ఇటీవల పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం.. పౌరసత్వ సవరణ బిల్లు, పౌరసత్వం అనేవి ఎందుకు? అసలు పౌరసత్వాన్ని ఎందుకు సవరించాల్సి వచ్చింది. దాని వల్ల ఎవరు లాభపడతారు. దాని ఉపయోగం ఏమిటి తదితర విషయాల గురించి తెలుసుకుందాం..
పౌరసత్వ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వం ఎందుకు తీసుకువచ్చిందంటే.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లలో మత వివక్ష కారణంగా వలస వచ్చిన ముస్లిమేతరు లకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్షా పార్లమెంటులో దిగువసభలో 9 డిసెంబర్ 2019న ప్రవేశపెడితే ప్రజాప్రతినిధుల సభ అదే రోజు ఆమోదం తెలిపారు. పెద్దల సభలో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వేశారు. పెద్దల సభలో 11 డిశెంబర్న 125 - 99 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. పౌరసత్వ సవరణ బిల్లును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ డిశెంబర్ 12న ఆమోదముద్ర వేశారు.
- రాజ్యాంగంలోని అధికరణ 14 అందించే సమానత్వ హక్కుకు ఈ బిల్లు విఘాతం కాదు.
- ఈ బిల్లు ప్రకారం రోహింగ్యాలకు ఎట్టి పరిస్థితుల్లో పౌరసత్వం ఇవ్వరు.
- భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులను ఆదుకోవడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం
- బంగ్లాదేశ్,పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు వద్ద రేషన్ కార్డు వంటి ఆధారపత్రాలేవి లేకపోయినా ప్రతిపాదిత చట్టం ద్వారా వారికి పౌరసత్వం మంజూరు చేయడం. గతంలోనూ మన దేశం ఈ విధంగా చేసింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ ఉపప్రధానిగా సేవలందించిన ఎల్.కె. అద్వానీ ఇలా పాకిస్తాన్ నుంచి వచ్చిన వారే..
- రాజ్యాంగంలోని అధికరణ 6లో చేర్చి ఉన్న అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాలకు ప్రతిపాదిత చట్టం వర్తించదు.
- శరణార్థులుగా వచ్చి మన దేశంలో ఐదేళ్ళుగా నివాసం ఉంటున్న వారికి పౌరసత్వం వస్తుంది.
- గత ఆరేళ్ళలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును తెరాస వ్యతిరేకించడం ఇదే మొదటిసారి.
- ఎన్డీయే రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులో ఆర్టీఐ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతునిచ్చింది. ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో తటస్థంగా ఉంది. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. ఈ బిల్లును ఈశాన్య రాష్ట్రాలతో పాటు అసోం వ్యతిరేకిస్తోంది. పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వ్యతిరేకిస్తున్నారు.
- అయితే పౌరసత్వం గురించి, అంటే ఎవరు పౌరులు,ఎవరు విదేశీయులు, ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు తదితర విషయాల గురించి రాజ్యాంగం ఏమి పేర్కొంటుందో చూద్దాం.
- రాజ్యాంగంలోని II వ భాగంలో నిబంధనలు 5 - 11 వరకు గల అధికరణలు పౌరసత్వం గురించి స్పష్టంగా పేర్కొంటున్నాయి.
- పౌరసత్వం అనే పదం ఆంగ్లంలోని 'citizenship' అనే పదానికి అనువాదం.ఇది లాటిన్ భాషలోని 'సివిస్', 'సివిటాస్' అనే పదాల నుంచి ఆవిర్భవించింది. సివిస్ అనగా పౌరులు అని, సివిటీస్ అనగా నగరం అని అర్థం.
- పౌరసత్వ భావన ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలలో మొదటిసారిగా ఆవిర్భవించింది.
- ఇతర ఆధునిక రాజ్యాల వలే మన దేశంలో కూడా రెండు రకాల ప్రజలు ఉంటారు. 1. పౌరులు 2. విదేశీయులు
- పౌరులకు ఆ రాజ్యంలో పౌర, రాజకీయ హక్కులు కల్పిస్తారు.
- విదేశీయులకు మానవతా దృక్పథంతో కొన్ని పౌర హక్కులు మాత్రమే కల్పిస్తారు.
- భారత రాజ్యాంగం ఈ కింది హక్కులను పౌరులకు ప్రసాదిస్తుంది.
