అంతర్జాతీయం
అమెరికా అధ్యక్షుడిపై వీగిన అభిశంసన తీర్మానం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై డెమొక్రాట్లు ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానం రిపబ్లికన్ల ఆధిక్యంలోని సెనేట్లో వీగిపో యింది. అధికార దుర్వినియోగం, కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుకున్నా రన్న ఆరోపణలతో ట్రంప్పై 2019, డిసెంబర్లో డెమొక్రటిక్ పార్టీ అమెరికన్ కాంగ్రెస్లో అభిశంసనను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఆమోదం పొందిన అభిశంసన తీర్మానాన్ని తాజాగా సెనేట్లో ప్రవేశపెట్టారు. ఇందులో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగం 52-48 ఓట్ల తేడాతో, కాంగ్రెస్ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం 53-47 ఓట్ల తేడాతో వీగిపోయాయి. అభిశంసనను తిప్పికొట్టేందుకు 100 మంది సభ్యుల సభలో మూడింట రెండొంతుల ఓట్లు అవసరం.
ప్రతి పది మందిలో ఒకరికి కేన్సర్ : డబ్ల్యూహెచ్వో
భారతదేశంలో 2018లో దాదాపు 11.6 లక్షల కేన్సర్ కేసులు కొత్తగా నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు తమ జీవిత కాలంలో ప్రాణాంతక కేన్సర్ వ్యాధి బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కేన్సర్ బారిన పడినవారిలో ప్రతి 15మందిలో ఒకరు మరణించే అవకాశం ఉందని తెలిపింది. వరల్డ్ కేన్సర్డే సందర్భంగా డబ్ల్యూహెచ్వో, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐఏఆర్సీ) సంస్థలు ఫిబ్రవరి 4న రెండు నివేదికలు విడుదల చేశాయి. కేన్సర్ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా ఎజెండా రూపొందించడంతో పాటు కేన్సర్పై పరిశోధన, నివారణలపై ఈ నివేదికలు ప్రధాన దష్టి సారించాయి. సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో రాబోయే 20 ఏళ్లలో మధ్య ఆదాయ దేశాల్లో కేన్సర్ మరణాల రేటు 60 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది.
అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి ఏర్పాటు
ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు 27 దేశాలు కలిసి అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి (ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం అలయెన్స్)గా ఏర్పాట య్యాయి. అమెరికాలోని వాషింగ్టన్లో ఫిబ్రవరి 5న ఈ కూటమి ప్రారంభమైంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రిటన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, నెదర్లాండ్స్, గ్రీస్ తదితర దేశాలు ఈ కూటమిలో సభ్య దేశాలుగా చేరాయి. మత స్వాతంత్యాన్న్రి గౌరవించి, పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని కూటమిలోని సభ్య దేశాలు ప్రతినబూనాయి.
జాతీయం
కేంద్ర బడ్జెట్ 2020-21 హైలైట్స్
2020 -21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. నరేంద్ర మోడీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. లోక్సభలో రెండున్నర గంటలకుపైగా బడ్జెట్ ప్రసంగం చేసిన నిర్మలా సీతారామన్ .. గ్రామీణ, వ్యవసాయరంగాలకు పెద్దపీట వేశారు. ఆదాయ పన్ను చెల్లింపులో పలు మార్పులు తీసుకొచ్చారు. మధ్య, ఎగువ తరగతి వర్గాలకు ఊరటనిచ్చేలా వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో మార్పులు చేశారు.
బడ్జెట్లోని ముఖ్యాంశాలు..
- ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా అందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
- అదుపులో ద్రవ్యోల్బణం
- ఎకానమీని సంఘటితపరిచేందుకు చర్యలు
- ఆరోగ్యకరమైన వాణిజ్య వద్ధికి తోడ్పాటు
- జీఎస్టీతో సామాన్యులకు నెలకు 4 శాతం వరకూ ఆదా
- 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం
బడ్జెట్ లక్ష్యం
- రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
- 100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
- 26 లక్షల మంది రైతులకు సోలార్ పంపు సెట్లు
- ఆన్లైన్లో ఆర్గానిక్ ఉత్పత్తులు
- రైతుల సౌకర్యార్థం రిఫ్రిజిలేటర్తో కూడిన కిసాన్ రైలు ఏర్పాటు
- సివిల్ ఏవియేషన్ ద్వారా కూరగాయల సరఫరాకు కృషి ఉదాన్ పథకం
- జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్కు చేయూత
- గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
- నాబార్డు ద్వారా రీఫైనాన్స్ పునరుద్ధరణ
- యువ పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి ప్రత్యేక పథకం
- గ్లోబలైజేషన్కు అనుగుణంగా పరిశ్రమల అభివద్ధి
- ఇండిస్టియల్ ఇన్వెస్ట్మెంట్ సెల్ ఏర్పాటు
- పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్
- విద్యారంగంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి
- విద్య, స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దష్టి
- 2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం కొత్త కోర్సులు
- ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్ కాలేజీ
- నేషనల్ పోలీస్, ఫోరెన్సిక్ యూనివర్సిటీ
- భారత్లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ఇన్సాట్ పరీక్షలు
- ఆడపిల్లల వివాహ వయస్సు పెంపు విషయమై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
- కరెంటు బిల్లుల స్థానంలో త్వరలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు
- ఆప్టికల్ ఫైబర్ లింక్తో లక్షగ్రామపంచాయతీల అనుసంధానం
- రైల్వేల్లో మరింత ప్రైవేటీకరణ.. పీపీపీ పద్ధతిలో 150 రైళ్లు
- వచ్చే నాలుగేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్ట్లు
- నూతన వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లు
- ఆదాయపన్ను శ్లాబ్లు నాలుగు నుంచి ఏడుకు పెంపు
- కార్పొరేట్ ట్యాక్స్ 15శాతం తగ్గింపు
రంగాలవారీగా కేటాయింపులు...
- జల్జీవన్ మిషన్కు రూ 11,500 కోట్లు
- విద్యారంగానికి రూ 99.300 కోట్లు
- నైపుణ్యాభివ ద్ధికి రూ 3,000 కోట్లు
- కొత్తగా ఐదు స్మార్ట్ సిటీల అభివృద్ధి
- నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ ఏర్పాటుకు రూ.1480 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ.27,300 కోట్లు
- రవాణా మౌలిక సదుపాయాలకు రూ .1.7 లక్షల కోట్లు
- సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ.9500 కోట్లు
- టూరిజం ప్రోత్సాహానికి రూ.2500 కోట్లు
- సాంస్కతిక శాఖకు రూ.3150 కోట్లు
- మహిళా సంక్షేమ పథకాల రూ. 28,600 కోట్లు
- పౌష్టికాహార పథకానికి రూ.35.6 కోట్లు
అయోధ్య మందిరానికి కేంద్ర ప్రభుత్వ విరాళం రూపాయి
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం తొలి విరాళంగా కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయిని లాంఛనంగా 'శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్కు అందజేసింది. ప్రభుత్వం తరపున హౌంశాఖలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్న డీ ముర్ము ఫిబ్రవరి 6న ఈ మొత్తాన్ని నగదు రూపంలో ట్రస్ట్కు అందించారు. నగదు రూపంలో కానీ, స్థిరచరాస్తుల రూపంలో కానీ ట్రస్ట్కు విరాళాలు అందజేయవచ్చని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ట్రస్ట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ సభ్యుడు పరాశరన్ ఇంట్లో ఏర్పాటు చేశామని, త్వరలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో కేంద్రం శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర పేరుతో ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసింది.
యథాతథంగా కీలక పాలసీ వడ్డీ రేట్లు
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6న సమావేశమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే 11 ఏళ్ల కనిష్టానికి చేరిన ఆర్థిక వద్ధికి మద్దతుగా బ్యాంకింగ్, రియల్టీ, ఎంఎస్ఎంఈ, ఆటో రంగాలకు ప్రోత్సాహక చర్యలతో ఆర్బీఐ ముందుకు వచ్చింది. రుణ రేట్లను తగ్గించేందుకు వీలుగా బ్యాంకులకు రూ.లక్ష కోట్లను సమకూర్చనున్నట్టు శక్తికాంతదాస్ ప్రకటించారు.
