1. కింది వాటిలో పరోక్ష పన్ను కానిదేది?
1) కస్టమ్స్ సుంకాలు 2) సేవా పన్ను
3) సంపద పన్ను 4) ఎక్సైజ్ పన్ను
2. కింది వాటిలో పన్నేతర రాబడిలోని అంశం కానిదేది?
1) ఫీజులు, పెనాల్టీలు, గ్రాంట్ల ద్వారా వచ్చే ఆదాయం
2) కేంద్ర అమ్మకం పన్ను
3) ప్రభుత్వరంగ సంస్థలకు ఇచ్చే రుణాలపై వసూలయ్యే వడ్డీ 4) పైవన్నీ
3. ప్రాథమిక లోటును ఎలా రాబట్టవచ్చు?
1) ద్రవ్యలోటు - వడ్డీ చెల్లింపులు
2) ద్రవ్యలోటు+వడ్డీ చెల్లింపులు
3) బడ్జెట్ లోటు+మొత్తం రుణం
4) పైవేవీకావు
4. గాడ్గిల్-ప్రణబ్ ముఖర్జీ ఫార్ములా (1991) ప్రకారం కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటాకు సంబంధించి ప్రత్యేక సమస్యలు అనే అంశానికి ఇచ్చిన వెయిటేజి?
1) 6 శాతం 2) 7.1 శాతం
3) 7.5 శాతం 4) 15 శాతం
5. కింది వారిలో 14వ ఆర్థిక సంఘంలో సభ్యులు కానివారు?
1) అభిజిత్సేన్ 2) రంగరాజన్
3) గోవిందరావు 4) సుష్మానాధ్, సుదీప్తో
6. కె.సి.పంత్ కింది ఏ ఆర్థిక సంఘం అధ్యక్షుడు?
1) 10 2) 11 3) 12 4) 13
7. అన్ని విధాలైన వసూళ్లు, ఆదాయాలు, రుణాల ద్వారా సేకరించిన మొత్తం ఏ నిధి కింద జమ అవుతుంది?
1) సంచిత నిధి 2) ప్రభుత్వ ఖాతా
3) ప్రణాళిక వ్యయం 4) మూలధన రాబడి
8. 2018-19 సంవత్సరంతో పోల్చినపుడు 2019-20లో ఆరోగ్య రంగానికి కేటాయించిన మొత్తంలో పెరుగుదల?
1) 12% 2) 14% 3) 16% 4) 18%
9. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు 2019-20 బడ్జెట్లో కేటాయించిన మొత్తం?
1) రూ.17,000 కోట్లు 2) రూ.19,000 కోట్లు
3) రూ.21,200 కోట్లు 4) రూ.25,400 కోట్లు
10. కింది వాటిలో ఏ పథకం యువజనుల అభివద్ధికి దోహదపడుతుంది?
1) ప్రధానమంత్రి ముద్ర యోజన
2) స్టార్టప్ ఇండియా
3) స్టాండప్ ఇండియా 4) పైవన్నీ
11. 2019-20 కేంద్ర బడ్జెట్లో వడ్డీ చెల్లింపులను ఎంతగా అంచనావేశారు?
1) రూ.5,15,000 కోట్లు
2) రూ.6,65,061 కోట్లు
3) రూ.6,75,980 కోట్లు
4) రూ.7,17,000 కోట్లు
12. భారత్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ?
1) సరోజినీదేవి 2) ఇందిరా గాంధీ
3) సుమిత్రా మహాజన్ 4) సుష్మా స్వరాజ్
13. పెర్ఫామెన్స్ బడ్జెట్ను 1962లో మొదటిగా ఏ దేశం ప్రవేశపెట్టింది?
1) ఫ్రాన్స్ 2) జర్మనీ
3) అమెరికా 4) జపాన్
14. ఎన్నికలు, కరువు-కాటకాలు లాంటి సందర్భాలలో 2 నుంచి 6 నెలల కాలానికి ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ను ఏ విధంగా వ్యవహరిస్తారు?
1) ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2) సంతులిత బడ్జెట్
3) స్థిర బడ్జెట్ 4) అనుబంధ బడ్జెట్
15. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తొలి సెమీ హైస్పీడ్ రైలు?
1) వందే భారత్ ఎక్స్ప్రెస్ 2) గరీబ్రథ్
3) రాజధాని ఎక్స్ప్రెస్
4) అలహాబాద్ దురంతో ఎక్స్ప్రెస్
16. ప్రాథమిక లోటును 2019-20 కేంద్ర బడ్జెట్లో ఎంతగా అంచనావేశారు?
