ప్రక్రియలో భాగంగా స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్-2019ను కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ 2019 ఆగస్టు 14న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దేశంలోని సుమారు 700 జిల్లాల్లోని 17వేల గ్రామాల్లో ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా ఘన వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై దష్టి సారించనున్నారు. స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ ద్వారా గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితం(ఓడీఎఫ్)గా మార్చే దిశగా ముందడుగు వేశామని మంత్రి షెకావత్ తెలిపారు. 2018లో నిర్వహించిన మొదటి దఫా సర్వేను దేశవ్యాప్తంగా ఉన్న 6వేల గ్రామాల్లో నిర్వహించారు.
కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ ప్రారంభం
రైళ్ల భద్రత కోసం కమాండోస్ ఫర్ రైల్వే సేఫ్టీ (కోరాస్) యూనిట్ను కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ 2019 ఆగస్టు 14న ఢిల్లీలో ప్రారంభిం చారు. కోరాస్ కమెండోలకు అంతర్జాతీ య శిక్షణ ఇవ్వాల్సిందిగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు సూచించినట్లు తెలిపారు. కోరాస్ యూనిట్ను మొదట ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మోహరించ నున్నట్లు వెల్లడించారు. కశ్మీర్తో పాటు ఈశాన్య రాష్ట్రాలు, తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉండే ఛత్తీస్గఢ్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కమాండోలు భవిష్యత్లో సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
బయోడీజిల్ పథకం ప్రారంభం
వాడేసిన వంటనూనె నుంచి ఉత్పత్తి చేసిన బయోడీజిల్ను కొనుగోలు చేసే బయోడీజిల్ కొనుగోలు పథకాన్ని ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రారంభించాయి. ప్రపంచ బయోడీజిల్ దినోత్సవ సందర్భంగా పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ 2019 ఆగస్టు 10న అధికారికంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ బయోడీజిల్ పథకం కింద... 100 పట్టణాల్లో వినియోగించిన మిగిలిన వంట నూనె నుంచి బయోడీజిల్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆహ్వానించనున్నాయి.
ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీసు రద్దు
ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీసును రద్దు చేస్తున్నట్లు 2019 ఆగస్టు 12న భారత్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం లాహోర్-ఢిల్లీ బస్ సర్వీసులను పాకిస్తాన్ రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ తెలిపింది. ఇప్పటికే భారత్-పాక్ల మధ్య నడిచే సంరతా ఎక్స్ప్రెస్, థార్ ఎక్స్ప్రెస్లను పాకిస్తాన్ రద్దు చేసింది. 1999 ఫిబ్రవరిలో ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీసు ప్రారంభమైన సర్వీసు 2001లో భారత పార్లమెంటు భవనంపై దాడి జరిగిన తర్వాత బస్సు నిలిపి వేశారు. అనంతరం 2003 జూలైలో పునఃప్రారంభమైంది.
పళని పంచామతానికి జీఐ గుర్తింపు
తమిళనాడులోని ప్రసిద్ధ పళని దేవస్థానం ప్రసాదమైన పంచామతం, కేరళలోని తిరూరు తమలపాకులకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించింది. మిజోరంకు చెందిన రెండు వస్త్రోత్పత్తులు తావ్ లోహపున్ (చేతితో నేయబడిన ఓ రకమైన వస్త్రం), మిజో పుంచీలకు కూడా ఈ గుర్తింపును కేటాయించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ప్రకటించింది. భౌగోళిక మూలాలు, నాణ్యత, వాటికి ఉన్న ప్రత్యేకతలను జీఐ ట్యాగ్ తెలియజేస్తోంది.
లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్ పుస్తకావిష్కరణ
భారత ఉప రాష్ట్రపతిగా వెంక య్యనాయుడి రెండేళ్ల పయ నంలో సాగిన పర్యటనలు, సంద ేశాలు, ఉపదేశాలు, కార్యక్ర మాల తో కూడిన 'లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్' పుస్తకావిష్కరణ 2019 ఆగస్టు 11న తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. సమా చార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ నేతత్వంలో రూపొందించిన ఈ పుస్తకాన్ని హౌం మంత్రి అమిత్షా ఆవిష్కరించారు. తొలి ప్రతిని వెంకయ్య అందుకున్నారు.