వృద్ధి రేటు 5 శాతం
2019-20లో దేశ వద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. 2020-21లో 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2020-21 తొలి ఆరు నెలల్లో 5.9-6.3 శాతం మధ్య ఉంటుందన్న లోగడ అంచనా లను.. 5.5-6 శాతానికి తగ్గించింది.
ఆదాయ పన్ను ఈ-కాలిక్యులేటర్ ఆవిష్కరణ
కొత్త, పాత విధానాల్లో ఎంత మేర ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తూ ఆదాయ పన్ను శాఖ ఫిబ్రవరి 6న ప్రత్యేకంగా ఈ-కాలిక్యులేటర్ను ఆవిష్కరించింది. ఇందులో పాత, కొత్త విధానాలను పోల్చి చూసుకుని, ఏది ప్రయోజనకరంగా ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు. తమ ఆదాయాలు, మినహాయింపులు, డిడక్షన్స్ మొదలైన వివరాలన్నీ ఇందులో పొందుపరిస్తే.. పాత, కొత్త విధానాల్లో పన్ను భారాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుత విధానంలో ఆదాయాన్ని బట్టి 5, 10, 30 శాతాల్లో పన్నులు ఉంటున్నాయి. ఐటీ రిటర్నులను దాఖలు చేసేందుకు ఉద్దేశించిన www.incometaxindiaefiling.gov.in లో ఈ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది.
ఏపీకి రూ.21,000 కోట్ల ఏఐఐబీ రుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం అందించేం దుకు ఏషియన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
చైనా ప్రయాణికులకు భారత్ ఇ-వీసా రద్దు
చైనా నుంచి వచ్చే ప్రయాణికులు, ఆ దేశంలోని ఇతర దేశస్తులకు ఇ-వీసా సౌకర్యాన్ని భారత్ తాత్కాలికంగా రద్దు చేసింది. ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్ని (కరోనా వైరస్ వ్యాప్తి) దష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజింగ్లో భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 2న ప్రకటించింది. ఇక అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు చైనా మీదుగా ప్రయాణించే వారిని కూడా తమ దేశంలోకి రానివ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు.
డబ్ల్యూహెచ్ఈఎఫ్ సదస్సు
వరల్డ్ హిందూ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూహెచ్ఈఎఫ్) ప్రాంతీయ సదస్సుకు విజయవాడ వేదిక కానుంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు పది దేశాలకుపైగా 300మంది ప్రతినిధులు హాజరు కానున్నారని డబ్ల్యూహెచ్ఈఎఫ్-2020 సదస్సు చైర్మన్ ఎస్.ఎన్. కుమార్ బుద్ధవరపు ఫిబ్రవరి 5న తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, 'కలసి అభివద్ధి చెందుదాం- కలసి పంచుకుందాం' అన్న లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో పోర్టు నిర్మాణం
మహారాష్ట్రలో రూ.65వేల కోట్లతో భారీ పోర్టు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఫిబ్రవరి 5న సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్పీటీ)కి 97 కిలోమీటర్ల దూరంలోని వధావన్ వద్ద ఈ భారీ పోర్టు నిర్మాణం చేపడతారు. ప్రైవేటు భాగస్వామ్యంతో (ల్యాండ్ లార్డ్ మోడల్లో) అభివద్ధి చేసే ఈ ప్రాజెక్టుకు రూ.65,544.54 కోట్లు వ్యయం అవుతుందని అంచనా.
మంత్రిమండలి నిర్ణయాలు
ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అలయన్స్ ఎయిర్ ద్వారా భారత్-శ్రీలంకల మధ్య విమాన సర్వీసులు నడపడానికి ఆమోదం. కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సూరత్, భోపాల్, భాగల్పుర్, అగర్తల, రాయచూర్ ట్రిపుల్ ఐటీ (పీపీపీ)లకు జాతీయ ప్రాధాన్య సంస్థల హౌదా కల్పించాలని నిర్ణయం. పీఎంసీ బ్యాంక్ తరహా సంక్షోభం మరోసారి తలెత్తకుండా డిపాజిట్దారుల ప్రయోజనాల పరిరక్షణ, సహకార బ్యాంకులను మరింత పటిష్టం చేసే దిశగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టానికి సవరణకు ఆమోదం.
