1. ఏకకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి? దాని లక్షణాల ను తెలుపండి?
పరిచయం : ఏక కేంద్ర ప్రభుత్వంలో పాలనాధికారాలన్నీ ఒకే ఒక ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఏ దేశంలోనైతే అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయో దానిని ఏక కేంద్ర ప్రభుత్వం అంటారు.
లక్షణాలు :
- అధికారాల కేంద్రీకరణ : ఏక కేంద్ర ప్రభుత్వంలో అధికారా లన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. రాష్ట్ర అధికారాలకు కేంద్ర ప్రభుత్వ బండాగారంగా పనిచేస్తుంది.
- స్థానిక / ప్రాంతీయ ప్రభుత్వాలు : ఏక కేంద్ర ప్రభు త్వంలో స్థానిక / ప్రాంతీయ ప్రభుత్వాలను కేంద్రమే ఏర్పాటు చేసి వాటికి అధికారాలను ఇస్తుంది. ప్రాంతీయ ప్రభుత్వాల ఉనికి కేంద్ర ప్రభుత్వంపై అధారపడి ఉంటుంది. వీటికి స్వయం నిర్ణయాధికారం ఉండదు.
ఉదా : ఇంగ్లాండ్
- అదృఢ రాజ్యాంగం : ఏక కేంద్ర ప్రభుత్వంలో కేంద్రమే ఏక పక్షంగా రాజ్యాంగ సవరణ చేస్తుంది. దీనిలో రాష్ట్రాలకు ఎలాంటి భాగస్వామ్యం లేదు.
- ఏకరూప పాలన : ఏక కేంద్ర ప్రభుత్వంలో అధికారాల చెలా మణి ప్రజలందరికీ ఆ దేశ భూభాగమంతటికీ ఒకే విధంగా ఉండి దేశానికంతటికీ బలమైన పాలన కొనసాగుతుంది
- ఏక పౌరసత్వం : ఏక కేంద్ర ప్రభుత్వంలో పౌరులకు ఒకే పౌరసత్వం ఉంటుంది. అదే జాతీయ పౌరసత్వం పౌరులకు ప్రాంతీయ పౌరసత్వం ఇవ్వరు.
ప్రశ్న : సమాఖ్య ప్రభుత్వం అంటే ఏమిటి? వాటి లక్షణాలను పరిశీంలిచండి?
పరిచయం : కేంద్ర - రాష్ట్రాల మధ్య అధికారాలు రాజ్యాంగ బద్దంగా పంపిణీ జరిగే ప్రభుత్వాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటారు.
లక్షణాలు :
- లిఖిత రాజ్యాంగం : సాధారణంగా సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ ఉనికిలో ఉన్న దేశాలలో లిఖిత రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం దేశానికి అత్యున్నత శాసనంగా పరిగణిస్తారు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణి జరుగుతుంది.
- దృఢరాజ్యాంగం: సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం దృఢ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల రాజ్యాంగ సవరణ అంత సులభం కాదు. కొన్ని ముఖ్యమైన అంశాలను సవరించడానికి కేంద్ర రాష్ట్రాల అనుమతి తప్పనిసరి.
- అధికారాల విభజన : సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రా ల మధ్య అధికారాల విభజన రాజ్యాంగ పరంగా ఉంటుంది. ముఖ్యమైన అధికారాలు కేంద్ర ప్రభుత్వం అధ్వర్యంలో ఉంటాయి. ఉదా: విదేశీ వ్యయాలు, రక్షణ, దిగుమతులు, ఓడరేవులు అదేవిధంగా వ్యవసాయం, విద్య, వైద్యం, నీటిపారుదల ప్రాంతీయ ప్రభుత్వాలకు అప్పగించడం జరుగుతుంది.
-ద్విసభా విధానం : ద్విసభా అనేది సమాఖ్య ప్రభుత్వ ముఖ్య లక్షణం దీనిలో రెండు ఉంటాయి. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రాల ప్రయోజ నాలను పరిరక్షి స్తుంది. దిగువ సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
- స్వతంత్రన్యాయవ్యవస్థ: సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రా ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి స్వతంత్ర న్యాయవ్యస్థ ఉంటుంది.