- అధికరణ 15 ప్రకారం పౌరులకు జాతి, మత, కుల,లింగ, పుట్టుక ప్రాతిపదికపై వివక్ష చూపరాదు.
- అధికరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు భారత పౌరులు మాత్రమే అర్హులు
- అధికరణ 19 ప్రకారం వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రం, సమావేశం కావటానికి సంస్థలు అల వరుచుకోవానికి, నివాసం ఉండడానికి వృత్తిని అవలంభించడానికి పౌరులకే పరిమితం.
- అధికరణ 29, 30 ప్రకారం సాంస్కృతిక, విద్యా హక్కులు పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
- లోక్సభ, రాష్ట్ర విధాన సభకు జరిగే ఎన్నికలలో ఓటు వేసే హక్కు
- పార్లమెంటు, రాష్ట్ర శాసనసభకు పోటీ చేసే హక్కు
- కొన్ని నిర్ధిష్టమైన ప్రజా సంబంధమైన పదవులకు అర్హత కలిగి ఉండడం
- అనగా భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర గవర్నర్లు భారత అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ హక్కులతో పాటు కొన్ని విధులను నిర్వర్తించాలి. అవి : పన్నులు చెల్లిం చడం, జాతీయ జెండాని, జాతీయ గీతాన్ని గౌరవించడం దేశాన్ని రక్షించడం.
జన్మత: పౌరుడు, సహజీకృత పౌరుడు ఎవరైనా భారతదేశం లో రాష్ట్రపతి పదవికి అర్హుడే. కానీ అమెరికా అధ్యక్ష పదవికి జన్మత: పౌరుడే అర్హుడు. సహజీకృత పౌరునికి అర్హత లేదు.
మన దేశంలో నివసించే విదేశీ పౌరులకు కల్పించబడిన హక్కులు :
- నిబంధన 14 చట్టం మందు అందరూ సమానమే.
- నిబంధన 20 అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ
- నిబంధన 21 జాతీయ హక్కు, 21(ఎ) విద్యాహక్కు
- నిబంధన 22 అక్రమ అరెస్టులకు రక్షణ
- నిబంధన 23 పీడనాన్ని నిరోధించే హక్కు
- నిబంధన 24 వెట్టిచాకిరి నిర్మూలన
- నిబంధన 25 మత స్వేచ్ఛ
- నిబంధన 27 మతం ఆధారంగా పన్నుల నిషేధం
- నిబంధన 28 ప్రత్యేక మతబోధన నిషేధం
రాజ్యాంగ ప్రకరణలు
5వ ప్రకరణ : రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయానికి భారతదేశంలో నివసించే పౌరులు భారతీయులే. (26 జనవరి 1950)
- అతడు భారతదేశంలో జన్మించి ఉండాలి.
- తల్లిదండ్రులలో ఎవరైనా భారత భూభాగంలో జన్మించి ఉండాలి.
- రాజ్యాంగం అమలులోకి రాకపూర్వం ఐదు సంవత్సరాలు నివసించి ఉండాలి.
ప్రకరణ 6 : పాకిస్తాన్ నుంచి భారతదేశం వలస వచ్చిన వ్యక్తికి భారతీయ పౌరసత్వానికి కావాల్సిన అర్హతలు.. వ్యక్తి లేదా తల్లిదండ్రులు అవిభక్త భారత్లో జన్మించి ఉండాలి.1948 జులై 19 లోపు తమ పేర్లను సంబంధిత కమిషనరేట్ల వద్ద నమోదు చేసుకుని ఉంటే వారికి భారత దేశం పౌరసత్వం లభిస్తుంది.
ప్రకరణ 7 : భారతదేశం నుంచి పాకిస్తాన్కు వలసపోయిన వ్యక్తి తిరిగి భారత్కు వస్తే భారతీయ పౌరుడు కావచ్చును. దీని కోసం ఆ వ్యక్తి దరఖాస్తు పెట్టుకున్న తేదికి ఆరు నెలల పాటు భారత భూభాగంలో నివాసం ఉండాలి.
ప్రకరణ 8 : ఒక వ్యక్తి తాను గానీ తన తల్లిదండ్రులు ఎవరైనా భారతీయ సంతతికి చెంది ఉన్నట్లయితే అలాంటి వారు రక్త సంబంధం ప్రకారం భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు.