గిన్నీస్ రికార్డ్స్లో యూపీ ప్రభుత్వ కార్యక్రమం
క్విట్ ఇండియా ఉద్యమం జరిగి 77 ఏళ్లయిన సంద ర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2019 ఆగస్టు 9న నిర్వహిం చిన మొక్కల పంపిణీ కార్యక్ర మానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు లభించింది. ఈ గిన్నీస్ రికార్డు పత్రాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు గిన్నీస్ అధికారులు అంద జేశారు. మొక్కల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏకకాలంలో 66వేల మొక్కలను యూపీ ప్రభుత్వం పంపిణీ చేసింది.
ప్రధాని మోడీ నేతత్వంలో అంతర్రాష్ట్ర మండలి
ప్రధాని నరేంద్రమోడీ నేతత్వంలో అంతర్రాష్ట్ర మండలిని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏర్పాటు చేసింది. ఆరుగురు కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల / కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు / పాలనాధికారులు కూడా ఈ మండలిలో సభ్యులుగా ఉంటారు. మరో 10 మంది కేంద్ర మంత్రులు మండలిలో శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. రాజ్యాంగం లోని 263వ అధికరణం ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలపై విచారణ జరిపి, సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత అంతర్రాష్ట్ర మండలికి ఉంటుంది. అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘాన్ని కూడా కేంద్రం మరోసారి ఏర్పాటు చేసింది.
ఏడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జరిమానా
మానవ హక్కుల కోసం ప్రత్యే కంగా కోర్టులను ఏర్పాటు చేసే అంశం గురించి నివేదిక ఇవ్వడంలో విఫలమయ్యా యంటూ ఏడు రాష్ట్రాలకు వేర్వేరుగా రూ.లక్ష వరకూ సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిందిగా 2018 ఏడాదిలో సూచించిన ప్పటికీ ఏర్పాటు చేయకపోవడం వల్లే జరిమానా విధించి నట్లు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ బీఆర్ దవైల ధర్మాసనం తెలిపింది. ఈ కేసు ఆగస్టు 13న వాదనలకు రాగా కనీసం తమ రాష్ట్రాల తరపున లాయర్లు కూడా హాజరుకాక పోవడంతో రాజస్తాన్, ఉత్తరాఖండ్లకు లక్ష జరిమానా విధించింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మేఘా లయ, మిజోరాంలకు రూ.50 వేల చొప్పున పెనాల్టీ విధించింది. మానవ హక్కుల చట్టం 1993 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక లాయర్ను నియమించాలని 2018లో సుప్రీం సూచించింది.
భారత్-చైనా అత్యున్నత సమావేశంలో జై శంకర్
చైనా రాజధాని బీజింగ్లో 2019 ఆగస్టు 12న జరిగిన భారత్-చైనా అత్యున్నత కమిటీ (సాంస్క తిక, ప్రజా సంబంధాలు) సమావేశం లో భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ పాల్గొన్నారు. భారత్-చైనా అత్యున్నత కమిటీ (సాంస్కతిక, ప్రజా సంబంధాలు) సమావేశం సందర్భంగా భారత్, చైనా 4 ఒప్పందాలు కదుర్చుకున్నాయి. సాంస్కతిక, ప్రజా సంబంధాలు బలోపేతానికి దోహదపడే ఈ ఒప్పందాలపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంతకాలు చేశారు.
ప్రాంతీయం :
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్కుమార్
తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షు డిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ నియమితులయ్యారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 16న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ పదవి లో వినోద్ మూడేళ్లు కొనసాగుతారు. 2019-20 ఆర్థిక సంవ త్సరానికి త్వరలోనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యం లో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలను సమీక్షించి, ప్రతిపాదనలు తయారుచేసే కీలక పనిని వినోద్కు అప్పగించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షునిగా వినోద్కు కేబినెట్ హోదా ఉంటుంది. మంత్రిమండలి సమావేశాలకు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు.
హైదరాబాద్లో అయాన్ ఆర్అండ్డీ సెంటర్
నీరు, పర్యావరణ నిర్వహణ సేవలందిస్తున్న అయాన్ ఎక్స్చేంజ్ హైదరాబాద్లోని పటాన్చెరు వద్ద పరిశోధన, అభివ ద్ధి కేంద్రాన్ని(ఆర్అండ్డీ సెంటర్) నెలకొల్పింది. 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.30 కోట్లతో ఈ సెంటర్ ను ఏర్పాటు చేసింది. కెమికల్స్, రెసిన్స తదితర వ్యాపారాలతో పాటు నూతన ఉత్పాదనల అభివద్ధిలో ఈ సెంటర్ తోడ్పాటు అందిస్తుందని అయాన్ ఎక్స్చేంజ్ సీఎండీ రాజేష్ శర్మ 2019 ఆగస్టు 9న తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్, ఇండిస్టియల్ రిసర్చ్ (డీఎస్ఐఆర్) నుంచి ఆర్అండ్డీ కేంద్రానికి ధ్రువీకరణ ఉందని పేర్కొన్నారు.