1) రూ.35,938 కోట్లు 2) రూ.36,938 కోట్లు
3) రూ.38,938 కోట్లు 4) రూ.41,118 కోట్లు
17. విజయ్ కేల్కర్ ఏ ఆర్థిక సంఘం అధ్యక్షుడు?
1) 11 2) 13 3) 1 4) ఏదీకాదు
18. కె.సి.నియోగి అధ్యక్షతన మొదటి ఆర్థిక సంఘాన్ని కింది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1951 2) 1969
3) 1984 4) 1994
19. రక్షణ రంగానికి 2019-20 బడ్జెట్లో కేటాయించిన మొత్తం?
1) రూ.2,90,000 కోట్లు 2) రూ.2,95,000 కోట్లు
3) రూ.3,01,866 కోట్లు 4) రూ.4,50,000 కోట్లు
20. నల్లధన రద్దు చట్టం, పెద్ద నోట్ల రద్దు కారణంగా ఎంత మొత్తం పన్ను పరిధిలోకి వచ్చిందని ఆర్థిక మంత్రి 2019-20 బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు?
1) రూ.1,00,000 కోట్లు
2) రూ.1,30,000 కోట్లు
3) రూ.1,75,000 కోట్లు
4) రూ.2,15,000 కోట్లు
21. 2019-20 కేంద్ర బడ్జెట్లో కింది ఏ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది?
1) సాగర్ మాల
2) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
3) ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన
4) పైవేవీ కావు
22. మత్స్య సంపద విషయంలో ప్రపంచంలో భారత్ స్థానం?
1) 2 2) 3 3) 5 4) 8
23. కోల్కతా నుంచి కింది ఏ ప్రాంతానికి తొలిసారిగా దేశీయంగా జల రవాణా ద్వారా సరుకు రవాణా ప్రారంభమైంది?
1) ముంబై 2) గాంధీ నగర్
3) వారణాసి 4) విశాఖపట్నం
24. కింది ఏ ప్రాంతాలలో కొన్ని దశాబ్దాలుగా నిలిచి పోయిన వంతెన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి?
1) అరుణాచల్ప్రదేశ్ 2) అస్సాం
3) ఢిల్లీ 4) పైవన్నీ
25. పాక్యాంగ్ విమానాశ్రయం కింది ఏ రాష్ట్రంలో ఉంది?
1) మేఘాలయ 2) సిక్కిం
3) త్రిపుర 4) కర్ణాటక
26. భారత్లో 1947 నవంబర్ 26న మొదటిగా బడ్జెట్ను ప్రవేశపెట్టినవారు?
1) మొరార్జీ దేశారు 2) షణ్ముఖ శెట్టి
3) రాజగోపాలచారి 4) నెహ్రూ
27. ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతూ బడ్జెట్ను ప్రవేశ పెట్టినవారు?
1) నెహ్రూ 2) ఇందిరా గాంధీ
3) రాజీవ్ గాంధీ 4) పై వారందరూ
28. కింది వారిలో వ్యయ సంస్కరణల కమిటీ అధ్యక్షుడు ఎవరు?
1) కె.సి. పంత్
2) కె.పి. గీతాకష్ణన్
3) రఘురామ్రాజన్ 4) వై.వి. రెడ్డి
29. కింది ఏ కమిటీ సిఫార్సు మేరకు 1925 సంవ త్సరం నుంచి సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరుచేశారు?
1) గీతాకష్ణన్ 2) కె.సి. పంత్
3) వల్లభ్భాయ్ పటేల్ 4) అక్వర్త్
30. గత అయిదు సంవత్సరాల కాలంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మొత్తం ఎన్ని గహాలు నిర్మించినట్లుగా 2019-20 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు?
1) 1.4 లక్షల కోట్లు 2) 1.53 లక్షల కోట్లు
3) 2.45 లక్షల కోట్లు 4) 3.25 లక్షల కోట్లు
31. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2019-20 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు?
1) రూ.60,000 కోట్లు 2) 65,000 కోట్లు
3) 70,000 కోట్లు 4) 75,000 కోట్లు
32. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి అందించిన రుణం?
1) రూ.11.05 లక్షల కోట్లు
2) రూ.11.15 లక్షల కోట్లు
3) రూ.11.68 లక్షల కోట్లు
4) రూ.11.75 లక్షల కోట్లు
33. జి.డి.పి.లో పన్ను ఆదాయం 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ఉంటుందని అంచనా వేశారు?
1) 12.1 శాతం 2) 12.5 శాతం
3) 13.1 శాతం 4) 15.1 శాతం
34. రాష్ట్రీయ గోకుల్ మిషన్కు 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన మొత్తం?