ప్రకరణ 9 : ఏ వ్యక్తి అయినా స్వచ్ఛందంగా విదేశీ పౌరస త్వాన్ని స్వీకరిస్తే సహజంగానే భారతీయ పౌరుడు కాడు / భారతీయుడిగా పరిగణింపబడడు.
ప్రకరన 10 : భారత పౌరులుగా పరిగణించబడే వారు భారత దేశ పౌరులుగా కొనసాగుతారు. వాటికి సంబం ధించిన నియమాలను పార్లమెంటు రూపొందిస్తుంది.
ప్రకరణ 11 : పౌరులకు పౌరసత్వం కల్పించడం, పౌర సత్వాన్ని రద్దు చేయడం తదితర అంశాలపై శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకే ఉంది.
పౌరసత్వ అర్జన, పౌరసత్వ రద్దు గురించి 1955 పౌరసత్వ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టంను ఇప్పటివరకు ఐదుసార్లు సవరించారు.
1. పౌరసత్వ సవరణ చట్టం 1986
2. పౌరసత్వ సవరణ చట్టం 1992
3. పౌరసత్వ సవరణ చట్టం 2003
4. పౌరసత్వ సవరణ చట్టం 2005
5. పౌరసత్వ సవరణ చట్టం 2019
పౌరసత్వ అర్జన పద్ధతులు: పౌరసత్వ చట్టం 1955 పౌర సత్వాన్ని ఆర్జించే పద్ధతులను తెలుపుతుంది. ఇది రెండు పద్ధతుల ద్వారా సంక్రమిస్తుంది.
అవి 1. సహజ పౌరసత్వం
2. సహజీకృత పౌరసత్వం
సహజ పౌరసత్వం: అధికారులకు ఎలాంటి దరఖాస్తు లేదా విజ్ఞప్తి చేయకుండా వ్యక్తులకు సంక్రమించే పౌరసత్వాన్ని సహజ పౌరసత్వం అంటారు.
ఎ. పుట్టుక ద్వారా పౌరసత్వం :
26 జనవరి 1950 తరువాత, జులై 1987 ముందు భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరడవు తాడు. దీనినే జస్సోలి అంటారు. 1987 తర్వాత భారత దేశంలో పుట్టిన వారు పౌరసత్వాన్ని పొందాలంటే తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారతీయులై ఉండాలి.
నోట్ : ఇండియాలో పనిచేస్తూన్న విదేశీరాయబారుల పిల్లలు జన్మత:పౌరసత్వాన్ని పొందలేరు.
బి. వారసత్వం ద్వారా
1950 తరువాత 1992 ముందు గాని భారత దేశం బయట జన్మించిన వ్యక్తి తండ్రి అతడు జన్మించినపుడు భారతీయ పౌరుడైతే ఆ వ్యక్తి వారసత్వం ద్వారా భారతీయ పౌరుడు అవుతాడు. దీనినే జస్ సాంగ్వినస్ అంటారు. 1992 తరువాత జన్మించిన వారికి భారత పౌరసత్వం పొందాలంటే త్ణల్లిదండ్రులు ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండాలి. వారి పుట్టుకను విదేశాంగ శాఖలో సంవత్సరంలోపు నమోదు చేయాలి.
సి. రిజిస్ట్రేషన్ ద్వారా
కొన్ని వర్గాల వారు కేంద్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వాన్ని పొందుతారు.
- భారత సంతతికి చెందిన వారు భారతదేశంలో 7 సంవత్సరాలు సాధారణ నివాసిగా ఉండాలి.
- భారతీయ పౌరుల మైనర్ పిల్లలు
- భారతీయ పౌరుడిని వివాహం చేసుకొన్న విదేశీయులకు భారతీయ పౌరసత్వం వస్తుంది.
- పూర్తి వయస్సు, సమర్థత కలిగిన వ్యక్తి అయి ఉండాలి.
2. సహజీకృత పద్ధతి
- సహజ పౌరసత్వం లేని వ్యక్తి సహజీకృత పౌరసత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతి ప్రకారం విదేశీయులు కొన్ని షరతులకు లోబడి రాజ్యపౌరసత్వాన్ని పొందవచ్చు. అటువంటి షరతులు అన్ని రాజ్యాలలో ఒకేలా ఉండవు.
ఎ. నివాసం
విదేశీయుడు తాను నివసిస్తున్న రాజ్యంలో పౌరసత్వాన్ని పొందే నిర్ణీత కాలం పాటు నివసించాలి. ఆ పరిమితి అన్ని రాజ్యాలలో ఒకేలా లేదు.