ప్రశ్న: అధ్యక్ష తరహాప్రభుత్వం అంటే ఏమిటి? వాటి లక్షణాలను చర్చించండి?
పరిచయం: అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గం తన చర్యలకు, శాసన నిర్మాణ శాఖకు ఎటువంటి బాధ్యత వహించదు. అధ్యక్షుడు ఒక్కడే అన్ని రకాల కార్యనిర్వాహక అధికారాలను అనుభవిస్తాడు.
లక్షణాలు :
- అధ్యక్షుడు రాజ్యానికి ప్రభుత్వాధినేత: అధ్యక్ష తరహ ప్రభుత్వంలో అధ్యక్షుడు ఇటు రాజ్యాధినేత గాను, ప్రభుత్వాధినేతగాను కొనసాగుతారు. వాస్తవ కార్యనిర్వహక అధికారాలను చెలాయిస్తాడు. అతడు తన సెక్రటరీల ద్వారా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తాడు.
- కార్యనిర్వాహక శాఖ నుండి శాసన శాఖ వేరు చేసి ఉంటుంది: అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసన శాఖ కార్యనిర్వాహకశాఖ రెండు వేరు వేరు . స్వతంత్య్రంగా వ్యవహరిస్తూ ఒక శాఖ మరోక శాఖ విషయంలో జోక్యం చేసుకోదు.
- రాజ్యాధినేత, ప్రభుత్వాధినేత ఎన్నిక :
అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో కార్యనిర్వాహక వర్గం వారసత్వం ద్వారాగాని నామినేట్ చేయడం ద్వారా గాని ఏర్పడదు. ప్రజల నుంచి నేరుగా ఎన్నిక కావడం వల్ల ఏర్పడుతుంది.
- అధ్యక్షుడి అభిశంసన : అధ్యక్షుడు అన్నిరకాల ప్రభుత్వ అధికారాలు సిద్ధాంత రీత్యా వాస్తవిక రూపంలోను అనుభవిస్తారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన, తప్పు చేసిన శాసనసభ అభిశంసన ద్వారా తొలగిస్తుంది.
- నిరోధ సమతౌల్యం: అధ్యక్ష ప్రభుత్వం ముఖ్య లక్షణం నిరోధ సమతౌల్యం. ఈ వ్యవస్థలో ప్రతి ప్రభుత్వ అంగం సర్వస్వతంత్రతన కలిగి ఉంటుంది. అదే సందర్భంలో ప్రతి ప్రభుత్వ అంగం మరో అంగం అధికంగా నిర్వహించే అధికారాలను నిరోధించే అధికారాన్ని కూడా కలిగి ఉంటుంది.
ప్రశ్న: పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు, గుణదోషాలను వివరించండి?
- పార్లమెంటరీ ప్రభుత్వం అనగా కార్యనిర్వహక శాఖ, శాసన నిర్మాణ శాఖలు రెండు సమన్వయంతో పని చేస్తూ ఏర్పడే ప్రభుత్వం.
లక్షణాలు:
- నామమాత్రపు, వాస్తవ అధికారం: పార్లమెంటరీ ప్రభు త్వంలో రెండు రకాల కార్యనిర్వహక అధిపతులు ఉంటారు. ఒకరు రాజ్యాధినేతగా నామమాత్రపు అధికారి అయితే మరొకరు ప్రభుత్వాధినేతగా వాస్తవాధికారి. నామమాత్రపు అధిపతిగా రాష్ట్రపతి ఉంటే వాస్తవ అధినేతగా ప్రధాన మంత్రి ఉంటారు.
- శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం: ఈ తరహా ప్రభుత్వంలో శాసనశాఖకు కార్యనిర్వ హక శాఖకు మధ్య చక్కటి సమన్వయం ఉండటం. కార్యనిర్వహక శాఖలో కొనసాగే సభ్యులు శాసన శాఖ నుంచి ఎంపిక చేయబడతారు.