త్వరలో ఎయిర్ డిఫెన్స్ కమాండ్ ఏర్పాటు
భారత గగనతలంలో జరిగే వైమానిక దళ ఆపరేషన్లు అన్నింటినీ పర్యవేక్షించేలా 'ఎయిర్ డిఫెన్స్ కమాండ్'ను త్వరలో ఏర్పాటు చేస్తామని భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ఫిబ్రవరి 4న వెల్లడించారు. హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో జరిగే నేవీ ఆపరేషన్ల కోసం ద్వీపకల్ప కమాండ్ను, సైనికులకు వసతి, ఆయుధాలు సమకూర్చడం వంటి అవసరాలు తీరుస్తూనే, వారి సేవల్ని వినియోగించుకునేలా లాజిస్టిక్ కమాండ్ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.
అమల్లోకి రూ.5 లక్షల డిపాజిట్ బీమా : ఆర్బీఐ
బ్యాంకు డిపాజిట్లకు పెంచిన బీమా కవరేజీ ఫిబ్రవరి 4 నుంచే అమల్లోకి తెచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణను దష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని ప్రస్తుతమున్న రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు 2020-21 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్బీఐలో భాగమైన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఈసీజీసీ) ఈ కవరేజీ ఇస్తుంది.
బీమా కవరేజీ పెంపుకు డీఎఫ్ఎస్ ఆమోదం
డిపాజిట్లపై బీమా కవరేజీని పెంచే ప్రతిపాదనకు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) ఆమోదం తెలిపింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత దీన్ని సవరించినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 4న తెలిపారు. ప్రతి రూ.100 డిపాజిట్పై బ్యాంకులు ఇకపై 12 పైసల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
లక్నోలో 11వ డిఫెక్స్పో ప్రారంభం
రక్షణ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ '11వ డిఫెక్స్పో' ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ఈ డిఫెక్స్పోను ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... రానున్న ఐదేళ్లలో భారత్ నుంచి 500 కోట్ల డాలర్ల(రూ. 35.6 వేల కోట్లు) విలువైన మిలటరీ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత్లో తయారీ యూనిట్లను ప్రారంభిం చాలని ప్రపంచంలోని ప్రముఖ రక్షణ పరికరాల తయారీ సంస్థలను కోరారు. భారత్ రెండేళ్లకు ఒకసారి ఈ 'డిఫెక్స్పో' ను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం జరుగుతోంది 11వ ప్రదర్శన. ఐదు రోజుల పాటు జరిగే 11వ డిఫెక్స్పోకు 38 దేశాల రక్షణ మంత్రులు, 172 విదేశీ, 856 స్వదేశీ మిలటరీ ఎక్విప్మెంట్ సంస్థల ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరవుతున్నారు.
దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్
రక్షణ, ఏరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా ప్రకాశం జిల్లా దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ను అభివద్ధి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, నైపుణ్యాభివద్ధి శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు.
సరోగసీ బిల్లుపై సెలెక్ట్ కమిటీ నివేదిక
సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు-2019పై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కమిటీ చైర్మన్ భూపేందర్ యాదవ్ ఫిబ్రవరి 5న రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయడుకి అందజేశారు. సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు -2019ని నవంబర్ 21, 2019న రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి నుంచి ఈ కమిటీ 10 సార్లు సమావేశమై తాజా నివేదికను రూపొందించింది. 23 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ బందం సరోగసీ బిల్లులో పలు మార్పులను సూచించింది.
సరోగసీ బిల్లుపై సెలెక్ట్ కమిటీ సూచనలు
సరోగసీ ద్వారా బిడ్డల్ని కనిచ్చేందుకు దగ్గరి బంధువులే కానక్కర్లేదనీ, ఆరోగ్యవంతులైన స్త్రీలెవ్వరైనా అందుకు సమ్మతిస్తే సరోగసీ పద్ధతుల్లో బిడ్డని కనివ్వొచ్చు. 35-45 ఏళ్ల మధ్య వయస్కులైన ఒంటరి స్త్రీలు సరోగసీని ఉపయోగించుకోవచ్చు. సరోగసీ ద్వారా బిడ్డని కనాలనుకునే జంట పెళ్ళైన ఐదేళ్ళ పాటు భార్యాభర్తలు కలిసి ఉండీ పిల్లల్ని కనలేని పరిస్థితుల్లోనే అద్దెగర్భాన్ని ఆశ్రయించాలన్న నిబంధన సడలింపు. అద్దెగర్భం దాల్చే మహిళలకు గతంలో ఉన్న 16 నెలల ఇన్సూరెన్స్ కవరేజ్ను 36 నెలలకు పెంచాలి. బిడ్డలు కావాలనుకునేవారు ఎప్పుడైనా సరోగసీ ద్వారా బిడ్డలను కనొచ్చనీ, అయితే అందుకు వైద్యపరమైన ఆమోదం పొందాల్సి ఉంటుంది. భారతీయ సంతతికి చెందిన వారెవ్వరైనా సరోగసీ బోర్డు ద్వారా అనుమతి పొందిన తరువాత దేశంలో సరోగసీ ద్వారా బిడ్డలను పొందే వీలుండేలా బిల్లులో మార్పులు చేయాలి.
