1. జాతీయ స్థాయిలో నూతన విద్యా విధాన ముసాయిదాను ఎవరి నేతృత్వంలోని కమిటీ రూపొందించింది?
ఎ) సతీష్ ధావన్ బి) కస్తూరి రంగన్
సి) మాధవన్ నాయర్ డి) రాధాకృష్ణన్
2. 'సంప్రీతి - 2019' సంయుక్త సైనిక విన్యాసాలు ఏయే దేశాల మధ్య జరిగాయి?
ఎ) భారత్ - బంగ్లాదేశ్
బి) భారత్ - యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
సి) భారత్ - రష్యా
డి) భారత్ - సింగపూర్
3. ట్రాన్స్పోర్ట్ మొబిలిటీ కోసం 'వన్నేషన్, వన్ కార్డ్' పథకాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎక్కడ ప్రారంభించారు?
ఎ) ముంబై, మహారాష్ట్ర
బి) కోల్కతా, పశ్చిమ బంగా
సి) అహ్మదాబాద్, గుజరాత్
డి) చెన్నై, తమిళనాడు
4. దేశ విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాలని ఏ సంవత్సరం నాటి జాతీయ అటవీ విధానం నిర్దేశించింది?
ఎ) 1952 బి) 1962
సి) 1972 డి) 1982
5. ఏ దేశానికి మిరపకాయల ఎగుమతి ప్రొటోకాల్పై భారత్ సంతకం చేసింది?
ఎ) యునైటెడ్ కింగ్డమ్ బి) మెక్సికో
సి) ఇజ్రాయిల్ డి) చైనా
6. దేశంలోని ప్రజలందరికీ ఏ సంవత్సరం నాటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు?
ఎ) 2021 బి) 2022
సి) 2023 డి) 2024
7. భారత రాజ్యాంగానికి 'సంవిధాన్ కావ్య' రచనతో కావ్యరూపమిచ్చిన ఎవరికి 'పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ అవార్డు' లభించింది?
ఎ) లాల్బహదూర్ శాస్త్రీ బి) సంపూర్ణానంద
సి) సునీల్ కుమార్ గౌతమ్ డి) కైలాష్నాథ్ కట్టూ
8. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ - 2019లో భారత్ ర్యాంక్?
ఎ) 138 బి) 140 సి) 145 డి) 150
9. ఏ దేశంతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపర్చు కునేందుకు అయిదేళ్ళ మార్గదర్శక ప్రణాళికను రూపొందించామని ప్రధాని మోడీ ప్రకటించారు?
ఎ) ఫిలిప్పీన్స్ బి) కిర్గిజ్స్థాన్
సి) ఇండోనేషియా డి) పైవన్నీ
10. కింది అంశాలలో సరైనవి ఏవి?
1. 2019 జూన్ 14, 15 తేదీల్లో షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సును కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో నిర్వహించారు
2. ఈ సదస్సులో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తూ ఆరోగ్యానికి కొత్త భాష్యం చెప్పారు. 'HEALTH' పదంలోని ఒక్కో అక్షరానికి ఒక్కో పదాన్ని అన్వయిస్తూ అది దేశాల మధ్య సహకారానికి స్ఫూర్తి కావాలన్నారు. హెచ్ అంటే హెల్త్ కేర్, ఈ అంటే ఎకనామిక్ కో ఆపరేషన్, ఏ అంటే ఆల్టర్నేట్ ఎనర్జీ ఎల్ లిటరేచర్ అండ్ కల్చర్, టీ అంటే టెర్రరిజం ఫ్రీ సొసైటీ, హెచ్ అంటే హ్యుమానిటేరియన్ కో ఆపరేషన్' అని వివరించారు.
3. చైనా నాయకత్వంలో ఆరు దేశాలతో 2001లో ఎస్సీఒ ఏర్పాటైంది.
4. 2017 లో భారత్, పాకిస్తాన్ల చేరికతో సభ్య దేశాల సంఖ్య ఎనిమిదికి చేరింది.
ఎ) 1 మాత్రమే బి) 1, 2 మాత్రమే
సి) 1, 2, 3 మాత్రమే డి) పైవన్నీ సరైనవే
11. సెంటర్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజ్ను ఎక్కడ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది?
ఎ) మైసూర్, కర్ణాటక బి) తిరూర్, కేరళ
సి) సేలం, తమిళనాడు డి) వరంగల్, తెలంగాణ
12. భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల రక్షణ, భద్రతను బలోపేతం చేసే చర్యలను సూచించడానికి ఆర్బీఐ నియమించిన కమిటీ చైర్మన్ ఎవరు?
ఎ) సలీల్ పరేఖ్ బి) మహేశే జైన్
సి) వీరల్ ఆచారి డి) నందన్ నిలేకని
13. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి పథకం- అధికారిక పోస్టర్లో ప్రధానమంత్రి చిత్రాన్ని ఉపయోగించడం వల్ల 'ఆయుష్మాన్ భారత్ - ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన' నుంచి ఏ రాష్ట్రం వైదొలిగింది?
