1. భారత దేశంలో మొట్టమొదటి సారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన జరిగింది?
ఎ) 1773 రెగ్యులేటింగ్ చట్టం
బి) 1784 పిట్స్ ఇండియా చట్టం
సి) 1853 చార్టర్ చట్టం
డి) 1861 భారత ప్రభుత్వ కౌన్సిల్ చట్టం
2. ఈ కింది వారిలో 1946 - 47 నాటి మధ్యంతర ప్రభుత్వంలో భారత ఆర్థికశాఖ మంత్రి ఎవరు ?
ఎ) జాన్ మత్తారు బి) ఆర్.కె.షణ్ముఖం చెట్టి
సి) లియాఖత్ అలీఖాన్ డి) పైవారందరూ
3. భారత ప్రభుత్వ చట్టం 1935 ముఖ్య లక్షణాలేవి? కింద తెలిపిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాలు ఎంపిక చేయండి?
1. కేంద్రంలో ద్వంద్వ పాలన 2. రాష్ట్రాలలో ద్వరద్వ పాలన
3. ఫెడరల్ కోర్టు ఏర్పాటు 4. గవర్నర్ వ్యవస్థ
ఎ) 2, 3 బి) 1, 2, 3
సి) 1, 3, 4 డి) పైవన్నీ
4. సెప్టెంబర్ 2, 1946లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంను మొదటిసారి ప్రతిపాదించింది ఎవరు?
ఎ) సైమన్ కమిషన్ బి) క్యాబినెట్ మిషన్ ప్లాన్
సి) వేవెల్ ప్లాన్ డి) క్రిప్స్ మిషన్
5. ఈ కింది వాటిలో ఏ కేసు ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు?
ఎ) మేనకాగాంధీ బి) కేశవనంద భారతి
సి) మినర్వామిల్స్ డి) గోలక్నాథ్
6. ఒక వేళ రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాల ను కుంటే తాను రాజీనామా పత్రాన్ని ఎవరికి అందించాలి?
ఎ) ప్రధానమంత్రి బి) లోక్సభ స్పీకర్
సి) ప్రధాన మంత్రి డి) ఉప రాష్ట్రపతి
7. మొట్టమొదటి ప్రతిభా ఆధారిత భర్తీ విధాన ఆలోచనను ఎక్కడ గుర్తించవచ్చు?
ఎ) మెకాలే కమిటీ బి) మాక్స్వెల్ కమిటీ
సి) లీకమిషన్ డి) ఇస్లింగ్టన్ కమిషన్
8. ఈ కింది వాటిలో ఏ జత సరిగా ఉంది?
ఎ) భారత కౌన్సిళ్ళ చట్టం 1982 - ఎన్నికల నియమం
బి) భారత కౌన్సిళ్ళ చట్టం 1909 - బాధ్యతాయుత ప్రభుత్వం
సి) భారత ప్రభుత్వ చట్టం 1919 - ప్రావిన్సుల స్వయం ప్రతిపత్తి
డి) భారత ప్రభుత్వ చట్టం 1935 - రాష్ట్రాలలో ద్వంద్వ పాలన
9. బ్రిటీష్వారు బెంగాల్లో 1774 సంవత్సరంలో సుప్రీం కోర్టును ఏర్పాటు చేసినపుడు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
ఎ) సర్ మారిస్ గ్వయర్ బి) హెచ్.జె.కానియా
సి) సర్ ఎలిజా ఇంఫె డి) పైవారందరూ
10. ఉమ్మడి జాబితా అనగానేమి?
ఎ) కేంద్రం ఒక్కటి మాత్రమే చట్టాలు చేయవీలైనది
బి) రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేయవీలైనది
సి) పైరెండూ డి) ఏదీకాదు
11. ఈ కింది వివరణలను పరిశీలించి, ఏది సరైనదో తెలపండి?
1. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ రాజ్యాంగ (89వ సవరణ) చట్టం కింద ఏర్పాటు చేశారు
2. మొదటి జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ 2006లో ఏర్పాటైంది.
ఎ) 1 మాత్రమే బి) 2 మాత్రమే
సి) పై రెండూ డి) ఏదీకాదు
12. ఈ కింది వివరణలను పరిశీలించి, సరైనవేవో తెలపండి?
1. భారతదేశంలో మొదటిసారిగా 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో సుప్రీంకోర్టును కలకత్తాలోని పోర్ట్ విలియం నందు ఏర్పాటు చేశారు
2. సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
3. భారత న్యాయవ్యవస్థల పితామహుడిగా కార్న్ వాలీస్ను పిలుస్తారు
4. సర్ ఎలిజా ఇంఫె సుప్రీంకోర్టు మొదటి న్యాయ మూర్తిగా పని చేశారు.
