అంతర్జాతీయం
గర్భిణుల రాకపై అమెరికా ఆంక్షలు
తమ దేశానికి వచ్చే విదేశీ గర్భిణులపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఆ దేశంలో పుట్టే ప్రతి ఒక్కరినీ అమెరికా పౌరులుగానే పరిగణిస్తారు. పాస్పోర్టు మంజూరు చేస్తారు. దీంతో తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం దక్కాలన్న ఉద్దేశంతో పలు దేశాలకు చెందిన గర్భిణులు ఆ దేశానికి వెళ్లి కాన్పు చేయించుకుంటుంటారు. అమెరికాకు చెందిన కొన్ని సంస్థలు దీన్ని వ్యాపార అవకాశంగా మలుచుకుంటున్నాయి. ఈ విధానంపై ట్రంప్ ప్రభుత్వం ఇపుడు ఆంక్షలు విధించింది. అమెరికాలోకి వలసలను నియంత్రించడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం కఠిన విధానాలను అనుసరిస్తుంది. 2020 జనవరి 24 నుంచి నూతన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
అత్యంత చిన్న పసిడి నాణెం తయారు చేసిన స్విట్జర్లాండ్
ప్రపంచంలోనే అత్యంత బుల్లి బంగారు నాణేన్ని స్విట్జర్లాండ్ టంకశాల తయారుచేసింది. దీని వ్యాసం 2.96 మిల్లీమీటర్లు బరువు 0.063 గ్రాములు. ముద్రిత విలువ 1/4 స్విస్ ఫ్రాంక్ (రూ.18.58). ఇలాంటి పసిడి నాణేలను కేవలం 999 మాత్రమే తయారు చేశామని, ఒక్కోదాన్ని 199 ఫ్రాంక్లకు (రూ.14,439) విక్రయిస్తామని టంకశాల పేర్కొంది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్స్టీన్ నాలుకను బయటపెట్టి చూస్తున్న చిత్రాన్ని దీనిపై ముద్రించారు.
బ్రెగ్జిట్ బిల్లుకు ఆమోదం
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వేరుపడేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. దీనిపై రాణి ఎలిజబెత్-2 సంతకం చేశారు. ఈయూ అంగీకారం కూడా లభిస్తే ముందుగా నిర్ణయించినట్టు 2020 జనవరి 31న బ్రెగ్జిట్ ప్రక్రియ పూర్తవుతుందని ప్రధాని బోరిస్ జాన్సన్ జనవరి 23న వెల్లడించారు.
రోహింగ్యాల ఊచకోతను అడ్డుకోండి : ఐసీజే
రోహింగ్యా ముస్లింలపై ఊచకోతను నివారించేందుకు అన్ని చర్యలూ తీసు కోవాలని మయన్మార్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) 2020 జనవరి 23న ఆదేశించింది. తమ ఆదేశాలను అమలు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
లక్ష కోట్ల చెట్లను పెంచేందుకు కార్యక్రమం
ప్రపంచ వ్యాప్తంగా లక్ష కోట్ల చెట్ల పెంపకానికి ప్రపంచ ఆర్థిక వేదిక, ఇతర భాగస్వామ్య సంస్థలు ఒక కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందు కోసం '1టీ. ఓఆర్జీ' అనే సంస్థను ప్రారంభించాయి. కార్యక్రమంలో తమ దేశం చేరుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
రాచరికాన్ని వదులుకున్న హ్యారీ దంపతులు
బ్రిటన్ యువరాజు హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజకుటుంబం నుంచి అధికారికంగా తప్పుకున్నారు. తమకున్న రాయల్ గుర్తింపుని వదులుకున్నారు. ఇకపై వారిద్దరి పేర్లకు ముందు రాచరికాన్ని ప్రతిబింబించే గౌరవ సూచకాలు ఉండవు. అలాగే బ్రిటన్ రాజ కుటుంబం వారసులుగా నిర్వహించే బాధ్యతలకు పన్ను రూపంలో బ్రిటన్ వాసులు చెల్లించే ఆదాయం కూడా అందదు. వారి పేర్లకు ముందు గౌరవ సూచకంగా వాడే టైటిల్స్ను (హెచ్ఆర్హెచ్) ఇకపై వాడకూడదని బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటించింది. హ్యారీ దంపతులు రాజభవనం వీడి వెళ్లడానికి తాము సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్టుగా రాణి ఎలిజబెత్ తెలిపారు.
ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సీ గోంచారక్ రాజీనామా
ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సీ గోంచారక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుడు వ్లోదిమర్ జెలెన్స్కీకి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఆర్థిక వ్యవస్థపై వ్లోదిమర్కు అంతగా అవగాహన లేదని ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో రికార్డులు ఇటీవల లీకయ్యాయి. దీనికి బాధ్యత వహిస్తూ 2020 జనవరి 17న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను తిరస్కరిస్తున్నట్లు అధ్యక్షుడు వ్లోదిమర్ తెలిపారు. ప్రధానికి మరో అవకాశమిస్తున్నట్లు చెప్పారు.
డబ్ల్యూఈఎఫ్ పారిశ్రామిక సభ్య దేశంగా భారత్
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పునఃనైపుణ్య విప్లవాత్మక కార్యక్రమంలో భారత్ వ్యవస్థాపక సభ్య దేశంగా చేరింది. నాలుగో పారిశ్రామిక విప్లవానికి చేయూతగా 2030 నాటికి 100 కోట్ల మందికి మెరుగైన విద్య, నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం
ఖనిజ సంపదపై భారత్, బ్రెజిల్ సహకారం
ఖనిజ సంపదపై భారత్, బ్రెజిల్ పరస్పర సహకారానికి మార్గం సుగమం అయింది. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి 22న ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ వ్యవహారాల కమిటీ అంగీకారం తెలిపినట్లు మైన్స్ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
భారత్, నేపాల్ మధ్య కొత్త చెక్పోస్ట్ ప్రారంభం
భారత్-నేపాల్ సరిహద్దుల్లో భారత్ సాయంతో నేపాల్ నిర్మించిన 'జోగ్బని-బిరాట్నగర్' ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ప్రారంభమైంది. ఈ చెక్పోస్ట్ను వీడియో లింక్ ద్వారా 2020 జనవరి 21న ఇరుదేశాల ప్రధానులు నరేంద్రమోడీ, కేపీ శర్మ ఓలి సంయుక్తంగా ప్రారంభించారు. ద్వైపాక్షిక వాణిజ్య వద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలు లక్ష్యంగా ఈ చెక్పోస్ట్ను రూపొందించారు. 260 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ చెక్పోస్ట్ నిర్మాణం కోసం భారత్ రూ. 140 కోట్ల ఆర్థిక సాయాన్ని నేపాల్కు అందించింది.
జాతీయం
15వ ఆర్థిక సంఘం సిఫార్సులు
ఆదాయం తగ్గి సతమతమవుతున్న కేంద్ర ప్రభుత్వంపై భారం తగ్గేలా 15వ ఆర్థిక సంఘం పలు సిఫార్సులు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆదాయం రూ.3.5 లక్షల కోట్ల మేర తగ్గుతుందన్న అంచనాలను దష్టిలో పెట్టుకుంది. మొత్తం ఐదేళ్ల కాలానికి ఆదాయ పంపిణీలపై పూర్తిస్థాయి నివేదికను 2020 అక్టోబరులో అందజేయనుంది. పన్నుల్లో రాష్ట్రాల వాటాను 14వ ఆర్థిక సంఘం 32 శాతం నుంచి 42 శాతానికి పెంచితే 15వ ఆర్థిక సంఘం తగ్గించాలని సిఫార్సు చేసింది.
తంజావూర్లో సుఖోరు-30
అగ్రశ్రేణి యుద్ధవిమానం సుఖోరు-30 ఎంకేఐను తొలి సారిగా దక్షిణ భారతదేశంలో వైమానిక దళం మోహరించింది. వ్యూహాత్మకంగా కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంత(ఐవోఆర్) పరిరక్షణకు ఈ చర్యను చేపట్టింది. మొత్తం ఒక స్క్వాడ్రన్ను తమిళనాడులోని తంజావూర్లో మోహరించింది. ఈ యుద్ధవిమానాలకు బ్రహ్మౌస్ క్రూయిజ్ క్షిపణులను అమర్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియాలు హాజరయ్యారు.