ప్రాంతీయం
హైదరాబాద్లో ఎక్స్పీరియన్ సెంటర్ ఏర్పాటు
ఐర్లాండ్కు చెందిన డేటా, అనలిటిక్స్ కంపెనీ ఎక్స్పీరియన్.. ఇండియా డెవలప్ మెంట్ సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పింది.హైదరాబాద్లోని హైటెక్సిటీ వద్ద 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. ప్రస్తుతం 200 మంది ఇంజనీర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. 2024 నాటికి ఉద్యోగుల సంఖ్యను 2,500 స్థాయికి తీసుకు వెళ్లనున్నట్టు కంపెనీ తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కేంద్రాన్ని ఫిబ్రవరి 4న ప్రారంభించారు.
నిజామాబాద్లో సుగంధ ద్రవ్యాల బోర్డు ఏర్పాటు
తెలంగాణలోని నిజామాబాద్లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్టెన్షన్ సెంటర్ (స్పైసెస్ బోర్డు రీజినల్ సెంటర్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 4న వెల్లడించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వీలుగా ఈ సెంటర్ పనిచేస్తుందని పేర్కొన్నారు. 'డిప్యూటీ డెరైక్టర్ స్థాయి అధికారి దీనికి నేతత్వం వహిస్తారు. రెండేళ్లలో ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు, ఉత్పత్తులు, నాణ్యత గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం. పసుపు, మిర్చిపై ప్రత్యేక దష్టి పెట్టడం ద్వారా ఈ ప్రాంతం స్పైసెస్ హబ్గా మారుతుంది.
యాక్సెంచర్ హబ్ ప్రారంభం
ప్రొఫెషనల్, కన్సల్టింగ్ సర్వీసుల్లో ఉన్న అమెరికన్ కంపెనీ యాక్సెం చర్ హైదరాబాద్లో ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేసింది. భాగ్యనగరి సెంటర్లో 2,000 మంది ఉద్యోగులు ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. ఈ కేంద్రంలో డిజిటల్ ఎకానమీకి అవసరమైన ఉత్పత్తులు, సేవలను యాక్సెంచర్తో కలిసి క్లయింట్లు ఆవిష్కరించాల్సి ఉంటుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంస్థ తొలి నానో ల్యాబ్ ఇక్కడ కొలువుదీరింది. సంస్థకు ఇప్పటికే ఇన్నోవేషన్ హబ్ బెంగళూరులో ఉంది.
వార్తల్లో వ్యక్తులు
హెచ్ఏఎల్ సీఈఓగా అమితాబ్ భట్
ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఈఓ)గా అమితాబ్ భట్ ఫిబ్రవరి 3న బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు సంస్థకు చెందిన లైట్ యుటిలిటీ హెలికాప్టర్ (ఎల్యూ హెచ్) ప్రాజెక్ట్కు ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్గా అమితాబ్ సేవలం దించారు. రక్షణ రంగానికి కామోవ్ కేఏ- 226టీ హెలికాప్టర్ల ను అందించడం కోసం కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ఇండో రష్యన్ హెలికాప్టర్స్ లిమిటెడ్కు ఈయన డెరైక్టర్గా కొనసాగుతున్నారు. సంస్థతో 32 ఏళ్ల అనుబంధం ఉన్న అమితాబ్ హాయంలోనే ఓఎన్జీసీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జార్ఖండ్ ప్రభుత్వానికి హెలికాప్టర్లను అందించడంతో పాటు నేపాల్, మారిషస్ వంటి దేశాలకు ఎగుమతులు జరిగినట్లు హెచ్ఏఎల్ వెల్లడించింది.
జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డెరైక్టర్గా శ్రీధర్
భారతీయ భూ వైజ్ఞానిక సర్వేక్షణ (జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-జీఎస్ఐ) డెరైక్టర్ జనరల్గా ఎం.శ్రీధర్ ఫిబ్రవరి 3న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలను చేపట్ట డానికి ముందు జీఎస్ఐ దక్షిణ ప్రాంతం అదనపు డెరైక్టర్ జనరల్గా శ్రీధర్ సేవలందించారు. 1986లో జీఎస్ఐలో చేరిన ఆయన హిమాలయాలు మొదలుకొని దక్షిణ భారత ద్వీపకల్పం వరకు భూవైజ్ఞానిక రంగంలో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించారు. జీఎస్ఐకి చెందిన వివిధ జాతీయ ప్రాజెక్టులను నిర్వహించడంలో టెక్నోఅడ్మినిస్ట్రేటర్గా వ్యవహరించారు.
భారత్లో బ్రిటన్ హైకమిషనర్గా సర్ ఫిలిప్
భారత్లో బ్రిటన్ హైకమిషనర్ (రాయబారి)గా సర్ ఫిలిప్ బార్టన్ ఫిబ్రవరి 6న నియమితుల య్యారు. ప్రస్తుత రాయబారి సర్ డొమినిక్ అస్కిత్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. బార్టన్ ప్రస్తుతం విదేశీ, కామన్వెల్త్ కార్యాలయంలో కాన్సులర్-సెక్యూరిటీ విభాగం డెరైక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. 1994లో ఢిల్లీలోని బ్రిటన్ రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీగా పనిచేశారు.
ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అరవింద్ కృష్ణ
అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా (సీఈవో) ఆంధ్రప్రదేశ్కు చెందిన అరవింద్ కృష్ణ నియమితుల య్యారు. 200 బిలియన్ డాలర్ల సంస్థ డెరైక్టర్ల బోర్డులోనూ ఆయనకు చోటు దక్కింది. 2020, ఏప్రిల్ 6 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుందని జనవరి 31న కంపెనీ వెల్లడించింది. అరవింద్తో పాటు రెడ్ హ్యాట్ సీఈవో, ఐబీఎం సీనియర్ వైస్ప్రెసిడెంట్ జేమ్స్ వైట్హస్ట్.. ఐబీఎం ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
అంటార్కిటిక్ త్వైట్స్ చిత్రాలు
సముద్రాల నీటి మట్టం పెరగడానికి ముఖ్య కారణమైన అంటార్కిటిక్ ఖండంలోని త్వైట్స్ అనే మంచు కొండకు సంబంధించిన చిత్రా లను శాస్త్రవేత్తలు తొలిసారి చిత్రీ కరించారు. అమెరికా లోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు రోబోటిక్ సబ్మెరైన్ సాయంతో చిత్రాలను తీశారు. వీటి సాయంతో త్వైట్స్ కదలికలను క్షుణ్నంగా పరిశీలించే అవకాశం లభించనుంది. త్వైట్స్ కారణంగా భూమిపై సముద్రాల నీటి మట్టం 4 శాతం మేర పెరుగుతుంది. దీని కదలికల్లో చోటుచేసుకునే చిన్న పరిణామాల వల్ల కూడా సముద్ర నీటి మట్టాలు 25 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉంది. గత 30 ఏళ్లలో త్వైట్స్ నుంచి సముద్రాల్లోకి ప్రవహించే మంచు శాతం రెట్టింపైనట్టు పరిశోధకులు వెల్లడించారు.
దేశంలోనే తొలి నాలుగో తరం రోబో ప్రారంభం
తుంటి, మోకాలు వంటి కీళ్లమార్పిడి శస్త్ర చికిత్సల్లో గుర్తింపు పొందిన సన్షైన్ ఆస్పత్రి యాజమాన్యం తాజాగా మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు లోకి తెచ్చింది. కీళ్లమార్పిడి శస్త్రచికిత్సల్లో దేశంలోనే తొలిసారిగా రూ.12 కోట్ల విలువ చేసే ఆధునిక 'నాలుగో తరం' రోబోను ప్రవేశపెట్టింది. హైదరాబాద్లోని సైబర్ కన్వెన్షన్ సెంటర్లో ఫిబ్రవరి 1న తెలంగాణ మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పీవీ సింధు, సన్షైన్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ గురువారెడ్డిలు రోబోను ఆవిష్కరించారు.