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3 డి) పైవన్నీ
13. ఈ కింది వాటిలో సరైనవి ఏవి?
1. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఫెడరల్ కోర్టు (1937) ఏర్పడింది.
2. ఫెడరల్ కోర్టులో ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు సాధారణ న్యాయమూర్తులుంటారు.
3. ఫెడరల్ కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా సర్ మారిస్ గ్వయర్ పని చేశారు
4. ఫెడరల్ కోర్టుకు చివరి ప్రధాన న్యాయమూర్తిగా హరిలాల్ జె.కానియా ఉన్నారు
ఎ) 1, 2 బి) 1, 2, 3 సి) 2, 3 డి) పైవన్నీ
14. ప్రధాన న్యాయమూర్తితో కలిసి సుప్రీంకోర్టులో ఉండాల్సిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
ఎ) 30 బి) 31 సి) 33 డి) 25
15. ప్రస్తుతం కేంద్రంలో ఎన్నో లోక్సభ అధికారంలో ఉంది?
ఎ) 15 బి) 16 సి) 17 డి) 18
16. కింద వివరణలను పరిశీలిచి సరైనవి ఏవో తెలపండి?
1. సుప్రీంకోర్టులో అత్యధిక కాలం ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వారు - వై.వి. చంద్రచూడ్
2. అతి స్వల్ప కాలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేసిన వారు - కమల్ నారాయణ్సింగ్
3. దళిత వర్గం నుంచి సుప్రీంకోర్టు ప్రధానమూర్తిగా పనిచేసిన వారు - కె.జి.బాలక్రిష్ణన్
4. సుప్రీంకోర్టు మొదటి మహిళ న్యాయమూర్తి - ఫాతిమా బీబీ
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 2, 3 డి) పైవన్నీ
17. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఏ విధంగా పెంచవచ్చు?
ఎ) రాష్ట్రపతి ప్రకటన ద్వారా
బి) పార్లమెంట్ చట్టం ద్వారా
సి) భారత రాజ్యాంగ సవరణ ద్వారా
డి) సుప్రీంకోర్టు అనుమతి ద్వారా
18. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితమయ్యే వ్యక్తి అర్హుడగుటకు నిర్దేశించిన వయసు ఎంత?
ఎ) నియామక రోజుకు 25 సంవత్సరాలకు తగ్గకూడదు
బి) నియామక రోజుకు 30 సంవత్సరాలకు తగ్గకూడదు
సి) నియామక రోజుకు 35 సంవత్సరాలకు తగ్గకూడదు డి) ఏ వయసు నిర్ధేశించలేదు
19. కింది వివరణలను పరిశీలించి సరైనవి తెలపండి?
1. 46వ భారత ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్ రంజన్ గొగోరు
2. భారతదేశంలో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి - లీలాసేథ్ (హెచ్పీ)
3. హైకోర్టు న్యాయమూర్తుల వేతనం రాష్ట్ర సంఘటిత నిధి నుంచి వారి పెన్షన్ మాత్రం భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
4. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీవిరమణ వయసు 65 సంవత్సరాలు
ఎ) 1, 3 బి) 3, 4 సి) 1, 2, 3 డి) పైవన్నీ
20. ప్రతిపాదన(ఎ): సుప్రీంకోర్టు ఒక రికార్డుల న్యాయ స్థానం
హేతువు(ఆర్): ఇది తీర్పులను బహిరంగ న్యాయ స్థానంలో వెలువరిస్తుంది.
ఎ) ఎ, ఆర్ రెండు విడివిడిగా సరైనవి. ఆర్ ఎ కు సరైన వివరణ
బి) ఎ, ఆర్ రెండు విడివిడిగా సరైనవి కానీ ఆర్ ఎ కు సరైన వివరణ కాదు.
సి) ఎ సరైనది కానీ ఆర్ తప్పు
డి) ఎ తప్పు కానీ ఆర్ సరైనది
21. అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి?
ఎ) కోల్కతా బి) మద్రాస్
సి) ముంబాయి డి) అలహాబాద్
22. భారత రాజ్యాంగంలో న్యాయసమీక్ష అధికారానికి ఆధారం?
ఎ) ప్రకరణ 13 బి) ప్రకరణ 32
సి) ప్రకరణ 131 డి) పైవన్నీ
23. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది?