కర్ణాటకలో మూఢవిశ్వాస నిషేధ చట్టం అమలు
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మూఢ విశ్వాస నిషేధ చట్టాన్ని అమలులోకి తెచ్చేలా 2020 జనవరి 23న ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో సిద్ధరామయ్య నేతత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లుకు అంకురార్పణ చేయగా అప్పట్లో విపక్షంలో ఉన్న బీజేపీ వ్యతిరేకించింది. కొద్దిపాటి మార్పులతో తాజాగా దానికి ఆమోదం పలికింది. 2020 జనవరి 4 నుంచే అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ చట్టం ప్రకారం చేతబడి, దిగంబర పూజలు, నిప్పులపై నడక, విడిచిన భోజన విస్తర్లపై పొర్లటం, వశీకరణం తదితర ప్రమాదకరమైన మూఢ విశ్వాసాలు కొనసాగించే వీలు లేదు.
బీహార్లో 5 కోట్ల మంది మానవహారం
పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం ప్రభు త్వానికి మద్దతుగా బీహార్లో 5.17 కోట్ల మంది కలసి 2020 జనవరి 19న భారీ మానవ హారం ఏర్పాటు చేశారు. ఈ చైన్ దాదాపు 18,034 కిలోమీటర్ల పొడవుంది. 2017, 18లలో మద్యపాన నిషేధం, వరకట్నం-బాల్యవివాహాల నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన మానవ హారం కంటే ఇదే అతిపెద్దది. ఈ మానవహారం పొడవు 2018 కంటే 14 వేల కిలోమీటర్లు, 2017 కంటే 11 వేల కిలోమీటర్లు అధికం.
జమ్మూ-కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవల పునరుద్ధరణ
కశ్మీర్ లోయలో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరిం చాల్సిందిగా అధికార యంత్రాంగం 2020 జనవరి 18న ఆదేశాలు జారీచేసింది. దీంతో 5 నెలల తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లైంది. కశ్మీర్లోని కుప్వారా, బాందీ పొరా జిల్లాల్లో అనుమతిపొందిన వెబ్సైట్లను చూసేందుకు 2జీ మొబైల్ డేటా సర్వీసులను పునరుద్ధరించారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం జమ్మూ-కశ్మీర్లో ల్యాండ్లైన్లు, మొబైల్ ఫోన్ సేవలను రద్దు చేశారు.
ఓబీసీ వర్గీకరణ కమిషన్ గడువు పెంపు
జాతీయ జాబితాలోని ఓబీసీల వర్గీకరణ కోసం జస్టిస్ రోహిణి నేతత్వంలో పనిచేస్తున్న కమిషన్ కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం 2020 జులై 31 వరకు పొడిగించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన 2020 జనవరి 22న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. కమిషన్కు ఇదివరకు అందజేసిన విధి విధానాల జాబితాకు కొత్తగా మరొకటి జత చేసింది.
ఆయా సూచీల్లో భారత్ స్థానాలు
- అవినీతి సూచీలో 180 దేశాల్లో భారత్ 80వ స్థానంలో నిలిచింది. 'కరప్షన్ పెర్సెప్షన్ ఇండెక్స్'(సీపీఐ) పేరుతో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ దీనిని రూపొందించింది. అవినీతిని కట్టడి చేయడంలో డెన్మార్క్, న్యూజిలాండ్ తొలి స్థానంలో... ఫిన్లాండ్, సింగపూర్, స్వీడన్, స్విట్లర్లాండ్ వంటివి మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. భారత్తో పాటు చైనా, బెనిన్, ఘనా, మొరాకోలు 80వ స్థానంలో ఉన్నాయి.
- ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ ర్యాంకింగ్స్-2019లో భారత్ 6.90 స్కోరు సంపాదించి 51వ స్థానంలో నిలిచింది. క్రమేణా పౌరహక్కులను అణచి వేయడమే ఇందుకు ప్రధాన కారణమని ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ జరిపిన ప్రపంచ వ్యాప్త సర్వేలో వెల్లడయింది. 2018లో 7.23 స్కోరు పొందింది.. మొత్తం 165 స్వతంత్ర దేశాలు, రెండు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.
- ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచీలో భారత్ 72వ స్థానంలో నిలిచింది. ప్రతిభను పెంచడం, ఆకర్షించడం, కాపాడుకోవడంలో ఆయా దేశాల సామర్థ్యాలను బేరీజు వేసి ఈ సూచీలో ర్యాంకులు కేటాయిస్తారు. 132 దేశాలతో రూపొం దించిన ఈ సూచీలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా, సింగపూర్లు 2, 3 స్థానాలు దక్కించుకున్నాయి.
