1. తమిళనాడు రాష్ట్రం ఇటీవల రాష్ట్ర ప్రత్యేక సంస్కృతీ, ప్రకృతి సంపదకు చిహ్నంగా దేనిని ఎంపిక చేసింది?
ఎ) కనోపి బటర్ఫ్లై బి) కామన్ పికాక్
సి) మలబార్ పికాక్ డి) సదరన్ బర్డ్ వింగ్స్
2. ఏ రాష్ట్ర సచివాలయం పేరును లోక్సేవా భవన్గా మార్చారు?
ఎ) ఉత్తరాఖండ్ బి) జమ్మూకాశ్మీర్
సి) ఒడిశా డి) పశ్చిమబెంగాల్
3. కింది వానిలో సరైనవి కనుగొనండి?
1. జమ్మూకాశ్మీర్లోని కిష్టావర్ జిల్లాలో మచైల్ మాతా యాత్రను భద్రతా కారణాల దృష్ట్యా నిలిపి వేశారు.
2. మచైల్ మాతా యాత్ర అంటే మచైల్ మాతా 'దుర్గాదేవి' మందిరం
3. మచైల్ యాత్రా అమర్నాథ్ యాత్ర కంటే పురాతన మైనదిగా, పవిత్రమైనదిగా ప్రభుత్వం ప్రకటించింది
4. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో ప్రారంభమై 43 రోజుల తీర్థయాత్ర జరుగుతుంది
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 2, 4 డి) 1, 3, 4
4. భారత దేశంలోనే టాప్ 10 పీఎస్లలో ఉత్తమమైన పోలీస్ స్టేషన్గా నిలిచింది ఏది?
ఎ) పంజాగుట్ట పీఎస్, తెలంగాణ
బి) ఫరక్కా పోలీస్స్టేషన్, పశ్చిమ బెంగాల్
సి) చోపాల పోలీస్స్టేషన్, హిమాచల్ ప్రదేశ్
డి) తరవా పోలీస్స్టేషన్, ఒడిశా
5. కింది వానిలో సరికాని దానిని గుర్తించండి
ఎ) ప్రధానమంత్రి కిసాన్ మాన్-ధన్ యోజన పథకంలో చేరిన రైతుకు 60 ఏండ్లు వయసు వచ్చిన తర్వాత నెలకు రూ.3వేల ఫించన్
బి) 5 ఎకరాల (2 హెక్టార్ల) లోపు భూమి కలిగిన రైతులు దీనికి అర్హులు
సి) 18 నుంచి 40 ఏండ్ల లోపు రైతులు, వారి జీవిత భాగస్వాములు పథకంలో చేరవచ్చు
డి) పింఛన్దారు 60 ఏండ్ల వయసు దాటాక మరణిస్తే జీవిత భాగస్వామికి పింఛన్లో 35 శాతాన్ని అంద జేస్తారు.
6. ప్రపంచంలోని అత్యంత వినూత్న ఆర్థిక వ్యవస్థల ఆధారంగా రూపొందించే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2019లో భారత్ ఏ స్థానంలో నిలిచింది?
ఎ) 40 బి) 36 సి) 52 డి) 64
7. కింది వాటిలో సరిగా లేని జత ఏది?
ఎ) జాతీయ చేనేత దినోత్సవం - ఆగస్టు 7
బి) అంతర్జాతీయ యువజన దినోత్సవం - ఆగస్టు 12
సి) జాతీయ క్రీడా దినోత్సవం - ఆగస్టు 29
డి) సంస్కృత భాషాదినోత్సవం - ఆగస్టు 25
8. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని 2019లో ఏ ఇతివృత్తంతో నిర్వహించారు?
ఎ) ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్
బి) సేఫ్ స్పేస్ ఫర్ యూత్ సి) యూత్ బిల్డింగ్ పీస్
డి) ది రోడ్ లు 2030 ఎరాడిక్టింగ్ పావర్టీ అండ్ అచీవింగ్ సస్టాయినేబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్
9. డ్రాగన్ బ్లడ్ ట్రీ గా పిలిచే డ్రాకెనా కాంబోడియానా చెట్టు జాతిని పరిశోధకులు భారతదేశంలో మొదటి సారిగా ఏ రాష్ట్రంలోగుర్తించారు?