ఉదా : బ్రిటన్లో 5 సం||లు, ఫ్రాన్స్లో 10 సం||లు
బి. ఎంపిక
విదేశీ తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత తమ ఇష్టం వచ్చిన రాజ్య పౌరసత్వాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
సి. దరఖాస్తు
విదేశీయుడు తాను కోరుకున్న రాజ్యంలో పౌరసత్వం పొంద డాన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ రాజ్యానికి చెందిన ప్రభుత్వం విధించే షరతులను సంతృప్తి పరచాల్సి ఉంటుంది.
డి.స్థిరాస్తులు
భూమి,ఇళ్ళు వంటి స్థిరాస్తులను సంపాదించుకోవడం ద్వారా రాజ్య పౌరసత్వాన్ని విదేశీయులు పొందగలుగుతారు.
ఇ. సేవలు
ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన ప్రయివేటు సంస్థలలో సేవ లను అందించడం ద్వారా విదేశీయుడు పౌరసత్వాన్ని పొందవచ్చు. ఉదా : మధర్ థెరిసా
ఎఫ్ : వివాహం :
కొన్ని దేశాలలో అన్య దేశీయుని వివాహమాడిన స్త్రీకి తన భర్త రాజ్యంలో పౌరసత్వం పొందవచ్చు.
ఉదా : సోనియా గాంధీ, సానియామీర్జా
- భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పేర్కొనబడిన 22 భాషలలో ఏదో ఒక భాషలో ప్రావీణ్యం ఉండాలి.
- సత్ప్రవర్తన కలిగి ఉండాలి.
- అంతకు ముందు ఉన్న విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు ఒక అఫిడవిట దాఖలు చేయాలి.
- దరఖాస్తు సమర్పించే తేదీకి ముందు 12నెలలు భారతదేశంలో నివసించి ఉండాలి.
భూభాగాల విలీనం ద్వారా :
భారత భూభాగంలోకి ఏదైనా ప్రాంతం విలీనం చెందినట్ల యితే ఆ ప్రాంత ప్రజలకు భారత పౌరసత్వం లభిస్తుంది.
ఉదా : గోవా, పాండిచ్చేరి భారత భూభాగంలో చేరడం
పౌరసత్వ రద్దు :
1. పౌరసత్వ త్యాగం : ఒక వ్యక్తి వేరొక రాజ్య పౌరసత్వాన్ని పొందినట్లయితే తన రాజ్యంలో పౌరసత్వాన్ని కోల్పో తాడు. సహజీకృత పద్ధతి ద్వారా వేరే దేశ పౌరసత్వం కనుకు లభించినట్లయితే అతడు మాతృ దేశ పౌరస త్వాన్ని కోల్పోతాడు. లేదా పౌరుడు భారతీయ పౌర సత్వాన్ని తాను స్వచ్ఛందంగా వదులుకుంటున్నా నని ప్రకటించవచ్చు.
2. విదేశాలలో ఉద్యోగం
విదేశాలలో ప్రభుత్వ ఉద్యోగాన్ని శాశ్వత ప్రతిపాదికన చేపట్టే వ్యక్తి తన దేశానికి దూరంగా విదేశాలలో దీర్ఘకాలం గడిపిన వ్యక్తి మాతృదేశ పౌరసత్వాన్ని కోల్పోతాడు.
3. విదేశీ బిరుదుల స్వీకారం
స్వదేశీ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ బిరుదులను అంగీకరించిన లేదా స్వీకరించిన పౌరుల పౌరసత్వం రద్దు అవుతుంది.
4. ఎక్కువ కాలం దేశంలో లేకపోవడం
ఒక రాజ్యంలో ఎక్కువ కాలం నివసించని వారు పౌరసత్వాన్ని కోల్పోతారు. కాలపరిమితి ఒక్కోక్క రాజ్యంలో ఒక్కోక్క తేడా ఉంది.
దేశద్రోహం
కొన్ని దేశాలలో అత్యంత దారుణమైన నేరాలకు పాల్పడిన వ్యక్తులు రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వ్యక్తులు పౌరసత్వం రద్దు చేయబడుతుంది.