- ఇళ్ల ధరల వద్ధిలో ప్రపంచ వ్యాప్తంగా హంగేరీలోని బుడాపెస్ట్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇళ్ల ధరల వద్ధి 24 శాతంగా ఉంది. తర్వాత చైనాలోని జియాన్, యూహాన్ నగరాలున్నాయి. ఈ ప్రాంతాల్లో వరుసగా 15.9 శాతం, 14.9 శాతం ధరల వద్ధి ఉంది. హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. మన దేశం నుంచి టాప్-20లో చోటు దక్కించుకున్న ఏకైక నగరం భాగ్యనగరమే.
- 'సోషల్ మొబిలిటీ సూచీ 2020' : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత స్థాయిలకు చేరేందుకు అనువైన పరిస్థితులను సూచించే ఈ సూచీలో భారత్కు 76వ స్థానం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 82 దేశాలతో రూపొందించిన ఈ సూచీలో డెన్మార్క్ అగ్రస్థానంలో నిలిచింది.
ప్రాంతీయం
ప్రపంచంలోని మేటి నగరాల్లో హైదరాబాద్కు తొలి స్థానం
2020 సంవత్సరానికి ప్రపంచంలోని 20 అగ్రశ్రేణి (టాప్-20) నగరాల్లో ప్రథమ స్థానం సాధించింది. సామాజిక ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130 నగరాలను రియల్ ఎస్టేట్ రంగంలో పేరొందిన జేఎల్ఎల్(జోన్స్ ల్యాంగ్ లాసలె) సంస్థ అధ్యయనం చేసింది. వద్ధి సూచికల ఆధారంగా అత్యుత్తమ నగరాల జాబితాను ఈ సంస్థ ఏడేళ్లుగా ప్రకటిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్-20 నగరాల్లో హైదరాబాద్ రెండోసారి అగ్రస్థానం సంపాదించింది.
హైదరాబాద్లో ఎస్అండ్పీ గ్లోబల్ కొత్త ఆఫీస్
రేటింగ్స్, అనలిటిక్స్, డేటా సేవల్లో ఉన్న ఎస్అండ్పీ గ్లోబల్ హైదరాబాద్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. స్కైవ్యూ భవనంలో 2.41 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఏర్పాటైంది. ఈ భవంతికి యూఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గోల్డ్ రేటెడ్ లీడ్ ధ్రువీకరణ ఉందని కంపెనీ తెలిపింది.
తెలంగాణలో ఎస్ఈసీసీ పేరుతో కేంద్రం సర్వే
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణుల జీవన ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం సర్వే చేయనుంది. పదేళ్లలో మారిన ప్రజల స్థితిగతుల గురించి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టనుంది. సామాజిక, ఆర్థిక, కుల గణన(ఎస్ఈసీసీ) పేరిట ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివద్ధి మంత్రిత్వ శాఖ 2020 జనవరి 21న వెల్లడించింది. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ సహకారంతో 2020, ఏప్రిల్ 14 కల్లా ఈ వివరాలను సేకరించాలని నిర్ణయించింది.
టీ-చిట్స్కు జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహిస్తోన్న టీ-చిట్స్కు జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డు లభించింది. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ సహకారంతో బ్లాక్ చైన్ సాంకేతికతతో తీసుకువచ్చిన టీ-చిట్స్ గోల్డ్ అవార్డుకు ఎంపికైందని రిజిస్ట్రేషన్ శాఖ వెల్లడించింది. ముంబయిలో 2020 ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేతులమీదుగా రాష్ట్ర అధికారులు అవార్డు అందుకోనున్నారు.
జయశంకర్ వర్సిటీకి 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్'
వ్యవసాయ విస్తరణ, పరిశోధన, ఉత్తమ బోధన, యువత వాణిజ్యవేత్తలుగా మారేలా నైపుణ్యాలను పెంపొందించడం, పరీక్షల నిర్వహణలో డిజిటల్ విధానం అమలు సహా పలు రంగాల్లో చేసిన కషికిగానూ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది. దిల్లీలోని అఖిల భారత వ్యవసాయ విద్యార్థుల సంఘం 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్-2019' పురస్కారానికి ఈ వర్సిటీని ఎంపిక చేసింది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో 'భారత వ్యవసాయ పరిశోధన మండలి'(ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్సీ అగర్వాల్ చేతుల మీదుగా వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రవీణ్రావు పురస్కారాన్ని అందుకున్నారు.