ఎ) తమిళనాడు బి) ఉత్తరప్రదేశ్
సి) ఆంధ్రప్రదేశ్ డి) పశ్చిమ్బంగ
14. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే 'ఒక కుటుంబం, ఒక ఉద్యోగం' పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) సిక్కిం బి) అసోం
సి) తెలంగాణ డి) హిమాచల్ప్రదేశ్
15. మహిళా సాధికారత, స్త్రీ పురుష సమానత్వంపై కృషి చేసే 'యూఎన్ - ఉమెన్' సంస్థకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు?
ఎ) లక్ష్మీపురి బి) అనితా భాటియా
సి) వినీతా ఫౌగట్ డి) సుప్రీతి దండే
16. గోసంరక్షణ, భద్రత, అభివృద్ధి ద్వారా సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన పథకం పేరు?
ఎ) రాష్ట్రీయ కామధేను అయోగ్
బి) గో సంరక్షణ్ యోజన
సి) ప్రధాన మంత్రి గో యోజన
డి) గ్రామ సంతోష్ గో సఫారీస్ అయోగ్
17. మేఘాలయలో జరగబోయే 2022 జాతీయ క్రీడల మస్కట్గా పేర్కొన్న జంతువు?
ఎ) సంగై బి) పులి
సి) క్లౌడెడ్ లెపార్డ్ డి) హిల్లాక్ గిబ్బన్
18. హిందీని తమ న్యాయ స్థానాలలో మూడో అధికారిక భాషగా చేర్చిన దేశం?
ఎ) ఇరాన్ బి) ఒమన్
సి) సౌదీ అరేబియా డి) యూఏఈ
19. కింది అంశాలలో సరైనవి?
1. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏండ్లు పూర్తి కానున్న సందర్భంగా 2018 నవంబర్లో నీతి అయోగ్ 'స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా@75 (అభినవ్ భారత్@75)' పేరిట ఒక నివేదికను రూపొందించింది
2. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నివేదికకు ముందు మాట రాశారు. నవ భారత నిర్మాణం కోట్లాది భారతీయుల ఆకాంక్షగా అభివర్ణించారు. అభివృద్ధి అందరి లక్ష్యంగా మారాలని కోరారు.
3. దేశాన్ని 2022 నాటికి నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం నివేదికలోని కీలక లక్ష్యం. తలసరి ఆదాయాన్ని పెంచడం, అవినీతి, బంధుప్రీతి లేని, పారదర్శకమైన, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, సమాన అవకాశాలు గల దేశంగా తీర్చి దిద్దడం లక్ష్యాల్లో ప్రధానమైనవి.
4. 'సబ్కా సాథ్-సబ్ కా వికాస్' నినాదం ప్రాతిపదికగా అభివృద్ధి అజెండా అమలు, రైతుల ఆదాయం రెట్టింపు, 'భారత్లో తయారీ' కార్యక్రమం బలోపేతం, వస్తు సేవల ఎగుమతులను 2022-23 నాటికి 800 బిలియన్ డాలర్లకు పెంచడం, ఏటా నూతన ఉద్యోగాల కల్పన, 'ఆయుష్మాన్ భారత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయడం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దీటైన శక్తిగా ఎదగడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు.
ఎ) 1 మాత్రమే బి) 1, 2 మాత్రమే
సి) 1, 3, 4 మాత్రమే డి) పైవన్నీ సరైనవే
20. ఎల్పీజీ రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఆవిర్భవించిన దేశం?
ఎ) భారత్ బి) అమెరికా
సి) దక్షిణ కొరియా డి) జర్మనీ
21. భారత్ వాతావరణ విభాగం అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
ఎ) మృత్యుంజయ మహాపాత్ర బి) సోమేష్ కుమార్
సి) వికాస్ బెనర్జీ డి) మోహన్ కనోజ్
22. సముద్ర మట్టంలో పెరుగుదల, వాతావరణ మార్పుల కారణంగా 2070 నాటికి అంతరించే దశకు చేరుకున్న పులి జాతి ఏది?
ఎ) సౌత్ చైనా టైగర్ బి) కాస్పియన్ టైగర్
సి) సైబీరియన్ టైగర్ డి) బెంగాల్ టైగర్
23. భారత పురుషుల ఫుట్బాల్ జట్టు కోచ్గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) గ్రహంరీడ్ బి) గులాం రబ్బానీ
సి) లాల్గింగ్లోవా హ్మర్ డి) ఐగోర్ స్టిమాక్
24. 2019 జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పీస్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్లీన్ ఎయిర్ గేమ్స్లో పర్యావరణ పరిరక్షణపై కీలకోపన్యాసం చేసిన భారత ప్రముఖుడెవరు?