వివాహం : విదేశీ పరుషుడిని వివాహం చేసుకొన్న మహిళ తన దేశపౌరసత్వాన్ని కోల్పోయి తన భర్తకు చెందిన పౌరసత్వాన్ని పొందుతుంది. అయితే కొన్ని రాజ్యాలు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చి, ఏ రాజ్యంలో పౌరసత్వం కావాలనే విషయాన్ని ఆ మహిళకే వదిలి వేయడమైంది.
సైన్యం నుంచి పారిపోవడం
సైన్యం నుంచి పారిపోయిన వ్యక్తుల పౌరసత్వం రద్దు అవుతుంది. అనేక రాజ్యాలు దీనికి సంబంధించిన చట్టాలను రూపొందించడం జరిగింది.
సమాపనం ద్వారా తొలగించుట
ఏ రకమైన ఒత్తిడులు, ప్రభావాలు, నిర్బంధం లేకుండా ఒక వ్యక్తి తానంతట తానుగా ఏదైనా దేశపు పౌరసత్వాన్ని పొందితే అతనికి భారత పౌరసత్వం వెంటనే అంతం (సమాపనం) అవుతుంది. అయితే దేశం యుద్ధంలో నిమగమై ఉన్నపుడు ఇది వర్తించదు.
విహీనత / బలవంతంగా రద్దు
- పౌరసత్వాన్ని తప్పుడు పద్ధతి ద్వారా పొందిన పౌరుడు
- భారత రాజ్యాంగాన్ని విధేయత చూపించని పౌరుడు
- యుద్ధ సమయంలో శత్రు దేశాలకు సహాయపడినా
- దేశ సాధారణ పౌరుడిగా ఉండి 7 సం||లు విదేశాలలో నివసించినా
- ఏదైనా దేశంలో రెండు సం||ల పాటు శిక్షను అనుభవించిన పౌరుడు
పరిమితులు
- భారతదేశంలో ఎక్కడ జన్మించినా ఒకే పౌరసత్వం పొందుతారు.
- జమ్మూకాశ్మీర్లో స్థానికేతరులకు శాశ్వత నివాసం ఏర్పరుచుకునే హక్కు లేదు కాని 370 అధికరణ రద్దు తర్వాత అందరూ సమానమే.
- ఆదివాసి ప్రాంతాలలో నివసించేవారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు.
పౌరసత్వం రకాలు
పౌరసత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించ వచ్చు.
1. ఏకపౌరసత్వం : ఏక పౌరసత్వం అంటే రాజ్యంలో పౌరులు ఒకే రకమైన పౌరసత్వాని కలిగి ఉండడంగా పేర్కొనవచ్చు. భారతదేశంలో పౌరులందరికీ సమాన మైన రాజకీయ, పౌర హక్కులు ఉంటాయి. ఈ రకమైన పౌరసత్వం ఆధునిక ప్రపంచంలో అనేక రాజ్యాలలో వాడుకలో ఉంది.
ఉదా: భారతరాజ్యాంగం భారత పౌరులకు జన్మత స్థలం, నివాసం వంటి అంశాలతో సంబంధం లేకుండా ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది.
ఉదా : కెనడా వలే ఇండియాలో కూడా ఏక పౌరసత్వం ఉంది.
2. ద్వంద్వ పౌరసత్వం : పౌరులకు రెండు రాజ్యాలలో పౌర సత్వం ఉండడాన్ని ద్వంద్వ పౌరసత్వం అంటారు. ఈ రకమైన పౌరసత్వం అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాలలో వాడుకలో ఉంది.
ఉదా : అమెరికన్ పౌరులకు విదేశాలలో జన్మించిన పిల్లలకు రెండు రాజ్యాలలో పౌరసత్వం ఉంటుంది. ఈ రెండింటి లో ఒకటి మాతృదేశ పౌరసత్వం కాగా మరోకటి జన్మించిన దేశ పౌరసత్వం
- ద్వంద్వ పౌరసత్వంలో ఓటు హక్కు ఉండదు.ప్రజా పదవులకు అర్హులు కారు.
- ద్వంద్వ పౌరసత్వం గల వ్యక్తులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉండవు.
3. విశ్వ పౌరసత్వం :
జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలలో ఇటీవల కాలంలో ఆవిష్కృతమైన భావనయే విశ్వపౌరసత్వం. అనేక మంచి పౌరులు విద్యా ఉద్యోగ సంబంధ విషయంలో భాగంగా వారు స్వదేశంతో పాటు విదేశాలలో సైతం పౌరసత్వాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రీవియస్ బిట్స్
1. రాజ్యాంగం ఏ భాగంలో పౌరసత్వ వివరణలు ప్రస్తావించబడినాయి?