టీఐఎఫ్ఆర్లో ఎక్స్ట్రీమ్ సెంటర్ ఏర్పాటు
హైదరాబాద్లోని టాటా ఇన్స్టి ట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)లో ఎక్స్ట్రీమ్ ఫొటో నిక్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎపిక్)ను ఏర్పాటు చేయను న్నారు. టీఐఎఫ్ ఆర్, యూకేకు చెందిన రూథర్ఫర్డ్ అప్పిలేట్ లేబొరేటరీ-సెంట్రల్ లేజర్ ఫెసిలిటీ(సీఎల్ఎఫ్) సంయు క్తంగా ఈ సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు 2019 ఆగస్టు 9న రెండు సంస్థలు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి.
ఫిజీ సుప్రీంకోర్టు జడ్జీగా జస్టిస్ లోకూర్
ఫిజీ దేశ సుప్రీంకోర్టులో నాన్రెసిడెంట్ ప్యానల్ జడ్జిగా భారత సుప్రీంకోర్టు జడ్జిగా సేవలందించిన జస్టిస్ మదన్ బి.లోకూర్ 2019 ఆగస్టు 12న ప్రమాణస్వీకారం చేశారు. లోకూర్తో ఫిజీ అధ్యక్షుడు జియోజీ కొన్రోటే ప్రమాణ స్వీకారం చేయించారు. ఫిజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా లోకూర్ మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. ఒక భారత జడ్జి మరోదేశ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. గతంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ ఆయన పని చేశారు.
జ్ఞానపీఠ్ సలహా కమిటీ కన్వీనర్గా సుబ్బారావు
భారతీయ జ్ఞానపీఠ్ తెలుగు భాషా సలహా కమిటీ కన్వీనర్గా ప్రముఖ సాహితీవేత్త డా|| చందూ సుబ్బారావు నియమితుల య్యారు. కమిటీ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ.కష్ణారావు, రచయిత వెన్నా వల్లభ్రావు నియమితులయ్యారు. వచ్చే 3 సంవత్సరాలకు జ్ఞానపీఠ్, మూర్తిదేవి పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేసేందుకు జ్ఞానపీఠ్ సంస్థ ఆగస్టు 13న భాషల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది.
ఎఫ్ఏఎన్ఎస్ సభ్యురాలిగా హేమలత
ఆసియా పోషకాహార సంఘాల సమాఖ్య (ఎఫ్ఏఎన్ఎస్) కార్య నిర్వాహక మండలి సభ్యురాలిగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సంచాలకురాలు డా|| ఆర్.హేమలత నియమితులయ్యారు. 2023 వరకు ఆమె పదవిలో కొనసాగు తారని ఎఫ్ఏఎన్ఎస్ 2019 ఆగస్టు 14న తెలిపింది. మండలి సభ్యురాలిగా.. పోషకాహార విభాగంలో పరిశోధన, శిక్షణ, సభ్య దేశాల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణలో హేమలత పాల్గొనాల్సి ఉంటుంది. ఇండోనేసి యాలోని బాలిలో తాజాగా జరిగిన సమావేశంలో నూతన సభ్యులను నియమించారు.
ఎల్బ్రూస్ను అధిరోహించిన భారతీయుడు
ఐరోపా ఖండంలోని ఎల్బ్రూస్ పర్వతాన్ని విజ యనగరం జిల్లాకి చెందిన గిరిజన యువకుడు ఆర్.సు దర్శనరాయుడు అధిరోహిం చాడు. 2019 ఆగస్టు 11న యాత్రను ప్రారంభించి, 5642 మీటర్ల ఎత్తు గల ఎల్బ్రూస్పైకి ఆగస్టు 15న చేరినట్లు సుదర్శన రాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలానికి చెందిన 24 ఏళ్ల రాయుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వ్యాయామ విద్యలో స్నాతకోత్తర విద్యను అభ్యసిస్తున్నాడు. 2018లో కిల్లిమంజారో శిఖరాన్ని అధిరోహించే బందంలో సభ్యునిగా ఎంపికై సాహస యాత్రను విజయవంతంగా ముగించాడు.
మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ ఆత్మహత్య
భారత మాజీ క్రికెటర్, తమిళనాడు క్రికెట్కు సుదీర్ఘ కాలం మూలస్తంభంలా నిలిచిన వక్కడై బిశ్వేశ్వరన్(వీబీ) చంద్రశేఖర్ (58) 2019 ఆగస్టు 15న చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నాడు. 1988-90 మధ్య భారత్ తరపున 7 వన్డేలు ఆడిన చంద్రశేఖర్ మొత్తం 88 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్లో తమిళనాడు జట్టు తరపున 4,999 పరుగులు చేశాడు. తమిళనాడు ఓపెనర్గా చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన వీబీ 81 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 43.09 సగటుతో 4,999 పరుగులు సాధించారు. 1988-89 ఇరానీ కప్ మ్యాచ్లో 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రిటైర్మెంట్ అనంతరం 2012లో తమిళనాడు కోచ్గా, భారత సెలక్టర్గా పనిచేశారు. కామెంటేటర్గానూ గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ ప్రస్తుతం చెన్నైలో సొంత క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నారు.
అవార్డులు :
సిద్ధిపేట కలెక్టర్కు ఇండియన్ ఎక్స్ప్రెస్ అవార్డు
తెలంగాణాలోని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డికు జాతీయ స్థాయిలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్లెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలోని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఆధ్వర్యంలోని కమిటీ 2019 ఆగస్టు 10న ప్రకటించింది. ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టులను, పథకాలను ప్రజలకు చేరవేస్తూ మంచి పాలనా ప్రక్రియకు నాంది పలికే కలెక్టర్లకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ అవార్డును అందజేస్తారు. ప్రధాని మోదీ కమిటీ చైర్మన్గా, ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ చైర్మన్ వివేక్ గోయెంక, రమానాథ్ గోయెంక సభ్యులుగా ఉన్న ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ కమిటీ అవార్డులను ప్రకటిస్తుంది.
సంగారెడ్డి కలెక్టర్కు పోషణ్ అభియాన్ అవార్డు
రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమం తరావుకు పోషణ్ అభియాన్ 2018-19 అవార్డు లభించింది. పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని సంగా రెడ్డిలో పక్కాగా అమలు చేసి విజయ వంతమైందుకు గాను హనుమంతరావుకు ఈ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'పోషణ్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా మాతా శిశు సంరక్షణ, గర్భిణుల ఆరోగ్యం, పిల్లల్లో పౌష్టికారం పెంపుదల విషయంపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడం, ఆచరిం చడంలో సంగారెడ్డి జిల్లా తెలంగాణలో తొలి స్థానంలో నిలిచింది.
జాతీయ యువజన అవార్డులు ప్రధానం
2016-17కు ప్రకటించిన జాతీయ యువజన అవార్డులను 2019 ఆగస్టు 12న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రధానం చేశారు. తెలంగాణ నుంచి ఒద్దిరాజు వంశీకష్ణ, ఆంధ్రప్రదేశ్ నుంచి గట్టెం వెంకటేష్, పథ్వీ గొల్ల ఈ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. అవార్డు అందు కున్న వారికి రూ.50 వేల నగదు, పతకం, సర్టిఫికెట్ అంద జేశారు. దేశ వ్యాప్తంగా 20 మంది యువజన అవార్డులకు ఎంపికయ్యారు. వివిధ రంగాల అభివద్ధి, సామాజిక సేవారంగంలో కషికి గుర్తింపుగా కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఈ యువజన అవార్డులను ఇస్తుంది.
సీబీఐ అధికారి పెద్దిరాజుకు హోం ఎక్సలెన్స్ అవార్డు
సీబీఐ ప్రధాన కార్యాలయం సైబర్ నేరాల దర్యాప్తు విభాగంలో డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్గా పని చేస్తున్న బండి పెద్దిరాజుకు కేంద్ర హోంమంత్రి ఎక్సలెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డు లభించింది. కేసుల దర్యాప్తులో అత్యుత్తమంగా విధులు నిర్వర్తించినందుకుగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
గోపాలన్కు లివింగ్ లెజెండ్ అవార్డు
దేశ పౌష్టికాహార రంగం భీష్మ పితామహుడిగా పరిగణించే డాక్టర్ కొళత్తూర్ గోపాలన్ను ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ న్యూట్రిషన్ సొసైటీ.. ప్రతిష్టాత్మక 'ఫాన్స్-లివింగ్ లెజెండ్' అవార్డుకు ఎంపిక చేసింది. ఇండోనేసియాలోని బాలీలో జరిగిన 13వ ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ న్యూట్రిషన్ సదస్సులో ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు జాతీయ పోషకాహార సంస్థ 2019 ఆగస్టు 13న తెలిపింది. భారత వైద్య పరిశోధన సంస్థ, హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థల మాజీ డెరైక్టర్ అయిన గోపాలన్.. 2018లో వందేళ్లు పూర్తి చేసుకున్నారు.