ఎ) నాగాలాండ్ బి) ఉత్తరాఖండ్
సి) అస్పాం డి) మణిపూర్
10. ఇటీవల ఏ దేశం ఒకే రోజున 35 కోట్ల మొక్కలను నాటి ప్రపంచ రికార్డును సృష్టించింది?
ఎ) కాంబోడియా బి) ఇథియోపియో
సి) మడగాస్కర్ డి) ఇండోనేషియా
11. కింది వాటిలో సరికాని వర్తమానాంశాలు ఏవి?
ఎ) సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 31 నుంచి 33కు పెంచాలన్న ప్రతిపాదనతో మొత్తం 33+1=34 కు న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది
బి) అంగన్వాడీ కార్యకర్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 'పోషణ్ అభియాన్' స్కీంలో భాగంగా నెలకు రూ.500 చొప్పున ఇవ్వనున్నారు
సి) దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా పెరుగుతున్న మొబైల్ కంపెనీలను నివారించడానికి 'ట్రూ మోబి సందేశ్' అనే నివారణ పథకాన్ని ప్రారంభించారు
డి) దేశంలో 2001 - 11 మధ్య 80 లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టినట్టు వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు
12. రైతు బీమా పథకానికి సంబంధించిన సరైన అంశాలు ఏవి?
1) రైతు బీమా ప్రీమియంను ఏకంగా 56.54 శాతం పెంచాలని ఎల్ఐసీ ఇచ్చిన ప్రతిపాదనలను వ్యవసాయ శాఖ ఆమోదించింది
2) ఒక్కో రైతు రూ.3555.94 చొప్పున ఈ ఏడాది ప్రీమియం చెల్లించాలని నిర్ణయించారు.
3) ఈ పథకం కింద నమోదైన రైతు ఏ కారణంతోనైనా కన్నుమూస్తే అతని తరుపు నామినీకి రూ.5లక్షల పరిహారాన్నిస్తారు.
4) 2019 ఆగస్టు 14 నుంచి 2020 ఆగస్టు 13 వరకు రైతు బీమా అమల్లో ఉంటుంది.
ఎ) 1, 2 బి) 2, 3 సి) 3, 4 డి) పైవన్నీ
13. కింది వాటిలో సరైనవి ఏవి?
1. తెలంగాణలో ప్రభుత్వ ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ల శాతాన్ని 4 శాతానికి పెంచారు
2. టీఎస్లో స్వచ్ఛతా దర్పణ్ 3వ దశలో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం లభించింది.
3. జాతీయ స్థాయిలో ఘన వ్యర్థాల నిర్వహణలో తెలంగాణ 2వ స్థానంలో నిలిచింది.
4. 'ఒకే దేశం ఒకే కార్డు' పేరుతో రేషన్ ఎక్కడి నుంచైనా తీసుకునే విధానం తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో ఆగస్టు 8 నుంచి అమల్లోకి వచ్చింది
ఎ) 3, 4 బి) పైవన్నీ సి) 1, 2, 3 డి) 1, 4
14. ఆంధ్రప్రదేశ్లో 2017లో ప్రతి వెయ్యి ప్రసవాలకు ఎంతమంది శిశువులు చనిపోయారు?
ఎ) 35 బి) 32 సి) 28 డి) 25
15. దక్షిణకొరియా అటో మొబైల్ దిగ్గజం కియా మోటార్స్ తాజాగా భారత్లో తమ తొలికారు 'సెల్టోస్'ను ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలోని కియో ప్లాంటులో ఆవిష్కరించింది?
ఎ) చిత్తూరు బి) కర్నూలు
సి) అనంతపురం డి) కడప
16. కింద ఇచ్చిన వాటిలో సరి అయినవి ఏవి?
1. టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకుల్లో విరాట్కోహ్లి మొదటి స్థానంలో ఉన్నాడు.
2. టెస్ట్ జట్ల ర్యాంకుల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది
3. టెస్ట్ బౌలింగ్ విభాగంలో కమిన్స్ మొదటి స్థానంలో నిలిచాడు
ఎ) 1, 2 బి) 1, 2, 3 సి) 2, 3 డి) 1
17. మాంట్రీయల్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల, మహిళల సింగిల్స్ టైటిళ్ళను గెలుచుకున్నవారు?
ఎ) రాఫెల్ నాదల్, బియాంక ఆండ్రీ స్కు
బి) జకోవిచ్, బియాంక ఆండ్రీ స్కు
సి) రోజర్ ఫెదరర్, హలెప్ డి) జకోవిచ్, హలెప్
18. థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ - 500 టోర్నమెంట్లో పురుషుల టైటిల్ను ఎవరు గెలుచు కున్నారు?
ఎ) సాత్విక్ సాయిరామ్, చిరాగ్ శెట్టి
బి) చేతన్ ఆనంద్, సయ్యద్ మోడీ
సి) లిజున్ హుయి, యుచెన్ డి) చెన్లాంగ్, షియూకీ
19. వికలాంగుల టీ - 20 వరల్డ్ కప్ సిరీస్లో ఏ దేశం విజేతగా నిలిచింది?
ఎ) భారత్ బి) ఇంగ్లాండ్
సి) ఆస్ట్రేలియా డి) దక్షిణాఫ్రికా
20. కింది వానిలో సరికానిది ఏది?
ఎ) తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పళని పంచామృతానికి జీఐ ట్యాగ్ లభించింది. దీనిని అరటి, బెల్లం, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన తేనె, కర్జూరంతో చేస్తారు
బి) ఒడిశా రసగుల్లాకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది. ధ్రువీకరణ పత్రాన్ని జులై 29న జారీ చేశారు.
సి) 2017 నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు రసగుల్లా కోసం పోటీ పడ్డాయి. పశ్చిమ బెంగాల్ రసగుల్లాకు 'బంగ్లార్ రసగుల్లా'గా జీఐ ట్యాగ్ జారీ చేశారు.
డి) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సభ్యదేశమైన భారత్లో 2000 సంవత్సరం నుంచి ఈ చిహ్నాలను ఇస్తున్నారు
21. ఆసియా నోబెల్గా ప్రసిద్ధి చెందిన రామన్ మెగసెసె అవార్డుకు 2019 సంవత్సరానికిగాను కిందివారిలో ఎన్నిక కానివారు ఎవరు?
ఎ) కొస్వెనిన్
బి) కివమ్జోంగ్-కి (దక్షిణకొరియా)
సి) నీతిపైజిత్ అంకాన్(థాయిలాండ్)
డి) సొనం వాంగ్చుక్(భారత్ )
22. కిందివాటిలో సరైన వాటిని కనుగొనండి?
1) ప్రముఖ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్, ప్రధాని నరేంద్ర మోడీ కలిసి ఉత్తరాఖండ్లోని జివమ్ కార్బెట్ జాతీయ పార్కులో సాహసయాత్రను చేపట్టారు.
2) ఈ సాహస యాత్ర ఆటస్టు 12న డిస్కవరీ గ్రూప్ చానళ్ళలో ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో ప్రసారమవుతుంది.
3) 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో భాగంగా ఈ సాహస యాత్రను చిత్రీకరించారు.
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3 డి) పైవన్నీ
23. కిందివాటిలో సరికాని అంశాన్ని కనుగొనండి?
ఎ) భారతదేశ అతిపెద్ద సరిహద్దు రక్షణ దళమైన బీఎస్ఎఫ్ నూతన డీజీగా వీకే జోహ్రి ఎంపికయ్యారు.
బి) ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రజనీ కాంత్ మిశ్రా ఆగస్ట్ 31న పదవీ విరమణ పొందనున్నారు.
సి) 3.6 లక్షల మంది సైనికులలో దేశంలోనే అతిపెద్ద సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్
డి) వి.కె. జోహ్రి 1984 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి
సమాధానాలు
1.ఎ 2.సి 3.సి 4.డి 5.డి
6.సి 7.డి 8.ఎ 9.సి 10.బి
11.సి 12.డి 13.బి 14.బి 15.సి
16.బి 17.ఎ 18.ఎ 19.ఎ 20.డి
21.బి 22.డి 23.సి
Authorization