'గ్రీన్ బిల్డింగ్ రేటింగ్'లో తెలంగాణాకు 6వ స్థానం
ఇంధన, పర్యావరణ అనుకూల డిజైన్(లీడ్) విభాగంలో దేశంలోని మొదటి 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి స్థానం లభించింది. భవనాలు, స్థలాలను పర్యావరణానికి అనుకూలంగా తీర్చిదిద్దిన పక్షంలో వాటికి లీడ్ సర్టిఫికేషన్ లభిస్తుంది. జీబీసీఐ ఇండియా (గ్రీన్ బిజినెస్ సర్టిఫికేషన్ ఇంక్) దీన్ని 2020 జనవరి 21న విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం 6వ స్థానంలో నిలిచింది. మొదటి అయిదు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లు ఉన్నాయి. లీడ్ సర్టిఫికేషన్ కల భవనాలు మనదేశంలో 1,400 పైగా ఉండగా, ఇందులో తెలంగాణ రాష్ట్రంలో 106 ప్రాజెక్టులు ఉన్నాయి.
వార్తల్లో వ్యక్తులు
అంటార్కిటికాను అధిరోహించిన తరుణ్జోష్
మంచు ఖండమైన అంటార్కిటికాలోని 4,897 మీటర్ల ఎత్తెన పర్వతం విన్సన్ మాసిఫ్ను హైదరాబాద్ పోలీస్ సంయుక్త కమిషనర్ తరుణ్జోషి 11.40 గంటల్లో అధిరోహించారు. 2020 జనవరి 16న ఉదయం 8.30 గంటలకు విన్సన్ మాసిఫ్ శిఖరాగ్రాన్ని ఆయన చేరుకున్నారు. తరుణ్జోషి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ప్రత్యేక విభాగం సంయుక్త కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాశ్ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన 59 ఏళ్ల నడ్డా ప్రధాని నరేంద్రమోదీకి, ఆరెస్సెస్కు విశ్వసనీయుడు. బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో నడ్డా 11వ నేత. హిమాచల్ప్రదేశ్లో రాష్ట్ర మంత్రిగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు. యూపీ సహా వేర్వేరు రాష్ట్రాల్లో పార్టీ తరఫున ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. 2019 జూన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడయ్యారు.
ఎస్బీఐ ఎండీగా చల్లా శ్రీనివాసులు శెట్టి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మేనేజింగ్ డైరెక్టరుగా (ఎండీ) చల్లా శ్రీనివాసులు శెట్టిని ప్రభుత్వం నియమిం చింది. ఎస్బీఐలో డిప్యూటీ ఎండీగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు శెట్టిని ఎండీగా నియమించే ప్రతిపాదనకు నియామకాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. శ్రీనివాసులు శెట్టి ఎండీగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి 3 సం||ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
ఎన్ఎంఎంఎల్ చైర్మన్గా నపేంద్ర మిశ్రా
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్గా ప్రధాని మాజీ ముఖ్య కార్యదర్శి నపేంద్ర మిశ్రా, వైస్ చైర్మన్గా ఎ.సూర్యప్రకాశ్ నియమితులయ్యారు. ఈ మేరకు 2020 జనవరి 14న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 74 ఏళ్ల నపేంద్ర మిశ్రా.. ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా 2019, ఆగస్టులో వైదొలిగారు. నెహ్రూ మెమోరియల్లో సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఖర్గే, జైరామ్ రమేశ్, కరణ్ సింగ్లను 2019 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం తొలగించింది. వారి స్థానంలో టీవీ జర్నలిస్ట్ రజత్ శర్మ, అద్మాన్ ప్రసూన్ జోషిలను నియమించింది.
భారత మాజీ క్రికెటర్ నాదకర్ణి మృతి
భారత మాజీ క్రికెటర్ రమేశ్ చంద్ర(బాపు) నాదకర్ణి 2020 జనవరి 17న మృతి చెందాడు. ఆయన వయసు 86 సంవత్స రాలు. లెఫ్టార్మ్ స్పిన్నర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాపు 1955-1968 మధ్య కాలంలో 41 టెస్టుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 29.07 సగటుతో 88 వికెట్లు పడ గొట్టారు. బ్యాట్స్మన్గా కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కన బర్చిన ఆయన 25.70 సగటుతో 1414 పరుగులు చేశారు. 191 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల కెరీర్లో సరిగ్గా 500 వికెట్లు పడగొట్టాడు.