ఎ) ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి
బి) రాష్ట్రపతి స్వయంగా
సి) క్యాబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి
డి) జాతీయ న్యాయ నియమకాల కమిషన్ సలహా మేరకు రాష్ట్రపతి
24. భారత రాజ్యాంగంపై వ్యాఖ్యానం చెప్పే అధికారం ఎవరికుంది?
ఎ) సుప్రీంకోర్టు బి) హైకోర్టు
సి) పార్లమెంట్ డి) రాష్ట్రపతి
25. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి గల అర్హతలు ఏవి?
ఎ) అతడు / ఆమె 65సం||లు వయసు మించరాదు
బి) ఏదైనా హైకోర్టులో 5 సం||ల న్యాయమూర్తిగా అనుభవం ఉండాలి.
సి) ఏదేని హైకోర్టులో 10 సం||లు న్యాయవాదిగా అనుభవం ఉండాలి డి) పైవన్నీ సరైనవే
26. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు?
ఎ) ఎట్టిపరిస్థితులలో తగ్గించరాదు
బి) జాతీయ అత్యవసర పరిస్థితులలో తగ్గించవచ్చు
సి) ఆర్థిక అత్యవసర పరిస్థితులలో తగ్గించవచ్చు
డి) 2, 3
27. మొదటి మోడల్ హైకోర్టు ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2009 గుజరాత్ హైకోర్టు
బి) 2010 తమిళనాడు హైకోర్టు
సి) 2011 కేరళ హైకోర్టు
డి) 2012 కర్ణాటక హైకోర్టు
28. భారత సుప్రీంకోర్టును ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన కోర్టుగా అభివర్ణించినది ఎవరు?
ఎ) కె.ఎం.మున్షి బి) డా|| బి.ఆర్.అంబేద్కర్
సి) అర్లాడి కృష్ణస్వామి అయ్యర్ డి) బి.ఎన్.రావు
29. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం నెలకు రూ.2,80,000
బి) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేతనం నెలకు రూ.2,50,000
సి) హైకోర్టు న్యాయమూర్తుల వేతనం నెలకు రూ.2, 25,000 డి) పైవన్నీ సరైనవే
30. ఈ కింది వివరణలను పరిశీలించి, సరైనవి గుర్తించండి?
1) జస్టిస్ కోకా సుబ్బారావు గోలక్నాథ్ కేసు సమ యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు
2) కేశవనంద భారతి కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం.సిక్రి
3) ఎమర్జెన్సీ కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఏ ఎన్ రే
4) తమిళనాడు నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అయిన మొదటి వ్యక్తి జస్టిస్ పతంజలి శాస్త్రి
ఎ) 1, 2 బి) 1, 3 సి) 1, 2, 4 డి) పైవన్నీ
31. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరు?
ఎ) భారత రాష్ట్రపతి బి) భారత పార్లమెంటు
సి) రాష్ట్ర ప్రభుత్వం డి) గవర్నర్
32. రాష్ట్రపతి భారత ప్రధాన న్యాయమూర్తిని నియమిం చునపుడు అతడు ఎవరిని సంప్రదించాల్సిన అవసరం ఉంది?
ఎ) మంత్రి మండలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తు లందరినీ
బి) ప్రధాన మంత్రి, న్యాయ శాఖా మంత్రి, అటార్నీ జనరల్
సి) అతడు అవసరమని భావించిన కేబినెట్ మంత్రులు, ప్రధానమంత్రి
డి) అతను అవసరమని భావించిన సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు.
33. ఈ కింది వివరణలను పరిశీలించి, సరైనవి తెలపండి?
1) ఎస్ఆర్ బొమ్మై కేసు తీర్పు వచ్చినపుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - జస్టిస్ వెంకటాచలయ్య
2) ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పని చేసిన వారు - జస్టిస్ కోకా సుబ్బారావు
3) భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన మొదటి మహిళ - అన్నా చారిటీ (కేరళ)
4) ఒకే ఒక రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వారు - బి.పి.ఝా (పాట్నా హైకోర్టు)
ఎ) 2, 3 బి) 3, 4 సి) 1, 3 డి) పైవన్నీ
సమాధానాలు
1.బి 2.సి 3.డి 4.బి 5.బి
6.డి 7.ఎ 8.ఎ 9.సి 10.డి
11.ఎ 12.డి 13.డి 14.బి 15.సి
16.డి 17.బి 18.డి 19.డి 20.బి
21.ఎ 22.డి 23.డి 24.ఎ 25.డి
26.సి 27.ఎ 28.సి 29.డి 30.డి
31.ఎ 32.డి 33.డి
- దారావత్ సైదులు నాయక్
సివిక్స్ లెక్చరర్
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్
జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా
ఫోన్్ 9908569970