క్రీడలు
అమెరికా టెన్నిస్ స్టార్ స్పియర్స్పై ఐటీఎఫ్ నిషేధం
డోపింగ్లో పట్టుబడినందుకు అమెరికాకు చెందిన మహిళల టెన్నిస్ డబుల్స్ స్టార్ ప్లేయర్ అబిగెయిల్ స్పియర్స్పై అంతర్జా తీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) 22 నెలలపాటు నిషేధం విధించింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ సందర్భంగా స్పియర్స్కు నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో ఆమె నిషేధిత ఉత్ప్రేరకాలు ప్రాస్టీరోన్, టెస్టోస్టిరాన్ వాడినట్లు తేలింది. డోపింగ్ ఫలితాలు వచ్చిన తేదీ 2019 నవంబర్ 7 నుంచి నిషేధం అమలవుతుందని 2021, ఏడాది సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతుందని ఐటీఎఫ్ ఫిబ్రవరి 6న తెలిపింది.
అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా విరాట్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా మూడో ఏడాది భారత్లో అత్యధిక బ్రాండ్ విలువ గల సెలబ్రిటీగా నిలిచాడు. ద డఫ్ అండ్ ఫెల్ప్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం రూ.1690 కోట్ల బ్రాండ్ విలువతో కోహ్లి అగ్రస్థానంలో ఉన్నాడు. రూ.743 కోట్లతో బాలీవుడ్ నటుడు అక్షరు కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. 2019లో కోహ్లి బ్రాండ్ విలువ 39 శాతం పెరిగింది. 2019 ఏడాదికి సంబంధించి రూపొందించిన 'అత్యధిక బ్రాండ్ విలువ గల భారత ప్రముఖుల జాబితా'లో టాప్-20లో కోహ్లి సహా నలుగురు క్రికెటర్లు ఉన్నారు. ధోని (రూ.293 కోట్లు) 9వ స్థానంలో, సచిన్ టెండూల్కర్(రూ. 153 కోట్లు) 15వ స్థానంలో, రోహిత్ శర్మ (రూ.163 కోట్లు) 20వ స్థానంలో ఉన్నారు.
గోల్డెన్ గర్ల్ బాక్సింగ్లో భారత్కు ఆరు స్వర్ణాలు
స్వీడన్లోని బోరస్లో 2020, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగిన గోల్డెన్ గర్ల్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత యువ మహిళా బాక్సర్లు ఆరు స్వర్ణ పతకాలతో సహా మొత్తం 14 పతకాలను సాధించారు. ఓవరాల్ చాంపియన్షిప్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. జూనియర్ విభాగంలో ఐదు పసిడి పతకాలు, మూడు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించగా... యూత్ విభాగంలో ఒక స్వర్ణం, నాలుగు కాంస్య పతకాలను గెలుచుకున్నారు.
ప్రాచీకి బెస్ట్ బాక్సర్ అవార్డు
జూనియర్ టీమ్కు ప్రాతి నిధ్యం వహించిన ప్రాచీ (50 కేజీలు) 'బెస్ట్ బాక్సర్' అవార్డును కైవసం చేసు కుంది. ఆమెతో పాటు నివేదిత (48 కేజీలు), ఎథోరుబి చాను వాంజమ్ (54 కేజీలు), లశు యాదవ్ (66 కేజీలు), మహి (80 కేజీలు) బంగారు పతకాలను గెల్చుకోగా... యూత్ విభాగంలో ముస్కాన్ (54 కేజీలు) స్వర్ణాన్ని సాధించింది. జూనియర్ విభాగంలో జాన్వీ (46 కేజీలు), రూడీ లాల్మింగ్ మువాని (66 కేజీలు), తనిష్కా (80 కేజీలు) రజతాలు... దియా(60 కేజీలు) కాంస్యం సాధించింది.