అవార్డులు
గోపాలకష్ణ ద్వివేదికి ఈసీ అవార్డు
2019 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సమర్థత చాటుకున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులు, పోలీసు అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం అవార్డులు ప్రకటించింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ భద్రత వ్యవహారాల విభాగంలో ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. అప్పట్లో ఏపీ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారిగా పనిచేసిన గోపాలకష్ణ ద్వివేది ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డు సాధించారు. ఈ విభాగంలో పంజాబ్, ఒడిశా ముఖ్య ఎన్నికల అధికారులూ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఎన్నికలను చక్కగా నిర్వహించినందుకు నిజామాబాద్, జగిత్యాల డీఈవో ఎ.శరత్కు సాధారణ పురస్కారం లభించింది.
ఐదుగురు తెలుగు చిన్నారులకు ప్రధానమంత్రి బాలశక్తి పురస్కారాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం అందించే 'ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలశక్తి పురస్కార్-2020'ను తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు చిన్నారులు అందుకున్నారు. 2020 జనవరి 22న రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా వీటిని స్వీకరించారు. కళలు-సంస్కతి, సాహసం, నవకల్పన, పాండిత్యం, సామాజికసేవ, క్రీడల విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు రూ.లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందించారు. ఇందులో తెలంగాణ నుంచి ఇంద్రజాలంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న దర్శ్మలాని(కళలు-సంస్క తి), 10 మీటర్ల ఎయిర్పిస్టల్ విభాగంలో జాతీయ రికార్డు నెలకొల్పిన ఇషాసింగ్, మౌంట్ కిలిమంజారో, మౌంట్ ఖుషీకోజ్ అధి రోహించినందుకు సామాన్యు పోతురాజు (క్రీడలు) ఉన్నారు.
22 మంది బాలలకు సాహస పురస్కారాలు
క్లిష్ట పరిస్థితుల్లో సాహసాన్ని ప్రదర్శించిన 12 రాష్ట్రాలకు చెందిన 10 మంది బాలికలు, 12 మంది బాలురకు జాతీయ సాహస బాలల పురస్కారాలు లభించనున్నాయి. భారతీయ బాలల సంక్షేమ మండలి 2020 జనవరి 21న ఈ జాబితాను ప్రకటించింది. కేరళలోని కోజికోడ్లో ముగ్గురు స్నేహితులు సముద్రంలో మునిగిపోకుండా రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన మహ్మద్ మొహిసిన్కు 'అభిమన్యు పురస్కారం' ప్రకటించారు. ఇంటిపైకి శతఘ్ని గుండును ముష్కరులు ప్రయోగించినప్పుడు కుటుంబ సభ్యుల్ని రక్షించిన సర్తాజ్ మొహిదీన్ (జమ్మూ-కశ్మీర్), నలబై మంది బస్సు ప్రయాణికుల్ని మంటల నుంచి కాపాడిన ఆదిత్య (కేరళ) తదితరులు గణతంత్ర దినోత్సవాల్లో ఈ పురస్కారాలను అందుకోనున్నారు.
ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సి.మీనన్ అవార్డు
మానవ, పౌర హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఏటా ఇచ్చే ముకుందన్ సి.మీనన్ అవార్డును 2019 సం||నికి ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.సాయిబాబాకు నేషనల్ కాన్ఫడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నా... సాయిబాబా తాను ఎంచుకున్న మార్గం నుంచి పక్కకు తప్పుకోలేదని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఆయన నాగ్పుర్ జైలులో ఉన్నారు.
కిరణ్ మజుందార్ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం
బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఈ పురస్కా రాన్ని అందుకున్న నాలుగో భారత వ్యక్తిగా కిరణ్ నిలిచారు. దశాబ్దాలుగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వాణిజ్య, విద్యాపరమైన సంబంధాల బలోపేతంలో కషి చేసినందుకు గాను మజుందార్ షాకు ఈ పురస్కారం లభించింది.
ఆర్థికాంశాలు
భారత్లో ఎన్టీటీ 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి
జపాన్కి చెందిన టెక్ దిగ్గజం ఎన్టీటీ భారత్లో వచ్చే నాలుగేళ్లలో 1.5 బిలియన్ డాలర్లు (రూ. 11,000 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. అంతర్జాతీయంగా నాలుగు ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటుపై దాదాపు 7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు సంస్థ సీఈవో (గ్లోబల్ డేటా సెంటర్స్ భారత విభాగం) శరద్ సంఘి 2020 జనవరి 22న తెలిపారు.