భాషా పండితులకు రాష్ట్రపతి పురస్కారాలు
సంస్కతం, పర్షియన్, అరబిక్, పాళీ, ప్రాకతం, క్లాసికల్ తెలుగు, క్లాసికల్ కన్నడ, క్లాసికల్ మలయాళం, క్లాసికల్ ఒడియా భాషల అభివద్ధికి కషిచేసిన ఆయా భాషా పండితులకు స్వాత్రంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి, మహర్షి భద్రాయన్ వ్యాస సమ్మాన్ పురస్కారాలను ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల అభివద్ధి మంత్రిత్వ శాఖ 2019 ఆగస్టు 15న వెల్లడించింది. 2019 సంవత్సరానికి ఈ పురస్కరాలను ప్రకటించారు.
ఇస్రో చైర్మన్ శివన్కు అబ్దుల్ కలాం అవార్డు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చెర్మన్ డాక్టర్ కైలాసవా డివో శివన్కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం అవార్డు ను ప్రకటిం చింది. శాస్త్ర-సాం కేతిక రంగాల్లో పురోగతి, విద్యా ర్థులకు అంతరిక్ష పరిజ్ఞా నంపై అవగాహన కల్పించడంలో చేసిన కషికిగా ను శివన్కు ఈ అవార్డు దక్కింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 2019 ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో తమిళ నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి చేతుల మీదుగా.. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం పేరిట అవార్డు (8 గ్రాముల బంగారు పతకం, రూ.ఐదు లక్షల నగదు)ను ఇస్రో చైర్మన్కు ప్రకటించారు.
సైన్స్&టెక్నాలజి
అత్యంత వేడి మాసంగా జూలై
భూ గ్రహ చరిత్రలోనే 2019 జూలై నెల అత్యంత వేడి మాసంగా నమోదైంది. ఈ విషయాన్ని గతంలోనే యూరో పియన్ యూనియన్ వెల్లడించగా, తాజాగా అమెరికా జాతీయ వాతావరణ, సముద్ర పరిశీలన సంస్థ (ఎన్వోఏఏ) కూడా 2019 ఆగస్టు 15న ధ్రువీకరించింది. 20వ శతాబ్దంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.8 డిగ్రీ సెల్సియస్ కాగా, తాజాగా 2019, జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.75 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. 2016 జూలై రెండో ఇప్పుడు ప్రపంచంలో రెండో అత్యంత వేడి మాసంగా ఉంది. పది అత్యంత వేడి జూలై మాసాల్లో తొమ్మిది 2005 తర్వాతనే నమోదయ్యాయి. ఆర్కిటిక్ సముద్రంలో మంచు సాధార ణంగా జూలై నెలలో ఉండే సగటు కన్నా 2019 ఏడాది జూలై నెలలో 19.8 శాతం తక్కువగా ఉంది.
క్రీడాంశాలు :
నాడా పరిధిలోకి బీసీసీఐ
జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిధిలోకి వచ్చేం దకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంగీకరిం చిందని జాతీయ క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ ఝుల నియా 2019 ఆగస్టు 9న తెలి పారు. దీంతో బీసీసీఐకి కూడా ఇకపై ఇతర క్రీడలలాగే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)గా గుర్తింపు లభిం చింది. బీసీసీఐను ఎన్ఎస్ఎఫ్గా ప్రభుత్వం గుర్తించడంతో డోపింగ్ విషయంలో నాడా నిర్వహించే పరీక్షలకు భారత క్రికెటర్లు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. సొంతంగా డోపింగ్ పరీక్షలు నిర్వహించుకునే అవకాశం లేదు. ఇప్పటివరకు భారత క్రికెటర్ల శాంపిల్స్ను స్వీడన్కు చెందిన ఐడీటీఎం సేకరించి జాతీయ డోప్ టెస్టింగ్ లాబొరేటరీ (ఎన్డీటీఎల్)కు బీసీసీఐ పంపేది. ఇకపై ఐడీటీఎంకు ఆ అధికారం ఉండదు. నేరుగా నాడానే పరీక్షలు నిర్వహిస్తుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా క్రికెటర్లకు నాడా పరీక్షలు నిర్వహించవచ్చు.
సౌరభ్ వర్మకు హైదరాబాద్ ఓపెన్ టైటిల్
జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మకు హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-100 టోర్నమెంట్లో టైటిల్ లభించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో 2019 ఆగస్టు 11న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 26 ఏళ్ల సౌరభ్ (మధ్యప్రదేశ్) 21-13, 14-21, 21-16తో లో కీన్ యె (సింగపూర్)పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన సౌరభ్కు 5,625 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 3 లక్షల 98 వేలు)తో పాటు 5,500 ర్యాం కింగ్ పాయింట్లు లభించాయి. మరోవైపు మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి-అశ్విని 17-21, 17-21తో హా బేక్-జుంగ్ యుంగ్ (కొరియా) చేతిలో ఓడారు.
నాదల్కు మాంట్రియల్ మాస్టర్ టైటిల్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్కు మాంట్రియల్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్-1000 టైటిల్ లభించింది. కెనడాలోని టొరంటోలో 2019 ఆగస్టు 12న జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో నాదల్ 6-3, 6-0తో మెద్వెదేవ్ (రష్యా)పై గెలిచి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. దీంతో నాదల్ కెరీర్లో 35వ మాస్టర్స్ సిరీస్ టైటిల్ను సాధించినట్లయింది. విజేత నాదల్కు 10,49,040 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 7 కోట్ల 48 లక్షలు) లభించింది. మహిళల విభాగం తుది పోరులో బియాంక ఆండ్రీస్క్యూ (కెనడా) 3-1తో ఆధిక్యంలో ఉండగా ప్రత్యర్థి సెరెనా విలియమ్స్ (అమెరికా) పోటీ నుంచి తప్పుకొంది. దీంతో టైటిల్ బియాంక సొంతమైంది.
ఇరీనా స్మారక చెస్ టోర్నీ విజేతగా హర్ష
పోలాండ్లో జరిగిన ఇరీనా వారకోమ్స్కా స్మారక ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ హర్ష భరతకోటి విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో 19 ఏళ్ల హర్ష ఏడు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 17 మంది గ్రాండ్ మాస్టర్లతో పాటు మొత్తం 97 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో హర్ష ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్లను 'డ్రా' చేసుకుని అజేయంగా నిలిచాడు.
2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్లో క్రికెట్
2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో మహిళల టి20 క్రికెట్ను ప్రవేశ పెట్టనున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్య (సీజీఎఫ్), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2019 ఆగస్టు 13న ప్రకటించాయి. అదే సమయంలో షూటింగ్ను తొలగిస్తున్నట్లు సీజీఎఫ్ అధ్యక్షుడు డేమ్ లూయిస్ మార్టిన్ వెల్లడించారు. 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ జూలై 27 నుంచి ఆగస్టు 7 వరకు జరగనున్నాయి. వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న కామన్వెల్త్ గేమ్స్లో 1998లో ఒక్కసారి మాత్రమే క్రికెట్ను ఆడించారు. పురుషుల విభాగంలో జరిగిన ఆ ఈవెంట్లో దక్షిణాఫ్రికా జట్టు విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది.
ప్రపంచ జూనియర్ రెజ్లింగ్లో భారత్కు స్వర్ణం
ఎస్తోనియాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో 18 ఏళ్ల విరామం తర్వాత భారత్కు మళ్లీ స్వర్ణ పతకం లభించింది. పురుషుల 86 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా విశ్వవిజేతగా అవతరించాడు. ఫైనల్లో అలిక్ షెబ్డజుకోవ్ (రష్యా)పై దీపక్ విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చివరిసారి 2001లో భారత్ తరుపున ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో రమేశ్ కుమార్ (69 కేజీలు), పల్విందర్ సింగ్ చీమా (130 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు.
- యన్.సంతోష్కుమారాచారి
జీకే,కరెంట్ అఫైర్స్ నిపుణులు
హైదరాబాద్
ఫోన్ : 9848286270