- ప్రధానమంత్రి విశిష్ట పాత్ర: ప్రధాన మంత్రి పార్లమెంటరీ ప్రభుత్వంలో వాస్తవ కార్య నిర్వహణ అధికారి మత్రులను ఎంపిక చేయటం వారికి శాఖలు కేటాయించటం, మార్పులు చేర్పులు చేయడంతోపాటు ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరే అధికారం ప్రధాన మంత్రికి ఉండటం మూలంగా ప్రధానమంత్రి పదవికి విశిష్టత ఏర్పడింది.
- సమిష్టి బాధ్యత : సమిష్టి బాధ్యత అనేది పార్లమెంటరీ ప్రభుత్వ మౌళిక లక్షణం మంత్రులందరు శాసన నిర్మాణ శాఖలోని దిగువ సభకు సమిష్టిగా బాధ్యత వహిస్తారు.
- దిగువ సభ రద్దు: పార్లమెంటరీ మంత్రి మండలికి మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సందర్భంలో ప్రధానమంత్రి దిగువసభ రద్దుకోసం కోరి తిరిగి ఎన్నికలకు వెళ్ళి ఓటరు విశ్వాసం కోరే అవకాశం ఉంటుంది.
ప్రయోజనాలు:
- శాసన, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం: ఈ ప్రభుత్వ విధానంలో రెండు శాఖల మధ్య సహకారం, సమన్వయం ఉంటాయి. మంత్రి మండలి శాసన సభలో అంతర్భాగం. శాసన సభ్యుల అభిప్రాయం ప్రకారం మంత్రులు చట్టాలను రూపొందిస్తారు. అలాగే మంత్రులు ప్రవేశ పెట్టే బిల్లుల్ని శాసన సభ్యులు అమోదిస్తారు. కాబట్టి ఈ రెండు శాఖల మధ్య వివాదాలకు, సంఘర్షణలకు అవకాశం ఉండదు.
- ప్రభుత్వ నియంతృత్వానికి అవకాశం తక్కువ: మంత్రి మండలి ప్రత్యక్షంగా పార్లమెంటుకు, పరోక్షంగా ప్రజలకు బాధ్యత వహిస్తుంది. శాసన సభ్యుల ప్రశ్నలు అనుబంధ ప్రశ్నలు వేయడం ద్వారా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టడం ద్వారా అధికారంలో ఉన్న పార్టీని నియంత్రిస్తారు.
- అధికారాల వికేంద్రీకరణకు అవకాశం: పార్లమెంటరీ ప్రభుత్వం అధికారాల వికేంద్రీకరణ జరుగుతుంది. కార్యనిర్వహణాధికారం ఏ ఒక్కరి చేతిలో కేంద్రీకృతం కాదు. మంత్రులు మధ్య అధికారాలపంపిణీ జరుగు తుంది.
- ప్రత్యామ్నయ ప్రభుత్వ ఏర్పాటు సులభం: ఈ ప్రభుత్వంలో ఎటువంటి మార్పులనైనా సులభంగా ప్రవేశ పెట్టవచ్చు. అవిశ్వాస తీర్మానం ద్వారా మంత్రి వర్గాన్ని తొలగించిన తరువాత ప్రతి పక్షాలు ప్రత్యామ్నయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటాయి.
- విస్తృత ప్రాతినిధ్యం: మంత్రివర్గ నిర్మాణంలో దేశంలోని విభిన్న వర్గాల వారికి ప్రాంతాలవారికి సముచితమైన ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణలో అన్ని వర్గాలవారికి, ప్రాంతాల వారికి భాషలవారికి ప్రాతినిధ్యం కల్పించడం జరుగుతుంది.
లోపాలు :
- అధికార వృధక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం: మంత్రులుశాసన కార్యనిర్వహణ శాఖలో సమస్యలుగా ఉంటారు. రెండు శాఖల మధ్య అవగాహన సహకారం ఉంటుంది. మంత్రి మండలి పార్లమెంటులో అంతర్భాంగంగా పని చేయడం వల్ల అధికార విభజన సిద్ధాంతానికి భంగం కలుగుతుంది.
- అస్థిర ప్రభుత్వం: పార్లమెంటరీ విధానంలో ప్రభుత్వం పూర్తి పదవీకాలం ఉంటుందన్న నమ్మకం లేదు. దీనికి గల కారణం మంత్రి వర్గాలు శాసన సభ్యుల మద్ధతుపై ఆధారపడి ఉండటమే ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసం ఉన్నంత వరకు పదవీలో ఉంటుంది.
- మంత్రిమండలి నిర్మాణం కష్టం : మంత్రి వర్గ నిర్మాణం అంత సులభం కాదు. ప్రధాన మంత్రి మంత్రులను ఎంపిక చేసేటపుడు అనేక అంశాలను కుల, మత, భాష, ప్రాంతం పాలనా దక్షత పార్టీ విధేయతను దృష్టిలో ఉంచుకోని అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచవలసి ఉంటుంది. అందువల్ల మంత్రివర్గ నిర్మాణం చాలా కష్టం.
- అత్యవసర పరిస్థితులకు తగినది కాదు: అత్యవసర పరిస్థితులలో సంభవించే ప్రమాదాలను అదిగమించే శక్తి దీనికి ఉండదు. త్వరిత గతిన నిర్ణయాలు తీసుకోవ డానికి వీలుకాదు. దీనికి గల కారణం కార్యనిర్వహణ అధికారాలు ఒక్కరి చేతిలో ఉండకపోవడం.
- పార్టీ ప్రయోజనాలకు అధిక్యత: పార్లమెంటరీ ప్రభుత్వం ప్రధానంగా పార్టీ ప్రభుత్వం. పార్లమెంటరీ తన మెజారిటీని కాపాడుకోవడానికి కృషి చేస్తుంది. అవసరమైతే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది.
ప్రశ్న: ఏక కేంద్ర ప్రభుత్వ గుణదోషాలను ఒక వ్యాసం రాయండి?
- బలమైన పాలన: ఏక కేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల సత్వర నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. ప్రభుత్వాంగాలన్నీ ఒకే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటంవల్ల శక్తిమంతంగా, సమగ్రమైన, సుస్థిర పాలనను అందించడం ద్వారా బలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది.
- తక్కువ వ్యయం : ఏక కేంద్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల ప్రభుత్వ నిర్మాణం, నిర్వాహణకు తక్కువ ఆర్థిక వనరులు సరిపోతాయి. దీనివల్ల ప్రజాధనం వృథాకాదు.
- సరళమైన పాలన : ఈ ప్రభుత్వంలో పాలన సులభంగా ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంటుంది.
- సత్వర నిర్ణయాలు అత్యవసరం: పరిస్థితిని ఎదుక్కోవటంలో ఇది బలమైన ప్రభుత్వం ఊహించని పరిణామాలు ఏర్పడినపుడు అత్యవసర సమయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.
- చిన్న రాష్ట్రాలకు అనువైనది:తక్కువ జనాభా పరిమితమైన భౌగోళిక ప్రాంతాలు ఉండే రాష్ట్రాలకు ఇది అనువైనది.
ఏక కేంద్ర ప్రభుత్వ దోషాలు
- నిరంకుశ అధికారం: ఏకకేంద్ర వ్యవస్థలో అన్ని రకాల అధికారాలు ఒకే ఒక కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండటం వల్ల అధికారంలో ఉన్న వ్యక్తులు తమ ఇష్టానుసారంగా నియంతృత్వ ధోరణిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
- పెద్ద రాష్ట్రాలకు అనువైనది కాదు: విశాలమైన భూభాగం, అధిక జనాభా, భిన్నమతాలు, పలు భాషలు, వివిధ సంస్కృతులు నెకొని ఉన్న రాజ్యాలలో ఏక కేంద్ర ప్రభుత్వ విధానం అనువైంది కాదు.
- అసమర్థత పెరిగే అవకాశం : ఈ తరహ ప్రభుత్వంలో ప్రాంతీయ ప్రభుత్వాలకు స్వయం నిర్ణయాధికారం ఉండదు. అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వలన పని భారం, అసమర్థత పెరిగే అవకాశం ఉంది.
Authorization