భారత్ వద్ధి 4.8 శాతమే : ఐఎంఎఫ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-2020లో భారత్ ఆర్థికవద్ధి రేటు 4.8శాతమే నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనావేసింది. ఇంతక్రితం ఈ వద్ధి అంచనా 6.1 శాతం. వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ (డబ్ల్యూఈఓ) తాజా అంచనాలను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ 2020 జనవరి 20న స్విట్జర్లాండ్ లోని దావోస్లో వెల్లడించారు.
ఆర్థిక అసమానతలపై ఆక్స్ఫామ్ నివేదిక విడుదల
ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల పక్షం వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ మానవ హక్కుల సంస్థ ఆక్స్ఫామ్ ఒక నివేదికను రూపొందించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సమావేశాల సందర్భంగా 'టైమ్ టు కేర్' పేరిట ఆక్స్ఫామ్ 2020 జనవరి 20న ఈ నివేదికను విడుదల చేసింది.
సైన్స్&టెక్నాలజీ
నింగిలో తొలి వంటకం
నింగిలో తొలి వంటకం సిద్ధమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో యాత్రికులు తొలిసారిగా చేపట్టిన ఈ ప్రయత్నం ఫలించింది. ముడి పదార్థాలను ఉపయోగించి ఇటలీకి చెందిన వ్యోమగామి లూకా పర్మిటానో 2019 డిసెంబర్లో ఐదు చాక్లెట్ చిప్ కుకీలను తయారుచేశారు. న్యూయార్క్కు చెందిన 'నానోరాక్స్ అండ్ జీరో జీ కిచెన్' రూపొందించిన ప్రత్యేక ఎలక్ట్రిక్ ఒవెన్ను ఇందుకు ఉపయోగించారు. పరీక్షలు నిర్వహించి వీటిని తినొచ్చా? లేదా? అన్నది నిర్ణయిస్తారు.
అంతరిక్షంలోకి ఇస్రో మహిళా రోబో వ్యోమమిత్ర
మానవులకంటే ముందుగా అంతరి క్షంలోకి మహిళా రోబో 'వ్యోమమిత్ర' ను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 'మానవసహిత అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలు, సవాళ్లు' అన్న అంశంపై 2020 జనవరి 22న బెంగళూరులో జరిగిన సదస్సులో 'వ్యోమమిత్ర' స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. 'హలో..నా పేరు వ్యోమమిత్ర,. నేను గగన్యాన్ ప్రయోగం కోసం తయారైన నమూనా హ్యూమనాయిడ్ రోబోను' అంటూ అందరినీ పలకరించింది.
సముద్రపు నాచుతో గాలి శుద్ధి చేసే పరికరం 'ఆక్స్-సి'
హానికర వాయువులను తొలగించడం ద్వారా గాలిని శుద్ధి చేసే సరికొత్త సాధనాన్ని పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్) పరిశోధక విద్యా ర్థులు ఆవిష్కరించారు. 'ఆక్స్-సి'గా పిలుస్తున్న ఈ పరికరాన్ని సముద్రపు నాచును ఉపయోగించి తయారుచేశారు. గాలిలోకి అదనంగా ఆక్సిజన్ను చేర్చడం దాని మరో ప్రత్యేకత.
కే-4 అణు క్షిపణి పరీక్ష విజయవంతం
జలాంతర్గాముల నుంచి ప్రయోగించే కే-4 బాలిస్టిక్ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ(డీఆర్డీవో) విజయ వంతంగా పరీక్షించింది. 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాల ను ఛేదించ గల ఈ క్షిపణిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సముద్ర తీరం నుంచి 2020 జనవరి 19న ప్రయోగించారు. 2,500 కేజీల బరువున్న అణ్వాయుధాలను కే-4 క్షిపణి నుంచి ప్రయోగించ వచ్చు. డీఆర్డీవో అభివ ద్ధి చేసిన ఈ క్షిపణులను అరిహంత్ రకం అణు జలాంతర్గాముల్లో మోహరించనున్నారు.
జీవం ఆవిర్భావంపై వీడిన గుట్టు
భూమి మీద జీవం ఆవిర్భావానికి సంబంధించిన కీలక గుట్టును శాస్త్రవేత్తలు ఛేదించారు. కణాల జీవక్రియకు అవసరమైన ఫాస్ఫరస్ మోనాక్సైడ్ అణువులు అంతరిక్షం నుంచి భూమికి ఎలా వచ్చాయో గుర్తించారు. జీవం ఆవిర్భావానికి సంబంధించిన 'పజిల్'లో ఇది చాలా కీలక రసాయనం. భారీ నక్షత్రాలు ఏర్పడినప్పుడు ఫాస్ఫరస్ కలిగిన అణువులు ఆవిర్భవిస్తుంటాయి. ఈ నేపథ్యంలో.. నక్షత్రాలకు జన్మనిస్తున్న ఏఎఫ్జీఎల్ 5142 అనే ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. అందులో నిర్దిష్టంగా ఫాస్ఫరస్ కలిగిన అణువులు ఎక్కడ ఏర్పడుతున్నాయో గుర్తించారు.