ఎ) భాగం - I బి) భాగం - II
సి) భాగం - III డి) భాగం - IV
2. భారతీయ ప్రవాస దివాస్ను ఏ రోజున జరుపుకొంటారు?
ఎ) జనవరి 15 బి) జనవరి 18
సి) జనవరి 9 డి) జనవరి 21
3. పౌరసత్వం అనే భావనను ఎక్కడి నుంచి గ్రహించారు?
ఎ) గ్రీకు బి) ఆస్ట్రేలియా
సి) ఫ్రాన్స్ డి) బ్రిటన్
4. జాబితా -I ని జాబితా -II తో జతపరుచుము. కింద పేర్కొన్న కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి?
జాబితా - I
(పౌరసత్వానికి సబంధించిన నిబంధనలు)
ఎ. పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన కొంతమంది వ్యక్తుల పౌరసత్వ హక్కులు
బి. ఎవరైతే స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని పొందారో వారు పౌరులు కారు.
సి. రాజ్యాంగం ప్రారంభంలో పౌరసత్వం
డి. పాకిస్తాన్కు వలసవెళ్ళిన వారి పౌరసత్వం
జాబితా -II
(ఈప్రకరణలలో కలవు)
1. ప్రకరణ 5 2. ప్రకరణ 7
3. ప్రకరణ 6 4.ప్రకరణ 8
కోడ్లు :
ఎ బి సి డి
ఎ) 3 4 2 1
బి) 2 1 3 4
సి) 2 4 1 3
డి) 3 4 1 2
5. మొదటి ప్రవాసీ దివాస్ ఎక్కడ జరిగింది?
ఎ) న్యూఢిల్లీ 2003
బి) హైదరాబాద్ 2003
సి) బొంబాయి 2003
డి) జైపూర్ 2003
6. ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశాలు?
ఎ) అమెరికా బి) స్విట్జర్లాండ్
సి) ఆస్ట్రేలియా డి) పైవన్నీ
7. 1955 భారత పౌరసత్వ చట్టం ప్రకారం ఈ కింది ఏ పద్ధతిలో భారత పౌరసత్వాన్ని పొందవచ్చు.
ఎ) రిజిస్ట్రేషన్ బి) పుట్టుక
సి) వారసత్వం డి) పైవన్నీ
8. ఈ కింది వానిలో ఏది భారత పౌరసత్వం పొందడానికి ప్రాతిపదిక కాదు?
ఎ) పుట్టుక బి) ఆస్తి
సి) రిజిస్ట్రేషన్ డి) అనువంశికత
9. ఈ కింది ఏ సంవత్సరాలలో పౌరసత్వ చట్టం 1955 ను సవరించారు?
1. 1986 2. 1992 3. 2003
4. 2005 కింద పేర్కొన్న కోడ్లను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి?
ఎ) 2, 3 బి) 3, 4
సి) 1, 3 డి) పైవన్నీ
10. ఈ కింది వాటిలో దేనికి భారతదేశ పౌరసత్వ హక్కు నియంత్రించే అధికారం కలదు.
ఎ) పార్లమెంటు బి) సుప్రీంకోర్టు
సి) రాష్ట్రపతి డి) ప్రధానమంత్రి
11. భారతదేశం ఏకపౌరసత్వాన్ని ఎంపిక చేసుకోవడానికి గల కారణం?
ఎ) ఐక్యత, సమగ్రత బి) ఏక రాజ్యాంగం
సి) విస్తృత అవకాశాలు డి) పైవన్నీ
12. పౌరులకు మాత్రమే వర్తించే హక్కులు ఏవి?
ఎ) వాక్ స్వాతంత్య్రం బి) సంచార స్వేచ్ఛ
సి) సాంస్కృతిక స్వేచ్ఛ డి) అన్నీ
13. భారత సంతతికి చెంది ఉండి విదేశాలలో నివసించే వారి గురించి తెలిపే ప్రకరణ ఏది?
ఎ) 7వ ప్రకరణ బి) 8వ ప్రకరణ
సి) 9వ ప్రకరణ డి) 10వ ప్రకరణ
సమాధానాలు
1.ఎ 2.సి 3.డి 4.డి 5.ఎ
6.డి 7.డి 8.బి 9.డి 10.ఎ
11.డి 12.డి 13.బి