ఎ) జగ్గీ వాసుదేవ్ బి) బాబా రామ్దేవ్
సి) శ్రీశ్రీ రవిశంకర్ డి) పైవారందరూ
25. 2019 మే 6 - 12 వరకూ జరిగిన 5వ ఐక్యరాజ్య సమితి ప్రపంచ రోడ్డు భద్రతా వారోత్సవాల నేపథ్యం?
ఎ) 'సేవ్ లైవ్స్ అండ్ స్పీకర్'
బి) 'లెట్స్ స్పీడ్ అప్ ది సొల్యూషన్స్'
సి) 'లీడర్షిప్ ఫర్ రోడ్ సేఫ్టీ'
డి) 'రైజింగ్ అవేర్నెస్ అబౌట్ ది రోడ్ సేఫ్టీ'
26. స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన 'స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2019' లో 2018కి అగ్రస్థానం దక్కించుకున్న దేశం?
ఎ) ఫిన్లాండ్ బి) ఇజ్రాయిల్
సి) అమెరికా డి) భారత్
27. స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన 'స్టార్టప్ ఎకోసిస్టమ్ ర్యాంకింగ్ 2019'లో భారత్ ర్యాంక్?
ఎ) 12 బి) 14 సి) 15 డి) 17
28. 5 రోజుల ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - 2019ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎక్కడ ప్రారంభించారు?
ఎ) జలంధర్, పంజాబ్
బి) హిసార్, హరియాణ
సి) లక్నో, ఉత్తరప్రదేశ్ డి) పనాజీ, గోవా
29. భారత ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా నియమితులైన ఇగోర్ స్టీమాచ్ ఏ దేశస్తుడు?
ఎ) అర్జెంటీనా బి) క్రొయేషియా
సి) జర్మనీ డి) పోర్చుగల్
30. కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఎవరు నియమితుల య్యారు?
ఎ) గజేంద్రసింగ్ షెకావత్
బి) రమేష్ పోఖియాల్ నిశాంక్
సి) నరేంద్రసింగ్ తోమర్
డి) రాంవిలాస్ పాస్వాన్
31. 2019 జనవరి 14న చంఢగీఢ్లోని చంఢ మందిర్లో IMBEX 2018 - 19లో ఏ దేశంతో కలిసి భారత్ ద్వైపాక్షిక సైనిక వ్యాయామంలో పాల్గొంది?
ఎ) మలేషియా బి) మయన్మార్
సి) మారిషస్ డి) మాల్దీవులు
32. పంజాబ్లోని ఫగ్వారాలో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో 'ఎగ్జిబిటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ దక్కించుకున్న సంస్థ?
ఎ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో
బి) ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ - డీఆర్డీఓ
సి) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్టీయల్ రీసెర్చ్ - సీఎస్ఐఆర్
డి) హిందూస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ - హెచ్ఏఎల్
33. షాంగై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం - 2019 జ్యూరీ సభ్యుడిగా ఎంపికైన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఎవరు?
ఎ) నితీష్ తివారీ
బి) ఆదిత్య చోప్రా
సి) సంజయ్ లీలా భన్సాలీ
డి) రాజ్కుమార్ హిరాణీ
34. 2020లో ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశం ఓషియన్ కాన్ఫరెన్స్కు ఆతిధ్యమివ్వనున్న దేశం?
ఎ) మాస్కో, రష్యా బి) బీజింగ్, చైనా
సి) లిస్బన్, పోర్చుగల్ డి) న్యూఢిల్లీ, భారత్
35. ఎల్ సాల్వడార్లో నిర్వహించిన 'మిస్ టీన్ వరల్డ్ - 2019' టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు?
ఎ) సుస్మితా సింగ్, ఇండియా
బి) తయాలా రాబిన్సన్, దక్షిణాఫ్రికా
సి) ఆనస్తాసియా సిదింపౌలో, గ్రీస్
డి) గాబ్రియెల్ మరినో, బ్రెజిల్
36. దక్షిణ చైనా సముద్రంలో జపాన్, ఫిలిప్పీన్స్, అమెరికా నౌకలతో పాటు భారత్కు చెందిన ఐఎన్ఎస్ కోల్కత, ఐఎన్ఎస్ శక్తి పాల్గొన్న ఎక్సర్సైజ్ పేరు?
ఎ) కోర్పట్ బి) వరుణ
సి) కొంకణ్ డి) గ్రూప్ సెయిల్
సమాధానాలు
1.బి 2.ఎ 3.సి 4.ఎ 5.డి
6.డి 7.సి 8.బి 9.బి 10.డి
11.బి 12.డి 13.డి 14.ఎ 15.బి
16.ఎ 17.సి 18.డి 19.డి 20.ఎ
21.ఎ 22.డి 23.డి 24.సి 25.సి
26.సి 27.డి 28.ఎ 29.బి 30.ఎ
31.బి 32.బి 33.డి 34.సి 35.ఎ
36.డి
Authorization