1) రూ.625 కోట్లు 2) రూ.670 కోట్లు
3) రూ.715 కోట్లు 4) రూ.750 కోట్లు
35. నేషనల్ శాంపుల్ సర్వే అభిప్రాయంలో మొత్తం రైతులలో రుణగ్రస్త రైతులు శాతం పరంగా?
1) 45 శాతం 2) 49 శాతం
3) 52 శాతం 4) 54 శాతం
36. 2019-20 కేంద్ర బడ్జెట్లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జి.డి.పి.లో ఎంత శాతంగా నిర్ణయించారు?
1) 3.2 శాతం 2) 3.4 శాతం
3) 3.7 శాతం 4) 3.9 శాతం
37. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయం చెన్నై నుంచి ఏ ప్రాంతానికి మార్చారు?
1) హైదరాబాద్ 2) పూణే
3) న్యూ ఢిల్లీ 4) కోల్కత్తా
38. తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి 2017-18లో స్థిర ధరల వద్ద (2011-12) కింద ఇచ్చిన ఏ రాష్ట్రంలో ఎక్కువ?
1) ఢిల్లీ 2) సిక్కిం
3) మహారాష్ట్ర 4) ఆంధ్రప్రదేశ్
39. తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి 2016-17లో స్థిర ధరల వద్ద కింది ఏ రాష్ట్రంలో అధికం?
1) ఢిల్లీ 2) సిక్కిం
3) మధ్యప్రదేశ్ 4) గోవా
40. ప్రత్యేక ప్రాంత అభివద్ధికి సంబంధించి సరికానిది?
1) చిన్న రైతుల అభివద్ధి ఎజెన్సీ
2) కరువుపీడిత ప్రాంతాల కార్యక్రమం
3) అంత్యోదయ
4) ఉపాంత రైతుల, వ్యవసాయ కార్మికుల అభివద్ధి కార్యక్రమం
41. ప్రాంతీయ అసమానతలను తొలగించాల్సిన ఆవశ్య కతను కింది ఏ పంచవర్ష ప్రణాళిక మొదటగా గుర్తించింది?
1) 1వ 2) 2వ 3) 3వ 4) 5వ
42. వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి సంబంధించి ఏర్పాటైన అత్యున్నత స్థాయి జాతీయ కమిటీ తన నివేదికను కింది ఏ ప్రణాళికలో సమర్పించింది?
1) 6వ 2) 8వ 3) 10వ 4) 12వ
43. భారత్లో ప్రాంతీయ అసమానతలు పెరగడానికి దోహదపడిన అంశం?
ఎ) భౌగోళిక కారకాలు
బి) అవస్థాపనా సౌకర్యాల కొరత
సి) హరిత విప్లవ ప్రభావం కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉండటం
డి) చరిత్రాత్మక కారకాలు
1) ఎ, డి 2) సి, డి
3) ఎ, సి 4) ఎ, బి, సి, డి
44. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనను 2000 డిసెంబర్ 25న ఎవరు ప్రారంభించారు?
1) రాజీవ్గాంధీ 2) వి.పి. సింగ్
3) అటల్ బిహారీ వాజ్పేయి 4) దేవెగౌడ
45. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజనను 2011లో ఏ విధంగా రీడిజైన్ చేశారు?
1) నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్
2) అక్షర భారత్ 3) స్వచ్ఛ భారత్
4) పైవేవీ కాదు
46. కింది ఏ దేశం నుంచి ఇటీవల ముడి చమురు దిగుమతిని భారత్ నిలిపివేసింది?
1) సౌదీ అరేబియా 2) ఇరాన్
3) జోర్డాన్ 4) రష్యా
47. పురుషుల్లో ఆయుఃప్రమాణం 2012-16 మధ్య కాలంలో కింది ఏ రాష్ట్రంలో అధికంగా నమోదైంది?
1) ఢిల్లీ 2) జమ్మూ-కశ్మీర్
3) కేరళ 4) పశ్చిమ బెంగాల్
సమాధానాలు
1 3 2.2 3.1 4.3 5.2
6.1 7.1 8.3 9.2 10.4
11.2 12.2 13.3 14.1 15.1
16.3 17.2 18.1 19.3 20.2
21.2 22.1 23.3 24.4 25.2
26.2 27.4 28.2 29.4 30.2
31.1 32.3 33.1 34.4 35.3
36.2 37.3 38.1 39.4 40.3
41.2 42.1 43.4 44.3 45.1
46.2 47.1