కోర్టు తీర్పులు చదివేందుకు కత్రిమ మేధ
న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను చదివి, విశ్లేషించేందుకు కత్రిమ మేధస్సు(ఏఐ)తో ఒక సాధనాన్ని ఐఐటీ ఖరగ్పుర్ పరిశోధకులు రూపొందించారు. తీర్పుల సారాంశాన్ని తయారుచేయడం, న్యాయపరమైన అంశాల్లో శోధన, కేసు విశ్లేషణ వంటి పనుల్లో ఇది సాయపడుతుంది. తీర్పుల్లోని వాక్యాల తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి పరిశోధకులు రెండు 'డీప్ న్యూరల్ మోడళ్ల'ను అభివద్ధి చేశారు.
క్రీడాంశాలు
ఆస్ట్రేలియాలో ఇండోర్ క్రికెట్ ప్రపంచకప్
ఇండోర్ క్రికెట్ ప్రపంచకప్ 11వ ఎడిషన్కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీని 2020 అక్టోబర్ 10 నుంచి 17 వరకు మెల్బోర్న్లోని కాసే స్టేడియం, సిటీ పవర్ సెంటర్లలో నిర్వహించనున్నారు. ఈ మేరకు 2020 జనవరి 22న వరల్డ్ ఇండోర్ క్రికెట్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా పురుషుల, మహిళల జట్లు డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. చివరగా 2017లో జరిగిన ఈ టోర్నీకి దుబాయి ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నమెంట్ లో 10 దేశాల నుంచి అండర్-21 పురుషులు, మహిళలు, ఓపెన్ పురుషులు, మహిళలు విభాగాల్లో జట్టు పోటీపడతాయి.
ముగిసిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్
3వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను అస్సాంలోని గువాహటిలో 2020 జనవరి 10 నుంచి 22 వరకు నిర్వహిం చారు. ఈ క్రీడల్లో ఓవరాల్గా మహారాష్ట్ర 78 స్వర్ణాలు, 77 రజతాలు, 101 కాంస్యాలతో కలిపి మొత్తం 256 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. హరియాణా (68+60+72) మొత్తం 200 పతకాలు నెగ్గి రెండో స్థానంలో... ఢిల్లీ (39+36+47) మొత్తం 122 పతకాలు సాధించి మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ 7 స్వర్ణాలు, 6 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి మొత్తం 21 పతకాలు సాధించి 15వ స్థానం సాధించింది. ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 7 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి మొత్తం 17 పతకాలతో 22వ స్థానం దక్కించుకుంది.
ఆస్ట్రేలియా ఛారిటీ మ్యాచ్ కోచ్గా సచిన్
ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు 2020 ఫిబ్రవరి 8న క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ఛారిటీ మ్యాచ్ని నిర్వహిస్తోంది. ఈ మ్యాచ్లో పాల్గొనే ఇరు జట్లకు షేన్ వార్న్, రికీ పాంటింగ్లు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. రికీ పాంటింగ్ జట్టుకు సచిన్ టెండూల్కర్, షేన్ వార్నర్ జట్టుకు కోట్నీ వాల్ష్ కోచ్లుగా వ్యవహరించను న్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సీఈఓ కెవిన్ రాబర్డ్స్ 2020 జనవరి 21న తెలిపారు. మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ రికవరీ ఫండ్కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా వన్డేల కెప్టెన్గా క్వింటన్ డికాక్
దక్షిణాఫ్రికా టీ20 జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్మన్ క్వింటన్ డికాక్ వన్డేలకు కూడా కెప్టెన్గా ఎంపికయ్యాడు. 2019 ప్రపంచకప్లో జట్టును నడిపించడంలో విఫలమైన డుప్లెసిస్ స్థానంలో క్వింటన్ డికాక్ను నియమించారు. 27 ఏళ్ల డికాక్ గతంలో రెండు వన్డేలకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు.